-
Amrutha Pranay: ఇన్స్టాగ్రామ్ లో పేరు మార్చిన అమృత
-
అవార్డ్ అందుకున్న సుకుమార్ భార్య.. వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు!
డిఫరెంట్ లుక్స్తో ఆదా శర్మ హోయలు..ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసిన కత్రినా కైఫ్..అవార్డ్ అందుకున్న తబిత సుకుమార్..వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు..వేకేషన్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ నీలం ఉపాధ్యాయ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
Karimnagar: ఫుట్పాత్పై వ్యాపారం.. రీల్స్తో క్రేజ్! సినిమాల్లోనూ ఆఫర్లు!
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్లోని భగత్నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్పాత్పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్స్ట్రాగామ్లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది. View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) -
పెళ్లి కూతురిలా మీనాక్షి చౌదరి.. బ్లూ శారీలో బిగ్బాస్ బ్యూటీ!
బెంగళూరు ఈవెంట్లో డాకు మహారాజ్ బ్యూటీ..పెళ్లి కూతురిలా ముస్తాబైన మీనాక్షి చౌదరి...బ్లూ శారీలో బిగ్బాస్ బ్యూటీ హరితేజ..తమిళంలో మొదటి ఆడిషన్ ఫోటోలు పంచుకున్న డ్రాగన్ బ్యూటీ..ప్రకృతి ఆస్వాదిస్తోన్న టాలీవుడ్ నటి శివాని రాజశేఖర్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
బ్లూ శారీలో హెబ్బా.. స్విమ్మింగ్పూల్లో కత్రినా కైఫ్!
బ్లూ శారీలో మెరిసిపోతున్న హెబ్బా పటేల్..స్విమ్మింగ్ పూల్లో కత్రినా కైఫ్ చిల్..మజాకా హీరోయిన్ రీతూ వర్మ స్మైలీ లుక్స్...శారీలో అనుపమ పరమేశ్వరన్ ట్రెండీ లుక్..శారీ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
చంద్రముఖిలా మారిపోయిన బిగ్బాస్ బ్యూటీ.. బాలిలో విష్ణుప్రియ చిల్!
చంద్రముఖిలా మారిపోయిన బిగ్బాస్ బ్యూటీ సోనియా ఆకుల..బాలిలో చిల్ అవుతోన్న బిగ్బాస్ భామ విష్ణుప్రియ..పెళ్లి కూతురిలా ముస్తాబైన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్..మాల్దీవుస్లోనే ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్..బీచ్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి సురేఖవాణి..గ్రీన్ శారీలో ప్రియమణి పోజులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) -
మాల్దీవుస్లో సాక్షి అగర్వాల్ చిల్.. దుబాయ్లో కాజల్ బ్యూటీ!
ఊప్స్ అబ్ క్యా అంటోన్న శ్వేతా బసు ప్రసాద్..గొడ్డలి చేతపట్టిన సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్..మాల్దీవుస్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్..మహాకుంభ్ మేళాలో పవిత్రం స్నానం చేసిన నిమ్రత్ కౌర్..పార్టీలో ఫుల్గా చిల్ అవుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత..దుబాయ్ టూర్లో కాజల్ అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Pragya Kapoor (@pragyakapoor_) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
జిమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ.. పుష్ప నటి లేటేస్ట్ లుక్స్!
జిమ్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..పుష్ప నటి కరణం పావని లేటేస్ట్ ఫోటో లుక్స్..టూర్లో చిల్ అవుతోన్న బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి..భూమిక చావ్లా లేటేస్ట్ ఫోటో షూట్..గ్రీన్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు...సైకిల్ నేర్చుకుంటోన్న ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.అయితే ఈ సినిమా ఎంత హిట్టయిందో.. అదే రేంజ్లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నాడు. తెరపై బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్లతో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.బుల్లిరాజు తండ్రి విజ్ఞప్తి..అయితే బుల్లి రాజు ఫేమ్ను కొందరు సోషల్ మీడియా వేదికగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రేవంత్ భీమాల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ బాలుడి తండ్రి బి శ్రీనివాసరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా మా అబ్బాయి పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ ప్రమోషన్స్ కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. రేవంత్ పేరిట కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని తెలిపారు. ఏదైనా అధికారిక ప్రకటన ఆ అకౌంట్ నుంచే తెలియజేస్తామన్నారు. అంతేకాదు రేవంత్ పేరిట ఎలాంటి ఫేస్బుక్, ఎక్స్, అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్స్ లేవని తెలిపారు. దయచేసి మా అబ్బాయిని వివాదాల్లోకి లాగొద్దని కోరారు. అంతేకాకుండా రాజకీయాలతో ముడిపెట్టవద్దని శ్రీనివాసరావు ఇన్స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by 𝕽𝖊𝖛𝖆𝖓𝖙𝖍@𝕭𝖚𝖑𝖑𝖎𝖗𝖆𝖏𝖚. (@revanth_bhimala) -
మనాలిలో బిగ్బాస్ బ్యూటీ దివి.. బ్లూ డ్రెస్లో హీరోయిన్ కృతి కర్బందా!
మనాలిలో బిగ్బాస్ బ్యూటీ దివి చిల్..బ్లూ డ్రెస్లో హీరోయిన్ కృతి కర్బందా..పింక్ శారీలో మెరిసిపోతున్న మోనాల్ గజ్జర్..దుబాయ్లో ఎంజాయ్ చేస్తోన్న వితికా శేరు..బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
రీల్స్ పిచ్చి..! బాలికను రెండుసార్లు వివాహం భార్గవ్
సీతమ్మధార: సెల్ఫోన్లకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్న రోజులివి. రీల్స్ పిచ్చి ఓ మైనర్ తల్లిదండ్రులను తలెత్తుకోకుండా చేస్తే..మరో యువకుడ్ని కటకటాలపాల్జేసింది. ఫోర్త్టౌన్ పోలీసు స్టేషన్లో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వివరాలు..తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన 15 ఏళ్ల బాలికకు రీల్స్ అంటే పిచ్చి..నిత్యం రీల్స్ చేయడం..వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేయడం అలవాటు. ఈ క్రమంలో సమీప ఇంట్లో ఉంటున్న భార్గవ్..బాలిక చేసిన రీల్స్ చూసి లైక్ కొట్టాడు. క్రమంగా ఇన్స్టాలోనే పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తనకు రీల్స్ చేయాలని ఉందని, దానికి సహకరించాలని బాలికను కోరాడు. లేదంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇటీవల కై లాసపురం కొండమీద గల వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలుసుకున్నారు. జనవరి 9వ తేదీన మళ్లీ అదే ప్రదేశంలో కలుసుకుని బలవంతంగా బాలిక మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత కొద్ది రోజులకు మళ్లీ సదరు బాలికను సింహాచలం తీసుకువెళ్లి అక్కడ మరోమారి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫోర్త్ టౌన్ పోలీసులు భార్గవ్పై పోక్సో, బాల్యవివాహ నిరోధక చట్టం, ఎస్టీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. భార్గవ్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. శనివారం ఆ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసును ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాషన్ అవుట్ఫిట్లో హీరోయిన్ ప్రణీత..మరింత గ్లామరస్గా టిల్లు భామ నేహాశెట్టి..!
ఫ్యాషన్ అవుట్ఫిట్లో హీరోయిన్ ప్రణీత...లవ్ యాపా మూడ్లో బాలీవుడ్ భామ ఖుషీకపూర్...మరింత గ్లామరస్గా టిల్లు భామ నేహాశెట్టి..గేమ్ ఛేంజర్ హీరోయిన్ భర్త స్పెషల్ విషెస్..అలాంటి డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ బరుచ్చా.. View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
బీచ్లో అనన్య నాగళ్ల చిల్.. స్టన్నింగ్ లుక్లో సలార్ నటి!
బీచ్లో అనన్య నాగళ్ల చిల్..స్టన్నింగ్ లుక్లో సలార్ నటి శ్రియా రెడ్డి..పింక్ డ్రెస్లో సింగర్ మధు ప్రియ పోజులు..బ్లూ డ్రెస్లో కాజల్ అగర్వాల్ క్రేజీ అవుట్ఫిట్..లేటేస్ట్ పిక్ షేర్ చేసిన మిహికా బజాజ్.. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
వీడియో: వైద్యుడి రీల్స్ పిచ్చి.. ఆసుపత్రిలో మహిళ మృతి
లక్నో: ఓ వైద్యుడి రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలను తీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను రక్షించాల్సిన వైద్యులు సోషల్ మీడియా చూస్తూ బిజీగా ఉండటంతో సదరు మహిళ చనిపోయింది. సరైన సమయంలో వైద్యుడు స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోకి మైన్పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి(60) అనే మహిళకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని మహారాజా తేజ్సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డాక్టర్ ఆదర్శ్ సెంగార్ డ్యూటీలో ఉన్నారు. దీంతో, బాధితులు ఆదర్శ్ను సంప్రదించారు. దీంతో, ఓ నర్సును బాధితురాలి వద్దకు పంపి.. డాక్టర్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఫేస్బుక్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో మహిళ కుటుంబసభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఐదు నిమిషాల పాటు బాధతో విలవిలలాడిన బాధితురాలు సరైన వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.ప్రవేశ్ కుమారి మృతి చెందడంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డాక్టర్పై దాడి చేశారు. దీంతో ఆస్పత్రికి సిబ్బందికి, వారికి మధ్య వివాదం నెలకొంది. వైద్యం చేయమని పదే పదే అడిగినా తమ తల్లి ప్రాణం పోయేదాకా డాక్టర్ రీల్స్ చూస్తూ కూర్చున్నాడని మృతురాలి కుమారుడు గురుశరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ తల్లికి ఎందుకు వైద్యం చేయలేదని ప్రశ్నించినందుకు వైద్యుడు తమపై దాడి చేశాడని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) ఆధ్వర్యంలో సీసీటీవీని పరిశీలిస్తున్నామని.. ఆరోపణలు నిజమని తేలితే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వైద్యుడిపై చర్యలు తీసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.At the #Mainpuri district hospital in #UttarPradesh, a 60-year-old woman, #PraveshKumari, died of a heart attack while the doctor on duty, #DrAdarshSanger, allegedly watched reels on his mobile phone.The woman's family claims that crucial time was lost due to the doctor's… pic.twitter.com/ZGLcD5ZExg— Hate Detector 🔍 (@HateDetectors) January 29, 2025 -
వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావ్..
బనశంకరి: సోషల్ మీడియా గొడవల వల్ల ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తున్నారు. ఇన్స్టా గ్రామ్లో మరో యువతికి కాబోయే భర్త లైక్ కొట్టినందుకు యువతి అతన్ని మందలించింది. ఇది నచ్చని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా బంటా్వళ తాలూకా పూంజాకట్టి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుక్కిప్పాడి నివాసి చేతన్ (25) కాంతార మాదిరి దేవుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. కుందాపురలో చైతన్య అనే యువతి ఇన్స్టా లో పరిచయమైంది. స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 8 నెలల క్రితం ఇరువురికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 21వ తేదీన చేతన్ ఇన్స్టాలో మరో యువతి ఫోటోకు లైక్ కొట్టాడు. ఈ విషయమై ప్రశ్నించడానికి ప్రియురాలు చైతన్య, చేతన్ ఇంటికి వెళ్లింది. వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావని గొడవకు దిగింది. క్రమంగా తీవ్ర వివాదంగా మారింది. మనస్థాపం చెందిన చేతన్ వెంటనే పై గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. నీ కొడుకు నిద్రపోయాడని, పిలిచినా లేవలేదని చైతన్య కాబోయే అత్త పుష్పకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి చేరుకున్న చేతన్ తల్లి ఇంటి పై గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
వికసిస్తా.. విరుచుకుపడతా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు. ‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?అధికారులు ప్రొటోకాల్ పాటించాలికరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
ఇన్స్టా లవ్.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నార్త్జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్ యువరాజ్నాయక్(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు. గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ.. ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్నగర్ సీఐ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. మరో కేసు కూడా.. అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్ తెలిపారు. -
లేత వయసు.. వినని మనసు
రోజుల పరిచయానికి కన్నవారినే కాదనుకుంటున్నారు.. అంతా తమకే తెలుసునన్న భ్రమలో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక.. కనిపించేదంతా నిజమేమో అని రంగుల మాయలో పడుతూ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు.. చేతుల్లోని సెల్ ఫోన్ ఈ మైనర్ ప్రేమ వ్యథలకు వారథి అవుతుండగా.. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాలు వారిని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా బాలికలు ఈ విషయంలో సమిధలవుతున్నారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అడుగు బయటపెడితే ఎటు వెళ్లాలో దారులు కూడా సరిగ్గా తెలియని అమాయక మైనర్లను.. చేతిలో ఉన్న ఫోన్లు, అందులో ఉన్న పలు ఆన్లైన్ సైట్లు తప్పుదోవ పట్టేలా చేస్తున్నాయి. ఆయా సైట్లలోని రంగుల ప్రపంచం మాదిరిగానే వాస్తవ పరిస్థితులు కూడా ఉంటాయనే భ్రమలో మితిమీరిన పరిచయాలను పెంచుకుంటూ.. వారి జీవితాలను వారే అంధకారంగా మార్చుకుంటున్నారు. పదిహేనేళ్ల వయస్సులోనే ‘తప్పు’టడుగులు వేసి గర్భం దాల్చడం.. బిడ్డలను కని రోడ్డున పడి.. తమ కన్నవారికి తీరని గుండె ఘోషను మిగుల్చుతున్నారు. సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని మైనర్ బాలికలు, యువతులు ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ వంటి సైట్లలో పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారుతున్నాయి.⇒ సింగ్నగర్ లూనాసెంటర్ ప్రాంతానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని సమీపంలోని ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లి ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలుపగా అతగాడు ఆ నగ్నఫొటోలతో వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ⇒ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్లో పోస్ట్లు, వీడియోలను చూసి ఓ యువకుడికి దగ్గరైంది. వారిళ్లల్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా కలుసుకున్నారు. ఆ బాలిక మూడు నెలల తరువాత గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ⇒ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క సింగ్నగర్, నున్న రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోనే నెలలో నలభై కేసుల వరకూ బాలికలు అదృశ్యమయ్యారని, బాలికలు, యువతులపై లైంగిక దాడుల ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు, ఐసీడీఎస్, చైల్డ్లైన్ వంటి విభాగాలు బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలో వీరికి అవగాహన సదస్సులు నిర్వహించడం, పోలీసులతో ఈ చట్టాల గురించి బాలబాలికలకు అవగాహన కల్పించడం చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల ఇవి అరకొరగా జరుగుతున్నా ప్రభావం చూపడం లేదు. బాలికలపై లైంగిక దాడులు, అదృశ్య కేసులను నియంత్రించాలంటే వారిపై నిరంతర పర్యవేక్షణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా యుక్త వయస్సులో ఉన్న బాలబాలికల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారు స్కూల్కు, కాలేజ్కు, ట్యూషన్కు వెళ్తున్నారా.. లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తరచూ బాలికలకు సమాజంపై అవగాహన కల్పించడం, అప్రమత్తంగా ఉండి.. వారికి ఎప్పటికప్పుడు తోడుగా ఉండడం, వారితో ఎప్పుడూ స్నేహంగా నడుచుకోవడం.. ఫోన్లను దూరంగా ఉంచడం ద్వారా పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం తగ్గుతుందని మానసిక వైద్య నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచండి.. బాల బాలికలు తప్పుడు త్రోవలో వెళ్లేందుకు ప్రధాన కారణం సెల్ఫోన్లే. చిన్నపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం, ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్, ఓటీటీ వంటి వాటికి ఎడిక్ట్ అవ్వడం, చదువు, సంప్రదాయాలను తెలుసుకోకుండా రీల్స్ పేరుతో చిన్నవయస్సులోనే చెడు అలవాట్లన్ని నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు అతి గారాబం చేయకూడదు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కదలికలపై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ శాఖ తరఫున పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు, సెల్ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. – బీహెచ్ వెంకటేశ్వర్లు, సింగ్నగర్ సీఐ -
జిమ్లో ఆదిపురుష్ భామ.. పెళ్లి కూతురిలా అత్తారింటికి దారేది హీరోయిన్!
జిమ్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ కసరత్తులు..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ పిక్స్..మన్మధుడు హీరోయిన్ అన్షు లేటేస్ట్ లుక్స్..ఖుష్బు దంపతులతో పార్టీలో మెరిసిన మీనా..పెళ్లి కూతురిలా ముస్తాబైన అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
మెక్సికోలో తంగలాన్ భామ చిల్.. బాలిలో బిగ్బాస్ బ్యూటీ!
మెక్సికోలో చిల్ అవుతోన్న తంగలాన్ బ్యూటీ..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ లుక్..బేబీ జాన్ మూడ్లోనే కీర్తి సురేశ్..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..ఆజ్ కీ రాత్ అంటోన్న బిగ్బాస్ భామ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
కలర్ఫుల్ శారీలో హన్సిక.. సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్!
మూవీ షూట్లో బిజీగా సన్ని లియోన్..ఈవెంట్లో మెహరీన్ ఫిర్జాదా సందడి..కలర్ఫుల్ శారీలో హన్సిక పోజులు..ఖుషీ కపూర్ ఫ్యాషన్ డ్రెస్ లుక్స్..బుల్లితెర భామ తేజస్వినీ గౌడ్ లేటేస్ట్ పిక్స్..బిగ్ బాస్ బ్యూటీ దివి అలాంటి లుక్..పింక్ శారీలో సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
నుమాయిష్.. సోషల్ జోష్..
కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. సాధారణంగా నగరంలో కొత్తగా ప్రారంభించిన కేఫ్ అయినా లేదా ఏదైనా ఆసక్తికరమైన ఈవెంట్ అయినా, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో తక్షణమే ప్రత్యక్షమవుతుంది. అయితే వందల సంఖ్యలో వెరైటీ ఉత్పత్తులు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్టాల్స్.. ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సోషల్ జోష్ నింపుతోంది.. దీంతో వీరికి చేతినిండా పని పెడుతోంది. ఈ క్రమంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. హైదరాబాద్లోని నాంపల్లి మైదాన ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిన దుకాణాలతో, సందర్శకులతో కిటకిటలాడుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఐకానిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18, 2025 వరకూ సందర్శకులను అలరించనుంది. మరోవైపు ఈ 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ ఈసారి సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం అవుతోంది. విభిన్న రకాల కంటెంట్స్ చేసేందుకు వీలుండడంతో ఇది క్రియేటర్లకు గమ్యస్థానంగా మారింది. స్థానికులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఇష్టమైన హైదరాబాద్ ఐకానిక్ వార్షిక ఫెయిర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ప్రవాహానికి నిలయంగా మారింది.రోజుకొకటి.. అదే వెరైటీ.. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్.. ఒక్కో రోజును ఎగ్జిబిషన్లోని ఒక్కో విభాగాలకు అంకితం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక రోజు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ గురించి, మరొక రోజు సంప్రదాయ చేనేత స్టాల్స్ గురించి.. తర్వాతి రోజు రైడ్లు.. ఎంటర్టైన్మెంట్ జోన్లను ఇలా విభజిìæంచి చూపిస్తున్నారు. ఈ సమాచారం వీక్షకులకు వినోదాన్ని మాత్రమే కాకుండా నుమాయిష్ సందర్శనను ప్లాన్ చేయడంలో కూడా ఉపకరిస్తోంది. వీరి కంటెంట్కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. రీల్స్ కేరాఫ్గా.. ఆహార ప్రియుల సాహసాల నుంచి షాపింగ్ స్ప్రీల వరకూ.. ఫీడ్లో స్క్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో నుమాయిష్ షాపింగ్, ఆహార ఉత్పత్తులను మాత్రమే కాకుండా సృజనాత్మక సోషల్ మీడియా కంటెంట్ను కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని శరవేగంగా వ్యాపిస్తుండడంతో నుమాయిష్ రీల్స్, వీడియోలకు కేరాఫ్గా మారింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా నిర్వాహకులతో ఎగ్జిబిషన్ సందడిగా మారుతోంది.అడుగడుగునా కెమెరాలు.. నుమాయి‹Ùలోని కలర్ఫుల్ స్ట్రీట్స్ మీదుగా నడుస్తుంటే.. సందడిగా ఉన్న స్టాల్స్కు ముందు పలు కెమెరాలను అమర్చడాన్ని గమనించవచ్చు. ఇన్స్టా, లేదా యూట్యూబ్ ద్వారా ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్లోని ప్రతి మూలనూ కవర్ చేస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. లక్నో చికన్ కారీ స్టాల్స్ నుంచి కాశ్మీరీ షాపుల వరకూ నోరూరించే ఫుడ్ కోర్ట్ నుంచి వినోద ప్రదేశంలో థ్రిల్లింగ్ రైడ్ల వరకూ దేనికదే వెరైటీగా కినిపిస్తోంది. దీంతో మెటీరియల్కు కొరత లేకపోవడం వీరికి మరింత ఉత్తేజాన్ని అందిస్తోంది.క్రేజీగా..మెన్ ఎట్ నుమాయిష్?.. ఈ సంవత్సరం ‘మెన్ ఎట్ నుమాయిష్’ పేరుతో ఓ రీల్ ఇంటర్నెట్లో క్రేజీగా మారింది. మగవాళ్లు తమ కుటుంబాలతో కలిసి షాపింగ్ ట్రిప్లలో చురుకుగా పాల్గొంటున్నట్లు చూపే ఈ రీల్ వేగంగా వైరల్ అయ్యింది. ఈ రీల్కి ఇన్స్టాలో ఒక్క రోజులో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 75,000 పైగా లైక్లు రావడం విశేషం. షాపింగ్ బ్యాగ్లను మోసుకుంటూ భార్యల్ని అనుసరించే భర్తలు, పిల్లలను ఎత్తుకుని ఆడిస్తుంటే మహిళలు షాపింగ్లో మునిగిపోవడం.. రీల్ని సూపర్ హిట్ చేశాయి. -
కళ్లు చెదిరే ఇన్స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను, మరో చేతిలో ఫుట్బాల్ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్బాల్తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
థాయ్లాండ్లో ఆండ్రియా చిల్.. బీచ్లో తంగలాన్ బ్యూటీ మాళవిక
మహేశ్ బాబుతో సంక్రాంతి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..థాయ్లాండ్లో హీరోయిన్ ఆండ్రియా జెరేమా..బాలయ్యతో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా..బీచ్లో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..యాంకర్ రష్మీ గౌతమ్ సంక్రాంతి లుక్.. కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం హీరోయిన్ మంజరి..బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ హరితేజ View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) -
బీచ్ ఒడ్డున నివేదా.. బిగ్ బాస్ దివి చిల్
బీచ్ ఒడ్డున నివేదా థామస్..చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..యోగాసనాలతో బిజీగా మంచు లక్ష్మి..ఆధ్యాత్మిక యాత్రలో రేణు దేశాయ్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న కల్యాణి ప్రియదర్శన్..లండన్లో బాలీవుడ్ భామ నోరా ఫేతేహి.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ తన ఉద్యోగుల్లో దాదాపు ఐదు శాతం మందికి లేఆఫ్స్ ఇచ్చే ప్రణాళికలను ప్రకటించింది. ఉద్యోగులందరికీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ పంపిన అంతర్గత మెమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. పనితీరు నిర్వహణపై పరిమితిని పెంచాలని, తక్కువ పనితీరు కనబరిచేవారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు జూకర్ బర్గ్ మెమోలో పేర్కొన్నారు.‘కంపెనీ సాధారణంగా ఏడాది కాలంలో తక్కువ పనితీరు కనబరిచేవారిని ట్రాక్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. ఇప్పటికే 2024లో పనితీరు సరిగాలేని దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాం. ఈసారి మరో 5 శాతం మందిని ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది భవిష్యత్తులో 10 శాతానికి చేరుతుంది’ అని మెమోలో పేర్కొన్నారు.ప్యాకేజీ ఇస్తామని హామీసెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఈ కోతల వల్ల దాదాపు 3,600 ఉద్యోగులు ప్రభావితం చెందుతారని అంచనా వేసింది. పనితీరు సరిగాలేని వారిని తొలగించే స్థానంలో ఈ ఏడాది చివర్లో ఆయా ఖాళీలను భర్తీ చేయాలని కంపెనీ యోచిస్తోంది. బాధిత ఉద్యోగులకు ఉదారంగా సెవెరెన్స్ ప్యాకేజీ(లేఆఫ్స్ కారణంగా ఇచ్చే ప్యాకేజీ)లు అందిస్తామని జూకర్ బర్గ్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: సులభంగా రూ.కోటి సంపాదన!మిశ్రమ స్పందనకార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, సంస్థ భవిష్యత్తు ప్రాజెక్ట్లపై కృత్రిమ మేధ, స్మార్ట్ గ్లాసెస్, సోషల్ మీడియా వంటి కీలక విభాగాలపై దృష్టి పెట్టడానికి మెటా చురుకుగా పని చేస్తోంది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటనపై ఉద్యోగులు, పరిశ్రమ పరిశీలకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కంపెనీ సమర్థతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం అవసరమని కొందరు భావిస్తుండగా, మరికొందరు ఉద్యోగుల నైతిక స్థైర్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
నాలుగేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సోషల్ మీడియా ఇన్స్ట్రాగామ్లో చిగురించిన ప్రేమ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో కొత్త మలుపు తిరిగింది. ప్రియురాలు ప్రియుడు ఇంటి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరిన ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల వివరాలు ప్రకారం.. ఇల్లంతకుంట మండలానికి చెందిన రచన అనే యువతికి తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఇరువురు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో రచన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్న క్రమంలో ఆ విషయాన్ని సాగర్కు చెప్పి తనను వివాహం చేసుకోవాలని కోరింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించాలని కోరింది. అప్పటి నుంచి సాగర్ ముఖం చాటేశాడు. రచన ఫోన్ నంబర్ను బ్లాక్లో పెట్టి స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. ఆదివారం గండిలచ్చపేట గ్రామానికి చేరుకొని సాగర్ ఇంటి ఎదుట బైఠాయించింది. యువతి బైఠాయించిన విషయం తెలుసుకున్న తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ సఖీ టీమ్తో గండిలచ్చపేట చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రచన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హాలీడే ట్రిప్లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
హాలీడే ట్రిప్లో చిల్ అవుతోన్న పాలక్ తివారీ..నివేదా థామస్ షాకింగ్ లుక్..రెడ్ డ్రెస్లో ఖుషీ పాప స్టైలిష్ పోజులు..ఐశ్వర్య రాజేశ్ బర్త్ డే పోస్ట్.. View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్ల్లో ఫ్యాక్ట్ చెకింగ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ను ఎలా డెలిట్ చేయాలని గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు అనలిటిక్స్ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్లో సెర్చ్ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్లో థర్డ్పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’తప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
ఫ్యామిలీ ట్రిప్లో అనసూయ చిల్.. న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బిగ్బాస్ బ్యూటీ
తమిళనాడు ఫ్యామిలీ ట్రిప్లో అనసూయ చిల్..గోవా ట్రైబల్ ఫెస్టివల్లో శ్రద్ధాదాస్ డ్యాన్స్..న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న బిగ్బాస్ బ్యూటీ అశ్విని..2024 జ్ఞాపకాలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్..మలేషియాలో శివం భజే హీరోయిన్ దిగాంగన సూర్యవన్షి...న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఆలియా భట్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj) -
ఐస్క్రీమ్ బిర్యానీ...!
మీరు సరిగ్గానే చదివారు. ఐస్ క్రీమ్ బిర్యానీనే. బిర్యానీ అంటేనే మసాలా. ఇక ఐస్క్రీమ్.. తీపి. ఈ రెండింటికీ అభిమానులు ఎంతో మంది. అలాంటిది ఆ రెండు డిషెస్ను కలిపితే.. రుచెలా ఉంటుంది? రుచి సంగతి తెలియదు కానీ.. ఈ బిర్యానీని ముంబైకి చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ హీనా కౌసర్ తయారు చేశారు. వీడియోను ఇన్స్ట్రాగామ్లో షేర్ చేశారు. ఫొటోలో ఉన్న విధంగానే... హుండీలో బిర్యానీ... మధ్యలో స్ట్రాబెర్రీ ఐస్క్రీ స్కూప్. రెండు హుండీలను పట్టుకుని ఆమె వీడియోలో కనిపిస్తున్నారు. సాధారణంగా మసాలాలతో బంగారు వర్ణంలో ఘుమఘుమలాడే బిర్యానీ.. ఐస్క్రీమ్ రంగును పులుముకుని గులాబీ రంగులో మెరిసిపోతోంది. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఆహార ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది. హీనా సృజనాత్మకత ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ ప్రయోగం చాలా మంది ఆహార ప్రియులను అయోమయానికి గురిచేసింది. కంటెంట్ క్రియేటర్ హీనా బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు. తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా ఈ ఫ్యూజన్ డిష్ను తయారు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ మెచ్చిన పాపులర్ గేమర్ పెళ్లి సందడి (ఫోటోలు)
-
జలకన్యలా బిగ్బాస్ బ్యూటీ.. అందాలు ఆరబోస్తున్న అశ్విని శ్రీ!
