breaking news
freedom of Press
-
ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా?
‘నువ్వు చెప్పే దానితో నేను ఏకీభవించకపోవచ్చు కానీ చెప్పడానికి నీకున్న ఆ హక్కును నా ప్రాణమిచ్చి అయినా కాపాడుతాను’ అన్న ప్రముఖ ఫ్రెంచ్ రచయిత వోల్టేర్ మాటలు గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ (Democracy) అనుకుంటున్న మన దేశంలో నీటి మూటలే! దేశంలో పాత్రికేయులకు రచయితలకు గడ్డుకాలం దాపురించింది. అకారణమైన అరెస్టులు, అక్రమ కేసులు వారి చుట్టూ బిగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు.పత్రికా సంపాదకుల మీద, పాత్రికేయుల మీద నిర్బంధకాండ యథేచ్చగా కొనసాగుతున్నది. ప్రభుత్వాలు తమకు వ్యతి రేకంగా రాసే పత్రికా సంపాదకులనూ, పాత్రికేయులనూ, సోషల్ మీడియా (Social Media) జర్నలిస్టులనూ, యూట్యూబర్లనూ ఒక్కరనేమిటి... ఎవరినీ వదలడం లేదు. కేసులతో వారిని వేధిస్తున్నారు. ఇళ్లపై అర్ధరాత్రి దాడులు నిర్వహించి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. తప్పును తప్పుగా చెప్పడం తప్పుగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు. మార్గదర్శకాలను ఉల్లంఘించినా, నియంత్రణ రేఖలను అధిగమించినా ప్రభుత్వాలు వారిపై చర్య తీసుకోవడం సబబు, సమర్థనీయం. కానీ తమ పని విధానాన్ని, విధి విధానాలను వ్యతిరేకించినా లేక సమర్థించకపోయినా; ప్రభుత్వ పాలసీలను, పథకాలలో ఉన్న లొసుగులను ఎత్తిచూపినా ప్రభుత్వాలు అది చాలా క్షమించరాని నేరంగా భావిస్తున్నాయి. పత్రికలు ఏదైనా రాసినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా నమ్ముతారా? అందులో నిజానిజాలు బేరీజు వేసుకోరనుకోవడం తప్పు. ప్రజలకు ఉన్న వివేచనను, విచక్షణను ప్రభుత్వాలు తక్కువగా అంచనా వేయకూడదు.పత్రికలు ఈ పోటీ ప్రపంచంలో పాత్రికేయ విలువలూ, సామాజిక బాధ్యతలూ రెండింటినీ రెండు భుజాలపై మోస్తూ ఈ వృత్తికి న్యాయం చేయాలి. ఒక రాజకీయ పార్టీవారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పనిని... వారు అధికారంలోనికి రాగానే ప్రతి పక్షాలు అదే పని చేస్తే సహించే పరిస్థితి నేడు లేదు. అంటే అధికారంతో, హోదాతో విలువలు మారుతాయన్న మాట! రాజ్యాంగం ఎన్నో విలువలతో పకడ్బందీ చట్టాలతో ప్రజల హక్కులను కాపాడుతూ తయారైన ఒక పవిత్ర, ప్రామాణిక గ్రంథం. దేశానికి దిశా నిర్దేశం చేసే గ్రంథం అది. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే ఏ రకమైన చర్యలైనా ప్రజలు సహించరు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే తగిన సమయంలో తగు తీర్పునిస్తారు.పత్రికా సంపాదకులను, పాత్రికేయులను వేధించిన ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ప్రజామోదం ఉండదు. విమర్శను ఆహ్వానించాలి. విచక్షణతో అందులోని సహేతుకతను అర్థం చేసుకొని ఆలోచించాలి. అంతేకానీ విమర్శలోని విషయాలను విషంగా పరిగణిస్తే పరిణామాలు విషమంగానే ఉంటాయి. విధాన నిర్ణయాలపై విమర్శలు వస్తే విశ్లేషించుకుని సవరించుకోవాలి. అందుకు విరుద్ధంగా విమర్శకులపై విచ్చలవిడిగా కేసులు బనాయించి విశృంఖలంగా అరెస్టు చేస్తూ వారికున్న హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తే న్యాయస్థానాలు మౌనంగా ఉండవు.చదవండి: భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?మీడియా స్వేచ్ఛ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో భారత్ 151 స్థానాన్ని పొందింది. ఇక్కడే భావ ప్రకటన స్వేచ్ఛ (Freedom of Expression) దేశంలో ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మీడియాపై ఎక్కుపెట్టిన ఆంక్షలను, కేసులను ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ, ఎడిటర్స్ గిల్డ్ లాంటి సంస్థలు ఖండించాయి. పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని ఘనంగా చెప్పుకుంటున్నాం. దాని విలువను, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పాలకులదే!– శ్రీశ్రీ కుమార్ కవి–రచయిత -
‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి, ప్రత్యేకించి ‘సాక్షి’ మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో ‘సాక్షి’ మీడియా సంస్థతోపాటు జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం ఎడిటర్స్ గిల్డ్ ఒక ఘాటు లేఖ రాసింది. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు అనంత్ నాథ్, ప్రధాన కార్యదర్శి రూబెన్ బెనర్జీ, కోశాధికారి కె.వి. ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఒక్క పత్రికపైనే ఎందుకు?ఒక రాజకీయ నాయకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు ఇతర మీడియా సంస్థలను వదిలిపెట్టి, కేవలం ‘సాక్షి’పై మాత్రమే క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమని, నేర చట్టాలను ఎంపిక చేసుకుని ప్రయోగించడం పోలీసుల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పేర్కొంది. ఇది సాధారణ జర్నలిజంలో భాగమే అయినప్పటికీ, ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.వేధింపులు ఆపండి పత్రికలను అనవసరమైన, కక్ష సాధింపు ఫిర్యాదులతో వేధించకూడదని ఎడిటర్స్ గిల్డ్ హితవు పలికింది. పోలీసుల ప్రవర్తన నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే సంస్థలను భయపెట్టేలా ఉండకూడదని స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అణచివేయడానికి, భయపెట్టడానికి క్రిమినల్ చట్టాలను ఆయుధాలుగా వాడటం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పత్రికలు నిర్భయంగా విధులను నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది.సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పత్రికా స్వేచ్చపై దాడే: ఐజేయూ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతోనే సాక్షి దినపత్రిక, పాత్రికేయులను వేధిస్తోందని ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్సింగ్ జమ్ము శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు ఇటీవల తనిఖీలు చేయడం, ఆయనకు నోటీసులు జారీ చేయడం పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులను భయపెట్టేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పత్రికలను నియంత్రించాలని ఏ ప్రభుత్వం భావించకూడదన్నారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని బల్విందర్సింగ్ స్పష్టంచేశారు. కానీ, పత్రికలపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్చను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలను ఐజేయూ ఏమాత్రం ఆమోదించదని స్పష్టంచేశారు. -
భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?
పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి ప్రస్తావించక పోయినప్పటికీ, 19(1)(ఎ) అధికరణం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను పొందుపరిచారు. తద్వారా పాత్రికేయులు, రచ యితలు, కవులు, కళాకారులు, సృజనాత్మక నిపుణులు తమ భావా లను నిర్ద్వంద్వంగా స్పష్టం చేసే హక్కులు పొందారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తున్నప్పటికీ సహేతుకమైన విమర్శ లను సాదరంగా ఆహ్వానించాల్సిందే. అర్థవంతమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనం వహించాలి. పత్రికలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా నిలబడాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేర వేయాలి. మీడియా ప్రచురించిన వార్తల్లో వాస్తవాలను గ్రహించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పాలనలో దిద్దుబాట్లకు శ్రీకారం చుట్టాలి. అంతేగానీ తాము చేసేదంతా మంచేననీ, దాన్నెవరూ ప్రశ్నించకూడదనీ ప్రభుత్వాలు భావిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన విస్తుగొలిపేలా ఉంది. ‘ఫలానా ప్రమోషన్లలో అవినీతి జరిగిందని’ ఎవరో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రిక రాసిన వార్త మీద పోలీసులు కేసు నమోదు చేయడం; ఎడిటర్, రిపోర్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి పోలీసు స్టేషన్లో ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి సహేతుకమైన సంకేతం. ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం నిర్ద్వంద్వంగా నియంతృత్వ పోకడే. ప్రతిష్ఠాత్మక ‘ఇండియా టుడే’ మీడియా గ్రూపు కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ సైతం ఈ చర్యల పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేశారంటే సమస్య తీవ్రత ఎంతటిదో అర్థమ వుతుంది. ‘పీ4 పథకం ముఖ్య నేత పిచ్చికి పరాకాష్ట’ అనీ, ‘ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే’ననీ రాసిన పత్రిక మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే సదరు పత్రిక రాసి నవి వాస్తవాలని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా? మరెందుకు కొన్ని పత్రికల పట్ల పక్షపాత వైఖరి?నిస్సందేహంగా మీడియాకు ‘లక్ష్మణ రేఖ‘ అవసరమే. అయితే ఇది స్వీయ నియంత్రణ రేఖ కావాలే కానీ, భావప్రకటన కుత్తుక మీద కత్తిలా ఉండకూడదు. మీడియాను బందిఖానాలో ఉంచాలను కుంటే రౌడీలు రాజ్యమేలతారు. అది మరింత ప్రమాదకరం!– ప్రొ‘‘ పీటా బాబీవర్ధన్జర్నలిజం విభాగ పూర్వాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటకలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతు నొక్కడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదమన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వేధించడాన్ని ఇక్కడి జర్నలిస్టు సంఘాల నేతలు, న్యాయవాదులు, రైతు సంఘం నాయకులు, తెలుగు సంఘాల ప్రతినిధులు తప్పుపడుతున్నారు. ఏ వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తపైనా అభ్యంతరాలుంటే దాన్ని ఖండించడం లేదా వివరణ ఇవ్వడం పరిపాటి అని.. కానీ, ఇలా విలేకరులపై కేసులు పెట్టడం, నోటీసులివ్వడం సరికాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం, భంగం కలిగేలా.. ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడాన్ని వారు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, మేధావుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..కేసులు పెట్టి వేధించడం సబబు కాదు.. పత్రికల్లో వచ్చే ప్రతి విమర్శపై కేసులు పెట్టడం పద్ధతికాదు. ఎవరి మీదైనా కేసులు పెట్టే ముందు, నోటీసులిచ్చే ముందు ఆ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అని పరిశీలించాలి. ఆధారాల్లేకుండా కేసులు పెట్టడం చట్టవిరుద్ధం. ప్రచురితమైన వార్తలపై అభ్యంతరాలుంటే వివరణ లేదా రిజాయిండర్ డిమాండ్ చేయాలి. అప్పుడు కూడా పత్రిక ప్రచురించకపోతే తదుపరి చర్యలకు పూనుకోవాలి. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఇలా కేసులు పెట్టి వేధించడం సబబు కాదు. – పునీత్, సీనియర్ న్యాయవాది, బెంగళూరు ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే.. వార్తను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కేసులు పెట్టడం సమంజసం కాదు. కచ్చితంగా ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఆధారాల్లేని కేసులు చట్టం ముందు నిలబడవు.. ప్రజల కోసం ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించే పత్రికలపై ఇలా వేధింపులు స్వాగతించదగ్గ పరిణామం కాదు. – గుళ్య హనుమన్న, దళిత ఉద్యమ నాయకుడు, బెంగళూరు సాక్షి ఎడిటర్పై కేసులు ఎత్తేయాలి.. సాక్షి పత్రిక ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పత్రిక స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతుంటే సాక్షి దినపత్రిక దాన్ని ఎత్తిచూపుతోందని, అంతమాత్రానా అదిరించి బెదిరించి రిపోర్టర్లను లొంగదీసుకోవాలని చూడడం సరికాదు. వెంటనే పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్పై కేసులను ఎత్తివేయాలి. – నకిరెకంటి స్వామి, రాష్ట్ర కార్యదర్శి, కర్ణాటక జర్నలిస్టు యూనియన్తప్పుడు కేసులు సబబు కాదు.. వార్తలో ఏమైనా అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు లేదా రిజాయిండర్ ఇవ్వొచ్చు. దానికి కూడా స్పందించపోతే కేసులు పెట్టుకోవచ్చు. అంతేగానీ, ప్రభుత్వం భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలన్న కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడం సబబుకాదు. వెంటనే సాక్షి పాత్రికేయులపై ఉన్న కేసులను ఎత్తివేయాలి. – రెవరెండ్ డాక్టర్ బిషప్ ఎం. బెంజమిన్, అధ్యక్షుడు, కర్ణాటక తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఫెలోషిప్ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం.. ఏపీలో ప్రతిపక్షం గొంతునొక్కే ఘటనలు తరచూ గమనిస్తున్నాం. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపై కూడా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కేసులతో సాక్షిని అణచివేయాలని చూడడం దారుణం. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టి నోటీసులివ్వడం వారి స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పెనుప్రమాదం. – సిద్ధం నారయ్య, అధ్యక్షుడు, బెంగళూరు తెలుగు సమాఖ్య మీడియా స్వేచ్ఛను గౌరవించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు మీడియాను సహించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడంపై స్పందిస్తూ.. ‘మీడియాకు, జర్నలిస్టులకు ఒక హక్కు, స్వేచ్ఛ ఉంటాయన్న విషయాన్ని గౌరవించే పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా లేవు. జర్నలిస్టులను గౌరవించాలన్న విషయాన్ని వదిలేస్తున్నాయి. అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. – ప్రొఫెసర్ హరగోపాల్కేసులతో భయపెట్టే ప్రయత్నమే ఇదిసమాజ శ్రేయస్సుకు ప్రజాస్వామిక విలువలు, వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం, స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ ఎంతో అవసరమని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ‘పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్య్రంలో ఒక భాగం. మీడియా అనేది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కళ్ల మాదిరిగా పనిచేస్తుంది. ఎక్కడో జరిగే అక్రమాలు, అన్యాయాలను మీడియా బట్టబయలు చేస్తుంది. దానివల్ల ప్రభుత్వాలకు, అధికారులకు తాము చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. కానీ, ప్రభుత్వానికి ఇష్టంలేని, నాయకులకు ఇష్టంలేని వార్తలు వచ్చినప్పుడు విలేకరులపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం అంటే పత్రికా స్వేచ్ఛపై దెబ్బకొట్టడమే. విలేకరులపై, ఎడిటర్లపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే ఇలాంటి వార్తలు రాకుండా చేయవచ్చన్నది వాళ్ల ప్రయత్నం. కానీ, అది అప్రజాస్వామికం. ఈ చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తాయి. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని విమర్శించారు. – జస్టిస్ చంద్రకుమార్ -
‘సాక్షి’ ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో గురువారం జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘సాక్షి’ఎడిటర్తో పాటు ఖమ్మంలో టీన్యూస్ ప్రతినిధి సాంబశివరావు, ఆ మీడియా సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వాలు వెంటనే ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేయగా.. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతలు సంఘీభావం తెలిపారు.బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియాను నిర్బంధాలతో లోబర్చుకోవాలనే ఆలోచనను ప్రభుత్వాలు మానుకోవాలని హెచ్చరించారు. సీపీఐ నేత హేమంతరావు, మాస్లైన్ నేత పోటు రంగారావు, సీపీఎం నేత కల్యాణం వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ నాయకుడు మోహన్రావు, బీఆర్ఎస్ నేత పగడాల నాగరాజు, ఐజేయూ నేతలు రాంనారాయణ, వెంకటేశ్వరరావు, టీజేఎఫ్ నేత ఆదినారాయణ, జేఏసీ చైర్మన్ తిరుమలరావు తదితరులు భేటీలో పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం అని కుల సంఘాలు స్పష్టం చేశాయి. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఈ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా వ్యవహరించే మీడియా.. ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుందని, అలాంటి వాటిని సానుకూలంగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించాయి. సాక్షి మీడియా వచ్చిన తర్వాత బీసీలు, బడుగు, బలహీన వర్గాల గొంతు పెద్ద ఎత్తున వినిపిస్తోందని ఆ సంఘాలు తెలిపాయి. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే ఈ వ్యవస్థను బలవంతంగా కేసులు పెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ముర్ఖత్వం. సాక్షి మీడియా ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. – జాజుల శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛను హరించడమే.. ప్రతిపక్షంతో పాటు విపక్ష అనుకూల మీడియా గొంతు నొక్కుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల చర్యలను ఎండగట్టడంలో మీ డియా పాత్ర కీలకం. అలాంటి వార్తలను ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలి. అలాకాకుండా మీడియాపైన అక్రమంగా కేసులు పెట్టడమంటే ప్రతికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – గవ్వల భరత్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీడియాపై దాడి మంచిదికాదు ప్రభుత్వాలు ఏ మీడియాపైనా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయవద్దు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే.. వాటికి వివరణ ఇవ్వడమో, ఖండించడమో జరగాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తామనడం సరికాదు. సాక్షి ఎడిటర్పై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మీడియాలో కేవలం పాలకపక్షం వార్తలే కాకుండా ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై నేరుగా దాడి చేయడమే. – జి.చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు -
వార్తలు రాయడమే నేరమా?
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది!’ కోట్లాది హిందు వుల మనోభావాలను గాయపరుస్తూ ఏపీ ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఇది. ఆ వెంటనే దానిని అందుకుని సనాతని వేషం కట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ‘ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేయడానికి యత్నించారు’... ఇది కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్ల గురించి చంద్రబాబు చేసిన మరో విమర్శ. ఇలా అనేక అభియోగాలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేశారు. వాటన్నిటిలో అత్యధిక భాగం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆపాదించి చేశారు. అలాగైతే ఎన్ని కేసులు పెట్టొచ్చు?అధికారంలోకి వచ్చాకే కాదు, అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నేతలు జగన్పై పలు తీవ్రమైన అభియో గాలు గుప్పించారు. ‘జగన్ ఏపీలో ప్రజల భూములన్నీ కొట్టేయడా నికి యత్నిస్తున్నారు; జగన్ పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇక పవన్ కల్యాణ్ అయితే 30 వేల మంది అమ్మాయిలు ఏపీలో తప్పిపోయారంటూ వలంటీర్లపై నిందలు వేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుంటే అప్పట్లో వారిపై ఎన్ని కేసులు పెట్టి ఉండవచ్చో! అలాంటి అబద్ధపు ఆరోపణలను ప్రచారం చేసిన ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టాలో! కానీ జగన్ టైమ్లో అలా చేయలేదు. వాటిని రాజకీయంగానే చూసి వదలివేశారు. ఇటీవలి కాలంలో ఏపీని పోలీసు రాజ్యంగా మార్చి, విపక్ష వైసీపీ వారిపైనే కాకుండా, తనకు గిట్టని ‘సాక్షి’ మీడియాపైనా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సంగతులు గుర్తు చేయవలసి వచ్చింది.కేసులతో కొత్త రికార్డులురాజకీయ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ల ఆధారంగా మీడియాపై కేసులు పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అమరావతి వరద ముంపు గురించి మీడియాకు ఒక విషయం చెప్పారు. ఆ వరద నీటి మళ్లింపు వల్ల గుంటూరు చానల్కు గండి పడిందనీ, తత్ఫలితంగా పొన్నూరు ప్రాంతంలో సుమారు 70 వేల ఎకరాల పంట పొలాలు మునిగాయనీ ఆరోపించారు. ఆయన చెప్పిన విషయాలను ‘సాక్షి’ ప్రచురించింది. సాధారణంగా ప్రభుత్వ పక్షాన ఎవరైనా ఏమి చేయాలి? అది వాస్తవమా, కాదా? అన్నదానిని పరిశీలించి మీడియాకు వివరణ ఇచ్చి, వార్తను ప్రజలకు తెలియచేయాలని కోరవచ్చు. అలాకాకుండా సంబంధిత అధికారి ఒకరితో ‘సాక్షి’పై ఏకంగా కేసు పెట్టించారు. తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డికి నోటీసు ఇచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరారు. విశేషం ఏమిటంటే, ఇదే సమయంలో టీడీపీ మీడియా ఒక కథనాన్ని ఇస్తూ, అమరావతిలో వరద ముప్పు నివారణ కోసం ప్రభుత్వం ఆరు వేల కోట్లతో మరో రెండు ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపింది. కేసులు అక్రమమని తెలిసినా, పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగక తప్పడం లేదు. ఆ మాట కొందరు పోలీసు అధికారులు జర్నలిస్టులకు వ్యక్తిగతంగా చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రెడ్ బుక్ ఎఫెక్ట్ అనీ, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికీ, ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికీ ఇలాంటి అసంబద్ధ చర్యలకు దిగుతోందని తెలుస్తోంది. ‘సాక్షి’ గొంతు నొక్కివేస్తే తమను ప్రశ్నించేవారు ఉండ రని పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు.మరో వార్త చూడండి. అవినీతి కారణంగానే పోలీసు అధికా రుల ప్రమోషన్లను జాప్యం చేస్తున్నారని ‘సాక్షి’ స్టోరీ ఇచ్చింది. దానికి పోలీస్ పెద్దలకు కోపం వచ్చిందట. అది నిజం కాకపోతే వారు ఖండించవచ్చు. కానీ, పోలీసు ఉద్యోగుల సంఘం నేతతో కేసు పెట్టించేశారు. గతంలో ఈ తరహా వార్తలు మీడియాలో వస్తే సదరు సంఘం నేతలు వివరణ ఇచ్చేవారు. పాపం... ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కానీ, మరికొందరు టీడీపీ నేతలు, జనసేన క్యాడర్గానీ కొంతమంది పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈ సంఘం నేతలు నోరు మెదపలేకపోతున్నారు. కానీ ‘సాక్షి’ మీద సంఘం అధ్యక్షుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అర్ధరాత్రి వేళ ‘సాక్షి’ ఆఫీస్కు పోలీసులు వచ్చి హడావిడి చేయడం జరిగింది. ఈ కేసులో కూడా విచా రణకు నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు సీనియర్ పాత్రికేయులు హాజర య్యారు. ఆ సందర్భంలో ఏ పోలీసు అధికారులు ఆ సమాచారం ఇచ్చారో చెప్పాలని కోరారట! జర్నలిజం సూత్రాల ప్రకారం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రహస్యంగా ఉంచాలి. అయినా ఆ వివరాలు కోరారు. ఆ పోలీసు అధికారులకు కూడా తమ శాఖలో జరుగుతున్న పరిణామాలు తెలిసే ఉండాలి. ఏ అధికారులు ప్రమోషన్లు పొందలేక పోయారో, దానికి కారణాలు ఏమిటో వారికి తెలిసి ఉండాలి. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని అర్థం అవుతుంది.ద్వంద్వ ప్రమాణాలుఇంకో ఉదంతం చూద్దాం. రాయలసీమకు చెందిన ఒక పోలీసు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ‘సాక్షి’ ఒక వార్తను ఇచ్చింది. ఆ అధికారి పేరు రాయలేదు. తమకు వచ్చిన సమాచారంలో నిజం ఉందని నమ్మితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుని కథనాలు ఇస్తుంటారు. ఈ స్టోరీపై సీనియర్ అధికారికి ఆగ్రహం వచ్చింది. వేరే అధికారిని పిలిచి కేసు పెట్టించారు. ఆ అధికారి తను ఏ తప్పు చేయకపోతే, ఆ కథనం తనను ఉద్దేశించి రాశారన్న అభిప్రాయం కలిగితే ధైర్యంగా మీడియా సమావేశం పెట్టి తన వాదనను వినిపించి ఉండవచ్చు. తన పరువుకు భంగం కలిగించారని నోటీసు ఇచ్చి ఉండవచ్చు. అలా చేయకుండా మరొకరితో కేసు పెట్టించడంలోనే డొల్లతనం ఉందనిపిస్తుంది.ఏపీ పోలీసుల ప్రవర్తనకు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన వైనమే పెద్ద శాంపుల్. తమ ఓట్లు తమను వేయనివ్వాలని కొందరు ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారంటే అది పోలీస్ వ్యవస్థకు ఎంత అప్రతిష్ఠో ఊహించుకోవచ్చు. కోర్టులలో బెయిల్ రాకుండా ఉండటం కోసం సంబంధం ఉన్నా, లేకపోయినా తోచిన సెక్షన్లు పెట్టి రిమాండ్ ఉత్తర్వులు వచ్చేలా చేయడంలో ఏపీ పోలీసులు స్పెషలైజేషన్ సంపాదించారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ వారిపై వీలైనన్ని కేసులు పెట్టడం... అదే టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ సమక్షంలోనే గూండాయిజానికి పాల్పడినా నిస్సహాయంగా ఉండిపోవడం సమాజానికే ప్రమాదకరమని చెప్పక తప్పదు. రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు చేసిన గూండాయిజం తెలిసిందే! ‘సాక్షి’ టీవీ చర్చలో అభ్యంతర పదం వాడారని అంటూ కూటమి నేతలే కొంతమందిని పురిగొల్పి కృత్రిమ ఆందోళనలు చేయించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, పోలీసు వ్యవస్థ ధర్మంగా, నిష్పక్షపాతంగా లేకపోతే అది సమాజానికి హానికరం. పోలీసులకు ప్రామాణికం రెడ్ బుక్ కాదనీ, రాజ్యాంగమనీ ఎప్పటికి గుర్తిస్తారో!కొమ్మినేని శ్రీనివాసరావువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే
సాక్షి, అమరావతి: ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగడుతున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వరుసగా కేసులు బనాయించడం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనని ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలపై వార్తను ప్రచురించినందుకు ‘సాక్షి’పై కేసులు నమోదు చేయడం, అదే వార్తను ప్రచురించిన మిగతా పత్రికలు, చానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం ‘సాక్షి’కి అండగా నిలబడతామని ప్రకటించారు. అది ప్రాథమిక హక్కు..రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ రాజ్దీప్ సర్దేశాయ్ ‘సాక్షి’తో మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ వరి్ధల్లితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని విశ్వసిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ఆరి్టకల్ 19(1)ఏ ద్వారా ప్రాథమిక హక్కుగా కల్పించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి పత్రికా రంగం అవిరళ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ‘సాక్షి’ నిలదీస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నారు. ‘సాక్షి’ ప్రచురించే వార్తా కథనాలపై ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఖండిస్తూ వివరణ ఇవ్వాలని, అప్పటికీ సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుల్లో పరువు నష్టం దావా వేయవచ్చన్నారు. అంతేగానీ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో ఆయన ఇంట్లో సోదాలు చేయడం, పోలీసు స్టేషన్లకు రప్పించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా ఈ రీతిలో పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్న దాఖలాలు లేవన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తే క్రిమినల్ చట్టాలను పోలీసులు దురి్వనియోగం చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు తమ బాధ్యతకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం, పత్రికా స్వేచ్ఛ వికాసానికి ‘సాక్షి’కి అండగా నిలుస్తామని ప్రకటించారు. -
‘సాక్షి’పై కక్ష... పత్రికా స్వేచ్ఛపై దాడే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ ధోరణి పత్రికా స్వేచ్ఛపై దాడి అని ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును అణచివేయడానికి ఏపీ ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను ఆయుధంగా వాడుకుంటోందనేందుకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని అభిప్రాయపడింది. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించే వార్తలు రాసినందుకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఒకటికి రెండు కేసులు నమోదు చేసే ఆందోళనకర సంస్కృతి కొనసాగుతోందని పేర్కొంది.‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసుల నమోదు కూడా ఇందులో భాగమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహిరి, ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ సోమవారం ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధారణ వార్తలు రాసినందుకే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై కేసులు బనాయించి, వ్యవస్థాగతంగా వేధిస్తున్నారు.ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో భారతీయ న్యాయ సంహిత కింద 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను ప్రచురించినందుకే రెండు స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అదే వార్తను ఇతర పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఇచ్చాయి. కేవలం ‘సాక్షి‘ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించడం కక్షసాధింపు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్లను పరిశీలించిన తర్వాత, పత్రిక సంపాదకవర్గంపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా, ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారని అర్థమవుతోంది’’ అని తెలిపారు. ⇒ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో ‘సాక్షి’ జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడాన్ని గమనించామని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తలు రాసిన జర్నలిస్టులను వేధించకుండా... పోలీసులను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. సంపాదకీయపరమైన వివాదాలను సివిల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, క్రిమినల్ చట్టాల ద్వారా కాదని తాము విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. -
ప్రజాస్వామ్య పునాదులపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: జర్నలిస్టులు, మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) తీవ్రంగా ఖండించింది. ‘సాక్షి’మీడియా సంస్థ, వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఐఎన్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షుడు ఎం.వి. శ్రేయామ్స్ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా రంగంపై జరుగుతున్న ఈ దాడులను ప్రజాస్వామ్య పునాదులు, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఐఎన్ఎస్ అభివర్ణించింది. ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’జర్నలిస్టులపై పలుమార్లు దాడులు జరగడంతో పాటు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిపై అక్రమ కేసులు బనాయించి, విచారణల పేరుతో వేధిస్తున్నారని ఐఎన్ఎస్ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా కార్యాలయాలు, సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు నిర్వహించడం వంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ధోరణి.. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను సొసైటీ తీవ్రంగా ఖండిస్తోందని ఐఎన్ఎస్ తెలిపింది. ఈ దాడులు స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ఒక ఆందోళనకరమైన ధోరణిలో భాగమని శ్రేయామ్స్ కుమార్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎలాంటి భయం, బెదిరింపులు, హింసకు గురికాకుండా తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించగలగాలని సూచించింది. దేశంలో పత్రికా రంగం శత్రువు కాదని.. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే మిత్రపక్షమని ఐఎన్ఎస్ పేర్కొంది. మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించాలి.. ఇక ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధుల రక్షణకు తగిన చట్టపరమైన భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎన్ఎస్ డిమాండ్ చేసింది. బెదిరింపులు, హింసను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు తాము అండగా నిలుస్తామని సొసైటీ పునరుద్ఘాటించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ కూడా తెలిపారు. -
‘సాక్షి’పై అక్రమ కేసులు ఉపసంహరించాలి
సాక్షి జర్నలిస్ట్లపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని ఢిల్లీ టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛను కాపాడలని పేర్కొంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని ఓ ప్రకటన విడుదల చేసింది.‘ప్రజాస్వామ్యంలో వేధింపులు, అక్రమ కేసులకు తావులేదు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పోలీస్ కేసులు, విచారణ పేరుతో నోటీసులు ఏ మాత్రం సరికాదు. ఆంధ్రప్రదేశ్లో తమకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్న నెపంతో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి సహా మరికొంత జర్నలిస్టులపై పోలీస్ కేసులు నమోదు చేసి, విచారణ కోసం పోలీస్స్టేషన్లకు రమ్మని గంటల తరబడి విచారిస్తూ,వేధింపులకు గురి చేయటం ఏ మాత్రం సమ్మతం కాదు. ముఖ్యంగా ఒక నాయకుడు పెట్టిన ప్రెస్మీట్పెట్టిన వార్తను ప్రచురించినందుకు ఎడిటర్ సహా, రాసిన విలేకరిపై క్రిమినల్కేసు నమోదు చేయటం విచారకరం. వాస్తవాలకు భిన్నంగా వార్తలు వస్తే, వాటిని తిరిగి ప్రచురించమని, తమ వాదనలు కూడా వేయాలని కోరే హక్కు ప్రభుత్వంతో పాటు అందరికీ ఉంది. కానీ వివరణలు ఇవ్వకుండా జర్నలిస్టులను బెదిరించే ధోరణిలో పోలీస్కేసులు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాలని పదేపదే హితువు పలికింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం పునరాలోచన చేసి పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాము’ అని ఢిల్లీ టీయూడబ్యూజే అధ్యక్షులు నాగిళ్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, కోశాధికారి కొన్నోజు రాజులు ప్రకటనలో పేర్కొన్నారు. -
పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను విఘాతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల గళాన్ని వినిపిస్తున్న పత్రికలపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు ధోరణిపై ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడమే ప్రతిపక్ష పార్టీల కర్తవ్యమని, పత్రికలు, మీడియా బాధ్యత కూడా ఇదేనన్నారు. కానీ ప్రజా సమస్యలను వినిపించుకోకుండా ఏకపక్షంగా గొంతు నొక్కే ప్రయత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదని హెచ్చరించారు. సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్మీట్ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికా సంప్రదాయాలు, విలువలు కాపాడేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరించాలి. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఎడిటర్పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి? విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడ న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, అందులో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ... అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ధనంజయరెడ్డిపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. తన విధిని నిర్వర్తిస్తున్న సంపాదకునిపై కేసులు పెట్టే సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. కానీ తరచుగా పత్రికలు, జర్నలిస్టులపై, చివరకు ఎడిటర్లపైనా దూషణలతోపాటు భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడం కూడా ఇలాంటి కోవలోనికి వస్తుంది. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసినఅ∙వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యనే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపైన నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలుఇది కక్షసాధింపు ధోరణే తెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్షసాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణఅచివేయడం వారి స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. – సంధ్య, పీఓడబ్ల్యూ నేతమీడియాపై కేసులు సరికాదు ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్ష పార్టీల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపైన దాడి చేయడమే. ఇది పూర్తిగా అక్రమం. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు సరికాకపోతే వాస్తవాలను వెల్లడించి రాజకీయ పోరాటం చేయాలి కానీ కేసులు పెట్టకూడదు. – ఎస్ఎల్ పద్మ, ప్రజాపంథ -
‘సాక్షి’పై కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించలేదని ప్రచురించిన కథనంపై నమోదు చేసిన అక్రమ కేసులో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసుల ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. పోలీసులు విచారణ పేరుతో మూడు గంటలపాటు వేచి ఉండేలా చేశారు.పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ప్రశ్నలు సంధించడం విస్మయ పరిచింది. బాధితుల వివరాలు వెల్లడించాలని, సంస్థ నిర్వహణకు సంబంధించిన అంతర్గత అంశాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను కచ్చితంగా పాటిస్తున్నామని సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులు స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమే పత్రికా స్వేచ్ఛ. సామాజిక మాధ్యమాల యుగంలో ప్రెస్మీట్ను వక్రీకరించకుండా యథాతథంగా ప్రచురించడం సంపాదకుడి బాధ్యత. సాక్షి ఎడిటర్గా తన విద్యుక్త ధర్మాన్ని పాటించిన ఆర్.ధనంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం సరికాదు. ఫిర్యాదులోని అంశాల్లో ఆధారాలు పరిశీలించకుండా కేసులు నమోదు చేయడం భావ్యం కాదు. నేతలు తమ పార్టీ విధానాలను వెల్లడిస్తే, వాటి ఆధారంగా ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఎడిటర్పై కేసులు పెట్టే సంస్కృతి ఏమిటి?విలేకరుల సమావేశంలో ఒక నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే.. ఆ పత్రిక సంపాదకునిపై ఏకంగా కేసు నమోదు చేయడం ఏమిటి? ఇదెక్కడి న్యాయం? ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, సాక్షిలో పనిచేసే వారిని, ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించేలా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు పెట్టొచ్చు కానీ.. అది ప్రచురించిన సంపాదకునిపై కేసు పెట్టడం అధికార దుర్వినియోగమే. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. ఈ సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలి. – టి.హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాంపత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక మీడియా సమావేశాన్ని ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయడం సరికాదు. విమర్శ హేతుబద్ధం కానప్పుడు, విమర్శ చేసిన వారిపై చట్టబద్ధ చర్య తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఈ విషయంపై పత్రిక సంపాదకునిపై కేసు పెట్టడం కక్ష సాధింపు చర్యే. దీనిని ఖండిస్తూ ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఎడిటర్ గిల్డ్ స్పందించాలని కోరుతున్నా. – విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలుబెదిరింపు ధోరణి సరికాదుపోలీసుల పదోన్నతుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు ప్రభుత్వం సాక్షిపై కక్షగట్టడం సరికాదు. లోపాలను ఎత్తిచూపితే బెదిరింపు ధోరణికి దిగడం సమర్థనీయం కాదు. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పోలీస్ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధించడం సరి కాదు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు తీరు ఉంది. ఏదైనా అభ్యంతరకరమైన విధంగా వార్తా కథనం ప్రచురిస్తే.. పోలీసు అధికారులు రిజాండర్ ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు తమ వాదనను కూడా సంబంధిత పత్రికకు చెప్పొచ్చు. అంతేగాని అధికారం చేతిలో ఉందని కేసులు పెట్టి బెదిరింపు ధోరణికి దిగడం మానుకోవాలి. – కె.రామకృష్ణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిఇది కక్ష సాధింపు ధోరణేతెలుగు రాష్ట్రాల్లో పాలక పక్షాలు.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపైనా కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోంది. కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి పెరగడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ ఆలోచన విధానం నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ప్రతిపక్షాల పాత్రను అణచి వేయడం, పత్రికల స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం. ఏకపక్షంగా పత్రికల గొంతు నొక్కే యత్నం ప్రజా క్షేత్రంలో చెల్లుబాటు కాదు. – సంధ్య, పీఓడబ్ల్యూ నేతమీడియాపై కేసులు సరికాదు ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో కేవలం పాలక పక్షం వార్తలే కాదు. ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై దాడి చేయడమే. – ఎస్ఎల్ పద్మ, ప్రజాపంథా నాయకురాలువిచారణ సందర్భంగా పలు ప్రశ్నలు!» సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. విజయవాడలోని సాక్షి కార్యాలయంలో అర్ధరాత్రి తనిఖీల పేరుతో వేధింపులకు తెగబడ్డారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కును కాలరాస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపై సాక్షి పత్రిక ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కఠిన చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని సూచించింది.» న్యాయస్థానం ఆదేశాల మేరకు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇద్దరు పాత్రికేయులు తాడేపల్లి పోలీసు స్టేషన్లో సీఐ పి.వీరేంద్ర బాబు ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 3గంటలపాటు నిరీక్షించేలా చేశారు. అసలు పత్రికా నిబంధనలను, నియమావళికి విరుద్ధంగా ప్రశ్నలు సంధించడం గమనార్హం.» బాధితుల వివరాలు చెప్పకూడదన్నది సహజ న్యాయ సూత్రం. కానీ పదోన్నతులు కల్పించక పోవడంతో తాము నష్టపోయామని సాక్షి పత్రిక దృష్టికి తీసుకువచ్చిన పోలీసు అధికారుల పేర్లు, వివరాలు చెప్పాలని పోలీసులు పదే పదే ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పదోన్నతులు కోల్పోయిన డీఎస్పీలు బాధితులు అవుతారు. కానీ వారి పేర్లను చెప్పాలని తాడేపల్లి పోలీసులు పట్టుబట్టారు. » సాక్షి పత్రిక నిర్వహణ, రోజువారీ పనితీరు అన్నది ఆ సంస్థ అంతర్గత వ్యవహారం. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని పత్రికకు సంబంధించిన అంతర్గత అంశాలను కూడా వెల్లడించాలని పోలీసులు ప్రశ్నించడం విస్తుగొలుపుతోంది. పోలీసులు సంధించిన 35 ప్రశ్నలకు సాక్షి ప్రతినిధులు లిఖిత పూర్వకంగా, మౌఖికంగా సమాధానాలు ఇచ్చారు.» రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు, విలువలను సాక్షి పత్రిక కచ్చితంగా పాటిస్తోందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బ తీయడం తమ అభిమతం ఏమాత్రం కాదని, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఎటువంటి బాహ్య ఒత్తిడికి తలొగ్గకుండా పాత్రికేయ ప్రమాణాలు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను తు.చ. తప్పక పాటిస్తున్నామని సాక్షి ప్రతినిధులు విస్పష్టంగా చెప్పారు. న్యాయవాదుల సమక్షంలో నిర్వహించిన విచారణ ప్రక్రియను పోలీసులు వీడియో తీశారు. -
కలంపై కూటమి కత్తి.. ఖండించాలి గొంతెత్తి
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఏపీ, తెలంగాణకు చెందిన పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు కేసులు పెట్టి ఆఫీస్కు వచ్చి మరీ నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు. ‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ప్రచురితమైన వార్తపై చద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేసు పెట్టి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. వార్తాపత్రికలో వచ్చిన ఏదైనా వార్తపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం సంప్రదాయం కాగా.. ఏకంగా కేసులు పెట్టి సాక్షి జర్నలిస్టులకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం, భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడాన్ని నిరసించారు. పలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే..కక్షపూరితం.. అత్యంత దుర్మార్గం ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ పట్ల రాజకీయ పార్టీలకు గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ ఈ హక్కును ప్రసాదించింది. దీనిని ఉల్లంఘించి ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే కుదరదు. రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా. ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. రాత్రి తర్వాత కచ్చితంగా పగలు అనేది వస్తుందని పాలకులు గుర్తుంచుకోవాలి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – బొత్స సత్యనారాయణ, శాసన మండలి విపక్ష నేత భయపెట్టి దారికి తెచ్చుకోవాలనే కుతంత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడిన మాటలను ప్రచురించినందుకుగాను ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఎంత మాత్రం సరికాదు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే. సాక్షి దినపత్రిక వాస్తవాలను వెలికి తెస్తోందని, ప్రభుత్వ పెద్దల నిర్వాకాలను బట్టబయలు చేస్తోందని ఇలా దుర్మార్గంగా కేసులు పెట్టడం ఎంత మాత్రం భావ్యం కాదు. పత్రికలో వచ్చిన వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వొచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. భయపెట్టి, తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. వెంటనే సాక్షి ఎడిటర్పై కేసులను ఎత్తివేయాలి. – భూమన కరుణాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేత కేసులు పెట్టడం పద్ధతి కాదు వార్తాపత్రికల్లో వచ్చే ప్రతి విమర్శపై కేసులు పెట్టడం పద్ధతి కాదు. ఎవరి మీద అయినా కేసు పెట్టడానికి ముందు, నోటీసులు ఇవ్వడానికి ముందే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం చట్టవిరుద్ధం. ప్రచురితమైన వార్తలపై అభ్యంతరాలుంటే వివరణ లేదా రిజాయిండర్ ఇవ్వాలి. దానిని ఆ పత్రిక ప్రచురించకపోతే తదుపరి చర్యలు తీసుకునే వీలుంటుంది. – ఎన్.రామచందర్రావు, సీనియర్ న్యాయవాది, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పత్రికాస్వేచ్ఛపై దాడే సాక్షి ఎడిటర్పై అక్రమ కేసును తీవ్రంగా ఖండస్తున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీలో అదిరించి, బెదిరించి మీడియాను, రిపోర్టర్లను లొంగదీసుకోవాలని కూటమి కుట్రపన్నతోంది. రిపోర్టర్ ఉద్యోగమే.. ఎవరు ఏ అంశాలు మాట్లాడితే వాటిని యథాతథంగా ప్రచురించడం. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీ విధానం మేరకు మాట్లాడితే దాన్ని ప్రచురించడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరించడం, తప్పుడు కేసులు నమోదు చేయడం తప్పు. – దాసోజు శ్రావణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సమంజసం కాదు ఒక రాజకీయ నాయకుడు పెట్టిన ప్రెస్మీట్ వార్తను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం సమంజసం కాదు. అది పత్రికాస్వేచ్ఛను హరించడమే. కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు.. ప్రజల ముందు కూడా నిలబడవు. – జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే -
‘సాక్షి’పై కక్ష సాధింపు..
