deputy commisioner
-
గవర్నర్కు కూడా ఎన్నికల కోడ్ వర్తింపు
-
నాటుసారాను పూర్తిగా నిర్మూలించాం
ఆలూరు రూరల్, న్యూస్లైన్ : దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుర్జిత్సింగ్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రేమ్ప్రసాద్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి వారు దేవరగట్టులో విలేకరులతో మాట్లాడారు. బన్ని ఉత్సవంలో నాటుసారా అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్, ఏఆర్ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. అలాగే బన్ని ఉత్సవంలో పాల్గొనే నెరణికి, నెరణికితండా, కొత్తపేటతో పాటు మరో పది గ్రామాల కొండల్లో ఉన్న నాటుసారా తయారీ స్థావరాలపై దాదాపు 25 రోజులుగా సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. ఆ దాడుల్లో దాదాపు 36 వేల లీటర్ల ఊట, 1000 లీటర్లకు పైగా నాటుసారా బిందెలను ధ్వంసం చేశారన్నారు. బన్ని ఉత్సవమే గాకుండా ఆలూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నాటుసారా అమ్మకాలను, తయారీని అరికట్టేందుకు మున్ముందు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. -
జాయింట్ కలెక్టర్గా పౌసమిబసు
కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లా జారుుంట్ కలెక్టర్గా పౌసమిబసు రానున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను వరంగల్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఇక్కడ జారుుంట్ కలెక్టర్గాపనిచేసిన ప్రద్యుమ్న పదోన్నతిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యూరు. ఈ మేరకు ఆయన స్థానంలో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివేక్ యూదవ్ గత నెల 30వ తేదీన ఇన్చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్, జేసీ పోస్టులు రెండూ కీలకమైనవి కావడంతో ఆయన పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం 40 రోజుల తర్వాత పూర్తిస్థారుు నియూమకం చేపట్టింది. కలిసొస్తున్న జిల్లా జేసీ పోస్టు... జిల్లా జారుుంట్ కలెక్టర్ కుర్చీ అధికారులకు కలిసొస్తుందనే చెప్పాలి. సుమారు నాలుగేళ్లపాటు జేసీగా జిల్లాలో పనిచేసిన వాకాటి కరుణ పదోన్నతిపై ఉపాధి హామీ రాష్ర్ట డెరైక్టర్గా బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన జేసీ పీఎస్.ప్రద్యుమ్న నిజామాబాద్ కలెక్టర్గా పదోన్నతిపై వెళ్లారు. ప్రస్తుతం నెలరోజులపాటు ఇన్చార్జ్ జేసీగా విధులు నిర్వర్తించిన బల్దియూ కమిషనర్ వివేక్యూదవ్ గుంటూరు జేసీగా బదిలీపై వెళుతుండడడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.