the fight
-
ప్రపంచప్యూచర్ సిటిగా అవతారమెత్తబోతున్న సిటీ
-
హామీలు నెరవేర్చే వరకు పోరాటం
అనంతపురం అర్బన్ : తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేదాక నిరంతర పోరాటం సాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టనున్న దీక్షకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్రెడ్డి ప్రారంభించిన పాదయూత్ర రెండవ రోజు మంగళవారం అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నందిని హోటల్ ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్నారాయణ మాట్లాడుతూ... టీడీపీ అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ఇలాంటి ప్రభుత్వం మెడలు వంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా మధుసూదన్రెడ్డి పాదయాత్ర చేశారన్నారు. జిల్లా మహిళ అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం మహిళలను పూర్తిగా మోసం చేసిందన్నారు. మహిళలంతా సంఘటితమై ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్రె డ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం మెడలు వంచి తీరుతామన్నారు. రైతులు, డ్వాక్రా మహిలు, చేనేత కార్మికులను నిలువునా మోసం చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమన్నారు. పార్టీ నేత చవ్వా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. అనంత చెల్లమ్మ కన్నీళ్లు తుడవాలని అపర భగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ముఖ్యమంత్రి, మంత్రులు అంతా తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి మధుసూదన్రెడ్డి పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు మధుసూదన్రెడ్డికి నగర శివారులోని మెట్టగోవిందరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఉరవకొండ నుంచి మొదలైన పాదయూత్ర 70 కిలోమీటర్లు కొనసాగింది. జల్లిపల్లి, లత్తవరం, షేక్షానుపల్లి, కోనాపురం, పెన్నోహోబిలం, శివకాలపేట, ఉదిరికొండ, ముద్దలాపురం, కూడేరు, అరవకూరు, కమ్మూరు, గొట్కూరు, బ్రహ్మణాపల్లి, రాచానపల్లి, సిండికేట్ నగర్ మీదుగా అనంతపురంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వైవి.నాగిరెడ్డి, రైతు సంఘం నేత తరిమెల శరత్చంద్రారెడ్డి, రాయదుర్గం మాజీ మున్సిపల్ ఛైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార ్యదర్శి మీసాల రంగన్న, పార్టీ అనుబంధ సంఘ రాష్ట్ర నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, ఎగ్గుల శ్రీనివాసులు, శ్రీదేవిరెడ్డి, అనుంబంధ సంఘాల అధ్యక్షులు మరవపల్లి ఆదినారాయణరెడ్డి, వెంకట చౌదరి, ధనుంజయ యాదవ్, బండి పరుశురాం, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, చింతకుంట మధు, డాక్టర్ మైనుద్దీన్, మిద్దె భాస్కర్రెడ్డి, మారుతినాయుడు, పెన్నోబిలేసు, రిలాక్స్ నాగరాజు, కృష్ణవేణి, విద్యాసాగర్రెడ్డి, అంకిరెడ్డి ప్రమీళరెడ్డి, హజీరాం బీ, మునీరా, నాగలక్ష్మి, కణేకల్ లింగారెడ్డి, నరసింహరెడ్డి, వలిపిరెడ్డి శివారెడ్డి, గౌస్బేగ్, సురేష్రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. డిమాండ్లు ఇవే... హంద్రీ-నీవాకు 2015-16 బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలి. వచ్చే ఖరీఫ్కి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరిందించాలి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు బేషరతు రుణమాఫీ చేయాలి ఇంటికో ఉద్యోగం కల్పించాలి నిరుద్యోగ భృతి కింద రూ.2 వేలు చెల్లించాలి నిరుద్యోగ యువతకు తక్షణమే ఉపాధి కల్పించాలి -
