Director Anil ravipudi
-
భార్య–భర్త–మధ్యలో మాజీ ప్రేయసి
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో కొత్త సినిమా షురూ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై రూపొందుతున్న 58వ చిత్రమిది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్కి జోడీగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. వెంకటేశ్–మీనాక్షీ చౌదరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ని మేకర్స్కి అందజేశారు. ‘‘హీరో, అతని భార్య, మాజీ ప్రేయసి... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. హీరో– దర్శక–నిర్మాతల కాంబినేషన్లో ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్లు రావడంతో మూడో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ కలగని అనుభూతిని అందించడానికి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, వీకే నరేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సమీర్ రెడ్డి. -
కాఫీ షాప్లో ఇన్ని జరుగుతాయని ఇప్పుడే అర్థమైంది: అనిల్ రావిపూడి
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాఫీ విత్ ఎ కిల్లర్'. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్హిల్స్ ప్రొడక్షన్స్పై సెవెన్హిల్స్ సతీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ట్రైలర్ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'కరోనా తరువాత రీ రీలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. అలాంటి స్కోప్ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్లో కనిపిస్తోంది. కాఫీ షాప్లో ఇన్ని జరుగుతాయా అని ఇప్పుడే అర్థమైంది. చాలా ఎంటర్టైనింగ్గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్పీ గారే హీరో అనిపించింది. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.' అని అన్నారు. దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఓటీటీ వచ్చాక జనాలకు థియేటర్స్లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్కు రప్పించలేం. ఎంటర్టైనింగ్తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకున్నా.అందుకు నా మరో తమ్ముడు సెవెన్హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో రివీల్ చేస్తాం. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడిగారికి కృతఙ్ఞతలు. ఎందుకో ఆయనకు నేనంటే చాలా అభిమానం.' అని అన్నారు. నిర్మాత సెవెన్హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. 'ఆర్పీ గారు నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా. ఈ చిత్రంలో ఒక చిన్నసర్ప్రైజ్ ఉంది. అది త్వరలో రివీల్ చేస్తాం. ఆర్పీ పట్నాయక్తో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘు బాబు, జెమినీ సురేష్, రవి ప్రకాష్, టెంపర్ వంశీ, బెనర్జీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
నవ్వుల వ్యాక్సిన్ సిద్ధం చేస్తాం
‘‘మన ఎదుగుదలను పోల్చిచూసుకోవడానికి మన పుట్టినరోజులు చాలా ఉపయోగపడతాయి. అందుకే పుట్టిన రోజుకు తప్పనిసరిగా ప్రాముఖ్యత ఇవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో మంచి విజయాలు అందుకుని, ఫామ్లో ఉన్నారాయన. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు. ► దర్శకుడిగా నా ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది. నాతో సినిమా చేసిన స్టార్స్ అందరూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు.. ప్రతిసారి వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాను. ఈ ప్రయాణంలో ‘దిల్’ రాజుగారి సహాయం కూడా మరువలేనిది. ► నాకు సినిమాయే ఎనర్జీ. సినిమా అంటే నాకు స్వర్గం.. స్వర్గంలో ఉన్నవారెవరైనా నీరసంగా ఉంటారా? అందుకే ఎప్పుడూ ఎనర్జిటిక్గా ఉంటాను. అలానే ఈ ఎడాది నాకు అన్ని రకాలుగా గుర్తుండే సంవత్సరం. ఈ ఏడాది మా కుటుంబం పెద్దది అయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాకు బాబు (అజయ్ సుర్యాంశ్) పుట్టాడు. సినిమా బ్లాక్బాస్టర్ హిట్ అయింది. ► ‘ఎఫ్ 2’ అనేది దర్శకుడిగా నన్ను మార్చేసిన సినిమా. యాక్షన్ సబ్జెక్ట్స్ చేస్తున్న నాకు పూర్తి ఫ్యామిలీ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ‘ఎఫ్2’ సినిమా చేశా. 2019 సంక్రాంతిని నవ్వుల మయం చేసేసింది ఆ సినిమా. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింట్లో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అదే అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ను సిద్ధం చేసే పనిలో ఉన్నాను. ‘ఎఫ్ 3’లో మరింత ఫన్ ఉంటుంది. డిసెంబర్ 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రస్తుతం అందరూ కరోనాకు మందు కనుక్కొనే పనిలో ఉన్నారు. ఈలోపల మేము ‘ఎఫ్ 3’తో నవ్వుల వ్యాక్సిన్ను సిద్ధం చేస్తాం. -
