eswari
-
విశాఖ అమ్మాయి.. భారీ ప్యాకేజ్తో కొలువు
మనం అనుకున్నవి నెరవేరకున్నా.. ఆ లక్ష్యం మరో రూపంలో నెరవేరే అవకాశాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి తండ్రీకూతుళ్ల కథే ఇది. తన తల్లి ప్రోత్సహంతో ఉన్నత స్థానానికి ఎదగాలనుకున్న వ్యక్తి.. కన్నకూతురి రూపంలో ఆ ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. భారీ ప్యాకేజీ కొలువుతో తండ్రి కలను తీర్చి.. ఆయన పేరును నలుదిశలా చాటిన ఆ మధ్యతరగతి బిడ్డ పేరు రేపాక ఈశ్వరి ప్రియ. పైగా ఏయూ చరిత్రలోనే పెద్ద ప్యాకేజీ అందుకున్న అమ్మాయి కూడా ఈమెనే కావడం గమనార్హం!. రేపాక శ్రీనివాసరావుది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన ఎలక్ట్రానిక్ స్పేర్పార్ట్లు అమ్ముకునే చిరు వ్యాపారి. ఆయన భార్య రాధ.. గృహిణి. కొడుకు సందీప్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇక కూతురు ఈశ్వరి ప్రియ గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. కానీ, అంతకంటే ముందు శ్రీనివాసరావు గురించి చెప్పాలి. చిన్నతనంలో ఆయనకు బాగా చదువుకోవాలని కోరిక. అదే ఆయన తల్లి కూడా కోరుకుంది. కానీ, ఆమె శ్రీనివాసరావు చిన్నతనంలోనే చనిపోయారు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక.. చదువు ముందుకు సాగలేదు. ఏళ్లు గడిచాయి.. ఆయన పెద్దయ్యాడు.. ఆయనకు ఓ కుటుంబం వచ్చింది. తాను చదువుకోలేకపోయానన్న బాధను.. తరచూ పిల్లల ముందు వ్యక్తపరిచేవారాయన. ఆ మాటలు కూతురు ఈశ్వరి ప్రియను బాగా ప్రభావితం చేశాయి. ‘నేనెలాగూ చదువుకోలేకపోయా. మీరైనా బాగా చదువుకోవా’లనే మాటలను ఆమె బాగా ఎక్కించుకుంది. ఇంటర్, ఆపై ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించింది. కానీ, తండ్రి కళ్లలో ఇంకా పూర్తి స్థాయిలో ఆనందం చూడలేదామె. మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పుడే తన తండ్రి సంతోషంగా ఉంటాడని భావించిందామె. మంచి ర్యాంక్ రావడంతో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో చేరింది. ఈ క్రమంలో సందీప్ సైతం సోదరికి ఎంతో ప్రోత్సాహం అందించాడు. వెనువెంటనే.. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు.. మోర్గాన్ స్టాన్లీ సంస్థలో ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసింది. రెండు నెలల ఇంటర్న్షిప్లో.. ఆమెకు రూ.87 వేలు స్టైపెండ్ వచ్చింది. అప్పుడే.. ఆ కంపెనీ రూ.28.7 లక్షల ప్యాకేజీతో(ఇయర్ శాలరీ) ఆఫర్ చేసింది. ఆపై అమెజాన్ సంస్థ కోడింగ్ పరీక్షలోనూ ఎంపికై.. నెలకు రూ.1.4 లక్షల అందించడం మొదలుపెట్టింది. నెల పూర్తయ్యే లోపే.. అట్లాషియన్లో భారీ ప్యాకేజీతో కొలువు దక్కించుకుంది. ఏకంగా ఏడాదికి.. రూ.84.5 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది అట్లాషియన్ కంపెనీ. ఇది తాను అసలు ఊహించలేదని ఈశ్వరి చెబుతోంది. అంతేకాదు వర్క్ఫ్రమ్ హోం కావడంతో.. తమ బిడ్డ కళ్లెదురుగానే ఉంటూ పని చేసుకుంటుందంటూ ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పెద్ద ప్యాకేజీ ఇంటర్వ్యూ అంటే.. ఆమె ఆందోళనకు గురైందట. అది తెలిసిన శ్రీనివాసరావు.. మరేం ఫర్వాలేదు.. ఇదొక్కటే జీవితం కాదు. అంతా మన మంచికే. నీ వంతు ప్రయత్నించు అని కూతురికి ప్రొత్సహం ఇచ్చి పంపించారు. ఆ మాటలే ఆమెలో ధైర్యాన్ని నింపాయి. ఇంటర్వ్యూ అయిన రోజే అపాయింట్మెంట్ లెటర్ మెయిల్ చేశారు. కిందటి ఏడాది అక్టోబర్లో అట్లాషియన్ కంపెనీ కోడింగ్ కోసం పోటీ పెడితే.. దేశవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు పోటీ పడ్డారు. 300 మందిని ఫైనల్ పోటీలకు ఎంపిక చేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. టెక్నికల్ సిస్టమ్ డిజైన్, హెచ్ఆర్ దశల్లో పరీక్షించి పది మందిని ఉద్యోగాలకు, చదువుతున్న మరో పది మందిని ఇంటర్న్షిప్లోకి తీసుకున్నారు. విశేషం ఏంటంటే.. ఈ ఉద్యోగానికి ఏపీ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈశ్వరినే. ఉపాధి అవకాశాల కోసం సోషల్ మీడియాలో అనేక ఫ్లాట్ఫామ్లు ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్ ఉద్యోగావకాశాలు చాలానే ఉంటున్నాయి. కాకపోతే.. క్యాంపస్లో కాకుండా బయట రిక్రూట్మెంట్స్పై దృష్టిసారించాలి అని సలహా ఇస్తోంది ఈ విజేత. -
చిన్న వయసు.. పెద్ద మనసు
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు భారం అనుకుంటున్న వారూ చాలా మంది ఉన్నారు... తమను పెంచి పోషించిన వారు మంచాన పడితే పట్టించుకోని వారినీ చూస్తుంటాం.. వారికి ఆలనాపాలన చూ సేందుకు వెనకాడుతుంటారు... అయితే ఓ అమ్మాయి తమ తాతయ్య కోసం అహర్నిశలు కష్టపడుతూ సేవలందిస్తోంది. రాయచోటి రూరల్ : రాయచోటి మండలం వరిగపాపిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీలోని చౌడచెరువువారిపల్లెకు చెందిన శంకారపు రెడ్డి ఈశ్వరి ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేసింది. తమ కుటుంబం కోసం ఎంతో కష్టపడిన తాతయ్య శంకారపు గంగాధరానికి సేవలందిస్తోంది. శంకారపు గంగాధరం(90) ఉపాధ్యాయుడిగా, ఎంఈవోగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశారు. ఎంఈవోగా లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో పని చేస్తూ రాయచోటి పట్టణంలో నివాసం ఉండేవారు. పెద్ద కుమారుడు వెంకటరమణ బిడ్డలు రెడ్డికుమారి, రెడ్డి ఈశ్వరి, రెడ్డిప్రసాద్తోపాటు రెండో కుమారుడు శివప్రసాద్ బిడ్డలను కూడా తన వద్దనే ఉంచుకుని చదివించాడు. విద్య విలువ తెలియడంతో పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో వారినే తన వద్దే ఉంచుకున్నారు. వారి చిన్ననాటి నుంచి ఆలనాపాలన చూసుకున్నారు. పక్షవాతం సోకడంతో.. గంగాధరానికి వయసు మీద పడింది. ప్రస్తుతం 90 ఏళ్లు. ఆయనకు పక్షవాతం సోకడంతో మొదట తిరుపతి, అనంతరం మహల్తోపాటు ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈశ్వరి రాత్రి, పగలు ఆయన దగ్గరే ఉంటూ సేవలందిస్తోంది. రోజుకు మూడు పూటలా వేడినీరు, తడిబట్టతో శరీరం శుభ్రం చేయడంతోపాటు అన్ని రకాల సపర్యలు చేస్తోంది. ఇది చూస్తున్న ఆసుపత్రి వర్గాలు, ఇతర రోగులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బిడ్డ పుడితే సంతోషించని వారు ఎవరు ఉంటారని వారు అంటున్నారు. రుణం తీర్చుకుంటున్నా కుటుంబంలో అందరి మంచి కోరుకుంటూ.. మనవళ్లు, మనవరాళ్లను బాగా చదివించిన గొప్ప మనిషి మా తాతయ్య. ఇప్పుడు ఆయనకు జబ్బు చేసింది. సేవ చేసి, రుణం తీర్చుకోవాలని ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నాను. అమ్మానాన్నలు, చినాన్న వాళ్లు, అవ్వ అందరూ తరచూ వచ్చి తాతయ్యను బాగా చూసుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి తాతయ్య అంటే చాలా ఇష్టం. చివరి వరకు బాగా చూసుకోవాలనుకుంటున్నాను. – రెడ్డి ఈశ్వరి -
చంద్రబాబు పై 420 కేసు పెట్టాలి - ఈశ్వరి
-
లింగాపుట్టులో పీహెచ్సీకి కృషి
త్వరలో రక్షిత తాగునీటి పథకం నిర్మాణం పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి హామీ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి బాధిత కుటుంబాలకు పరామర్శ పాడేరు రూరల్ : మండలంలోని లింగాపుట్టు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హామీ ఇచ్చారు. వరుసగా అంతుచిక్కని మరణాలతో బెంబేలెత్తిపోతున్న లింగాపుట్టు గ్రామాన్ని సోమవారం ఆమె సందర్శించారు. రెండు వారాల వ్యవధిలో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ఆమె పరామర్శించి ఓదార్చారు. తాగునీటి పథకం మూలకు చేరడంతో, కలుషితమైన బావి నీటినే ఉపయోగిస్తున్నామని, రోగాలకు ఇదే కారణమని గిరిజనులు ఎమ్మెల్యే ఈశ్వరి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె తాగునీటి బావులను పరిశీలించారు. తోటలగొంది గ్రామం నుంచి పైపులైన్లను ఏర్పాటు చేసి రక్షిత తాగునీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐకేపీ అధికారుల జాడ కరువైందని, గిరిజనులు మృతి చెందుతున్నా ఆపద్బంధు పథకం కింద వారి పేర్లను నమోదు చేయడంలేదని బాధిత కుటుంబాలవారు తెలుపగా అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే చెప్పారు. పారిశుద్ధ్య మెరుగుపరచాలని వీఆర్వోను ఆదేశించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటంలో విఫలమైందని, ఫలితంగా ఇప్పుడు గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడి మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వివరిస్తానన్నారు. ఆమె వెంట ఇన్చార్జీ ఏడిఎంహెచ్వో డాక్టర్ లీలాప్రసాద్, మినుములూరు పీహెచ్సీ వైదాధికారి ఒ. గోపాలరావు, ఇన్చార్జి ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్, పంచాయతీ విస్తరణాధికారి కె. వెంకన్నబాబు పాల్గొన్నారు. -
కొత్తపల్లి గీత ఎస్టీయే కాదు!
