galleries
-
చీర కట్టు.. చిరునవ్వుతో మదిని దోచేస్తున్న పూనమ్ బజ్వా (ఫోటోలు)
-
సాంస్కృతిక నగరిలో.. ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో పాటు విభిన్న కళలకు గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ ఆనవాయితీ ఈనాటిది కాదు. నిజాం కాలం నుంచే వినూత్న, విదేశీ కళలకూ ప్రసిద్ధిగాంచింది. ఇందులో భాగంగానే నగర వేదికగా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి విభిన్న నగరాల నుంచి ప్రముఖ ఆర్టిస్టులు ఈ కళా ఉత్సవంలో తమ కళలను ప్రదర్శించనున్నారు. 2011 నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో నిర్వహించే ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ రెండో ఎడిషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ ఫెస్టివల్తో పాటు ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ‘ది ఎటర్నల్ కాన్వాస్ – 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్’ ప్రదర్శన హైలైట్గా నిలువనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రతి రాష్ట్రం నుంచి కళాకారులు పాల్గోనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, దేశవ్యాప్తంగా 50 మంది దిగ్గజ కళాకారులతో పాటు దాదాపు 200 మంది ప్రముఖ, యువ, ఔత్సాహిక కళాకారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన పెయింటింగ్స్, శిల్పాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ రేతిబౌలి (మెహదీపట్నం) పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 68 దగ్గరున్న కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకూ 11:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకూ కొనసాగుతుంది. ప్రముఖ కళాకారుల ప్రదర్శన.. ప్రముఖ కళాకారులు జోగెన్ చౌదరి, మను పరేఖ్, క్రిషేన్ ఖన్నా, శక్తి బర్మన్, సీమా కోహ్లీ, పరేశ్ మెయితీ, యూసుఫ్ అరక్కల్, ఎస్ జి వాసుదేవ్, అంజోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టి వైకుంఠం, చింతల జగదీశ్, గిగి సర్కారియా, ఎంవి రమణా రెడ్డి, లక్ష్మణ్ ఏలె, అశోక్ భౌమిక్, గురుదాస్ షెనాయ్, జతిన్ దాస్, పి జ్ఞాన, రమేశ్ గోర్జాల తదితర ప్రముఖ కళాకారుల కళారూపాలు ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. వైవిధ్యమైన కళావేదిక.. కళాకారులు తమ నెట్వర్క్ మరింతగా పెంచుకోడానికి, భిన్న రంగాలకు చెందిన ప్రేక్షకుల ఎదుట తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది చక్కటి వేదిక. తమ ఇళ్లను చక్కని సృజనాత్మక కళాఖండాలతో అందంగా అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరే నగర యువతకు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ చక్కని వేదికగా నిలుస్తుంది. చదవండి: స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరంయువ, మిడ్–కెరీర్ కళాకారులు తమ కళాకృతులను పలువురు దిగ్గజ కళాకారులతో పాటు ప్రదర్శించడానికి ‘వన్–స్టాప్ ఆర్ట్ షాప్’గా ఈ వేదిక నిలుస్తుంది. హైదరాబాద్ నగరం నుంచి ఆర్ట్స్బ్రీజ్ ఆర్ట్ గ్యాలరీ, గ్యాలరీ సెలెస్టే, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, స్నేహా ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వంటి సంస్థలు తమ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. – రాజేంద్ర, డైరెక్టర్ –ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ -
క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంత క్యూట్ గా ఉందో సాయి పల్లవి (ఫోటోలు)
-
చూపులతోనే కేక పుట్టిస్తోన్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు
-
కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న నేహా శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
నిషా కళ్ళతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న నటి దివ్యభారతి ఫోటోలు
-
అందాలతో తెగ అట్రాక్ట్ చేస్తున్న అనైరా గుప్తా ఫోటోలు.. లుక్స్తో రచ్చ చేస్తుందిగా..!
-
చీరకట్టులో అతుల్య రవి.. క్యూట్ లుక్స్తో రచ్చ చేస్తుందిగా..!
-
మైమరపించే అందాలతో నటి నాజియా డేవిసన్ ఫోటోలు
-
మిల్కీ బ్యూటీ కాదు... పాలరాతి శిల్పంలా... వైట్ డ్రెస్లో తమన్నా ఫోటోలు
-
కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!
-
ఔరా! అనిపించే అందాలతో కవ్విస్తోన్న నోరా ఫతేహి ఫొటోస్
-
అందాలతో సెగలు పుట్టిస్తున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఫొటోస్
-
మైమరపించే అందాలతో OG నటి శ్రీయా రెడ్డి ఫొటోస్
-
కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్న లైలా హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాలు
-
Vadlamani Priya: ట్రెడిషనల్ లుక్లో అదరగొడుతున్న ముఖచిత్రం హీరోయిన్ (ఫోటోలు)
-
రవాణా మ్యూజియం!
మనదేశంలో మనిషి మొట్టమొదటగా ఉపయోగించిన రవాణా సాధనం రూపు రేఖలు... ఎలా ఉండేవి? ఆ తర్వాత పరిణామ క్రమంలో ఎలాంటి సాధనాలను రవాణాకోసం మనిషి ఉపయోగించాడు? ఎడ్ల బండి నుంచి ఎరోప్లేన్ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణా సాధనాలన్నింటినీ చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని పిల్లలకూ చూపాలని ఉందా? అయితే, రండి ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం’కి వెళ్లొద్దాం.. హర్యానా రాష్ట్రం, బిలాస్పూర్ చౌక్, టారు రోడ్లో ఉంది హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం. ఢిల్లీ నుంచి సోహ్నా-గుర్గావ్ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా వెళితే దాదాపు 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మ్యూజియం. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా మ్యూజియం ఇదే! 90,000 చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్ ఉదయం 10 గం॥నుంచి రాత్రి 7 గం॥వరకు (సోమవారం సెలవు) తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియం, షాప్లు, రెస్టారెంట్ వసతులు కూడా ఉన్నాయి. మొదటగా షికారుకు వెళ్లిన కారు... మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో 75 పాత కార్లనూ వీక్షించవచ్చు. భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు, క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్ పంపు, బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. బస్సులు-వ్యాన్లు... పెద్ద పెద్ద వాహన పరికరాలు గల బస్ డిపో ఏ విధంగా ఉంటుంది, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... ఈ వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీలో ప్రదర్శన ఉంటుంది. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. చుక్.. చుక్.. రైలు... మన దేశంలో రవాణాకు రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎంత సమయం పట్టింది? వివరాలతో పాటు 1930ల నాటి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నమూనా, సెలూన్ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి వాస్తవ ఛాయా చిత్రాలు, ట్రెయిన్ టికెట్లు, కరెంట్ దీపాలు, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు. విమానయాన వివరాలు... భారతదేశ విమాయాన పరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి విపులంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఒక చక్కని వేదిక. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందిందీ దశలవారీగా తెలియజెప్పే విశేషాలు ఇందులో ఉంటాయి. ఆసక్తి, ఉత్సాహం, పరిశోధన... నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్రల్ విషయంలోనూ జరిగింది. ఢిల్లీ వాస్తవ్యులైన తరుణ్కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. గ్రామ్ఫోన్ల నుంచి ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలను తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా డిసెంబర్, 2013లో ఈ చారిత్రాత్మక వాహనశాల ఏర్పాటైంది. అంతేకాదు 1940ల నాటి జె3సి సియుబి విమానాన్నీ ఇక్కడ తిలకించవచ్చు. ద్విచక్రవాహనాలు... నాటి కాలంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ద్విచక్రవాహనాలు సైకిల్, స్కూటర్, మోటార్సైకిల్, మోపెడ్స్... వీటితో పాటు భారతదేశ రవాణాసాధనాల నమూనాను పోలిన బొమ్మలూ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ బొమ్మలన్నీ మనల్ని బాల్యంలోకి తీసుకెళతాయి. జల మార్గంలో... మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించి 10,000 అంశాలను ఒకే దగ్గర తెలుసుకునే మహాదావకాశంగా ఈ మ్యూజియంను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమ ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ కళ్లకు కడుతుంది. మ్యూజియం సందర్శనకు టికెట్ ధర పెద్దలకు (ఒకరికి) రూ.300/-; పిల్లలకు (ఒకరికి ) రూ.150/- 50 మందికి పైగా పిల్లలు ఒకేసారి సందర్శిస్తే వారికి టికెట్ రేటులో 10 శాతం రాయితీ లభిస్తుంది. ఇందులో పుట్టినరోజు ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఫుడ్ ప్యాకేజీ ఒకరికి (శాకాహారం) రూ.1100/-, మాంసాహారం రూ.1200/-, అల్పాహార ప్యాకేజీలో భాగంగా ఒకరికి రూ. 600/- (వెన్యూకు చార్జీ లేదు) ఎవరికి వారే ఆహారం తెచ్చుకునేటట్టయితే వెన్యూ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వెన్యూ చార్జీ రోజుకు రూ.50,000, సగం రోజుకు రూ.25,000/- ఫొటోగ్రాఫ్స్ తీసుకునే సౌలభ్యం ఉంది. మరిన్ని వివరాలకు: ఫోన్ నెం. +911123718100 Email ID: info@heritagetransportmuseum.org ఆసక్తి, ఉత్సాహం, పరిశోధన... నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్రల్ విషయంలోనూ జరిగింది. ఢిల్లీ వాస్తవ్యులైన తరుణ్కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. గ్రామ్ఫోన్ల నుంచి ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలను తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా డిసెంబర్, 2013లో ఈ చారిత్రాత్మక వాహనశాల ఏర్పాటైంది. -
తిరుమలలో నేడు ఒక రోజు బ్రహ్మోత్సవం
రథసప్తమికి అంతా సిద్ధం తరలివచ్చిన అశేషభక్తజనం సాక్షి, తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమికి తిరుమల సిద్ధమైంది. ఏడు వాహనసేవల్లో స్వామివారిని దర్శించి తరిం చేందుకు భక్తకోటి తరలివచ్చింది. ఉద యం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ దర్శనమిచ్చేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రి అన్ని విభాగాల అధికారులతో కలసి జేఈవో శ్రీనివాసరాజు రథసప్తమి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆలయం వద్ద, నాలుగు మాడవీధుల్లో నిర్మించిన ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లను పరి శీలించారు. ఏకదాటిగా ఏడు వాహ సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాన్ని పాటించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఉండడంతో బుధవారం ప్రత్యేకంగా పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సుదర్శన చక్రతాళ్వా ర్కు స్నానం జరిపే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు చొరబడకుం డా ఇనుప కమ్మీలను ఏర్పాటు చేశారు. నాలుగు మాడవీధుల్లో ఏ ర్పాటు చేసిన చలువ పందిళ్ల వద్ద తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు వితరణ చేసేందుకు అదికారుల చర్యలు తీసుకున్నారు.