మహేశ్బాబు రఫ్ ఆడేశారు
హిట్ ట్రాక్లో దూసుకెళుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మంచి దూకుడు మీద ఉన్న హీరో మహేశ్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు అనిల్ చేసింది నాలుగు సినిమాలే. ఐదో సినిమాకే సూపర్ స్టార్ మహేశ్ కాంబినేషన్ కుదరడం అంటే చిన్న విషయం కాదు. ‘ఇంత పెద్ద స్టార్ని ఎలా డీల్ చేస్తాం?’ అనే కన్ఫ్యూజన్ లేకుండా తాను నమ్మిన ఫార్ములాతో ‘సరిలేరు నీకెవ్వరు’ని తెరకెక్కిస్తున్నారు. నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. ► ఐదేళ్లలో నాలుగు సక్సెస్ఫుల్ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2) అందించారు. మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక సినిమా చేస్తున్నప్పుడు నా గత సినిమాలను మర్చిపోతాను. ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. గత సినిమా తాలూకు ప్రభావం ప్రస్తుత సినిమా మీద పడకూడదు. అది హిట్ అయినా ఫ్లాఫ్ అయినా.. మనం ఏం చేస్తున్నాం? అనే ఆలోచన, విశ్లేషణ ఉన్నప్పుడు మనకి మనం బోర్ కొట్టం. ఆడియన్స్కి కూడా బోర్ కొట్టం అని నేను నమ్ముతాను. అది నా ఫిలాసఫీ అనుకోవచ్చు.. స్ట్రాటజీ అనుకోవచ్చు. ► ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎలా స్టార్ట్ అయింది? ఈ సినిమా ‘ఎఫ్ 2’ తర్వాత స్టార్ట్ అయిందని అందరూ అనుకుంటున్నారు. కాదు. ‘ఎఫ్ 2’ పూర్తయ్యేసరికే మహేశ్గారు ఈ కథను ఓకే చేశారు. ‘ఎఫ్ 2’ సమయంలో నిర్మాత అనిల్ సుంకరగారు మహేశ్గారికి నన్ను రిఫర్ చేశారు. నా దగ్గర ఉన్న పాయింట్ను 45 నిమిషాలు మహేశ్గారితో చెప్పాను. సినిమా ఓకే అయింది. సుకుమార్గారితో చేయబోయే సినిమా తర్వాత స్టార్ట్ చేయాలనుకున్నాం. అనుకోకుండా నా సినిమా ముందుకు రావడం జరిగింది. ► ఈ మధ్య మహేశ్ సినిమాలు సోషల్ మెసేజ్ చుట్టూ తిరిగాయి. మరి ఈ సినిమాలో? మహేశ్ లాంటి సూపర్ స్టార్ చేసే సినిమాలో ఎక్కడో ఒక చోట బాధ్యతాయుతమైన పాయింట్ను కచ్చితంగా చెప్పాలి. అలాగే ఆయన మాస్ లుక్లో కనబడి, పూర్తి స్థాయిలో కామెడీ చేసి చాలా రోజులైంది. ప్రేక్షకులు మహేశ్గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమా ఉంటుంది. మహేశ్బాబుగారు వెరైటీగా కనిపించబోతున్నారు, బాధ్యతాయుతంగా ఉంటారు. విపరీతంగా ఎంటర్టైన్ చేస్తారు. కథకు అవసరమైన యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మిలటరీ ఆఫీసర్ ‘అజయ్ కృష్ణ’ పాత్రలో మహేశ్గారు కనిపిస్తారు. ఆయన పాత్ర గురించి కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. ఇది కచ్చితంగా స్పెషల్ సినిమా అవుతుంది. ► కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఈ కాన్ఫిడెన్స్ అంచనాలను మరింత పెంచుతుంది కదా? పూర్తయినంతవరకు సినిమా చూశాం. ఈ సినిమా చూసిన ఏ ఒక్కరూ నిరుత్సాహపడరు అని చెప్పగలను. మహేశ్బాబుగారు ఉన్నారు కదా అని ఆడుతూపాడుతూ సినిమా చేసేయలేదు. ఇప్పటివరకూ ఏ సినిమాకీ నేనలా చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్బాబుగారు రఫ్ ఆడేశారు. కేవలం ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. ఫ్యాన్స్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. అది వాళ్లకు కిక్ ఇస్తుంది. అలాగే పండక్కి ఫ్యామిలీతో కలసి సినిమా చూడాలనుకునేవాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. ► విజయశాంతిగారిని మళ్లీ స్క్రీన్ మీదకు తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? నా చిన్నప్పుడు చూసిన ‘కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ’ లాంటి సినిమాల్లో విజయశాంతిగారి డైనమిజమ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాంటి యాక్టర్తో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కమ్బ్యాక్కి తగ్గ పాత్ర కూడా ఉండాలి. అలాంటి పాత్ర ఉంటే కచ్చితంగా చేస్తాను అని ఆవిడ అన్నారు. ‘రాజా ది గ్రేట్’ సినిమాను మొదట రామ్తో అనుకున్నప్పుడు రామ్ తల్లి పాత్రలో విజయశాంతిగారిని తీసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత అది రవితేజగారితో చేశాను. ఆమెని అడగలేదు. ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్ర రాసుకున్నాక ఆమెని తప్ప మరెవ్వరినీ ఊహించలేదు. కథ విని, పాత్రతో పాటు కథ కూడా నచ్చి ఆమె ఒప్పుకున్నారు. ► దర్శకుడిగా మీ ప్లస్ పాయింట్ కామెడీ. దాన్ని ఈ సినిమాలో ఎంతవర కూ ఉపయోగించారు? నా సినిమాలో ఏం ఉంటాయో అవి కోరుకొని ఆడియన్స్ థియేటర్కి వస్తారు. అవి కచ్చితంగా అందించాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ సినిమాలు చేస్తున్న దర్శకులం కొందరే ఉన్నాం. నేను శేఖర్ కమ్ముల స్టయిల్లో సినిమా చేయలేను. నేను నమ్ముకున్నదాన్ని ఎంత కొత్తగా చేస్తాను అన్నది ముఖ్యం. అన్ని జానర్లలో సినిమాలు చేయాలని ఉంది. ► బర్త్డే ప్లాన్స్ ఏంటి? ప్రతీసారి కుటుంబం, ఫ్రెండ్స్తో ఉండేవాణ్ణి. ఈసారి మహేశ్గారితో ఉండబోతున్నా. అదో కిక్కు. ఆయనతో సరదాగా టైమ్ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. మంచి కిక్ ఇచ్చే బర్త్డే ఇది. ► నెక్ట్స్ సినిమా? ఇంకా ఏం ఆలోచించలేదు. కానీ ఏం చేయాలనే ఐడియా మాత్రం ఉంది. ► ‘అల.. వెకుంఠపురములో.., సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు ఒక రోజు గ్యాప్లో విడుదలవుతున్నాయి. అదేమైనా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందా? ఈ రెండూ డిఫరెంట్ సినిమాలు. పండగ సమయాల్లో మూడు సినిమాలు రిలీజ్ అయినా ప్రాబ్లమ్ ఉండదు. ఇవాళ ఓ సినిమా చూస్తే రేపు మరో సినిమా చూస్తారు. ► ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎఫ్2’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. తెలుగు నుంచి ఎంపికైన సినిమా అదొక్కటే. ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. షూటింగ్ ఉండి ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్లలేకపోయాను. మా టీమ్ తరఫున ‘దిల్’రాజుగారు హాజరయ్యారు. ► ప్రస్తుతం ఉన్న యంగ్ కమర్షియల్ డైరెక్టర్స్లో ఫ్లాప్స్ని చూడని దర్శకుడు మీరు. హిట్ స్ట్రీక్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు? రాజమౌళిగారు అంత సక్సెస్ఫుల్ దర్శకుడు ఎలా అయ్యారు? ఒక్క సినిమా కూడా మిస్ అవ్వకుండా ఎలా హిట్ కొడుతున్నారు? అని గమనిస్తే, తెలిసింది ఏంటంటే ఆయన తన బలాన్ని వదిలి ఎప్పుడూ సినిమా చేయలేదు. ఆయన బలం ఎమోషన్. ‘ఈగ’ లాంటి ప్రయోగం అయినా, ‘బాహుబలి’ లాంటి ఫ్యాంటసీ అయినా ఆ బలాన్ని వదల్లేదు. ఆయనలా మన బలాన్ని మనం వదలకూడదు. అప్పుడు సినిమా మిస్ఫైర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుందనుకుంటున్నాను. కథ రాసుకునే దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. బేరాల్లేవ్! ‘భయపడే వాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా!’ అంటున్నారు మహేశ్బాబు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ శుక్రవారం రిలీజ్ అయింది. ‘మీరెవరో మాకు తెలియదు. మీకు, మాకూ ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీ పిల్లల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత. గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్, సంక్రాంతికి అల్లుళ్లు వస్తారనుకుంటే మొగుడు వచ్చాడేంట్రా’ అనే డైలాగ్స్తో ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 11న రిలీజ్ కానుంది. -
అనిల్ రావిపూడితో సరదాగా కాసేపు
-
మాస్ పటాస్
నచ్చిన కథలతో సినిమాలు తీస్తూ, నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటూ తన అభిరుచికి అనుగుణంగా కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నారు నందమూరి కల్యాణ్రామ్. ఈ క్రమంలో ఆయన చేస్తున్న తాజా చిత్రం ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్లో ఉంది. ఈ చిత్రం టైటిల్ లోగోను, టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు కల్యాణ్రామ్ తెలిపారు. మాస్ మెచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్గా అనిల్ ఈ చిత్రాన్ని రూపొందించారనీ, ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ఇందులో చేశాననీ కల్యాణ్రామ్ అన్నారు. డిసెంబర్లోనే సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రుతీ సోధీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, సాయికుమార్, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆశుతోష్ రాణా, శ్రీనివాసరెడ్డి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, నిర్మాణం: నందమూరి తారక రామారావు ఆర్ట్స్.