Husband kill
-
భర్తను అంతమొందించిన భార్య
మాలూరు : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. ఈ ఘటన శనివారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని షిమోగ జిల్లా మాలూరులోని మారుతీకాలనీకి చెందిన మహేంద్ర(23)ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. తల్లి, తండ్రితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. 8 నెలల క్రితం పట్టణంలోని గాంధీ సర్కల్లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి కుమార్తె పూజాను వివాహం చేసుకున్నాడు. చదువకునే రోజుల్లో ప్రేమించిన సంపత్తో పూజా వివాహేతర సంబంధం కొనసాగించింది. మహేంద్ర లేని సమయంలో సంపత్ వచ్చి వెళ్లేవాడు. శనివారం మహేంద్ర ఆటో తీసుకుని బయటకు వెళ్లగా అతని తల్లిదండ్రులు వేరే ఊరు వెళ్లారు. ఈ సమయంలో సంపత్ పూజా ఇంటికి వచ్చాడు. రాత్రి 10 గంటల సమయంలో మహేంద్ర ఇంటికి రాగా పూజా సంపత్ను మంచం కింద దాచి ఉంచింది. భర్త భోజనం చేసి పడుకున్న తరువాత సంపత్, పూజా కలిసి మహేంద్రను మారణాయుధాలతో దాడి జరిపి హత్య చేశారు. అనంతరం సంపత్ పరారు అయ్యాడు. ఈ ఘటన ఆదివారం వెలుగు చూడటంతో మాలూరు సీఐ రాఘవేంద్రన్, ఎస్ఐ చేతన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పూజాన అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
అర్ధంతరంగా శవదహనం నిలిపివేత
భర్త మృతిపై భార్య అనుమానం కశింకోట, న్యూస్లైన్: భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్థంతరంగా శవదహనాన్ని నిలిపి వేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసింగబిల్లికి చెందిన కోన నూకినాయుడు(70) మాణిక్యం దంపతులు. స్పర్ధలు రావడంతో భర్తతో విడిపోయి మాణిక్యం దూరంగా ఉంటోంది. దీంతో నూకినాయుడు ఏకైక కుమార్తె సత్యవేణిని పెంచి, పెళ్లి చేశారు. అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 2011లో పక్షవాతం వచ్చి నూకినాయుడు మంచాన పడటంతో తన పేరున ఉన్న ఎకరం భూమిని కుమార్తె పేరున రాసిచ్చారు. విషయం తెలియడంతో భార్య కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నూకునాయుడు శనివారం మృతి చెందారు. దహనసంస్కారాలకు తీసుకెళుతుండగా శవాన్ని చూపాలని మాణిక్యం అడ్డుకోగా ఇది సంప్రదాయం కాదంటూ బంధువులు దహనసంస్కారాలు జరిపించారు. దీంతో భర్త మృతిపై అనుమానాలున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ కె.రమామణి ఆధ్వర్యంలో కాలుతున్న శవాన్ని నీటితో ఆర్పించి, పోస్టుమార్టం నిర్వహించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు.