కోరికలే... దెయ్యాలైతే!
శ్రీ మన్మథ, రాజీ జంటగా వరసాల సరస్వతి, నరసింహారావు సమర్పణలో గూన అప్పారావు దర్శకత్వంలో వరసాల సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘అవును-నేనే’. నిర్మాత మాట్లాడుతూ -‘‘దాదాపు 21 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. ఇది మంచి రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘దెయ్యాలు, పిశాచాలు కోరికలతో రగిలిపోతున్న మనుషుల దేహాల్లో నివాసం ఉంటాయనే కథతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు.