High Security Zone
-
తాజ్ వద్ద డ్రోన్ కలకలం
ఆగ్రా: చారిత్రాత్మక కట్టడం తాజ్మహల్ వద్ద డ్రోన్ ఒకటి కలకలం రేపింది. హైసెక్యూరిటీ జోన్లో ఉన్న తాజ్మహల్ వద్ద శనివారం మధ్యాహ్న సమయంలో డ్రోన్ను ఎగురవేస్తున్న అమెరికా పర్యాటకుడిని పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఒహయో ప్రాంతానికి చెందిన నికోలస్గా గుర్తించారు. రెండు సార్లు తాజ్మహల్ వద్ద డ్రోన్ ఎగరడం గుర్తించామని హైసెక్యూరిటీ జోన్లో వీటిని ఎగరవేయడం నేరమని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆ పర్యాటకుడిని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీకి కూడా తెలిపామన్నారు. -
హైకోర్టులో పుస్తకాల చోరీ
♦ నిందితుడు న్యాయవాదే.. ♦ పట్టించిన సీసీ కెమెరాలు హైదరాబాద్: హై సెక్యూరిటీ జోన్ అయిన హైకోర్టు నుంచే పుస్తకాలు అపహరించాడో దొంగ. రంగంలోకి దిగిన చార్మినార్ పోలీసులు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. అక్కడ పనిచేస్తున్న న్యాయవాదే ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల సాక్షిగా తేలింది. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ వి.సత్యనారాయణ వివరాలు తెలిపారు. కాకినాడకు చెందిన కుంటల గంగవేణు గోపాలకృష్ణ (49) 2012 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తనకు పెద్ద కేసులు రాకపోవడం... వీటికి తోడు లా బుక్స్ కూడా లేకపోవడంతో కేసుల కోసం వినియోగదారులెవరూ ఇతని వద్దకు వచ్చేవారు కాదు. దీంతో కోర్టు హాల్లోని న్యాయశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను గత 9 నెలల నుంచి దొంగిలిస్తున్నారు. పుస్తకాలు పోతున్న విషయం తెలుసుకున్న న్యాయమూర్తులు ఈ విషయమై చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు హైకోర్టులోని సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం బయటపడింది. దీంతో ఈ నెల 20న పోలీసులు నిందితుడు గోపాలకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా.. 144 పుస్తకాలు దొంగిలించినట్లు అంగీకరించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.