finance support
-
పేదరికంలో సరస్వతీ పుత్రుడు.. స్పందించిన కేటీఆర్.. ఆదుకుంటామని హామీ
సాక్షి, కరీంనగర్(జమ్మికుంట): సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది. కూలీ పని చేసుకుంటే కాని పూటగడవని ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేడుకుంటున్నారు. వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి ధర్మారం గ్రామంలోని రెండో వార్డుకు చెందిన మోతే అశోక్– రాణి దంపతుల కుమారుడు మోతే జయంత్. అశోక్ నాలుగు రేకులు వేసుకొని, చుట్టూ పరదాలు కప్పుకొని, ఆటో అద్దెకు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జయంత్ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడు. 1 నుంచి 6వ తరగతి వరకు ఇల్లందకుంట జిల్లా పరిషత్ పాఠశాల, పదో తరగతి వరకు మానకొండూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసించి, హైదరాబాద్లోని గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మెడిసిన్ సీటు వచ్చిందని ఆ తల్లితండ్రులు ఎంతో సంబరపడ్డా.. కుమారుడి చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో కూడా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికం అతడిని వెంటాడుతున్నా పట్టుదలతో చదివి ఇటీవల నిర్వహించిన నీట్లో 463 మార్కులతో 2,700 ర్యాంక్ సాధించాడు. ఈనెల 8న నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలి. మెడిసిన్ చదువుకు ఏడాదికి రూ.1లక్షకు పైగా ఖర్చువుతుంది. పేద తల్లిదండ్రులు అంత మొత్తంలో ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేదంటున్నారు. దాతలు పెద్ద మనసుతో ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయండి సారు.. డాక్టర్ చదువుకొని, భవిష్యత్లో పేదలకు సేవ చేస్తానని అంటున్నాడు జయంత్. కేటీఆర్ హామీ అయితే నీట్లో మంచి ర్యాంకు సాధించి.. యువకుడి ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయిన పలువురు తమకు తోచిన సాయం చేస్తున్నారు. మరికొంతమంది యువకుడిని ఆదుకోవాలంటూ ‘సాక్షి కథనాన్ని’ ట్విటర్లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. దగ్గరుండి అతనికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సమన్వయం చేసుకోవాల్సిందిగా మంత్రి కార్యాలయానికి సూచించారు. Will take care personally @KTRoffice please coordinate https://t.co/eYx0boCgYC — KTR (@KTRTRS) November 4, 2022 దాతలు సాయం చేయాల్సిన అడ్రస్ మోతే జయంత్ అకౌంట్ నం : 026312010000566 ఐఎఫ్ఎస్సీ కోడ్ UBI0802638, యూనియన్ బ్యాంకు, జమ్మికుంట బ్రాంచ్ -
5 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు చార్జ్!
వాషింగ్టన్: భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉద్దేశించిన ఒక అధునాతన సాంకేతికత సాయంతో విద్యుత్ కారును కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చని నాసా ఆర్థికసాయంతో పరిశోధన చేసిన ఒక అధ్యయన బృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోడ్డు వెంట ఉన్న చార్జింగ్ స్టేషన్లో దాదాపు 20 నిమిషాలు, ఇళ్లలో అయితే గంటల తరబడి విద్యుత్ కార్లను చార్జ్ చేయాల్సి వస్తోంది. దాంతో ఇప్పటికీ భారత్లో కొందరు విద్యుత్ వాహనాలకు యజమానులుగా మారేందుకు సంసిద్ధంగా లేరు. ప్రస్తుతమున్న అధునాతన చార్జర్లు 520 ఆంపియర్ల కరెంట్నే బదిలీచేయగలవు. వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులో ఉన్న చార్జర్లు అయితే కేవలం 150 ఆంపియర్లలోపు విద్యుత్నే పంపిణీచేయగలవు. అయితే, నూతన ఫ్లో బాయిలింగ్, కండన్సేషన్ ఎక్స్పరిమెంట్తో ఇది సాధ్యమేనని అమెరికాలోని పురŠూడ్య విశ్వవిద్యాయంలోని పరిశోధకులు చెప్పారు. అయితే, 1,400 ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సామర్థ్యముండే