-
'కొత్తపల్లి గీత తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారు'
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు ధ్రువపత్రాలు పొందుపరిచారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈశ్వరి మాట్లాడారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈశ్వరి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లి గీత నామినేషన్ అఫిడవిట్లో ఫోర్జరీ సంతకాలు చేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆమె నామినేషన్ పత్రాలు తీసుకున్నామని ఈశ్వరి వెల్లడించారు. ఆమె ఎస్టీ కాదని గతంలోనే జాయింట్ కలెక్టర్ మంగపతిరావు రిపోర్టు ఇచ్చారని చెప్పారు. ఈ ప్రెస్మీట్ తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొత్తపల్లి గీతకు దమ్ముంటే రాజీ నామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధపడాలని ఈశ్వరి సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గీత ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
మాట ఇచ్చా...మళ్లీ వచ్చా...!!
ఓట్ల కోసం వచ్చి అవసరం తీరాక ప్రజలకు మొహం చాటేసే నేతలను ఇన్నాళ్లూ చూసిన ఆ గ్రామస్తులు ఈ కొత్త ఎమ్మెల్యే సాహసం చూసి అబ్బుపడ్డారు. తమ కోసం వాగులు వంకలు, కొండలు గుట్టలు దాటుకుని వచ్చిన తమ ఆడ బిడ్డను చూసి ఆనంద పరవశులై అక్కున చేర్చుకున్నారు. సీలేరు,న్యూస్లైన్ : పాడేరు నియోజకవర్గంలో కాకు లు దూరని కారడవి, అడుగు తీసి అడుగు వేయాలంటే ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ప్రాంతాలవి. గత ఇరవయ్యేళ్లుగా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అటువైపు చూసిన దాఖలాల్లేవు. కనీసం తహశీల్దార్ కూడా వెళ్ళిన చరిత్ర లేదు. నిత్యం మావోయిస్టులు, పోలీసుల మధ్య అక్కడి జనం నలిగిపోతుంటారు. గుమ్మిరేవుల పంచాయతీ 25 గ్రామాల్లో 20 వేలకు పైగా ఓటర్లున్నాయి. ఆ పల్లెలను అభివృద్ధి చేస్తామన్న మాటలు నమ్మి ఇదివరకు నలుగుర్ని ఎమ్మెల్యేలుగా గెలిపించినా ఆ తరువాత వారు మొహం చాటేశారు. అయితే తాజాగా వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే ఈశ్వరి మాత్రం ఆ పంచాయతీలకు వెళ్లారు. సుమారు 30 కిలోమీటర్ల గతుకులు, గంతల రహదారి గుండా అటు ఇటు ఆరు గంటలు ప్రయాణించారు. ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు వెళ్లి అక్కడి ప్రజలకు కలిశానని ఆమె చెప్పారు. ఒక మహిళా ఎమ్మెల్యే తమ గ్రామంలో పర్యటించడం ఇదే మొదటిసారని చెప్పిన అక్కడి జనం ఆమె కోసం పరుగుపరుగున వచ్చి అక్కున చేర్చుకున్నారు. 6 గంటలు ఉత్కంఠ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గిడ్డి ఈశ్వరి ఎలాంటి భయం లేకుండా మావోయిస్టుల కోటలోకి అడుగిడారు. దారిలో పెద్ద పెద్ద గోతులున్నా భయపడకుండా అవసరమైన చోట కాలినడకన వెళ్లారు. ప్రతి గ్రామంలోనూ గిరిజనులను పేరుపేరుగా పలకరిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం 4 నుంచి 11 వరకూ ఆమె పర్యటన సాగింది. ఆమె వెంట జీకేవీధి, చింతపల్లి, పాడేరు జెడ్పీటీసీలు అందరూ మహిళలే కావడం విశేషం. వీరంతా ఆ గ్రామాలకు ధైర్యంగా వెళ్ళారు. ఆమె వెంట పలువురు జడ్పీటీసీలు, కర్యకర్తలు ఉన్నారు.