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి సర్కారు ఘోర వైఫల్యాలు.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తోంది. ఎమర్జెన్సీ దురాగతాలను తలదన్నేలా బరి తెగిస్తోంది. ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు గతంలో పలుచోట్ల దాడులకు తెగబడగా ఇటీవల విజయవాడ ఆటోనగర్లోని ప్రధాన కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు చొరబడి అరాచకంగా వ్యవహరించడం తెలిసిందే. గతంలో కార్యాలయాలపై దాడులకు పురిగొల్పగా.. ఇప్పుడు వార్త ప్రచురించినందుకు నోటీసులు, అక్రమ కేసులు నమోదు చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. ఓ రాజకీయ పార్టీ నేత మాట్లాడిన అంశాలను ప్రచురించినందుకు మీడియాపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవని ప్రజాస్వామికవాదులు, పాత్రికేయ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే యత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులతో ఫిర్యాదులు ఇప్పించడం.. ఆ వెంటనే ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం కూటమి సర్కారుకు పరిపాటిగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం... ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది. పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక వార్త వస్తే చాలు.. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలనేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించినందుకు తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా.. బీఎన్ఎస్ఎస్ 35 (3) కింద నోటీసులు జారీ చేశారు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గతనెల 16వ తేదీన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ మాయలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరు నియోజకవర్గంలో 72 వేల ఎకరాల్లోపంట పొలాల ముంపునకు కారణమైందని ఆరోపించారు. దీనికి సంబంధించి.. ‘అమరావతి కోసం పొన్నూరును ముంచేశారు’ శీర్షికన ప్రచురించిన వార్తపై గుంటూరు ఛానెల్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ అవినాష్ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు 518/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లి పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లోని ‘సాక్షి’ కార్యాలయానికి చేరుకుని ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులు అందచేశారు. బీఎన్ఎస్ఎస్లో సెక్షన్లు 353(1), 61(2), డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2025 సెక్షన్ 54 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అందచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. దీనితో పాటు మరో అక్రమ కేసులోనూ ఎస్ఐ నోటీసులు అందజేశారు. పోలీసు శాఖలో డీఎస్పీల నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించడానికి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు రాసిన ‘పైసా మే ప్రమోషన్’ కథనంపై తాడేపల్లి పోలీసులు మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ అక్రమ కేసులో 61(2), 196(1),353(2) రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ఎస్, పోలీసుల్లో అసంతృప్తిని రెచ్చగొట్టడం 1922 చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం గమనార్హం.తీవ్రంగా ఖండించిన పాత్రికేయ సంఘాలు, సీనియర్ జర్నలిస్ట్లు‘సాక్షి’ దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ప్రచురితమైన వార్తకు సంబంధించి ఏకంగా పత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్, వార్తను వెబ్ ఎడిషన్లో ప్రచురించినందుకు ఇన్చార్జిగా ఉన్న ధనంజయరెడ్డిపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయించి నోటీస్లు ఇవ్వడాన్ని పలు జర్నలిస్టుల సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్ట్లు, సంపాదకులు తీవ్రంగా ఖండించారు. పత్రికలో ఏదైనా వార్త వస్తే దానిపై అభ్యంతరాలుంటే వివరణ కోరడం లేదా రిజాయిండార్ ఇవ్వడం ఆనవాయితీ కాగా ఏకంగా అక్రమ కేసులు మోపి ‘సాక్షి’ జర్నలిస్టులను కోర్టుకు ఈడ్వటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు వ్యవహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జర్నలిస్ట్సంఘాల నేతలు, సీనియర్ పాత్రికేయుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..ఖండన ఇవ్వకుండా సంపాదకుడిపై కేసులా?దినపత్రికలు ప్రచురించే వార్తల్లో పొరపాట్లు ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వాస్తవాలు తెలియచేస్తూ వివరణ ఇవ్వడం, వక్రీకరణలు ఉంటే ఖండించడం ఒక పద్ధతి. ఉద్దేశపూర్వకంగా అసత్యాలు రాసి వాటి మీద సవరణలు తెలిపినా ప్రచురించని మీడియా సంస్థల మీద చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమిషనర్కు దఖలు పరుస్తూ చాలా ఏళ్ల క్రితం ఒక జీవో వెలువడింది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ జీవోను సవరించి సమాచార శాఖ కమిషనర్కు ఉన్న అధికారాలను ఆయా శాఖల కార్యదర్శులకు బదిలీ చేశారు. దీనిపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ, దాని వందిమాగధ మీడియా చేయని రభస లేదు. ఇప్పుడు అదే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ పత్రికా గోష్టిలో కొండవీటి వాగు మళ్లింపు వల్ల పంట పొలాలు మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్న విషయాన్ని ‘సాక్షి’ రిపోర్ట్ చేసినందుకు నేరుగా సంపాదకుడి మీద కేసు పెట్టి పోలీసులను పంపే దాకా వచ్చింది ప్రభుత్వం. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. – దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ స్టీరింగ్ కమిటీ మెంబర్రాజ్యాంగ హక్కుల హననం..‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ఒక వార్త విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏకంగా ఎడిటర్పై పోలీసు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి కోసం పొన్నూరు అనే ప్రాంతాన్ని ముంచేశారు అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన ఒక నాయకుడు చేసిన ఆరోపణను ఆయన వ్యాఖ్యల రూపంలోనే ‘సాక్షి’లో ప్రచురించారు. దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అదే పత్రికాముఖంగా ఖండించాలేగానీ ఈ విధంగా పోలీస్ కేసులు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు.రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా మీడియా స్వేచ్ఛను హరిస్తూ పోలీస్ కేసులు పెడితే జర్నలిస్ట్ సంఘాలుగా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన పోలీస్ కేసును వెంటనే ఉపసంహరించుకునేలా అక్కడి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – అల్లం నారాయణ, ఆస్కాని మారుతి సాగర్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక మీడియాపై దాడి..ఏపీలో పరిస్థితి చూస్తుంటే... పోలీస్రాజ్యం మినహా ప్రజారాజ్యం నడుస్తున్నట్లు కనిపించడంలేదు. ఎల్లో మీడియా తమ అవసరం కోసం ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపుతూ వార్తలు రాస్తే కేవలం రిజాయిండర్ లేదా వివరణ మాత్రమే అడుగుతున్నారు. చంద్రబాబు పర్యవేక్షణలోని ‘సూర్యఘర్’పై వారు వార్తలు రాస్తే ఖండన మాత్రమే ఇచ్చారు. అదే ‘సాక్షి’ పత్రిక అమరావతికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను మాత్రమే రాస్తే ఎడిటర్కు నోటీస్లు ఇవ్వటాన్ని చూస్తుంటే.. పత్రికాస్వేచ్ఛను హరించాలనే తాపత్రయమే కనిపిస్తోంది. సోషల్ మీడియాను సైతం నియంత్రంచడానికి నేపాల్లో ఏం జరిగిందంటూ మాట్లాడడం సరికాదు. సాక్షిలో ప్రచురితమైన వార్తకు ఖండన ఇవ్వకుండా, వివరణ కోరకుండా నేరుగా కేసులు పెట్టడాన్ని చూస్తుంటే జర్నలిజం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు విపక్షంలో ఉండగా సీఎంతో సహా ఎవరి మీద పడితే వారి మీద నానా విమర్శలు చేశారు. ఇప్పుడు తనపై వాస్తవాలు రాస్తున్నా భరించలేకపోవడం ప్రజాస్వామ్య హననమే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు!
ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలపిస్తోన్న రాష్ట్ర పరిస్థితి సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమల్లో ఘోర వైఫల్యం.. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం.. అంతులేని అవినీతి, అక్రమాలపై ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తున్న ‘సాక్షి’ మీడియాపై ఆది నుంచీ చంద్రబాబు కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజల గొంతుకగా ప్రతిధ్వనిస్తున్న ‘సాక్షి’పై పోలీసులను ఉసిగొలిపి, అక్రమ కేసులు బనాయిస్తూ బరితెగిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను యథేచ్ఛగా కాలరాస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తూ.. ఎమర్జెన్సీ నాటి దురాగతాలను గుర్తుచేస్తోంది. సోమవారం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై తాడేపల్లి పోలీసు స్టేషన్లో నమోదు చేసిన అక్రమ కేసులే ఇందుకు తార్కాణం. దీనిని అడ్డుపెట్టుకుని సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ ఆటోనగర్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు దాడికి తెగబడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2 గంటల వరకూ హల్చల్ చేస్తూ భయోత్పాతం సృష్టించారు. ఇంతకూ ఆ అక్రమ కేసు ఎందుకు బనాయించారంటే.. పోలీసు అధికారుల హక్కులపై ‘సాక్షి’ గళమెత్తినందుకే. బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనం.. రాష్ట్రంలో డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్యానల్ కాల పరిమితి ఆగస్టు 31తో ముగిసింది. కానీ.. పదోన్నతులు ఇవ్వకపోవడంతో డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గత నెల 31న రిటైరయ్యారు. మళ్లీ కొత్తగా ప్యానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించే సరికి మరికొందరు రిటైరవుతారు. భారీగా ముడుపులు ఇవ్వలేదనే నెపంతోనే తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డీఎస్పీలు వాపోయారు. పోలీసు శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ.. ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడికి తెగబడింది. ఏ పోలీసు అధికారుల హక్కుల కోసమైతే సాక్షి గళమెత్తిందో.. అదే పోలీసు అధికారులతోనే అక్రమ కేసు నమోదు చేయించి అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. ఆ ఫిర్యాదు కూడా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్తో చేయించి మరీ అక్రమ కేసు పెట్టడం గమనార్హం. ఆ ఫిర్యాదు మేరకు తాడేపల్లి స్టేషన్లో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై బీఎన్ఎస్ సెక్షన్లు 61(2), 196(1), 353(2) కింద కేసు(క్రైమ్ నంబరు 543/ 2025) నమోదు చేశారు. ఆది నుంచీ అక్రమ కేసులే.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ‘సాక్షి’పై అక్రమ కేసులతో దాడి చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. కూటమి అరాచకాలను ఎక్కడికక్కడ ప్రశి్నస్తుండడంతో గొంతు నొక్కే దుస్సాహసానికి ఒడిగడుతోంది. రాజ్యాంగం కల్పించిన ఆరి్టకల్–19 (1)(ఏ)లోని భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. అక్రమ కేసులు బనాయించడాన్ని న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నా ప్రభుత్వ తీరు మారడం లేదు. భావ ప్రకటనపై వచ్చే ఫిర్యాదుల కేసు నమోదు విషయాల్లో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసుశాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినా సరే.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, ఎత్తిచూపుతున్న ‘సాక్షి’ని అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకుంది.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. బాపట్ల టౌన్, టెక్కలి, కోనేరుసెంటర్, నరసరావుపేట: సాక్షి ఎడిటర్, మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా మంగళవారం బాపట్ల జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. » సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ బందరు డీఎస్పీ చప్పిడి రాజాకు మచిలీపట్నం ‘సాక్షి’ పాత్రికేయుల బృందం మంగళవారం రాత్రి వినతిపత్రం అందజేసింది. » సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసుపై పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పాత్రికేయులు నిరసించారు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ప్రెస్క్లబ్, నరసరావుపేట, ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీడబ్ల్యూయు జే) ప్రతినిధులు ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. అక్రమ కేసు వెనక్కి తీసుకోవాలి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ దిన పత్రికపై ప్రభుత్వ ప్రోత్సాహంతో పోలీసు అధికారులు అక్రమ కేసులు పెట్టడం తగదు. జర్నలిస్టు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రతిఘటించాలి. – శాసపు జోగినాయుడు, ఏపీ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు అర్ధరాత్రి చొరబాటు దారుణం రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ మీడియా సంస్థపై దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. అర్ధరాత్రి పత్రికా కార్యాలయంలోకి చొరబడటం అసమంజసం, అనైతికం. – స్వాతిప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ యూపీ బాటలో ఏపీ ఏపీలో ప్రభుత్వం ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదు. ఆరి్టకల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. సాక్షి కార్యాలయాల్లోకి చొరబడి జర్నలిస్టులను విచారించడం అనైతికం. – నల్లి ధర్మారావు, స్సామ్నా రాష్ట్ర అధ్యక్షుడుపత్రికా స్వేచ్ఛపై దాడి.. పత్రికా ఎడిటర్పై కేసు పెట్టడం అంటే కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నట్లే. భావ వ్యక్తీకరణను అడ్డుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టొద్దని కోర్టులు అధికారులకు చీవాట్లు పెడుతున్నా లెక్క చేయడం లేదు. – బి.మురళీకృష్ణ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులు మీడియా స్వేచ్ఛను హరించడమే.. కూటమి సర్కారు మీడియా స్వేచ్ఛను హరిస్తోంది. అర్ధరాత్రి ‘సాక్షి’ కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగడం సమంజసం కాదు. అధికారంలో ఉన్న వారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా? ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాండర్ ఇవ్వాలి. – మచ్చా రామలింగా రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పత్రికలను ఇబ్బంది పెట్టే సంప్రదాయం మంచిది కాదు ప్రజల పక్షాన గళమెత్తుతున్న ‘సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధానాలు ప్రభుత్వం మానుకోవాలి. పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – కొత్తపల్లి అనిల్కుమార్ రెడ్డి, ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఇప్పటి వరకు ‘సాక్షి’పై అక్రమంగా నమోదు చేసిన కేసులివీ..» గత ఏడాది ఆగస్టు 31న విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీ సినందుకు ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు » పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తను తెలంగాణలో దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రచురించినందుకు ఈ ఏడాది ఏప్రిల్ 9న అక్రమ కేసు » కర్నూలు జిల్లాలో ప్రభుత్వ టీచర్ కుటుంబం కిడ్నాప్ ఉదంతాన్ని వెలుగులోకి తెచి్చనందుకు.. అదే జిల్లాలో ఓ ఐపీఎస్ అరాచకాలను ఎండగట్టినందుకు ‘‘సాక్షి’’ పత్రికపై అక్రమ కేసులు నమోదు » అనంతపురంలో బాలికపై టీడీపీ మూకలు అత్యాచారం చేసిన దారుణాన్ని ప్రశి్నంచినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు » ఇటీవల భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని వీడియో ఆధారాలతో సహా ప్రసారం చేసిన సాక్షి టీవీపై అక్రమ కేసు » శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు » వాట్సప్ గవర్నెన్స్ ముసుగులో చేస్తున్న సంక్షేమ పథకాల ఎగవేత, ఓట్ల తొలగింపుపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై న్యాయస్థానంలో ఫిర్యాదుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి ఇస్తూ మార్చి 5న ఉత్తర్వులు జారీ » మే 8న పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో తనిఖీల పేరుతో హల్చల్ (ఓ పత్రిక ఎడిటర్ నివాసంలో తనిఖీల పేరుతో వేధింపులకు దిగడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి) » ‘సాక్షి’ టీవీ డిబేట్లో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలను అన్నట్లుగా జూన్ 9న అక్రమ కేసు, అరెస్టు. -
'సాక్షిపై దాడులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే'
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని.. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా? అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘తొలుత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మీద పడి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్షి మీద అర్ధరాత్రి దాడులు చేశారు. దేశానికి అర్ధరాత్రి వస్తే.. కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్చేచ్చని హరించేసింది. ఇది నియంతృత్వం కాదా?. ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద అక్రమ కేసు పెట్టించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులతో అక్రమ కేసు పెట్టించారు. మే 8న కూడా ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. అధికారంలో ఉన్నవారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా?. పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తారా?’’ అంటూ జూపూడి ధ్వజమెత్తారు.’’ఏపీలో అప్రజాస్వామ్యం నడుస్తోందనటానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని పాలకులు భావిస్తున్నారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తామంటే కుదరదు. వీధి రౌడీలాగ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఒప్పుకోం’’ అంటూ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. -
ఉడత ఊపులకు భయపడేది లేదు: సాక్షి మీడియా
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం కథనాలల వ్యహారంలో లీగల్ నోటీసుల అంశంపై సాక్షి మీడియా సంస్థ స్పందించింది. టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. అది నిజంకాదా?. క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా? అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నది నిజం కాదా?. బీఆర్నాయుడి హయాంలో.. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా?. మీ చేతకానితనంలో సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా?. రోజుల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా?. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది నిజం కాదా?. డిప్యూటీ సీఎం పవన్ దర్శనానికి వెళ్లారనే అక్కసుతో పూజారికే మోమో ఇచ్చింది నిజం కాదా?.. అని సాక్షి మీడియా సంస్థ నిలదీసింది.భక్తులకు సరైన సదుపాయలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీడీపీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. శ్రీవారిని కేవలం వీఐపీలకు పరిమితం చేయడంపై ప్రశ్నించడం ఆగదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు అని సాక్షి మీడియా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘సాక్షి’పై మరో అక్రమ కేసు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై ప్రభుత్వ కక్షసాధింపు, పోలీసుల అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అక్రమ కేసులు నమోదుచేస్తామని పత్రికలను, మీడియాను బెదిరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ పేరుతో ఓ ఐపీఎస్పై ‘సాక్షి’ శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. అదే రోజు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించి తనపైనే కథనం రాశారని.. తాను నిజాయితీపరుడినని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం కర్నూలు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’పై సెక్షన్ 132, 308 (3), 353 (1)(బి), 356 (3), రెడ్విత్ 61(2) బీఎన్ఎస్ ప్రకారం అక్రమ కేసు నమోదుచేశారు. డీఐజీ సీసీ రత్నప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఐ శేషయ్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా సాక్షి అమరావతి బ్యూరో, ఏ2గా సాక్షి మేనేజ్మెంట్, పబ్లిషర్ పేరును చేర్చినట్లు తెలుస్తోంది. డీఐజీ సీసీ ఫిర్యాదు చేయడమేంటి? ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంలో ఓ ఐపీఎస్ అని మినహా అందులో పేరులేదు. డీఐజీ కోయ ప్రవీణ్ తనపైనే వార్త రాశారని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. డీఐజీ చెప్పినట్లు ఆయనపైనే వార్త రాస్తే, ఆయన పరువుకు నష్టం వాటిల్లిందని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ, డీఐజీ సీసీ రత్నప్రకాశ్ బాధితుడు ఎలా అవుతారు? అతనెలా ఫిర్యాదు చేస్తారు? అతని ఫిర్యాదు మేరకు కేసు ఎలా నమోదుచేస్తారు? అనేది పోలీసులే చెప్పాలి. నిజానికి.. ప్రభుత్వం, అధికారులు చేసే మంచిని పత్రికలు ఎలా ప్రచురిస్తాయో, తప్పొప్పులు, లోటుపాట్లు, అవినీతి ఆరోపణలు ఉన్నా అలాగే ప్రచురిస్తాయి. ఇది పత్రికలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదే భావప్రకటనా స్వేచ్ఛ. దీనిపై బాధితులకు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. గతంలో అభ్యంతరాలున్న వారు కోర్టులను ఆశ్రయించేవారు. కానీ, కర్నూలు పోలీసులు కొత్త పంథాను అవలంభిస్తున్నారు. తప్పుడు కేసులు నమోదుచేస్తున్నారు. పత్రికలు వార్తలు రాస్తే కేసులు నమోదుచేయడం ఏంటని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు పలుమార్లు ఖండించినా, ఆందోళనలు నిర్వహించినా పోలీసుల్లో మార్పులేదు.గతంలోనూ తప్పుడు కేసు నమోదు.. ఇక గతేడాది డిసెంబరు 22న కర్నూలులో మునీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారు. తన భూమిని మరొకరికి కట్టబెట్టాలని పోలీసులు బెదిరిస్తున్నారని, తాను పనిచేస్తున్న స్కూలుకు పోలీసులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని, డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలతోనే ఈ వ్యవహారం జరిగిందని.. పలుమార్లు డీఐజీ పిలిపించి కోర్టులతో పనిలేదు, సెటిల్ చేసుకోవాలని చెప్పారని మునీర్ విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించగా.. వివిధ ఛానెళ్లూ ప్రసారం చేశాయి. కానీ, అప్పుడు కూడా ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదుచేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ‘సాక్షి’ కథనం రాస్తే త్రీటౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధులకు సాక్షి విలేకరి ఆటంకం కల్గించారని తప్పుడు కేసు నమోదుచేశారు. కిందిస్థాయి పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేస్తే డీఎస్పీ, ఎస్పీలను కలిసి బాధితులు విన్నవిస్తారు. కానీ, ఐపీఎస్ అధికారుల సూచనల మేరకే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఇలా పత్రికలపై తప్పుడు కేసులు కడుతుంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో.. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ స్థాయిలో తొక్కేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు, ప్రభుత్వమే కారణం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా?. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం పాపం చేశారని అరెస్ట్ చేశారు. అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం?. గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఊడగొట్టించారు. ఆయనపై పగతోనే ఇదంతా చేశారు. పత్రికల గొంతు నులుపే కార్యక్రమం ధర్మమేనా?. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపచెల్లుమనిపించినట్టు కాదా?. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసిన వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా?. పక్కా ప్లన్, ఓ ప్రణాళికతో సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కుట్ర జరిగింది. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈరోజు సాక్షి టార్గెట్గా దాడులు చేశారు. రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా? ఇది ఇలాగే కొనసాగితే ఎలా?. భవిష్యత్ ప్రజలు బతుకుతారా?. ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కాదా?. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి. ‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేసింది వీరే..శ్రీకాకుళంలో మెట్ట శైలజ-టీడీపీ అధ్యక్షురాలుమెండ దాసు నాయుడు- టీడీపీ నాయకులు.విశాఖలో.. ముక్కా శ్రావణి.. టీడీపీ కార్పొరేటర్. అనంత లక్ష్మి.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు.తూర్పుగోదావరి.. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే).బతూలు బాలరామకృష్ణ.. జనసేన ఎమ్మెల్యే. విజయవాడలోగద్దె అనురాధ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె క్రాంతి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు. మంగళగిరిలో.. కంభంపాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్.అనంతపురంలో.. స్వప్న.. టీడీపీ మహిళా వింగ్ స్టేట్ సెక్రటరీ. సంగా తేజస్వినీ.. టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ.కడపలో.. బొజ్జా తిరుమలేష్.. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్. తిరుపతి.. ఆర్సీ మునికృష్ణ.. తిరుపతి డిప్యూటీ మేయర్. కోడూరి బాలసుబ్రహ్మణ్యం.. టీడీపీ అధికార ప్రతినిధి. -
పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి, అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను మీడియా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం– పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపట్టేలా వ్యవహరిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాస రావు కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనను అరెస్టు చేయడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది’ అని సీనియర్ సంపాదకులు అన్నారు.ఇటీవల ఏపీలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటీవల సంపాదకుడు రహమాన్పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్రావు, ట్రెజరర్ రాజేష్, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు వ్యక్తపర్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కె.రామచంద్రమూర్తి ,సీనియర్ సంపాదకులుపత్రికా స్వేచ్ఛను కోరుకునేది ప్రజలే.. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. దీన్ని ప్రధానంగా కోరుకునేది ప్రజలే. పత్రికలు చురుకుగా ఉన్నప్పుడే ప్రతీ విషయం ప్రజలకు చేరుతుంది. కానీ ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్నీ గౌరవించిన మనిషి కాదు. ప్రతీ రంగంలో తన వ్యతిరేకులను అణచివేయడం ఏళ్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతికా స్వేచ్ఛనే కాదు... అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. - టంకశాల అశోక్, సీనియర్ సంపాదకులుమీడియాను భయపెట్టే ప్రయత్నమిది.. కొమ్మినేని అరెస్టుతో మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొమ్మినేని తప్పు లేకు న్నా.. ఒకరకమైన భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడి యా స్వతంత్రంగా లేదు. రాజకీయ పారీ్టల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం రెండూ వేర్వేరు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొమ్మినేని అరెస్ట్తో ఆగుతుందని అనుకోవడం లేదు. దీంతో భయపడి మిగతావారు వ్యతిరేక వార్తలు రా యకుండా ఉంటారని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మిగతా జర్నలిస్టులు రియాక్ట్ కాకుంటే ఎలా..? - దేవులపల్లి అమర్ ,సంపాదకులు మన తెలంగాణకక్ష సాధింపునకు పరాకాష్ట సాక్షి టీవీ డిబెట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలకు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానాలి. కొమ్మినేని అరెస్టే సరి కాదని న్యాయస్థానం స్పష్టంచేస్తుంటే, సాక్షి కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సరైన కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని, ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చనే తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది. ఇది రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. - ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షిఒక్కో మీడియా ఒక్కో వైఖరితో.. ప్రస్తుత రోజుల్లో ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో ఉంది. ఈ పరిస్థితుల్లో ఐదు పేపర్లు, పది టీవీ చానళ్లు చూస్తే తప్ప వాస్తవాలేంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తుంటే... ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే గుడ్డలూడదీసి కొడతానంటోంది. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అరెస్టులను వ్యతిరేకించాలి. అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులుపాత్రికేయుల భద్రత గురించి ఆలోచించాలి రాజకీయ కక్ష సాధింపులో మీడియా పావులుగా మారుతోంది. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చాలా రాష్ట్రాల్లో మీడియా టార్గెట్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రికేయుల భద్రత గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాచా రం అందించే ఏ వ్యవస్థ అయినా మీడియా కిందనే గుర్తించాలి. ఓ వార్త విషయంలో ప్రైవేటు వ్యక్తులు కేసు పెడితే నాపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు చేశారు. ఇదివరకు సోషల్ మీడియా వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన స్రవంతి మీడియా పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడది మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చింది. కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్టు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది. - కె.శ్రీనివాస్, సీనియర్ సంపాదకులుసుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థలు వెక్కిరిస్తున్నాయి కొమ్మినేని అరెస్టు... సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన తీరు ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను దిగజార్చుతున్నాయి. కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సూచనలపై కొందరు వ్యంగ్యంగా చర్చిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలియకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే ప్రమాదకరం. - విజయ్ బాబు,సీనియర్ సంపాదకులుపత్రికలకు స్వేచ్ఛ లేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పత్రికలకు స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. వార్త రాసినా ఉపేక్షించే పరిస్థితిలో లేవు. అందుకు తాజా ఉదా హరణ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారమే. వాస్తవానికి ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదు. - దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్..అయినా ప్రజా ప్రయోజన వార్తలు ఆగవు గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే స్థానికుల సమాచారంతో నేను వార్తలు రాశాను. ఇథనాల్ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైంది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను అరెస్టు చేసింది. అయినా ప్రజలకు ప్రయోజనం కలిగించే వార్తలు రాయడం ఆపను. - రహమాన్, సంపాదకులుకలిసి ఉంటేనే మనుగడవ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటున్నాయి. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా ఉంటేనే మీడియా మనుగడ ఉంటుంది. - శైలేష్ రెడ్డి, సీఈఓ, టీ న్యూస్ -
కొమ్మినేని తప్పేమీ లేదు.. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే శక్తులు ఆరంభం నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో, వివిధ స్థాయిలో ఉన్నాయని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నొక్కి చెప్పారు. రాజకీయ కక్షతో మీడియాపై దాడులు సరికాదని పాలకులకు హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ‘డెమోక్రసీ- ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కే శ్రీనివాస్, దేవులపల్లి అమర్, దిలీప్రెడ్డి, విజయ్బాబు, శైలేశ్రెడ్డి, రెహమాన్, సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్. ధనంజయరెడ్డి.. ఇంకా పలువురు జర్నలిస్టులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను వీరంతా ఖండించారు. ఎవరేమన్నారంటే.. ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ.. ఈ రెండు ప్రశ్నార్థకాలే. కేఎస్ఆర్ కాంట్రవర్సీగా మాట్లాడే వ్యక్తి కాదు. సాక్షి కార్యాలయాలపై దాడి సరికాదు: రామచంద్రమూర్తిప్రజల భాగస్వామ్యంతోనే పత్రిక స్వేచ్చను కాపాడాలి: టంకశాల అశోక్కొమ్మినేనిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు: కే. శ్రీనివాస్పత్రికా స్వేచ్చకు భగం కలిగించారు: విజయ్బాబుకొమ్మినేని శ్రీనివాస్ తప్పేమీ లేదు. జర్నలిస్టులను భయపెట్టే విధంగా అరెస్టులు. ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్ఛ భాగమే: దేవులపల్లి అమర్ -
ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన
విజయవాడ స్పోర్ట్స్/జి.కొండూరు: ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దురుద్దేశంతో చేస్తున్న దాడులను ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, వామపక్ష నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. నాణేనికి మరోవైపు ఉన్న ప్రపంచాన్ని చూపిస్తూ ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. పత్రిక కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నినదించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను రెడ్బుక్ ప్రమాదంలో పడేసిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా విజయవాడ గాం«దీనగర్లోని ధర్నా చౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇచి్చన పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టు, జర్నలిస్టు సంఘాల నాయకులు తరలివచ్చి ధరాలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా కొనసాగింది.టీడీపీ గూండాల చర్యలకు నిరసనగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్బుక్ పాలనను అంతం చేయండి, పత్రికా కార్యాలయాలపై దాడులు సిగ్గు.. సిగ్గు.. అనే నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్, సాక్షి ప్రతినిధులు బీవీ రాఘవరెడ్డి, విశ్వనా«థ్రెడ్డి, ఎన్.సతీ‹Ù, ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, చందు శివాంజనేయులు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాల్గొన్నారు.సాక్షిపై కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం మీడియా సంస్థలు తప్పులు, పొరపాట్లు చేశాయని భావిస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది కేవలం కక్షసాధింపు చర్యే. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ను ఈ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోంది. సాక్షిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం. – కె.పోలారి, ఇఫ్టూ నేతనా సర్విసులో ఇలాంటివి చూడలేదు నా సర్విసులో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చూడలేదు. మీడియా సంస్థలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డ్ పోలీసు అధికారి నిరంకుశ చర్య మంచిది కాదు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులను, దమన కాండలను జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం దుర్మార్గం. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శించడంమంచి చర్య కాదు. – సీహెచ్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం (సామ్నా) -
సాక్షి కార్యాలయాల వద్ద పచ్చ మూకల విధ్వంసం
రాజానగరం/ఏలూరు/ఏలూరు టౌన్: సాక్షి కార్యాలయాల వద్ద కూటమి మూకల విధ్వంసకాండ కొనసాగుతోంది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంతోపాటు ఏలూరులోని ప్రాంతీయ కార్యాలయం వద్ద కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంపైకి రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన పార్టీ), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ), అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన ముష్కరులు దాడికి తెగబడ్డారు.ప్రధాన గేటు ముంగిట సాక్షి పత్రికలను వేసి దహనం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి నేమ్ బోర్డును పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, సాక్షి కార్యాలయాలపై కూటమి నేతల దాడులను అరికట్టాలని కోరుతూ తూర్పు గోదావరి, కాకినాడ ఎస్పీలు నరసింహ కిషోర్, బిందుమాధవ్లకు మీడియా ప్రతినిధులు వినతిపత్రాలు అందించారు.ఫర్నిచర్ తగులబెట్టి భీతావహ వాతావరణం ఏలూరు ఎన్ఆర్ పేటలోని ‘సాక్షి’ ప్రాంతీయ కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన 500 మందికిపైగా టీడీపీ గూండాలు భీతావహ వాతావరణం సృష్టించారు. కార్యాలయం వద్ద ఫరి్నచర్ను పెట్రోల్ పోసి తగులబెట్టారు. భారీగా మంటలు చెలరేగటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తొలుత కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు ముష్కరులు యతి్నంచారు. కార్యాలయం ఆవరణలో కింద ఉన్న ఫరి్నచర్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, కార్యకర్తలు ఏప్రిల్ 22న కూడా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.సాక్షి కార్యాలయాలపై దాడులు హేయం టీడీపీ ప్రభుత్వం సాక్షి మీడియా గ్రూప్ టార్గెట్గా చేస్తున్న పనులు అత్యంత హేయం. అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా ఆఫీసులపై దాడి చేసిన పచ్చమూకలు... మరో అడుగు ముందుకేసి, ఏలూరు సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసి ఫరి్నచర్కు నిప్పు పెట్టడం దుర్మార్గం. ఈ అనైతిక చర్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అక్రమ కేసుతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం దారుణం. – కురసాల కన్నబాబు,వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రిపథకం ప్రకారమే దాడులుసాక్షి కార్యాలయాలపై మూడు రోజులుగా పథకం ప్రకారం టీడీపీ ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయం ఆవరణలోని ఫర్నిచర్కు నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే. హింసాత్మక చర్యలు భవిష్యత్లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్రమ కేసులో కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నా. – బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో విపక్ష నేతకూటమి అరాచకాలు పతాకస్థాయికి ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం దారుణం. టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి ఈ అరాచకాలకు తెగబడుతున్నాయి. ఏలూరు సాక్షి ఆఫీసులోని ఫర్నిచర్ తగులబెట్టడం అత్యంత దారుణం. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి -
AP: ‘సాక్షి’పై దాడులు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది.తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈ దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.మీడియాపై అధికార పార్టీ దౌర్జన్యం తగదు శ్రీకాకుళం: అమరావతిపై ఇటీవల సాక్షి టీవీ చానల్లో జరిగిన చర్చలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలపై నిరసనల పేరుతో అధికారపార్టీ దౌర్జన్యాలకు దిగడం దారుణమని, మీడియా కార్యాలయాలను ధ్వంసం చేయడం సరైన విధానం కాదని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఖండించారు. మీడియాపై దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దాడి ఘటనలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.ఈశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ జగదీ‹Ù, సనపల రమేష్ ఖండించారు.ప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే..ఏపీలో సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసనసోమవారం కొవ్వొత్తుల ప్రదర్శనతో టీడీపీ దాడులపై మండిపాటుప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే దాడులుఇవి కుట్రపూరిత, కక్ష పూరిత దాడులంటూ ధ్వజంపత్రికా స్వేచ్ఛపై దాడి: డీజేయూ'సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు, సాక్షిపై దాడులను ఖండించిన డీజేయూ ఏపీ రాష్ట్ర కమిటీవిశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గమైన చర్య,ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిసాక్షి కార్యాలయాలపై దాడుల సరికాదుసాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు తగవు: ఏపీయూడబ్ల్యూజేసాక్షి పత్రిక కార్యాలయాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఖండించిన ఏపీయూడబ్ల్యూజేదాడులతో పాటు పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలు దిగ్భ్రాంతి కలిగించాయిసాక్షి కార్యాలయా లపై దాడులకు పూనుకోవడం గర్హనీయంపత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరం ‘సాక్షి’పై దాడుల్ని ఖండించిన ఐజేయూసాక్షి టీవీ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంపై నిరసన పేరుతో ఏపీలోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిపి, ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్ అలీ, కె.రాంనారాయణ, సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్రమూర్తి సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధ్వంస సంస్కృతి ఏ రకంగానూ సమర్థనీయం కాదన్నారు. కొమ్మినేనిపై కేసు నమోదు చేయడం సరైంది కాదని, క్షమాపణ చెప్పిన జర్నలిస్టును విడుదల చేయాలని కోరారు. సాక్షి పత్రిక, చానల్ కార్యాలయాల ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ‘సాక్షి’కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నాం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఐజేయూ మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ తీవ్రంగా ఖండించారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్ చేశారన్నారు. 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్ షోలు చేసే వారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. మహిళలను కించపరిచేవిధంగా, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. -
పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
సాక్షి, అమరావతి : రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఏపీ శాసనసభ ద్వారా వేధింపులకు దిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికకు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఫిబ్రవరి 25న సాక్షిలో ప్రచురితమైన ఒక వార్త అసెంబ్లీకి, అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగించిందని అందులో పేర్కొన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారని, ఈనెల 2న సమావేశమైన కమిటీ పత్రిక ఎడిటర్, సంబంధిత రిపోర్టర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్ స్పందన తెలుసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ నోటీసుపై స్పందించాలని కోరారు. ఎవరి హక్కుల ఉల్లంఘనా జరగలేదు.. వాస్తవానికి.. ‘సాక్షి’ ప్రచురించిన కథనంలో ఎక్కడా సభా హక్కుల ఉల్లంఘన జరగలేదు. అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యులు, అధికారుల ప్రస్తావన అందులో లేదు. వారి హక్కులకుగానీ, వారి హుందాతనానికి గానీ అగౌరవం కలిగే వ్యాఖ్యలు అసలేలేవు. కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే అందులో ప్రస్తావించారు. శిక్షణా తరగతుల పేరుతో అన్ని ఏర్పాట్లు చేశాక రద్దుచేయడం ద్వారా ప్రజాధనం వృధా అయిందని, ప్రణాళికా లోపంవల్లే ఇది జరిగిందని వ్యవస్థాపరమైన లోపాలను గుర్తుచేస్తూ ఈ కథనంలో రాశారు. కానీ, సాక్షి మీడియాపై కక్షగట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల్లో ఒక సభ్యుడితో దీనిపై ఫిర్యాదు చేయించి సభా హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది. ఆ సభ్యుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపగా కమిటీ నోటీసులిచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై వరుస దాడులు చేయిస్తోంది. జర్నలిస్టులను భయపెట్టాలని, పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించాలనే కుతంత్రంతో ఇలా చేయిస్తున్నట్లు ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. సాక్షి, సాక్షి సిబ్బందిపై వరుస దాడులు.. ఇక ఇటీవలే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి నివాసంలో ‘సిట్’ పోలీసులు అకారణంగా సోదాలు జరిపారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. మద్యం కేసు నిందితుల కోసం అన్వేషించే పేరుతో ఒక పత్రిక ఎడిటర్ నివాసంలో సోదాలు జరిపి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించారు. అలాగే, సమాజంలో జరిగే పలు అంశాలను ప్రతిబింబించే క్రమంలో రాసిన వివిధ కథనాలపై పరువు నష్టం కేసులు వేసింది. మరోవైపు.. సాక్షి విలేకరులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కులు దాడులకు తెగబడుతున్నారు. వారి తప్పులను ఎత్తిచూపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అలాగే, గుంటూరు జిల్లా సాక్షి ఛానల్ ప్రతినిధిపై కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనూ సాక్షి విలేకరిపై దాడి చేశారు. ఇంకా అనేక చోట్ల సాక్షి మీడియాపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఇప్పుడు అసెంబ్లీ ద్వారా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. -
‘సాక్షి’పై సర్కారు అక్కసు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. ‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.