doctors irresponsibility
-
గర్భస్థ మృతశిశువు తొలగింపులో జాప్యం
వైద్య సిబ్బందిపై గర్భిణి బంధువుల ఆగ్రహం ఆస్పత్రి ముందు ఆందోళన సరైన పరికరాలు లేవని కాకినాడ తరలింపు రాజమహేంద్రవరం క్రైం : మూడు రోజుల క్రితం కడుపులో మృతి చెందిన శిశువుతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యానికి నిరసనగా బందువులు ఆందోళన నిర్వహించారు. వివరాల ప్రకారం రాజమహేంద్రవరం రూరల్ నామవరం డి బ్లాక్కు చెందిన వంగలపూడి మంజు గర్భిణి. ఈమె కడుపులో ఉన్న శిశువుకు మూడు రోజులుగా కదలికలు ఆగిపోయాయి. దీంతో బంధువులు ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని గైనకాలజీ వార్డుకు తీసుకువచ్చారు. ఉదయం 10 గంటలకు తీసుకువచ్చినప్పటికీ వైద్యం అందకపోవడంతో ఆ మహిళ నొప్పితో విలవిలలాడింది. మూడు గంటల ప్రాంతంలో ఇక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు పరికరాలు లేవని, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంలో కూడా వైద్యుని సంతకం కోసం, అంబలెన్స్ లేదని సిబ్బంది జాప్యం చేశారు. దీంతో గర్భిణి బంధువులు వైద్యునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరో గర్భిణితో పాటు అంబులె¯Œ్సలో కాకినాడ తరించారు. సకాలంలో వైద్యం అందించాలి : జక్కంపూడి విజయలక్ష్మి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా, శిశు భవనం నిర్మించినప్పటికీ సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణికి వైద్యం అందడం లేదని తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి చేరుకుని వైద్యునితో మాట్లాడి రోగులకు మెరుగైన వైద్యం కల్పించాలని సూచించారు. అంబులె¯Œ్సలో కాకినాడ తరలించిన గర్భిణికి సకాలంలో వైద్యం అందేలా కాకినాడ ఆస్పత్రి సూపరిటెండెంట్కు ఫో¯ŒS చేసి మాట్లాడారు. రోగుల పట్ల దయతో వ్యవహరించాలన్నారు. మాజీ కార్పొరేటర్ చోడిశెట్టి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంతోనే నా భార్యను చంపేశారు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : నిర్లక్ష్యంతో తన భార్యను చంపేసారని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆరోపించాడు. కోలమూరుకు చెందిన కె.వెంకటరమణమ్మ(50) చికిత్సపొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద కుటింబీకులు, బంధువులు మంగళవారం ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు...రాజమహేంద్రవరం రూరల్ కోలమూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.వెంకటేశ్వరావు భార్య వెంకటరమణమ్మ కొంతకాలంగా ఆయాసంతో బాధపడుతోంది. ఆమెను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు గుండెలో వాల్వ్ పాడైందని చెప్పారు. వారు అక్కడ నుంచి తిరిగి ఆర్టీసీ డిపోలో ఉండే సంస్థ వైద్యురాలికి విషయం తెలిపారు. ఆమె సంస్థ తరపున వైద్యం చేయించేందుకు దానవాయిపేటలోని కమలాకర్ హార్ట్కేర్కు మాత్రమే వెసులుబాటు ఉందని చెప్పడంతో గత నెల 25న కమలాకర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు 29న వాల్్వకు సంబంధించి ఆపరేష¯ŒS చేశారు. తర్వాత ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. తిరిగి ఆమెకు ఆయాసం రావడంతో వేరే ఆసుపత్రికి మార్చాలని చెప్పారని, మళ్లీ ఎందుకో ఆసుపత్రి మార్చకుండా ఆ వైద్యులే ఇక్కడికి వస్తారని తాత్సారం చేసినట్టు భర్త వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో ఆమెకు పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతిచెందింది. విషయాన్ని కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో వారు వైద్యుని నిలదీసారు. దీనిపై ఆసుపత్రి ఎదుట ఆందోళనచేపట్టి ధర్నా చేశారు. తన భార్య మృతికి బ్రెయి¯ŒSస్ట్రోక్, పక్షవాతం, ఊపిరితిత్తుల సమస్య ఇలా పొంతనలేని కారణాలు చెబుతున్నారన్నారు. విషయం తెలిసిన ప్రకాశ్నగర్ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతోను, డాక్టర్తోను మాట్లాడారు. జరిగినదానిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ రోగి పరిస్థితి బాగానే ఉందని, అయితే వాల్వ్ ఆపరేష¯ŒS చాలా క్లిష్టమైందని, సర్జరీ తర్వాత రోగి కోలుకునే శరీరం సహకరించడం బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. -
కడుపులో దూదిని ఉంచి కుట్లేసిన డాక్టర్
-
అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అమానుషం