Government employ
-
ట్రంప్ వార్నింగ్.. ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు క్యూ
వాషింగ్టన్ : ‘ఇంటి నుంచి పనిచేయడం కాదు. ఆఫీస్కు వస్తారా? ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా?. ఆఫీసుకు వచ్చి పని చేయండి. లేదంటే ఫిబ్రవరి 6 తారీఖులోపు రాజీనామా చేయండి. రాజీనామా చేసిన ఉద్యోగులకు బైఅవుట్ చెల్లిస్తాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) 20లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు (US federal workers) అల్టిమేట్టం జారీ చేశారు. దీంతో ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ గడువు ముగియనున్న తరుణంలో వేలాది మంది ఉద్యోగులు రాజీనామా చేసేందుకు క్యూ కట్టినట్లు తెలుస్తోంది.అమెరికాలో 2.3 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 40వేల మంది తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా (resign) చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వారందరూ ట్రంప్ ఇచ్చే బైఅవుట్ ప్యాకేజీకి సిద్ధపడి రాజీనామా చేసినట్లు వాషింస్టన్ పోస్ట్ తెలిపింది. వైట్ హౌస్ వర్గాలు సైతం ధృవీకరించినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డొజ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డోజ్ బాధ్యతల్ని బిలియనీర్ ఎలాన్మస్క్కు బాధ్యతల్ని అప్పగించారు. అయితే, అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ డోజ్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలు జారీచేస్తూ వస్తున్నారు.ఇందులో భాగంగా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ సర్కారు బైఅవుట్ను ప్రకటించింది.కొవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పని చేస్తున్నారు. తాజాగా వారు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కారు తేల్చిచెప్పింది.ఆఫీస్కు రావాలనుకుంటే రావొచ్చు. వద్దనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ నుంచి ఒక ఈ-మెయిల్ 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పంపింది. అందులో ఫిబ్రవరి 6లోపు స్వచ్ఛందంగా ఉద్యోగాలు రాజీనామా చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు.దీంతో ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ సమీపిస్తున్న తరుణంలో వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగాలు రాజీనామా చేశారు. మరికొందరు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు.👉చదవండి : సంకెళ్లతో భారత వలసదారులు.. స్పందించిన కేంద్రం -
పండ్లతోటలకు ‘ఉపాధి’ వరం
నారాయణపేట రూరల్, న్యూస్లైన్: గ్రామీణ రైతాంగ సంక్షేమంకోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్లతోటలను పెంచుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మహాత్మాగాంధీ వననర్సరీ కింద బండ్ ప్లాంటింగ్ (గట్ల వెంబడి టేకు మొక్కల పెంపకం), పండ్లతోటల పెంపకం, ఇందిరమ్మ పచ్చతోరణం తదితర పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వివిధ రకాల పండ్లతోటలు, టేకుమొక్కలు, ఎర్రచందనం మొక్కలను తమ పొలాల్లో పెంచే రైతులకు నెలకు రూ.మూడు వేలు చెల్లించాలని సూచించింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 14న రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు (సర్క్యూలర్ నం.4611/ సీఆర్డీ/ఎంజీవీఎన్/2013) జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే వేతనం వలే టేకు, పండ్ల తోటల మొక్కలు పెంచే రైతులకు (ప్రతి మొక్కకు ప్రతిరోజూ 50 పైసల చొప్పున) ప్రతినెలా రూ.మూడు వేలు అందజేస్తుంది. దీనివల్ల తమ పొలాల్లో పండ్లతోటల సంరక్షణకు నిరంతరం పర్యవే క్షించి అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతినెలా ఒకటి, రెండుసార్లు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ సదరు రైతు పొలాన్ని పరిశీలించి పంటలు అధిక దిగుబడి వచ్చేందుకు సలహాలు, సూచనలు ఇస్తారు. దీనివల్ల వారికి అవగాహన కలిగి మొక్కలను బతికించుకునే అవకాశముంటుంది. ఇక ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, కుటుంబాలకు ఈ ప్రకారమే మొక్కలకు రూ.15 చొప్పున ప్రతినెలా చెల్లిస్తారు. అయితే ఫీల్డ్అసిస్టెంట్, సర్వేయర్ నివేదిక ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ రికార్డు చేసి ఇస్తారు. దీనికి ఇంజనీర్ కన్సల్టెంట్ తనిఖీ చేసి డబ్బులు చెల్లించే లా చర్యలు తీసుకుంటారు. ఇలా ప్రతి రైతుకు మూడేళ్ల వరకు చెల్లిస్తారు. బండ్ ప్లాంటింగ్లో టేకు, ఎర్రచందనం మొక్కల పెంపకానికి రెండేళ్ల వరకు (సెప్టెంబర్ నుంచి జూన్ వరకు) బతికిన ప్రతి మొక్కకు రూ.ఐదు చొప్పున రికార్డు చేస్తారు. ఇలా మొత్తం 600 మొక్కలకు మాత్రమే చెల్లిస్తారు. ప్రతినెలా 15లోపు వేతనం రైతు బ్యాంకు ఖాతాలో వేసేలా మండలస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలి. ఈ విధానం వల్ల ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగవని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇలా జరగకపోతే అలస్యంగా చెల్లింపు జరిమానాను సిబ్బంది వేతనాల ద్వారా రికవరీ చేస్తారు.