earphone
-
బ్లూటూత్ ఇయర్ఫోన్స్తో భయంకర వ్యాధి?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బ్లూటూత్ ఇయర్ఫోన్ల వాడకం ప్రతీ ఒక్కరికీ అవసరంగా మారింది. ఆఫీసు పనులైనా, ప్రయాణాలైనా ఇవి లేనిదే ఎవరూ ముందుకు నడవడం లేదు. అయితే వీటిని నిరంతరం వాడటం వల్ల రేడియేషన్ బారిన పడి ‘బ్రెయిన్ ట్యూమర్’ (మెదడు కణితి) వచ్చే ప్రమాదం ఉందంటూ, సోషల్ మీడియాలో తరచూ కథనాలు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఇలాంటి భయాల్లో నిజమెంత? సైన్స్ ఏం చెబుతోంది? ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ దీనిపై సంచలన వివరణ ఇచ్చారు.అసలు నిజం ఏంటి?అమెరికాకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ.. మెదడు, నాడీ వ్యవస్థకు సంబంధించిన ట్యూమర్ల చికిత్సలో నిపుణురాలు. ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ అంశంపై నెలకొన్న అపోహలను శాస్త్రీయంగా తిప్పికొట్టారు. బ్లూటూత్ హెడ్ఫోన్ల వాడకానికి, బ్రెయిన్ ట్యూమర్లకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తూ.. ‘మెదడులో పెరిగే ట్యూమర్లు, వినికిడి నాడుల వద్ద వచ్చే గడ్డలు (వెస్టిబ్యులర్ స్క్వానోమాస్), క్యాన్సర్ గడ్డలకు సర్జరీ చేసే వైద్యురాలిగా, సైన్స్ ఏం చెబుతుందో వివరిస్తున్నాను. బ్లూటూత్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు’ అని ఆమె స్పష్టం చేశారు.పరిశోధనలు ఏం చెబుతున్నాయి?డాక్టర్ జుతానీ తన వివరణకు తోడుగా 2022లో నిర్వహించిన పరిశోధనను ఉదాహరించారు. దాదాపు 10 లక్షల మంది మహిళలపై 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో, బ్లూటూత్ లేదా సాధారణ హెడ్ఫోన్ల వాడకం వల్ల ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ సుదీర్ఘ అధ్యయనం ఇయర్ ఫోన్ల వినియోగదారుల్లో ఉన్న భయాన్ని పటాపంచలు చేసింది.రేడియేషన్కు భయపడాలా?సాధారణంగా రేడియేషన్ అనగానే ఎవరికైనా సరే క్యాన్సర్ గుర్తుకు వస్తుంది. అయితే అన్ని రకాల రేడియేషన్లు ప్రమాదకరం కావు. డాక్టర్ జుతానీ వివరణ ప్రకారం బ్లూటూత్ పరికరాల నుండి ‘నాన్-అయోనైజింగ్ రేడియేషన్’ విడుదల అవుతుంది. ఇది ఎక్స్-రేలు లేదా ఇతర ప్రమాదకర కిరణాల మాదిరిగా మన శరీరంలోని డీఎన్ఏ (డీఎన్ఏ)ను దెబ్బతీయదు. డీఎన్ఏ దెబ్బతిననప్పుడు క్యాన్సర్ లేదా ట్యూమర్లు ఏర్పడే అవకాశం ఉండదు.ఫోన్ నేరుగా చెవి దగ్గర పెట్టుకుంటే..మనలో చాలామంది బ్లూటూత్ వాడటం వల్ల ప్రమాదం అనుకుంటారు కానీ, అసలు ముప్పు ఫోన్ నేరుగా వాడటంలోనే ఉందని డాక్టర్ జుతానీ హెచ్చరించారు. బ్లూటూత్ ఇయర్ఫోన్ల కంటే, మొబైల్ ఫోన్ను నేరుగా చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడినప్పుడు రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ఫోన్ను తలకి దూరంగా ఉంచాలని ఆమె సూచించారు. ఫోన్ కాల్ వెళ్తున్న సమయంలో రేడియేషన్ స్థాయిలు గరిష్టంగా ఉంటాయని, అలాగే ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా రేడియేషన్ ఎక్కువగా వెలువడుతుందని ఆమె తెలిపారు. అటువంటి సమయంలో ఫోన్ నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం కంటే ఇయర్ఫోన్స్ వాడటమే సురక్షితమని ఆమె తెలిపారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలురేడియేషన్ ముప్పు లేకపోయినా, అతిగా హెడ్ఫోన్లు వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి డాక్టర్ జుతానీ కీలక సూచనలు చేశారు.స్పీకర్ మోడ్: వీలైనంత వరకు ఫోన్ను స్పీకర్ మోడ్లో పెట్టి మాట్లాడటం అన్నిటికంటే ఉత్తమం.సరైన వినియోగం: టెక్నాలజీని అవసరమైన మేరకే వాడాలి. పని పూర్తయిన వెంటనే ఇయర్ఫోన్లను చెవుల నుండి తొలగించి, దాచుకోవాలి.ఫోన్ దూరం: ఫోన్ను నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం వల్ల వినికిడి నాడులపై ఒత్తిడి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హెడ్ఫోన్లు వాడినప్పుడు ఈ ఒత్తిడి తక్కువగా ఉంటుంది.ఏదైనా అతిగా వాడితే..బ్లూటూత్ ఇయర్ఫోన్లు బ్రెయిన్ ట్యూమర్లకు కారణమవుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ జుతానీ స్పష్టం చేశారు. అయితే, ఏదైనా అతిగా వాడటం ఆరోగ్యానికి హానికరం. వైర్లెస్ సాంకేతికతను వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఫోన్ను నేరుగా తలకు ఆనించి మాట్లాడకుండా ఉండటం శ్రేయస్కరం.గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ‘అది వివక్ష కాదు.. ఆచారం’ -
ఇయర్ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్లో ఎక్కువ సేపు హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్ఫోన్స్ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?) -
మనిషి కడుపులో ఇయర్ ఫోన్లు, తాళం, బోల్టులు.. వైద్యుల అవాక్కు
పంజాబ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కడపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి స్కానింగ్ చేసి పరీక్షించిన వైద్యులు అతని కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కయ్యారు. వ్యక్తి కడుపులో ఏకంగా ఇయర్ ఫోన్స్, లాకేట్స్, బోల్టులు, నట్స్, ఇలా వందకు పైగా వస్తువును చూసి ఖంగుతున్నారు. వివరాలు.. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా వాంతులు, కడుపు నొప్పి, తీవ్రవైన జ్వరం ఉండటంతో మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు మెడిసిన్ ఇచ్చినా నొప్పి తగ్గకపోవడంతో.. స్టమక్ ఎక్స్రే చేయాలని నిర్ణయించారు. స్కాన్ చేసిన తర్వాత వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వ్యక్తి కడుపులో అనేక ఇనుప, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్లు తేలింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి అతడి శరీరంలోని వస్తువులను విజయవంతంగా బయటకు తీశారు. వ్యక్తి కడుపులో నుంచి తీసిన అనేక వస్తువుల్లో ఇయర్ ఫోన్లు, వాషర్లు, నట్స్, సేఫ్టీపిన్స్, బోల్ట్లు, వైర్లు, రాఖీలు, తాళం, తాళం చెవి లాకెట్లు, బటన్లు, రేపర్లు, హెయిర్క్లిప్లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్, ఇలా ఎన్నో ఉన్నాయి. చదవండి: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కొత్త కూటమికి సిద్ధమవుతున్న అన్నా డీఎంకే! సర్జరీపై మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఇదే మొదటిదని అన్నారు. రెండు ఏళ్లుగా ఈ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడని తెలిపారు. దాదాపు 3 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు వ్యక్తి కడుపులోని వస్తువుల్ని తొలగించారు.అతని శరీరంలో నుంచి వస్తువులన్నీ తీసేసినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కుదుటపడలేదని చెప్పారు. వ్యక్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. బాధితుడి కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా షాక్ అయ్యామని చెప్పారు. అవన్నీంటిని అతడు ఎలా, ఎప్పుడూ మింగాడో తెలీదని అన్నారు. కానీ అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, కడుపు నొప్పి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడని తెలిపారు. ఆసుపత్రిలో చేరే కొన్ని రోజుల ముందు నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించినట్లు చెప్పారు. ఎంతమంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా, వారు అతని నొప్పి వెనుకగల కారణాన్ని నిర్ధారించలేకపోయారని పేర్కొన్నారు. -
పాడుతా తీయగా చల్లగా...
జనాభాలో దాదాపు ముప్పయి శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఒక అంచనా. నిద్రలేమిని జయించడానికి ఎన్నో చిట్కాలు పాటిస్తున్నా, వాటి వల్ల దక్కే ఫలితాలు అంతంత మాత్రమే! అయితే, నిద్రలేమికి చెక్ పెట్టడానికి సరికొత్త సాధనం అందుబాటులోకి వచ్చేసింది. ఇది బ్లూటూత్ సాయంతో పనిచేసే హెడ్ఫోన్స్ సెట్. ‘మ్యూజికోజీ హెడ్ఫోన్స్’గా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కోరుకున్న సంగీతం కావలసినంత ధ్వనితో వింటూ తేలికగా నిద్రలోకి జారుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు. ‘పాడుతా తీయగా చల్లగా...’ అంటూ ఈ హెడ్ఫోన్స్ వినిపించే సంగీతాన్ని వింటూ హాయిగా నిద్రలోకి జారుకోగలుగుతున్నామని వినియోగదారులు కూడా చెబుతున్నారు. ఈ ‘మ్యూజికోజీ హెడ్ఫోన్స్’కు ఆన్లైన్లో రివ్యూలు బాగానే వస్తుండటంతో వీటికి గిరాకీ పెరుగుతోంది. ఈ హెడ్ఫోన్స్ ధర 25.70 డాలర్లు (రూ.2032) మాత్రమే! -
అదిరిపోయే గాడ్జెట్, ఫోన్లో మీరు అరిచి గీపెట్టినా ఎవ్వరికి వినబడదు!
