hca scam
-
అక్కడ అద్భుతం- ఇక్కడ అవినీతిమయం
ఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. హెచ్సీఏలో వివేక్ అవినీతికి పాల్పడుతున్నాడని, ఇప్పటికి రూ.12 కోట్లు దోచుకున్నాడని అన్నారు. ఆర్బిట్రేషన్ పేరుతో రూ.25 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుంటే హెచ్ సిఎ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్సీఏ అక్రమాలపై దృష్టి పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు
-
ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు
హైదరాబాద్: హెచ్సీఏ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. అయితే ఫలితాలు మాత్రం ఇప్పుడే వెల్లడించొద్దని ఆంక్షలు విధించింది. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హెచ్సీఏ కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయకపోవడంతోపాటు, పదవీకాలం ముగిసినా అధ్యక్షుడిగా ఉన్న అర్షద్ అయూబ్ కొనసాగతుండటంపై హైకోర్టు గతంలో తీవ్రంగా మండిపడింది. హెచ్సీఏలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అర్షద్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 7నే ముగిసింది. అయినప్పటికీ ఆయన పదవిలో కొనసాగారు. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో తేలింది. దీంతో హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మరోపక్క, లోధా కమిటీ సిఫారసు ప్రకారం హెచ్సీఏ ఎన్నికలు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా అలా చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ హెచ్సీఏ ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కూడా పాల్గొంటున్నారు. హెచ్సీఏ అధ్యక్ష పదవికి ఇప్పటికే అజహర్ నామినేషన్ వేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఆయన పోటీకి బీసీసీఐ అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. -
హెచ్సీఏలో భారీ కుంభకోణం!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. గత శుక్రవారం కూడా హెచ్సీఏ సభ్యులపై ఉప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన నిర్వహించిన హెచ్సీఏ సర్వసభ్య సమావేశంలో రోజూవారీ బాధ్యతల నిర్వహణకై అడ్హక్ కమిటీ చైర్మన్గా ప్రకాష్చంద్ జైన్ (56)ను నియమించారు. ఈ నెల 5వ తేదీన, 16వ మరోసారి విధుల నిమిత్తం స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ వుండే సెక్యూరిటీ లోనికి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, కుట్ర జరుగుతుందంటూ ప్రకాష్చంద్ ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంభకోణం జరిగినట్లు ప్రైవేట్ సంస్థ దర్యాప్తులో వెల్లడికావడం పలు అనుమానాలకు దారితీసింది. -
క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం