evacuations ordered
-
Semeru: నిప్పులు కక్కిన రాకాసి పర్వతం
జకార్తా: ద్వీప దేశాల్లో అగ్ని పర్వతాలు బద్ధలు కావడం తరచూ చూసేది. అయితే.. పసిఫిక్ రీజియన్లోని అగ్నిపర్వతాలు బద్ధలు కావడం తరచూ తీవ్రతకు దారి తీస్తుంటాయి కూడా. అందునా రాకాసి అగ్నిపర్వతంగా పేరున్న సెమెరూ వల్ల జరిగే నష్టం మరీ తీవ్రంగా ఉంటోంది. తాజాగా.. ఇండోనేషియా జావా తూర్పు ప్రాంతంలోని గునుంగులో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు 3,676 మీటర్ల ఆదివారం సెమెరూ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో.. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు అధికారులు. కిందటి నెలలో అగ్నిపర్వతం ధాటికి 300 మంది దాకా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు అగ్నిపర్వత ముప్పుపై అక్కడ ఆందోళన నెలకొంది. Pyroclastic flow footage from the Semeru volcano in East Java, Indonesia. Imagine seeing that thing coming toward you. Terrifying. (footage sped up 5x) pic.twitter.com/84D4Dr6IIr — Nahel Belgherze (@WxNB_) December 4, 2022 తూర్పు జావాలో అతిపొడవైన అగ్నిపర్వంగా సెమెరూకి పేరుంది. సోమవారం భారీ శబ్ధం చేసుకుంటూ నిప్పులు కక్కింది ఈ రాకాసి అగ్నిపర్వతం. లావా భారీగా పల్లపు ప్రాంతానికి వస్తోంది. ఈ ప్రభావంతో ఎనిమిది కిలోమీటర్ల మేర జనాలను తిరగనివ్వకుండా జోన్గా ప్రకటించారు అధికారులు. హుటాహుటిన రంగంలోకి దిగి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Gunung #Semeru volcano Java Indonesia, eruption with pyroclastic flow, 04.12.20022, 11:41 local time, realtime speed my prayers are with the people living there pic.twitter.com/YRh7Hd3rOA — Rita Bauer (@wischweg) December 4, 2022 👉TELEGRAM: https://t.co/JDDUrdyqRt 🌋On the island of East Java in Indonesia🇮🇩, the eruption of the volcano Semeru with a height of 3,676 meters began.#Indonesia #Semeru #volcano #Java #eruption #NEWS #indonesia #semeru #gunungberapi #jawa #letusan #berita pic.twitter.com/9vWD4KkylR — DISASTERS IN THE WORLD (@WRLD_disasters) December 4, 2022 #Semeru #Volcano #Indonesia Eruption 2022.12.04 Plume in motion 📸🛰#Landsat8-9 Footage(without motion) : @USGSLandsat @sentinel_hub pic.twitter.com/qAYZtxMZGo — 🛰🗺🌋❄️🌪🌊🔥👀 (@ar_etsch) December 4, 2022 Personel Polsek Pasirian Lumajang Jawa Timur sigap bantu evakuasi warga akibat Awan Panas Guguran Gunung Semeru Lumajang Doa kami menyertai untuk saudara-saudara yang di Lumajang dan sekitarnya moga semuanya diberikan keselamatan#TerusBerikanManfaat Melindungi Dari Bencana pic.twitter.com/qMKdRkrNO8 — Polres Trenggalek (@1trenggalek) December 5, 2022 WATCH: #BNNIndonesia Reports Mount #Semeru, Indonesia's tallest #volcano, erupted on Sunday, sending a massive column of ash into the sky and lava rivers down steep slopes. pic.twitter.com/TVnpAbYDcn — Gurbaksh Singh Chahal (@gchahal) December 4, 2022 అయితే తేలికపాటి వర్షం.. ప్రమాద తీవ్రత నుంచి కొంత ఉపశమనం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఇదే రాకాసి అగ్నిపర్వతం కిందటి ఏడాది బద్ధలైన ఘటనలో.. యాభై మందిదాకా పొట్టనబెట్టుకుంది. వేల మందిని అక్కడి నుంచి తరలిపోయేలా చేసింది. ఇదిలా ఉంటే..పసిఫిక్ తీరంలో చిన్న ద్వీప సమూహాలున్న ఇండోనేషియా.. భూమిపై అత్యంత విపత్తు సంభవించే దేశాలలో ఒకటి. ఈ అగ్నిపర్వతం బద్ధలుకు సంబంధించిన కొన్ని భయానక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. భయంతో జనాలు పరుగులు పెడుతుండగా.. గాయపడిన కొందరిని చికిత్సకు తరలిస్తున్నవి వైరల్ అవుతున్నాయి. -
అఫ్గానిస్తాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు వేగవంతం
-
