huts burnt
-
బుగ్గిపాలైన మురికివాడ: 700 గుడిసెలు మంటల్లో..
గుర్గావ్: ఒక గుడిసెలో చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల వ్యవధిలో మురికివాడంతా వ్యాపించాయి. దీంతో ఆ వాడలో ఉన్న 700 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి బస్తీవాసులు తృటిలో తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. కాకపోతే వారి నిత్యావసరాలు.. సామగ్రి, దాచుకున్న సొమ్మంతా బుగ్గిపాలయ్యాయి. దీంతో వారంతా రోడ్డుపై పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. హరియాణాలోని గుర్గావ్ సమీపంలో ఉన్న నాథూపుర మురికివాడలో శనివారం తెల్లవారుజామున ఓ పూరి గుడిసెలో మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పేలోపు పక్కనే ఉన్న మరో గుడిసెకు ఆ విధంగా గుడిసె గుడిసెకు అంటుకుంటూ ఏకంగా 700 గుడిసెలు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గుడివాసులు వాటికి దూరంగా వచ్చారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గంటన్నర పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు. गुड़गांव डीएलएफ फेज 3 नाथूपुर मैं 200 झुग्गियों में आग लगने से 200 गरीब परिवार बेघर हो गए आज रात 3:00 बजे pic.twitter.com/Pzuoz6vNCN — Vikash Singh (@VikashS23800552) April 2, 2021 -
అగ్నిప్రమాదంలో వంద గుడిసెలు దగ్ధం
యాదగిరిగుట్ట: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వంద గుడిసెలకు పైగా కాలి బూడిదయ్యాయి. యాదగిరిగుట్టలో సాయిపవన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ కంపెనీలో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశాకు చెందిన కూలీలు పనులు జరిగే సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం కూలీలు పనిలోకి వెళ్లగా ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు సమీపంలో ఉన్న వందకుపైగా గుడిసెలకు వ్యాపించాయి. అప్రమత్తమైన కూలీలు మంటలను కంపెనీ వాహనాల సహాయంతో నీళ్లు తెచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
షార్ట్సర్క్యూట్తో 35 గుడిసెలు దగ్ధం
సీతానగరం (తూర్పుగోదావరి జిల్లా): షార్ట్సర్యూట్ కారణంగా 35 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కూలీలందరూ ఊరి చివరలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కాగా, బుధవారం అందరూ కూలీ పనులకు వెళ్లిన సమయంలో షార్ట్సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో గుడిసెలన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం సంభవించిందని రెవిన్యూ అధికారులు తెలిపారు.