breaking news
families of farmers
-
ఆ రైతు కుటుంబాలను నిలబెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు మళ్లీ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని మహిళా రైతులు, శ్రామికుల హక్కుల వేదిక (మకాం) డిమాండ్ చేసింది. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన మహిళలను రైతులుగా గుర్తించాలని, వారు వ్యవసాయం కొనసాగించడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరింది. మహిళా రైతులను ఆదుకునేందుకు వారి పేరిట పట్టాలు, రుణాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. శుక్రవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మకాం ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభం-మహిళా రైతులు, శ్రామికులపై పడుతున్న ప్రభావం-మనమేం చేద్దాం?’’ అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. రైతు స్వరాజ్య వేదిక సభ్యురాలు గోపరాజు సుధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోప్రొ.రమా మెల్కొటే, మకాం ప్రతినిధులు ఉషా సీతాలక్ష్మి, విజయ రుక్మిణిరావు, కె.సజయ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. మకాం పక్షాన గ్రామాలకు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని, మహిళా రైతు లు, గ్రామాల్లో సంప్రదాయ వ్యవసాయ పరిరక్షణకు చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయంలో మహిళల పాత్రను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను బాధిత రైతు కుటుంబాల మహిళలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమా మెల్కొటే మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్రం సమగ్రమైన విధానం రూపొందించాలన్నారు. సాగును మరిచిపోయి కేవలం పాశ్చాత్య దేశాల్లోని అభివృద్ధిని అనుసరించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడకపోవడం వల్లే సంక్షోభం తలెత్తుతోందని ఉషా సీతాలక్ష్మి అన్నారు. రైతుల కోసం విరాళాలు సేకరిస్తున్నవారిలో.. రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశం కాకుండా, వారి ద్వారా ఏం ప్రయోజనం పొందుదామనే ధోరణే కనిపిస్తోందని కె.సజయ అన్నారు. మహిళా రైతులకు గుర్తింపు, ఇతరత్రా సమస్యలపై పాదయాత్ర నిర్వహించాలని ప్రముఖ రచయిత్రి విమల సూచించారు. -
రైతు కుటుంబాలకు నానాపటేకర్ సాయం
113 కుటుంబాలకు చెరో రూ.15,000 అందజేత లాతూర్: కరువు, అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ రూ.15,000 చొప్పున నగదు సాయం అందించారు. శనివారం ఇక్కడ మొత్తం 113 కుటుంబాలకు నటుడు మకరంద్ అనాస్పురెతో కలసి చెక్కులిచ్చారు. మహారాష్ట్రలోని మరాఠాడ్వా ప్రాంతంలోని లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో కరువు కన్నెర్రజేసిందని పటేకర్ అన్నారు. ‘శరద్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్ వంటి రాజకీయ నేతలు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆశిస్తున్నాను. నా ఆశ తీరుతుందో లేదో తెలి యదు’ అని అన్నారు. గత నెలలోనూ విదర్భ లో పటేకర్ 62 కుటుంబాలకు రూ.15,000 చొప్పున నగదు సాయం చేశారు. -
వస్తున్నాడు
11న హైదరాబాద్కు రాహుల్ 12న నిర్మల్లో 15 కిలోమీటర్ల పాదయాత్ర ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ ఈ నెల 11న హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12న ఉదయం 15 కి.మీ కాలినడకన తిరగనున్నారు. పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం నుంచి 200 మంది కార్యకర్తలకు తగ్గకుండా పాల్గొనేలా రాష్ట్ర నేతలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ ఈ నెల 11న హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12వ తేదీన ఉదయం 15 కిలోమీటర్లు కాలినడకన తిరగనున్నారు. ఈ మేరకు రాహుల్ పర్యటన ఏర్పాట్లపై చర్చించడానికి టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ గాంధీభవన్లో మంగళవారం సమావేశమైంది. ఈ పర్యటన సందర్భంగా పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ‘రైతు ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో జరుగుతున్న ఈ పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 200 మంది కార్యకర్తలకు తగ్గకుండా పాల్గొనేలా చూడాలని, నియోజకవర్గాల వారీగా బాధ్యతలను విభజించుకోవాలని నిర్ణయించారు. పర్యటన వివరాలివీ.. 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాహుల్గాంధీ హైదరాబాద్కు చేరుకుని.. బేగంపేటలోని బాలయోగి పర్యాటక భవన్లో బస చేస్తారు. 12వ తేదీన ఉదయం 5.30కు హైదరాబాద్ నుంచి వాహనాల్లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు బయలుదేరుతారు. ఉదయం 9 గంటల సమయంలో ఆ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాల గ్రామానికి రాహుల్ చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. వడ్యాల నుంచి రాచాపూర్, పొట్టుపల్లి, లక్ష్మణచాంద మీదుగా కొరటికల్ గ్రామానికి చేరుకుంటారు. ఈ గ్రామాల్లో ఏడు రైతు కుటుంబాలను రాహుల్గాంధీ పరామర్శించనున్నారు. పాదయాత్రలో చివరి గ్రామమైన కొరటికల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు. అదేరోజున రాత్రి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. 13న ఉదయం ఢిల్లీకి తిరిగి వెళతారు. పార్టీ నేతలు, ఇతర ముఖ్యులు ఎవరైనా రాహుల్గాంధీని కలవాలనుకుంటే 11వ తేదీన సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల దాకా అవకాశం ఉన్నట్టుగా టీ పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ముఖ్యనేతలు డి.శ్రీనివాస్, దామోదర, జె.గీ తారెడ్డి, శ్రీధర్బాబు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. రెండు వారాల్లో మరో పర్యటన.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్టాగోష్టి, తెలంగాణ ప్రొఫెసర్లతో చర్చలు, హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్ ముందుగా నిర్ణయం తీసుకున్నారని.. అయితే వాటికోసం మరో పర్యటన పెట్టుకోవాలని నిర్ణయించారని టీ పీసీసీ నేతలు తెలిపారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే అందరి దృష్టి అటువైపు మళ్లే అవకాశం ఉంటుందని రాహుల్ భావిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల మరో రెండు వారాల్లోనే రాహుల్ మరోసారి హైదరాబాద్లో పర్యటించే అవకాశముందని పేర్కొన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలి సంక్షోభంలో కూరుకుపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని టీ పీసీసీ కిసాన్సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మా జీమంత్రి డి.శ్రీధర్బాబు, నేతలు భిక్షమయ్యగౌడ్, మాదు సత్యం అన్నారు. గాంధీభవన్లో మంగళవారం వారు వి లేకరులతో మాట్లాడారు. సాగర్లో జరిగిన టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో రైతులు, వ్యవసాయం సంక్షోభం, ఆత్మహత్యలను ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని వారు వ్యాఖ్యానించారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.