చారిత్రక కట్టడంగా గురజాడ గృహం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
విజయనగరం కంటోన్మెంట్: నవయుగ వైతాళికుడిగా ఖ్యాతిగాంచిన గురజాడ నివసించిన గృహాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది.
విజయనగరంలోని గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, ఆ గృహ సముదాయాన్ని పురావస్తు కట్టడంగా గుర్తిస్తున్నట్టు పురావస్తు, మ్యూజియం శాఖ శనివారం ప్రకటించింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జీఓ నంబర్-8ను విడుదల చేశారు. దీని ప్రకారం గురజాడ గృహాన్ని చారిత్రక కట్టడంగా, పురావస్తు ప్రదేశంగా గుర్తిస్తూ గెజిట్ పబ్లికేషన్ను విడుదల చేయనున్నారు.