బిగ్బాస్ బ్యూటీ అశ్విని శ్రీ హోయలు..రెడ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి పోజులు..జూబ్లీహిల్స్ ఆలయంలో క్లీంకార పూజలు..శారీలో బుల్లితెర నటి విష్ణుప్రియ అందాలు..దుబాయ్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా సందడి.. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Rajitha Chowdary (@artist_rajitha) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by House Of Neeta Lulla (@houseofneetalulla) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్జీపీటీ ఆఫ్లైన్లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్బుక్తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
జిమ్లో సెల్ఫీతో నభా నటేశ్.. దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ఫిట్!
వేకేషన్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ..జిమ్లో నభా నటేశ్ సెల్ఫీ కసరత్తులు..బంగారంలా మెరిసిపోతున్న అక్కినేనివారి కోడలు శోభిత..మరింత హాట్గా మిల్కీ బ్యూటీ తమన్నా లుక్స్..దుబాయ్లో ప్రియమణి ఫోటోషూట్..మతిపొగొట్టే అవుట్ఫిట్లో దేవర భామ జాన్వీ కపూర్.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
వివాహ వేడుకలో అల్లు అర్జున్, మెగాస్టార్.. ఫోటోలు వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఓ పెళ్లిలో సందడి చేశారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ ఈ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు.అయితే ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కనిపించడం మరో విశేషం. వధూవరులను మెగాస్టార్ ఆశీర్విదిస్తున్న ఫోటో తెగ వైరలవుతోంది. ఓకే పెళ్లికి అల్లు, మెగా ఫ్యామిలీ సభ్యులు హాజరవడంతో టాలీవుడ్ మరోసారి హాట్టాపిక్గా మారింది. అయితే ఇటీవల ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వస్తున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా అల్లు అరవింద్ ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి ఓకే పెళ్లిలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.మరోవైపు అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సాధించని విధంగా ఆల్ టైమ్ రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. View this post on Instagram A post shared by साधना सिंह📿 (@sadhnasingh1) -
రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపుల కారణంగానే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుమారుడి మృతికి సదరు యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల కిందట హరీష్కు కాల్ చేసింది. మాటామాటా కలిసి.. ఇన్స్టాగ్రామ్లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఎస్ఐ హరీష్ ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి.ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్.. ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకలేదు. అంతేకాకుండా తమ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ నెల ఆరో తేదీన హరీష్కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. -
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
వైట్ శారీలో ఆర్జీవీ హీరోయిన్.. మరింత క్యూట్గా ఆషిక రంగనాథ్!
వైట్ శారీలో ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి స్టన్నింగ్ లుక్స్...ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకలో మెరిసిన ప్రియమణి..నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్...ఈ కోట తనకెంతో ప్రత్యేకమన్నా ఆదితి రావు హైదరీ..ఫిల్మ్ ఫేర్ అవార్డ్తో లైగర్ భామ అనన్యపాండే..తెల్లటి చీరలో శ్రీలీల స్మైలీ లుక్స్.. బంగారం లాంటి చీరలో మెరిసిన శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Manoj Kumar Katokar (@media9manoj) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) -
ఇన్స్టాగ్రామ్ పరిచయమే ప్రాణం తీసింది..
కాళేశ్వరం: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన మహిళ వడ్డీలకు అప్పులు ఇస్తుందని తెలుసుకున్న ఓ యువకుడు ఆమె సోదరుడి ద్వారా రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఈక్రమంలో మహిళతో తరచూ ఫోన్లో మా ట్లాడేవాడు. దీంతో ఆమె భర్తకు అనుమానం పెరి గి అపార్థం చేసుకొని యువకుడిని హత్య చేశా డు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూ ర్ మండలం చండ్రుపల్లిలో గత బుధవారం జరిగిన ఈ హత్యకు సంబంధించి శుక్రవారం రాత్రి కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల శ్రీకాంత్గౌడ్(24) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు పొన్నం శివకృష్ణగౌడ్ భార్యతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు. ఆ మహిళ సోదరుడు పవన్, శ్రీకాంత్గౌడ్ ఇద్దరూ స్నేహితులు కావడంతో ఆమె వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు విషయంలో వారిద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. గమనించిన ఆమె భర్త పలుమార్లు మహిళను మందలించాడు. ఫోన్లో మాట్లాడడంతోపాటు, వారిద్దరు దగ్గరయ్యారనే అనుమానంతో శివకృష్ణ, అతని స్నేహితుడు ఎండీ ఫయాజ్తో కలిసి శ్రీకాంత్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కొమ్మెర గ్రామానికి చెందిన కిరాణ దుకాణం నిర్వాహకుడు కురుమ సాయితో పరిచయం పెంచుకుని శ్రీకాంత్ కదలికలను తెలుసుకున్నాడు. ఈ నెల 27వ తేదీన (బుధవారం) గ్రామంలో రెక్కీ నిర్వహించగా అక్కడ లేడని, అన్నారం సమీపంలోని చండ్రుపల్లిలో హార్వెస్టర్ నడిపిస్తున్నట్లు సాయి తెలిపాడు. దీంతో శివకృష్ణ, అతని స్నేహితుడు ఫయాజ్.. సాయి దుకాణంలో బీర్లు, ఆ తర్వాత కల్లు తాగి మహదేవపూర్ మండలం చండ్రుపల్లికి వచ్చారు. అక్కడ హార్వెస్టర్ డ్రైవర్ కోసం తన కారులో వేచి చూస్తున్న శ్రీకాంత్తో గొడవపడ్డారు. వెంటతెచ్చుకున్న కత్తితో చాతి, కడుపులో విచక్షణారహితంగా పొడవగా శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందడంతో బైక్ వదిలేసి పారిపోయారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యచేసిన రోజు ధరించిన రక్తపుదస్తులు, కత్తి, హెల్మెట్ దాచి ఉంచిన స్థలానికి శుక్రవారం నిందితులు చేరుకోగా చండ్రుపల్లి వద్ద మహదేవపూర్ సీఐ రామచంద్రరావు, ఎస్సైలు చక్రపాణి, పవన్కుమార్, తమాషారెడ్డిలతోపాటు పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి పల్సర్ బైక్, కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఫారిన్ ట్రిప్లో చిల్ అవుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్
