euthanesia
-
సీఎంకు ట్వీట్: 'దయుంచి నన్ను చంపేయండి'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఓ దళిత రేప్ బాధితురాలు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రాకు చెందిన ఆమెపై కొద్ది రోజుల క్రితం గ్యాంగ్రేప్ జరిగింది. నిందితులను ఇంకా శిక్షించకపోవడంపై ప్రశ్నిస్తూ యోగి ఆదిత్యనాథ్కు ఆమె ట్వీట్ చేసింది. ఒక్కొ క్షణం నరకం అనుభవిస్తున్నానని తనపై దారుణానికి ఒడిగట్టిన వాళ్లు మాత్రం యథేచ్చగా తిరుగుతున్నారని పేర్కొంది. ఆమె ట్వీట్లో ఏం ఉందంటే.. 'నేనొక దళిత అమ్మాయిని. నాపై ఈ ఏడాది మే నెల 2వ తేదీన గ్యాంగ్రేప్ జరిగింది. ఈ రోజు వరకూ నిందితులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. దయచేసి నాకు న్యాయం చేయండి (లేదా) కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి' అని బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది. ట్వీట్లో పోలీసు ఫిర్యాదు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు చేసిన ఫిర్యాదుల పత్రాలను కూడా బాధితురాలు జత చేసింది. బాధితురాలి ట్వీట్ అనంతరం రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పార్టీపై విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని పేర్కొంది. -
ఛోటూకు కారుణ్య మరణం
ఇండోర్: ఛోటూ గత మూడేళ్లుగా అచేతనంగా పడి ఉంది. తనకు సోకిన పక్షవాతం వల్ల కనీసం అటూ ఇటూ కదలడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో అధికారులు 35 ఏళ్ల ఛోటూ పడుతున్న ఇబ్బందిని చూడలేక దానికి శనివారం కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తున్నారు. దానిని ఎంతో అల్లారుముద్దుగా ఛోటూను సాకిన జీవన్ దాదా బాధ మాటల్లో వర్ణించలేనిది. ఇండోర్ జూలోని హిమాలయన్ రకానికి చెందిన ఎలుగుబంటి ఛోటూకు కారుణ్య మరణాన్ని అమలు చేయాలని సెంట్రల్ జూ అథారిటీ నిర్ణయించింది. జూలో పుట్టినప్పటి నుంచి ఛోటూను సంరక్షించిన జీవన్ దాదా శుక్రవారం దానికి చివరిసారిగా అహారం అందించాడు. ఛోటూ కోలుకోవడానికి అత్యుత్తమ వైద్యులతో చికిత్స అందించినా అవేమీ ఫలితాలను ఇవ్వలేదని జూ ఇంచార్జ్ డాక్టర్ ఉత్తమ్ యాదవ్ తెలిపారు. గత సంవత్సరం ఛోటూకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలనే ప్రతిపాదనకు జీవన్ దాదా నిరాకరించాడు. పూర్తిగా వృద్ధాప్యంలోకి ప్రవేశించిన ఆ ఎలుగుబంటి ఇక కోలుకోవడం కష్టమని తెలిపిన వైద్యులు.. కష్టం మీద ఇటీవల జీవన్ దాదాను ఒప్పించారు. ఎలుగుబంటికి నొప్పి కలిగించని విధానం ద్వారా జూ అధికారులు, ఎన్జీవోల సమక్షంలో వైద్యులు దానికి కారుణ్య మరణాన్ని అమలు చేస్తున్నారు.