నిలిచిపోయిన గూడ్స్: రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటక - నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ జడ్చర్ల వద్ద నిలిచిపోయింది.
అలాగే చెన్నై - కాచిగూడ మధ్య నడిచే ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ గొల్లపల్లి వద్ద ఆగిపోయింది. డెమో రైలు దివిటిపల్లి వద్ద నిలిచిపోయింది. అయితే గూడ్స్ రైలు ఇంజన్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.