చార్జింగ్ స్టేషన్లలో ఇది సాధ్యమేనని నాసా పేర్కొంది. ఇంతటి ఎక్కువ ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సమయంలో వేడి బాగా ఉద్భవిస్తుంది. దీనికి చెక్పెట్టేందుకు ద్రవ కూలెంట్ను ముందుగా చార్జింగ్ కేబుల్ గుండా పంపించారు. ఇది కరెంట్ను మోసుకెళ్లే కండక్టర్లో జనించే వేడిని లాగేస్తుంది. దీంతో 4.6 రెట్లు వేగంగా చార్జింగ్ చేయడం సాధ్యమైంది. కరెంట్ ప్రసరించేటపుడు వచ్చే 24.22 కిలోవాట్ల వేడిని ఈ విధానం ద్వారా తొలగించగలిగారు. ‘కొత్త పద్ధతి కారణంగా చార్జింగ్ సమయం బాగా తగ్గుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్ జంజాటం లేదుకాబట్టి ఎక్కువ మంది ఎలక్టిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతారు’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. భారరహిత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ రెండు ఫేజ్ల ఫ్లూయిడ్ ఫ్లో, వేడి బదిలీ ప్రక్రియను పరీక్షించనున్నారు. -
భళా.. బాల కార్మికా
‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయంచేసే చేతులు మిన్న’.. ఓ అధికారి ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆ యువకులను ఉన్నతస్థాయికి చేర్చింది. జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు ఒక అధికారి ఇచ్చిన చేయూత వారి జీవితాలను మార్చేసింది. ఒకరు డాక్టరు అయితే మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా.. ఇంకొకరు íసీఏ ఫైనల్ చదువుతున్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన ఈ పేద విద్యార్థుల విజయగాథ ఏమిటంటే.. బీవీ రాఘవరెడ్డి 1998లో కర్నూలుకు చెందిన నిరుపేద తల్లిదండ్రులు తమ కుమారుడు శివప్రసాద్ను 8వ తరగతిలోనే చదువు మాన్పించి స్థానిక జిన్నింగ్ మిల్లులో సంచులు కుట్టే పనిలో పెట్టారు. తనిఖీ నిమిత్తం ఆ మిల్లుకు వెళ్లిన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్రెడ్డి ఆ కుర్రాడితో కాసేపు మాట్లాడాక అతనికి చదువుపై ఉన్న ఇష్టాన్ని గుర్తించారు. శివప్రసాద్ తండ్రిని ఒప్పించి.. తానే స్కూలులో చేర్పించి ఆర్థికసాయం అందిస్తూ వచ్చాడు. టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు సంపాదించిన శివప్రసాద్ ఆ తర్వాత మెడిసిన్ సీటు సాధించాడు. అనంతరం జనరల్ మెడిసిన్లో పీజీ, క్లినికల్ ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేసి ఇప్పుడు కర్నూలు విశ్వభారతి మెడికల్ కళాశాలలో మెడికల్ ఆంకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన జనార్థన్దీ ఇలాంటి కథే. చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనికి వెళ్తున్న ఆ కుర్రాణ్ణి శివకుమార్రెడ్డి చేరదీసి ఇంటర్లో చేర్పించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్లో సీటొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని కోర్సు పూర్తయ్యాక ఫోన్పేలో ఉద్యోగం సంపాదించాడు. ఇక ఏటుకూరుకు చెందిన యలవర్తి శివకుమార్ కూడా వీరిలాగే గుంటూరులోనే బాలకార్మికుడిగా పనిచేస్తుండగా శివకుమార్రెడ్డికి తారసపడ్డాడు. అతనికి చదువుపై ఆసక్తి ఉందని తెలిసి సీఏ ఇంటర్లో చేర్పించారు. అతను ఇప్పుడు సీఏ ఫైనల్కు ప్రిపేర్ అవుతున్నాడు. శివకుమార్ అన్న విజయకుమార్కు సైతం చేయూతనివ్వటంతో అతనూ ఫీజు రీయింబర్స్మెంటుతో బీటెక్ పూర్తిచేసి టీసీఎస్లో రూ.22 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. పేద పిల్లల చదువుకు చేయూత వివిధ కారణాలతో కొందరు పిల్లలు చిన్న వయసులోనే చదువుకు దూరమవుతున్నారు. నా విధి నిర్వహణలో భాగంగా ఫ్యాక్టరీల్లో బాల కార్మికులను గుర్తించి వారిని ఇంటికి పంపడంతో సరిపెట్టకుండా చదువు వైపు మళ్లిస్తున్నాను. నాలుగు కుటుంబాల్లో వెలుగు రావటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అదే స్ఫూర్తితో నంద్యాలలోని నా చిన్ననాటి స్నేహితులతో కలిసి ‘ఆపద్బంధు సేవాసమితి’ని ప్రారంభించి పేద పిల్లల చదువుకు చేయూతనిస్తున్నాం. – ఎంవీ శివకుమార్రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విజయ్కుమార్కు వచ్చిన టీసీఎస్ ఆఫర్ లెటర్ నేను సైతం.. నేను టెన్త్ చదువుతున్నప్పుడు గుంటూరులోనే ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేసేవాడ్ని. అప్పుడు తనిఖీకొచ్చిన ఇన్స్పెక్టర్ శివకుమార్రెడ్డి నన్ను ప్రోత్సహించి సాయంచేశారు. ఫీజు రీయింబర్స్మెంటు తోడ్పాటుతో ఇంజనీరింగ్ పూర్తిచేశా. ప్రస్తుతం ఫోన్పేలో పనిచేస్తున్నాను. సార్ చూపిన బాటలో విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. – గుంజి జనార్థన్రావు, బిజినెస్ డెవలెప్మెంట్ అసోసియేట్, ఫోన్పే ఆ స్ఫూర్తి మరువలేనిది.. పేద కుటుంబం కావటంతో చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనిచేసేవాణ్ని. 2008లో సార్ తనిఖీకి వచ్చినపుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పనిమానేసి చదువుపై శ్రద్ధపెట్టాలని చెప్పి ఆర్థికసాయం చేశారు. టెన్త్లో మంచి మార్కులొస్తే కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ ఘటన మర్చిపోలేను. నేను ఈస్థాయికి చేరుకోవడానికి సార్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. – యలవర్తి శివకుమార్, సీఏ ఫైనల్ -
అమ్మాయి నవ్వింది!
హుస్నాబాద్రూరల్: ఆడ పిల్ల పెళ్లా...! అబ్బో.. అనుకునే సామాన్య కుటుంబాలు ఆడపిల్ల పుట్టిదంటే కష్టాలు మొదలవుతాయని ఉహించుకొంటారు. అలాంటి వివక్షను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ కుటుంబాలకు చెందిన 3 లక్షల కు పైగా కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించింది. వచ్చే ఏప్రిల్ నుంచి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116Sకు పెంచనుంది. జిల్లాలో 58,165 మంది కిశోర బాలికలు ఉండగా ఇందులో 50 వేల మందికి ఆరేళ్లలో ప్రయోజనం చే కూరనుంది. 4 వేల వరకు 18 ఏళ్లు దా టిన బాలికలకు తక్షణ లబ్ధి కలగనుంది.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్ల క్రితం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన అడపిల్లల పెళ్లిలకు 51వేల ఆర్థిక సహాయం అందజేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని బీసీలు, ఓసీలలోని పేద కుటుంబాలకు వర్తింపజేస్తూ పథకం నగదు ప్రోత్సాహకాన్ని రూ.75,116లకు పెంచింది. ఆడబిడ్డలను కన్నవారిలో ఆనందం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే ప్రోత్సాహకాలను లక్షకు పెంచడంతో ఆడబిడ్డలను తల్లిదండ్రుల్లో కాస్త ఊరట కనిపిస్తోంది. ప్రభుత్వ సహాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 7వేల మంది కిశోర బాలికలు, 2వేల మంది పెళ్లి వయస్సు వచ్చిన యువతులు ఉండగా జిల్లాలో దాదాపు 40వేల మంది కిశోర బాలికలు, 12వేల వరకు పెళ్లి వయస్సు వచ్చిన ఆడపడచులకు ప్రయోజనం చేకూరనుంది. -
కిడ్నీ బాధితుడికి చేయూత
అనంతపురం ఎడ్యుకేషన్ : కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి ఎస్ఎస్బీఎన్ కళాశాల విద్యార్థులు అండగా నిలిచారు. ఆత్మకూరుకు చెందిన మనోజ్కుమార్ అనే యువకుడు రెండు కిడ్నీలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్న వైనంపై ‘సాక్షి’లో ఇటీవల ‘బతుకునివ్వండి’ శీర్షికతో కథనం వెలువడింది. స్పందించిన ఎస్ఎస్బీఎన్ కళాశాల బీజెడ్సీ ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె.సుకన్య, ప్రణీతాదీప్తి, శిరీష, అనిల్కుమార్ రూ. 20 వేల విరాళం సేకరించారు. ఈ మొత్తాన్ని శనివారం కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు.