deteriorating
-
కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్ ఘర్షణ, తాజాగా అరుణాచల్ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
నెల్లూరు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం
-
కరోనా మందు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం
సాక్షి, నెల్లూరు: రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈ రోజు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్ పడింది. కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రానుంది. బ్లాక్మార్కెట్లో ఆనందయ్య కరోనా మందు మరో వైపు కరోనా మందు పేరుతో బ్లాక్మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజల అవసరాలను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు బ్లాక్ మార్కెట్లో రూ.3 వేల నుంచి 10 వేల డిమాండ్ ఏర్పడింది. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ 50 పడకలు దాటితే.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు -
బలహీనపడిన తుపాను
విశాఖపట్టణం: క్యాంట్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 220 కిలో మీటర్ల దూరంలో, విశాఖపట్టణానికి దక్షిణ నైరుతి దిశగా 260కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నానికి వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంగా కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు క్యాంట్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖపట్టణం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కుంభవృష్టిగా కురిసింది. ప్రస్తుతం విశాఖపట్టణంలో ఆకాశం మేఘావృతమై ఉంది. శ్రీకాకుళం జిల్లాలోనూ అక్కడక్కడా తుపాను ప్రభావంగా చిరుజల్లులు కురిశాయి. దీంతో జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. శనివారం విశాఖపట్టణం వేదికగా భారత్-కివీస్ జట్ల మధ్య సిరీస్ లో ఆఖరి వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. తుపాను హెచ్చరికలతో చివరి మ్యాచ్ కు ఆటకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సిరీస్ ఫలితం తేల్చే రేపటి మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
బలహీనపడిన తుపాను
-
రోజురోజుకి దిగజారుతున్న పార్టీ పరిస్ధితి