breaking news
Indigo company
-
పరువు విమానం పాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్ర మంత్రి, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అప్రతిష్ట పాలయ్యారు. రామ్మోహన్ నాయుడు తన వాగ్ధాటితో ఇన్నేళ్లు నెట్టుకువచ్చారు. వీటిపైనే సామాజి క మాధ్యమాల్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలివేషన్ వీడియోలు చేసి బిల్డప్లు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన పరిణామాలు మాత్రం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడిని అభాసుపాలు చేశాయి. ఆయనకు ఎంత ఎలివేషన్ ఇస్తున్నారో అంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తోంది.రామ్మోహన్నాయుడు హయాంలో భారత విమానయాన శాఖ గౌరవానికి మచ్చ వచ్చి పడింది. జాతీయ, అంతర్జాతీయ విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికుల శాపనార్థాలతో విమానాశ్రయాలు గగ్గోలు పె డుతున్నాయి. గత ఐదు రోజులుగా విమాన సర్వీ సులు రద్దువుతున్నా ఏం చేయలేకపోయారని ప్రయాణికులు కేంద్ర మంత్రిపై మండిపడుతున్నారు. అత్యవసర ప్రయాణం చేయాల్సిన వారు, షెడ్యూల్ ప్రకారంగా వెళ్లాల్సిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదీ చదవండి: Indigo crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్ఇండిగో విమానాలు అకస్మాత్తుగా నిలిచిపోవడం, 1000కి పైగా విమానాల సేవలు రద్దు కావడంతో, వాటిలో ప్రయాణించాల్సిన ప్రయాణికులంతా లబోదిబోమంటున్నారు. కేంద్ర మంత్రిపైన, చివరికి కేంద్రప్రభుత్వంపైన ప్రయాణికులంతా ధ్వజమెత్తుతున్నారు. దేశంలో ఇండిగో విమానాల రాకపోకలు నిలిచిపోవడం అతి పెద్ద ప్రయాణ సంక్షోభంగా చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రమంత్రిగా పరిష్కరించలేకపోయారని, సంక్షోభాన్ని డీల్ చేయలేకపోయారని విమర్శలకు గురవుతున్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం మాటలు చెప్పినంత సులువు కాదని విమాన ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.అంతకుముందు కూడాకేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అంతకుముందు కూడా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఈ ఏడాది జూన్లో అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో కూలిపోయిన సమయంలో ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు వీడియో తీశారు. దానికి బ్యాగ్రౌండ్ మ్యూ జిక్ జత చేసి పోస్టు చేయడంతో అది కాస్తా వివాదాస్పదమైంది. విషాద సమయంలో ఇలాంటి పనులేంటని నెటిజన్లు ధ్వజమెత్తారు. మంత్రి తీరుపై దేశమంతా చర్చ జరిగింది. -
విమానాల రద్దుపై.. ఇండిగో CEO వివరణ
-
ఇండిగో తెచ్చిన సంక్షోభం
దేశీ పౌరవిమానయాన రంగంలో 66 శాతం వాటాతో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో సంస్థ... తమ జోలికెవరూ రాకూడదన్న రీతిలో వ్యవహరించిన తీరు వల్ల శుక్రవారం వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చు కానీ.. నిర్దిష్టంగా ఎంతన్నది సంస్థ వెల్లడించలేదు. బుధ, గురు వారాల్లోనూ వెయ్యికి పైగా విమానాలు రద్దు కావటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పైలట్ల డ్యూటీ, విశ్రాంతికి సంబంధించి పౌరవిమానయాన సంస్థ (డీజీసీఏ) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం ఇష్టంలేక... విమానాలు రద్దుచేసి ప్రయాణికుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా డీజీసీఏను దిగివచ్చేలా చేయాలన్న ఇండిగో వ్యూహం నెరవేరినట్లే అనుకోవాలి.