-
రీడ్.. రైట్.. రైట్
ఈ మధ్య మంచి సినిమా వచ్చింది చూశావా బ్రో.. ఇన్స్టాలో కొత్త రీల్ ట్రెండింగ్లో ఉంది తెలుసా మచ్చా.. యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ అవుతోంది సెండ్ చేయాలా? ఈ తరం యువతను కదిపితే వారి నోటివెంట ఎక్కువగా వచ్చే మాటలు. మనలో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కూడా. అదే ఏదైనా పుస్తకం గురించి చెప్పామనుకోండి.. పుస్తకమా.. పుస్తకం చదివే టైం ఎక్కడుంది.. అయినా ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారు చెప్పండి! అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. నిజమే పుస్తక పఠనం ఈ తరం యువతలో తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ మనలో చాలా మంది ఈ ట్రెండ్స్ని ఫాలో అవుతూనే ఏదో ఒక పుస్తకాన్ని చువుతూ ఉంటారు. మరికొందరైతే పుస్తకాలంటే పడి చచి్చపోతుంటారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ పుస్తకాలను తెగ చదివేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మాత్రమే చూసే ఈ తరం యువతీ, యువకుల్లో చాలా మంది పుస్తకాలు చదివే వాళ్లు కూడా ఉన్నారా అని మనలో కొందరికి డౌటనుమానం? అయితే అదంతా వట్టి అపోహేనని ఏటా జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు వచ్చే స్పందన రుజువు చేస్తోంది. వేలాది మంది యువత ఈ ఫెయిర్లో లక్షల సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బుక్ ఫెయిర్లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. నవలలకు ప్రాధాన్యం.. పుస్తకాలు చదివే వారిలో ఎక్కువగా నవలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొట్టి వీడియోలు, షార్ట్ న్యూస్ లాగే పొట్టి కథలు చదివేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ నిడివిలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే నవలలకు యువత ఎక్కవగా అట్రాక్ట్ అవుతోంది. ఇక, వచన కవిత్వంపై కూడా యూత్ మనసు పారేసుకుంటోంది. దీంతో పాటు ప్రముఖుల ఆత్మకథలు చదివేందుకు చాలా మంది యువతీ, యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లిష్ లో నవలలు చదివేందుకు కాలేజీ విద్యార్థులు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు పుస్తకాలు చదివేందుకు ప్రయతి్నస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారు తెలుగు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.పాఠకులు పెరుగుతున్నారు.. 1990లలో పుస్తకాలు బాగా హిట్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎంత ఆసక్తిగా ఉన్నా కూడా పుస్తకాలు చదివే వారు తక్కువయ్యారని చాలా మంది అంటుంటారు. కానీ పుస్తకాలు చదివేవారు బాగానే పెరిగారు. ఓ సినిమా బాగుంటే ఎలా చూస్తున్నారో.. మంచి కథ.. విభిన్న కథనంతో పుస్తకాలు మార్కెట్లోకి వస్తే కళ్లకద్దుకుని చదివే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకం దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. నిజ జీవితంలో జరిగే ఉదంతాలనే ఆసక్తిగా రాస్తే పుస్తకాలు చదువుతారని ఆ పుస్తక రచయిత నిరూపించారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పుస్తకాలు చదివిన తర్వాత చాలా మంది ఏదైనా మంచి పుస్తకం ఉంటే చెప్పండి బ్రదర్ అని తెలిసిన వారిని ఇప్పటి యువతీ, యువకులు అడుగుతున్న సందర్భాలు కోకొల్లలు.రచయితలుగానూ రాణిస్తూ.. ఇటీవలి కాలంలో పుస్తకాలు రాసేందుకు కూడా యువత ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా మాతృభాషపై మమకారంతో తమకు సాధ్యమైనంత వరకూ రచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హాబీగా ఖాళీ సమయాల్లో రచనలు చేస్తుండగా.. కొందరు మాత్రం రచనను కెరీర్గా ఎంచుకుంటున్నారు. మంచి కథతో వస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం పెరగడంతో, మంచి కథలు రాసేందుకు ప్రయతి్నస్తున్నారు. అందరికీ పుస్తకాలు అచ్చు వేయించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న కథలు రాస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇలా రాస్తూ.. రాస్తూ.. పుస్తకాలు ప్రచురించేసి, ఆదరణ పొందుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక, పుస్తకాలు, సోషల్ మీడియాలో రాస్తూ సినిమాల్లో గేయ రచయితగా, స్క్రిప్ట్ రైటర్గా కూడా వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.వెలకట్టలేని అనుభూతి.. పుస్తక పఠనం ఎప్పటికీ వన్నె తరగనిది. సామాజిక మాధ్యమాలు తాత్కాలికమే. పుస్తకాలు చదివితే ఏదో వెలకట్టలేని అనుభూతి కలుగుతుంది. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసుకునే బదులు మంచి పుస్తకం చదివితే కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్లమవుతాం. – డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, రచయితఅవినాభావ సంబంధం చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు. తెలుగుపై మమకారంతో తెలుగులో పీజీ చేశాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం– స్త్రీ జీవన చిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. పుస్తక పఠనంతో భాషను మెరుగుపరుచుకోవచ్చు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఆసక్తిగా ఉంటాయి. – పెద్దపల్లి తేజస్వి, పరిశోధక విద్యారి్థని, ఓయూబంగారు భవితకు బాట.. పుస్తక పఠనం యువత బంగారు భవితకు బాటలు వేస్తుంది. సాహిత్య పఠనం ద్వారా సామాజిక స్పృహ కలుగుతుంది. పుస్తకం చదువుతుంటే ఎంతో మందితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సహనం పెరుగుతుంది. – రావెళ్ల రవీంద్ర, యువ రచయిత -
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి పోజులు..పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసుకున్న బిగ్బాస్ దివి..కోట్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా...బ్లూ శారీలో మేఘా ఆకాశ్ హోయలు.. View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
నట్టింటి నుంచి.. నెట్టింటికి..
