governer home
-
వెళ్లొద్దన్నా వచ్చిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు పలువురు ఈ విందుకు హాజరయ్యారు. అయితే గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని టీ-కాంగ్రెస్ నేతలు ఈ విందును బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి దానం నాగేందర్లు విందుకు హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమాచారం లేదని, వెళ్లొద్దని చెబితే వెళ్లేవాడిని కాదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. కాగా ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాలేదు.. -
'మమ్మల్ని జంతువుల్లా చూడటం మానండి'
సెయింట్ పాల్: అమెరికాలో నల్లజాతీయులను పోలీసులు కాల్చేసిన ఘటనలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మిన్నెసోటాలోని సెయింట్ పాల్లో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుమారు 40 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో గవర్నర్ నివాసానికి సమీపంలో రోడ్డును మూసివేసి ఆందోళనకారులు నిర్వహిస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. జులై 7న ఫిలాండ్ కాసిల్ అనే నల్లజాతీయుడిని పోలీసు అధికారి సెయింట్ ఆంథోనీ కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఫేస్బుక్ లైవ్స్ట్రీమింగ్ ద్వారా ఫిలాండో కాసిల్ గర్ల్ఫ్రెండ్ ఈ ఘటనను రికార్డ్ చేసింది. అప్పటి నుంచి ఆందోళనకారులు.. సెయింట్ పాల్ లో గవర్నర్ నివాసం వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ల సందర్భంగా తమను జంతువుల్లా ట్రీట్ చేయడం మానుకోవాలని నల్లజాతి నిరసనకారుడు జాకబ్ లడ్డా పేర్కొన్నారు. అకారణంగా ఓ వ్యక్తిని చంపేశారని, ఈ ఘటనలో న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.