పిల్లలను వదిలి.. ప్రియుడితో వెళ్లి.. | Married Woman Left The Children And Jumps With Her Boyfriend In Jagtial, More Details Inside | Sakshi
Sakshi News home page

పిల్లలను వదిలి.. ప్రియుడితో వెళ్లి..

Published Fri, Mar 14 2025 10:14 AM | Last Updated on Fri, Mar 14 2025 6:06 PM

married woman jumps to boyfriend

తల్లి కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు

చేరదీసిన అమ్మమ్మ తాతయ్య

జగిత్యాలక్రైం: నవమాసాలు మోసి.. ఇద్దరు పిల్లలను కనిపెంచిన తల్లి ఆ పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన యువతిని మల్లాపూర్‌ మండలం సాతారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి గతంలో వివాహం చేశారు. వీరికిద్దరు పిల్లలు జన్మించారు. యువతి భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

 పిల్లలను పోషించాల్సిన సదరు మహిళ.. మరో వ్యక్తి మోజులో పడింది. ఈ క్రమంలో యువతి తండ్రి అనారోగ్యంతో జగిత్యాల ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరు కుమారులను తీసుకుని ఆస్పత్రికి వచ్చిన ఆ యువతి కుమారులను అక్కడే వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. తండ్రి ఎందుకు రావడం లేదో.. తల్లి ఎప్పుడొస్తుందో తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనాథలుగా మారి న ఆ పిల్లలను అమ్మమ్మ, తాతయ్య చేరదీశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement