Gandeevam
-
ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మృతి
-
సీనియర్ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్ అలియాస్ ‘కెప్టెన్ రాజు’(68) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు. 1980ల్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాజు ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి పొందారు. తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో ‘పవనాయి 99. 99’ చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. -
తెలుగులో మోహన్లాల్
బాలకృష్ణ నటించిన ‘గాండీవం’ చిత్రంలో ‘గోరువంక వాలగానే గోపురానికి’ పాటలో తళుక్కున మెరిశారు మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్. మళ్లీ ఆ తర్వాత నేరుగా ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు. అయితే అనేక అనువాద చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇటీవలే ‘జిల్లా’ అనే చిత్రంతో తెలుగు తెరపై కనిపించిన మోహన్లాల్, ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు చిత్రంతో మన ముందుకు రానున్నారు. సురేశ్ వంశీ దర్శకత్వంలో విశ్వనాథ్ ఇ.ఎస్ నిర్మించనున్న చిత్రం ‘నువ్వే నా ప్రాణమని’. సూరజ్, కవిత జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్లాల్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో యాక్షన్, సెంటిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మోహన్లాల్ వంటి అగ్ర హీరో ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివ, సంగీతం: సందీప్ కుమార్, మహమ్మద్ రఫిక్, సహ నిర్మాత: కొండారెడ్డి.