సాధారణంగా నలుగురిలో ఫోన్ మాట్లాడటం మహా కష్టం. అదీ ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇంకా కష్టం. మనం మాట్లాడితే పక్కవారు మన రహస్యాలను వింటున్నారా? మాటలను గమనిస్తున్నారా? ఇలా ఎన్నో భయాలతో.. ఫోన్లో అవతల వ్యక్తికి చెప్పాలనుకున్నది చెప్పలేం. మరోవైపు మన ఫోన్ సంభాషణలతో పక్కవాళ్లకు ఇబ్బంది కలుగుతుందేమోననే భయం కొన్నిసార్లు ముఖ్యమైన ఫోన్కాల్స్ను కూడా మాట్లాడనివ్వదు. పోనీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడదామంటే.. అవతల వ్యక్తికి మన మాట సరిగా వినిపించకపోవడమో, చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో.. మనమెంత బేస్లో మాట్లాడుతున్నామో మనకు తెలియకపోవడమో ఇలా చాలా సమస్యలు ఉంటాయి. దాంతో ఏదైనా రహస్యం చెప్పాలంటే.. తర్వాత చెబుతానులే అనేస్తాం. మాట దాటేస్తాం. అలాంటి సమస్యకు చెక్ పెడుతోంది ఈ ఉష్మీ హెడ్ ఫోన్స్. చక్కగా వందమందిలో ఉన్నా రహస్యాలను ఆపాల్సిన పనిలేకుండా చేస్తుంది ఈ డివైజ్. దీన్ని మెడలో వేసుకుని, సంబంధిత యాప్ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఫోన్ రాగానే దాని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని.. మెయిన్ బోర్డ్ డివైజ్ని పెదవులకు దగ్గరగా బిగించుకోవాలి. దీంట్లో సైజ్ అడ్జస్టబుల్ సిస్టమ్ ఉంది. ఔటర్ స్పీకర్స్, మినీ జాక్, ఎయిర్ ఛానల్, మైక్రోఫోన్ ఇలా హై టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్ ఎంత గట్టిగా మాట్లాడినా మన వాయిస్ని క్యాప్చర్ చేసి.. బయటికి అస్సలు వినిపించనివ్వకుండా ఫోన్లో అవతల వ్యక్తికి మాత్రం స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. స్మార్ట్ ఫోన్ యాప్తో లైబ్రరీ మాస్కింగ్ సౌండ్లను ఎంచుకోవడానికీ, వాల్యూమ్ను సర్దుబాటు చేయడానికీ వీలుంటుంది. బయటి నుంచి వచ్చే శబ్దాలను ఇది చాలా సులభంగా నివారిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా క్యాప్చర్ అయినా వాటిని తగ్గించి మన మాటను మాత్రమే అవతలవారికి వినిపించేలా చేస్తుంది. ఆప్షన్స్ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఇయర్ ఫోన్ చిక్కుముడి పడకుండా ఉండాలంటే...
మీ సెల్ ఫోన్ల ఇయర్ ఫోన్లు పాకెట్లో లేదా బ్యాగ్ లో పెట్టుకుంటే చిక్కు బడిపోవడం, ముడిపడటం జరుగుతోందా? అర్జంటుగా ఫోను వస్తూంటే ఇయర్ ఫోన్ చిక్కు ముడులు విప్పుకుంటూ చికాకు పడుతున్నారా? అలాగైతే ఈ వార్త మీ కోసమే. యుకె లోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గత చాలా ఏళ్లుగా ఈ 'పెద్ద' సమస్యను పరిష్కరించేందుకు రీసెర్చిల మీద రీసెర్చిలు చేస్తున్నారు. దారాలు, తాళ్లు సంచుల్లో పెట్టినా, ఒక చోట ఉంచినా ముడిపడిపోవడం ఖాయం. కానీ ఆ ముడులను విప్పడం మాత్రం మహా తలనొప్పిగా ఉంటుంది. ఆ శాస్త్రవేత్తలు చాలా రకాల పరిశోధనలు చేస్తూ చేస్తూ చివరికి కనుగొన్నదేమిటంటే ఇయర్ ఫోన్ రెండు కొసలు - అంటే చెవిలో ఉంచుకునే కొస, సెల్ ఫోన్ ను అమర్చే కొస కలిపి ఉండేలా ఉంచుకుంటే చిక్కుపడదట. దీనికి లూప్ కంజెక్చర్ అని పేరు పెట్టారు. కాబట్టి మీ ఇయర్ ఫోన్ చిక్కు ముడులు పడకుండా ఉండాలంటే రెండు కొసలనూ కలిపేయండి.