అఫ్గన్లో 1,500 మంది భారతీయులు.. తరలింపుపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: తాలిబాన్లు ఆదివారం అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లోకి ప్రవేశించింది మొదలు అక్కడ ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడంలో ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 5 నాటికి అఫ్గానిస్తాన్లో అధికారులు సహా సుమా రుగా 1,500 మంది భారతీయులు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది బ్యాంకులు, ఐటీ సంస్థలు, నిర్మాణ సంస్థలు, ఆసుపత్రులు, ఎన్జీవో సంస్థలు, టెలికాం కంపెనీలు, సెక్యూరిటీ కంపెనీలు, యూనివర్శిటీలు, భారత ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టులు, ఐక్యరాజ్యసమితి అనుబంధ మిషన్లలో పనిచేస్తున్నారు. జూలైలోనే కాందహార్లో భారత కాన్సులేట్ కార్యాలయ సిబ్బందిని భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. కాబూల్లోని భారత రాయబార కార్యాలయం మాత్రం యథావిధిగా పనిచేస్తూ వీసా జారీ తదితర సేవలు అందిస్తోంది. అయితే సోమవారం మధ్యాహా్ననికి కాబూల్లోని భారత ఎంబసీలో అధికారులు, సిబ్బంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ తదితర పారా మిలిటరీ సిబ్బంది సహా 200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు ఎదురుచూస్తున్నట్టు సమాచారం. కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ వాయుసేనకు చెందిన భారీ విమానం (సి–17 గ్లోబ్ మాస్టర్) ఒకటి అందుబాటులో ఉందని, దానిలో వీరందరినీ తరలించాలని యతి్నస్తున్నప్పటికీ ఎంబసీ నుంచి విమానాశ్రయానికి చేరే పరిస్థితి లేకపోవడం, విమానాశ్రయం నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో వీరి తరలింపుపై ఉత్కంఠ నెలకొని ఉంది. భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. భారత రాయబార కార్యాలయం మూసివేత అఫ్గనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం కాబూల్లో రాయబార కార్యాలయం మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని తరలించింది. -
అమెరికాలో పెనుముప్పు.. ఎన్నారైల ప్రాంతాలు ఖాళీ
-
అమెరికాలో పెనుముప్పు.. ఎన్నారైల ప్రాంతాలు ఖాళీ
అమెరికాలో ఒక పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దాంతో ఓరోవిల్లె పరిసర ప్రాంతాలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎన్నారైలు ఉంటారు. మొత్తం జనాభాలో 13 శాతం మంది పంజాబీలు, సిక్కులేనని తెలుస్తోంది. ఓరోవిల్లె డ్యాం ఎమర్జెన్సీ స్పిల్వే వద్ద ఒక రంధ్రం కనిపించడంతో ఏ క్షణంలోనైనా డ్యాం బద్దలయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఈ ప్రాంతమంతా కొట్టుకుపోతుందని అంటున్నారు. రంధ్రాన్ని మూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందువల్ల దిగువ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. ఓరోవిల్లె డ్యాం ఆగ్జిలరీ స్పిల్వేకు రంధ్రం పడిందని, దానివల్ల ఓరోవిల్లె చెరువు నుంచి భారీ మొత్తంలో వరద నీరు ముంచెత్తొచ్చని జాతీయ వాతావరణ శాఖ తొలుత తెలిపింది. పరిస్థితి ఏమాత్రం తమ అదుపులో లేదని, అందువల్ల ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పారు. ఓరోవిల్లె నగరంలో సుమారు 16వేల మంది ఉంటారు. వాళ్లలో చాలామంది ఎన్నారైలు ఉన్నారని తెలుస్తోంది. అందులోనూ పంజాబీలు, సిక్కులు ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్లందరినీ చికో నగరం వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. యుబా కౌంటీకి కూడా ప్రమాదం ఉందని, అందువల్ల వాళ్లు కూడా ఖాళీ చేయాలని చెప్పారు. ఇది ఏదో ప్రయోగాత్మకంగా చేస్తున్న డ్రిల్ కాదని, అందువల్ల ప్రజలు వెంటనే కదలాలని జాతీయ వాతావరణ శాఖ నొక్కిచెప్పింది. ఇటీవలి కాలంలో వర్షాలు, మంచు ఎక్కువగా పడుతుండటంతో నీరు ఎక్కువగా చేరిందని, నీటి ఒత్తిడి వల్లే స్పిల్వేకు రంధ్రం పడి ఉంటుందని అధికారులు అంటున్నారు. డ్యాం నుంచి భారీ మొత్తంలో నీళ్లు వస్తున్నట్లు హెలికాప్టర్ల ద్వారా తీసిన వీడియోలో కనిపించింది. స్పిల్వేకు మరమ్మతులు చేయడానికి సుమారు రూ. 670-1300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.