వేల విమానాలు రద్దవుతుండటంతో చివరకు డీజీసీఏ దిగివచ్చింది. నిబంధనలను తాత్కాలికంగా సడలిస్తామని, విమానాలు పూర్తిస్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోను అభ్యరి్థంచింది. ఇండిగో దీనికి ఒప్పుకుంటూనే... తాము మార్గదర్శకాలను లైట్ తీసుకున్నామని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని, డీజీసీఏ సడలింపులిచ్చింది కనక త్వరలో పరిస్థితి చక్కబడుతుందని అధికారికంగా ప్రకటించింది. ఏ రంగంలోనైనా ఒకటిరెండు సంస్థలే గుత్తాధిపత్యం చెలాయిస్తే ఏమవుతుందన్నది ఇండిగో ఉదంతం మరోసారి నిరూపించినట్లయింది. పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించి... పైలట్లు్ల విరామంలేకుండా విమానాలను వేల కిలోమీటర్ల దూరాలు నడుపుతున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిసు్కలో పడుతున్నారని భావించి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని 2024 జనవరిలోనే విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనల్లో 15 నిబంధనలు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రాగా... పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించిన మిగతా 7 నిబంధనలు ఈ నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వారానికి 12 గంటలుగా ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచడం, రాత్రి వేళ ఏ పైలట్ కూడా రెండుకు మించి ఎక్కువ ల్యాండింగ్లు చేయకూడదని విధించిన నిబంధనలను పాటించటం వల్ల మరింతమంది సిబ్బంది కావాల్సి వస్తారని ఇండిగో భావించింది.అందుకే ఈ నిబంధనల్ని అడ్డం పెట్టుకుని నవంబరులో ఏకంగా 1,200పైగా విమానాలను రద్దు చేసింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి కూడా. అయితే దేశవ్యాప్తంగా ఇండిగో నెలకు 60వేలకు పైగా సర్వీసులను నడిపిస్తోంది. కాబట్టి 1,200 రద్దుతో పెద్ద తేడా రాలేదు. కానీ ఈ నెల 3న ఒకేరోజు 500కు పైగా విమానాలు రద్దు కావటం... 4న అది కొనసాగటం...5న తీవ్రమవటంతో సంక్షోభం ఒక్కసారిగా బద్దలయింది. అయ్యప్పభక్తుల శబరిమల యాత్ర మొదలు శీతాకాల పర్యటనలకు వెళ్లే సందర్శకులు, అత్యవసర పనుల నిమిత్తం విమానప్రయాణాలను ఎంచుకునే లక్షలాది మంది జనం తాము ఎక్కే విమానం అసలు బయల్దేరుతుందో లేదో... రద్దయితే రిఫండ్ ఎప్పుడొస్తుందో తెలీక తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదే అదునుగా ఇతర కంపెనీలు అత్యధిక ధరల మోత మోగించడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇండిగోకు ఈ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. 10 రోజుల్లో పరిస్థితి అదుపులోకి! నిబంధనావళిని సడలించటంతో ఎక్కువ మంది పైలట్లు అందుబాటులోకి వచ్చి విమానాల రద్దుకు తెరపడుతుందని, మరో 10 రోజుల్లో అంతా సర్దుకుంటుందని, డిసెంబర్ 10–15 తేదీకల్లా సాధారణ స్థాయిలో విమానాల రాకపోకలు ఉంటాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ శుక్రవారం ప్రకటించారు. నిబంధనలను తక్కువగా అంచనావేశాం. క్షమించమని కూడా కోరారాయన. శనివారం నుంచి పరిస్థితిలో మార్పురావొచ్చునన్నారు. ప్రధాన ఎయిర్పోర్ట్లలో అంతా గందరగోళంశుక్రవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి షెడ్యూల్ చేసిన మొత్తం 235 దేశీ సర్విసులను ఇండిగో రద్దుచేసింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు అప్పటికే వచ్చిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని ఎయిర్పోర్టుల్లో ఇండిగో కౌంటర్ల వద్ద సిబ్బంది కనిపించలేదు. ఇచ్చేసిన లగేజీలను వెనక్కి తెచ్చుకోవడం, మరో కంపెనీ విమానాన్ని బుక్ చేసుకోవడం, గత విమాన టికెట్ రీఫండ్ కోసం ప్రయతి్నంచడం ఇలా పలు రకాల బాధలు పడుతున్నారు.డిమాండ్ పెరగటంతో పోటీ సంస్థలు ధరలు పెంచేశాయి. ప్రధాన రూట్లలో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.లక్ష దాటేసిందని సోషల్ మీడియా హోరెత్తింది. ధరలు అమాంతం పెరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, డీజీసీఏ చేసిన సూచనలను విమానయాన సంస్థలు పట్టించుకోలేదు. ఎయిర్పోర్టుల్లో తాము పడుతున్న అవస్థలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో నెటిజర్లు ఇండిగో తీరుపై మండిపడటం కనిపించింది. తప్పు ఇండిగోదే: ఆర్.శివరామన్ డైరెక్టర్లు, ఇండిపెండెంట్ డైరెక్టర్లతో ఇండిగోలో చాలా పెద్ద వ్యవస్థ ఉందని, వారిలో ఎవ్వరూ కూడా ఈ పరిస్థితిని ఊహించకపోవటం, దానిగురించి ముందుగా చర్చించకపోవటం అత్యంత దారుణమని మాజీ డీజీసీఏ ఆర్.శివరామన్ చెప్పారు. వారు తక్షణం రాజీనామా చేయాల్సి ఉందన్నారు. రెండేళ్ల కిందటనే నిబంధనలు వెలువరించినా... దాన్ని పాటించాల్సిన డెడ్లైన్ దగ్గర పడుతున్నా... అందుకు తగ్గ చర్యలను తీసుకోవటం ఇండిగో బాధ్యతారాహిత్యం తప్ప వేరేమీ కాదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటిదాకా దీన్ని గమనించకపోవటం, ఎప్పటికప్పుడు సమీక్షించకపోవటం డీజీసీఏ తరఫున తప్పిదాలేనని అంగీకరించారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ కీలక నిబంధనల సడలింపు ఇండిగోలోని ఏ320 రకం విమానాలకు సంబంధించిన ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ శుక్రవారం సడలించింది. ముఖ్యంగా అధిక విశ్రాంతి వెసులుబాటుతో విధుల నుంచి విరామం తీసుకున్న పైలట్లను వెంటనే విధులకు హాజరయ్యేలా డీజసీఏ తన నిబంధనలకు సడలింపునిచ్చింది. అంటే వారపు విరామంలో భాగంగా పైలట్లు సమరి్పంచే సెలవు అభ్యర్థనలను తిరస్కరిస్తారు. దీంతో ఎక్కువ మంది పైలట్లు అందుబాటులోకి వస్తారు. గతంలో వారానికి రెండు రోజులే నైట్ డ్యూటీలు వేసేవారు. ఇప్పుడు గరిష్టంగా ఆరు సార్లు నైట్డ్యూటీలు చేయొచ్చు.పైలట్లు అందుబాటులోకి వచ్చి రాత్రిపూట సైతం విమానాల రాకపోకలు పెరుగుతాయి. దీంతో విమానాల క్యాన్సిలేషన్ రేటు తగ్గుతుంది. వెనువెంటనే రెండురోజులు నైట్డ్యూటీలు చేయకూడదనే నిబంధననూ సడలించారు. ‘‘విమానాల రాకపోకలు కొనసాగేలా నిబంధనలను సడలించాం. అంతేగానీ భద్రతానిబంధనల్లో ఎలాంటి సడలింపు లేదు. సరిపడా పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు సూచించాం’’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.నిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ షురూ.. మొత్తం ఉదంతంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బ్రాహ్మణి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్లు కపిల్ మాంగ్లిక్, రాంపాల్లతో డీజీసీఏ ప్యానెల్ను ఏర్పాటుచేసింది. సమస్యకు కారణాలను అన్వేషించి, కారకులెవరో నిగ్గుతేల్చి 15 రోజుల్లోపు డీజీసీఏకు ఈ ప్యానెల్ నివేదిక సమరి్పంచుంది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలనూ ప్యానెల్ సూచించనుంది. అయితే నవంబర్ నుంచే సరిపడా పైలట్లను అందుబాటులో ఉంచుకోకపోవడం, నిర్వహణ, షెడ్యూలింగ్, ప్రణాళికా లోపాలు సైతం సమస్యను పెనువిపత్తుగా మార్చేశాయని ప్యానెల్ ప్రాథమికస్థాయిలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. శీతాకాల సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన రద్దీకి తగ్గట్లు పైలట్లు అందుబాటులో చూడాలని పైలట్ల సంఘాలకు సైతం డీజీసీఏ విజ్ఞప్తిచేసింది.మరోవైపు అధిక విమానాల రద్దుతో నడిచిన ఆ కొద్దీ విమానాలూ ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుండటంతో వాటి సమయపాలనా రేటు (ఓటీపీ) గురువారం దారుణంగా 8.5 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆకాశా ఎయిర్ 63 శాతం, ఎయిర్ఇండియా 61 శాతం, ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ 58.6 శాతం, స్పైస్జెట్ 56.4, అలయన్స్ ఎయిర్ 56 శాతం ఓటీపీ సాధించడం గమనార్హం.డీజీసీఏ ఫెయిల్యూర్ కూడా...వాస్తవానికి నిబంధనలు విడుదల చేసిన డీజీసీఏ... దాన్ని పాటించడానికి తగ్గ ఏర్పాట్లు ఎయిర్లైన్స్ సంస్థలు చేసుకుంటున్నాయో లేదో ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కానీ డీజీసీఏ అలాంటివేమీ చేయలేదు. చివరకు రెండునెలల కిందట ఆలిండియా పైలట్ల సంఘం నేరుగా డీజీసీఏను కలిసి... ఇండిగోలో ఎలాంటి ఏర్పాట్లూ చేయటం లేదని, నిబంధనలు గనక కఠినంగా అమల్లోకి తెస్తే సంక్షోభం రావచ్చని తెలియజేస్తూ వినతిపత్రం కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు శామ్ థామస్ స్వయంగా చెప్పారు. కానీ డీజీసీఏ దీన్ని లైట్ తీసుకుంది. నిబంధనలు అమల్లోకి వస్తే అంతా సర్దుకుంటుందని భావించింది.దీన్ని గమనించిన ఇండిగో... నవంబరు నుంచి కొత్త నిబంధనలు పాటిస్తూ తన పైలట్లకు విశ్రాంతినివ్వటం ఆరంభించింది. కానీ వాళ్ల స్థానంలో వేరొకరిని డ్యూటీలో పంపలేదు. ఎందుకంటే అంతమంది పైలట్లు లేరు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడపటం... కొన్నిటిని రద్దు చేయటం ఆరంభించింది. చివరికి గడిచిన మూడురోజుల్లో ఈ రద్దుల పర్వం పతాక స్థాయికి చేరింది. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని, దానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని శామ్ థామస్ వ్యాఖ్యానించటం ఈ సందర్భంగా గమనార్హం. -
ఇండిగో నిర్వహణ బాగోలేదు.. సొంత సంస్థపై ఉద్యోగుల షాకింగ్ ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రామాణిక నిర్వహణ విధానాలను ఇండిగో సరిగ్గా పాటించడం లేదని ఆ సంస్థలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఆరోపించారు. దీని వల్ల ప్రయాణికుల భద్రత రిస్క్లో పడుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆల్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్స్ జులై 12న విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్కు లేఖ రాశారు. ఇండిగో విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఎయిర్బస్కు వారు విజ్ఞప్తి చేశారు. 'మీరు విమానాలకు లీజుకు ఇచ్చిన ఆపరేటర్లు నిర్వహణ ప్రమాణాలను పాటించడం లేదు. గత నాలుగు రోజులుగా సాంకేతిక సిబ్బంది స్ట్రయిక్ చేస్తున్నారు. అయినా సరైన నిర్వహణ లేకుండానే విమానాలు నడుస్తున్నాయి. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గత ఏడు రోజులకు సంబంధించిన నిర్వహణ డాటాను ఆపరేటర్లను అడగండి. సరైన నిర్వహణ లేకపోతే ఆ సంస్థల వల్ల మార్కెట్లో మీ కంపెనీకి కూడా చెడ్డపేరు వస్తుంది. మీ విమానాల నిర్వహణ ప్రమాణాలను వారు దిగజార్చారు. ఈ విషయంపై మీరు వాళ్లని నేరుగా ప్రశ్నించండి.' అని సాంకేతిక నిపుణులు ఎయిర్బస్కు లేఖ రాశారు. అయితే, ఈ ఆరోపణలను ఇండిగో కొట్టిపారేసింది. విమాన నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది. అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. ఇవి నిరాధార ఆరోపణలని, కొందరు దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇండిగో సాంకేతిక నిపుణులు లేఖ రాసిన ఐదు రోజులకే ఆ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం సాంకేతిక కారణాలతో పాకిస్థాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ఈ లేఖ చర్చనీయాంశమైంది. చదవండి: కరాచీ ఎయిర్పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో
CEO of IndiGo Ronojoy Dutta has expressed regret: దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన పై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్ వీల్ చైర్ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులే మన సమాజానికి నిజమైన హీరోలు అని అన్నారు. ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటన గురించి దత్తా మాట్లాడుతూ..."మా కస్టమర్లకు మర్యాదపూర్వకంగా, దయతో కూడిన సేవను అందించడమే మాకు ముఖ్యం. ఐతే భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ సిబ్బంది విమానం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై క్లిష్టమైన పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సంస్థగా సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయం తీసుకుందనే నేను భావిస్తున్నాను". అని అన్నారు. అంతేకాదు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఘటన తాలుకా వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. Here is the video of the incident that happened at Ranchi airport where @IndiGo6E airlines denies boarding to a special need child along with his child. Seems lack of empathy from Indigo staff, not the first time though. Indigo to issue a statement shortly. @JM_Scindia https://t.co/5ixUDZ009a pic.twitter.com/SyTNgAQIT6 — Dibyendu Mondal (@dibyendumondal) May 8, 2022 (చదవండి: ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింథియా ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్) -
నేడు కర్నూలు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం
-
నేడు కర్నూలు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం
కర్నూలు(సెంట్రల్): విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆదివారం కర్నూలు నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి. ముందుగా కర్నూలు నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక ఇండిగో సంస్థకు చెందిన విమానం(6ఈ7911) బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం 09.05కి బయల్దేరి 10.10కి కర్నూలుకు చేరుకుంటుంది. కర్నూలు నుంచి 6ఈ7912 అనే నంబర్ కలిగిన విమానం ఉదయం 10.30కి బయల్దేరి మధ్యాహ్నం 12.40కి విశాఖ చేరుకుంటుంది. అలాగే 6ఈ7913 అనే నంబర్ కలిగిన మరో విమానం విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి కర్నూలుకు 2.55కి చేరుకుంటుంది. 6ఈ7914 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి మధ్యాహ్నం 3.15కి బయల్దేరి సాయంత్రం 4.25కి బెంగళూరు చేరుకుంటుంది. 6ఈ7915 అనే నంబర్ కలిగిన విమానం చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50కి బయల్దేరి కర్నూలుకు 4.10కి, 6ఈ7916 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి సాయంత్రం 4.30కి బయలుదేరి చెన్నైకి 5.50కి చేరుకుంటుంది. కాగా, ప్రయాణికుల నుంచి కూడా స్పందన బాగుంది. బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చేందుకు 52 మంది, కర్నూలు నుంచి విశాఖ వెళ్లేందుకు 66 మంది, విశాఖ నుంచి కర్నూలుకు 31 మంది, కర్నూలు నుంచి బెంగళూరుకు 63 మంది, చెన్నై నుంచి కర్నూలుకు 16 మంది, కర్నూలు నుంచి చెన్నైకి 32 మంది బుక్ చేసుకున్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 3 వరకు విమాన ప్రయాణం చేసేందుకు బుక్ చేసుకున్న వారి వివరాలను ఇండిగో ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అలాగే విమాన టికెట్ల ధరలు ప్రస్తుతం కర్నూలు–బెంగళూరు మధ్య రూ.2,077, చెన్నైకి రూ.2,555, విశాఖకు రూ.3,077గా ఉన్నాయి. -
ఇండిగో ఐపీఓకు ఆమోదం
న్యూఢిల్లీ: చౌక ధరల్లో విమానయాన సర్వీసులందజేసే ఇండిగో సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో రూ.2,500 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,272 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. మరోవైపు ప్రస్తుతమున్న వాటాదారుల వద్దనున్న 3 కోట్ల షేర్లను కూడా ఇంతే మొత్తానికి ఈ ఐపీఓ ద్వారా ఆఫర్ చేయాలని ఇండిగో భావిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ ఏడాది జూన్లోనే ఇండిగో సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓకు సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ, బార్క్లేస్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. దేశంలో లాభాలార్జిస్తున్న రెండు విమాన యాన సంస్థల్లో ఇండిగో ఒకటి కాగా, రెండోది గో ఎయిర్.