మహిళా హక్కుల సాధనకు మరో పోరాటం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆకాశంలో సగం మహిళలు అంటూ ప్రగల్బాలు పలికే పాలకులు తమకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంలో మాత్రం పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారని, మహిళా సాధికారతను తుంగలో తొక్కుతున్నారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గాదె ఝాన్సీ, చండ్ర అరుణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచి ఉద్యమాలు చేసిన మహిళలు తమ హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 7 నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని అన్నారు. మహిళలకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి తమ సంఘం పోరాడుతోందని చెప్పారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడారు. 1973 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా విద్యార్థినులపై వేధింపులు ఎక్కువ కావడంతో లలిత అనే విద్యార్థిని ఆధ్వర్యంలో ఏర్పాటైన అభ్యుదయ సంఘం.. 1974లో అన్ని రాష్ట్రాల్లో ప్రగతిశీల మహిళా సంఘంగా రూపాంతరం చెందిందని తెలిపారు. అదే సంవత్సరంలో ఖమ్మం నగరంలో కుటుంబ హింసపై పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించామని, మహిళలపై జరుగుతున్న వేధింపులపై ఈ సభలో సందేశం ఇచ్చామని చెప్పారు. ఈ సంఘం మహిళల కోసం.. వారి హక్కుల కోసం.. స్త్రీలలో సామాజిక చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తోందని తెలిపారు. సామ్రాజ్యవాద విష వలయంలో మహిళను ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు. 2003-04లో కేంద్ర ప్రభుత్వం గృహహింస ముసాయిదా చట్టం తీసుకొచ్చిందని, అయితే అందులో భర్త అప్పుడప్పుడు భార్యను కొట్టడం నేరం కాదని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ పీవోడబ్ల్యూ అనేక పోరాటాలు చేసిందని, దీని ఫలితంగానే చట్టంలో మార్పులు వచ్చాయని వివరించారు. ప్రభుత్వాలు మహిళల హక్కులపై ఎన్ని చట్టాలు చేసినా, వారికి ఉన్న హక్కులను మహిళలు తెలుసుకోలేకపోతున్నారని, దీనిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఘటన తర్వాత ప్రభుత్వం నిర్భయ చట్టం రూపొందించిందని, ఈ చట్టం రూపకల్పనకు ముందు వర్మ కమిషన్ వేశారని, ఈ కమిషన్ మహిళలపై జరుగుతున్న హింస, దాడులకు కారణాలేంటి.. ఈ సంఘటనలపై సామాజిక ప్రభావం ఎలా ఉంది.. పోలీసుల ప్రవర్తన ఎలా ఉంది అనే వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని, దీనిని పట్టించుకోకపోవడంతో నిర్భయ చట్టం తర్వాత కూడా మహిళలపై దాడులు ఆగలేదని పేర్కొన్నారు. 30 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులపైనే కాకుండా మహిళల ప్రధాన సమస్యలపై పోరాటానికి, వారిని చైతన్యం చేసేందుకు రాత్రి పాఠశాలలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వమే ఈ పాఠశాలలను ప్రస్తుతం యువజన విద్య పేరుతో నిర్వహిస్తోందన్నారు. అనేక మంది ఆకలితో చనిపోతుంటే పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని, దాని ద్వారా పనికి ఆహార పథకం ప్రారంభించారని, దీనిని ప్రస్తుతం ఉపాధి హామీ పథకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే అది ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో ఇంకా జోగిని వ్యవస్థ ఉందని, ఈ మూఢాచారాల నుంచి మహిళలను విముక్తి చేసేందుకు ఉద్యమిస్తున్నామని చెప్పారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాల నుంచి తప్పించుకునేందుకు పురుషులు కొత్త దారులు వెతుకుతున్నారని, కొందరు భార్యాబాధితుల పేరుతో సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. సమాజంలో మహిళలే వివక్షకు గురవుతుంటే పురుషులను ఎలా వేధిస్తారని ప్రశ్నించారు. 3,4,5 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, పీకే హిందీ చిత్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఏమీ లేవని, అయినప్పటికీ కొన్ని సంస్థలు, వ్యక్తులు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు భావించారని, ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో మహిళా మంత్రి కాని, మహిళ కమిషన్ను కాని నియమించకపోవడం నిరాశను కల్పించిందని అన్నారు.