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం.. నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంటున్నాయి. సంతోషాన్ని పంచుకునేందుకు.. ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కామెంట్ల వెల్లువ.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్గ్రౌండ్లో సెట్చేసి అప్లోడ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్స్ట్రాగామ్ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రీల్స్ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. జాగ్రత్త అంటున్న నిపుణులు.. ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం కామన్గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్ యూజ్ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం.. -
బర్త్ డే మూడ్లో బుల్లితెర బ్యూటీ.. బ్లాక్ డ్రెస్లో రామ్ చరణ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్లో బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..బ్లాక్ బ్యూటీలా ఎవడు హీరోయిన్ అమీ జాక్సన్..చిల్ అవుతోన్న హీరోయిన్ హన్సిక.. గ్రీన్ డ్రెస్లో విష్ణుప్రియ లేటేస్ట్ లుక్స్ View this post on Instagram A post shared by Ritesh Deshmukh - रितेश विलासराव देशमुख (@riteish) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
ప్రేమికుడే కాలయముడు!
మియాపూర్: మైనర్ అమ్మాయిని ఇన్స్ట్రాగాంలో పరిచయం చేసుకుని హత్యచేసి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సోమవారం కేసు వివరాలను తెలిపారు. అశోక్ కుటుంబం మియాపూర్లోని టేకు నర్సింహనగర్లో నివాసముంటోంది. చిన్న కుమార్తె(17) గత నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక తల్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటు(22)పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను నగరంలోని ఫలక్నుమా దేవాలయంలో పరిచయం చేసుకుని ఇన్స్టాలో చాటింగ్ చేసుకునేవారని చెప్పాడు. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు. దీంతో అమ్మాయి గత నెల ఇంటినుంచి వెళ్లిపోయింది. విఘ్నేష్ ఆ బాలికను మీర్పేట్లోని స్నేహితులు సాకేత్, కళ్యాణిల గదిలో ఉంచాడు. అమ్మాయి తరచూ పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో ఈ నెల 8న పెళ్లిచేసుకున్నట్లు దండలు మార్చుకుని ఫోటోలుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు. అనంతరం బాలికను హత్యచేయాలనే పథకం పన్నాడు. 8న విఘ్నేష్.. అమ్మాయి గొంతు నులిమి మొఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అదేరోజు అర్ధరాత్రి సాకేత్, కళ్యాణిలతో కలిసి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాకేత్.. బాలిక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి ఉప్పుగూడ దగ్గరలోని పారిశ్రామిక వాడలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చెత్తాచెదారం కప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విఘ్నేష్ తనకేమి తెలియనట్లు అమ్మాయి తల్లిదండ్రులకు కాల్ చేసి అమ్మాయి మీ దగ్గరకు వస్తుందని చెప్పి ఇక్కడి నుండి వెళ్లిందని, వచి్చందా అని అడిగాడు. అనుమానించిన తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విఘ్నేష్ను విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. పారిశ్రామిక వాడకు వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లిచేసుకోవాలని తరచూ ఒత్తిడి చేయడంతోనే హత్యచేసినట్లు తెలిపారు. హత్యచేసిన విఘ్నేష్, అతనికి సహకరించిన సాకేత్, కళ్యాణిలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
బొమ్మరిల్లు హీరోయిన్ స్టన్నింగ్ లుక్స్.. చిల్ అవుతోన్న రాశీ ఖన్నా!
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్ స్టన్నింగ్ లుక్స్..బిస్కెట్స్ తింటూ చిల్ అవుతోన్న రాశీ ఖన్నా...భర్తతో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తోన్న సోనాక్షి సిన్హా.. దో పట్టి సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆదిపురుష్ భామ..బ్లాక్ బ్యూటీలా పుష్ప భామ రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Genelia Deshmukh - जेनेलिया रितेश देशमुख (@genelia.deshmukh) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్.. రెడ్ డ్రెస్లో తాప్సీ !
రెడ్ డ్రెస్లో తాప్సీ పన్ను హోయలు..భూటాన్ పర్వతాల్లో చిల్ అవుతోన్న సంయుక్త మీనన్..మెహందీ లుక్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ డ్రెస్లో అదిరిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్..క మూవీ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) -
ఇన్స్టాలో ఇక వయసు దాచలేరు
టీనేజీ యూజర్లు అసభ్య, అనవసర కంటెంట్ బారిన పడకుండా, వాటిని చూడకుండా కట్టడిచేసేందుకు, వారి మానసిక ఆరోగ్యం బాగుకోసం సామాజికమాధ్యమం ఇన్స్టా గ్రామ్ నడుం బిగించింది. ఇందుకోసం ఆయా టీనేజర్ల వయసును కనిపెట్టే పనిలో పడింది. తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారంతో లాగిన్ అయినాసరే ఇన్స్టా గ్రామ్ యాప్ను వాడుతున్నాసరే దానిని కనిపెట్టి అడ్డుకునేందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటామని దాని మాతృసంస్థ ‘మెటా’వెల్లడించింది.ఎలా కనిపెడతారు? అడల్ట్ క్లాసిఫయర్ పేరిట కొత్త ఏఐ టూల్ను మెటా వినియోగించనుంది. దీంతో యూజర్ల వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్ను యూజర్ వీక్షిస్తున్నాడు?, ఆ యూజర్ ప్రొఫైల్లో పొందుపరిచిన వివరాలతో వయసుపై తొలుత ప్రాథమిక అంచనాకొస్తారు. తర్వాత ఈ యూజర్ను ఏఏ వయసు వాళ్లు ఫాలో అవుతున్నారు?, ఈ యూజర్తో ఎలాంటి కంటెంట్ను పంచుకుంటున్నారు?, ఎలాంటి అంశాలపై ఛాటింగ్ చేస్తున్నారు? ఏం ఛాటింగ్ చేస్తున్నారు? వంటి విషయాలను వడబోయనున్నారు. ఫ్రెండ్స్ నుంచి ఈ యూజర్లకు ఎలాంటి బర్త్డే పోస్ట్లు వస్తున్నాయి వంటివి జల్లెడపట్టి యూజర్ వయసును నిర్ధారిస్తారు. ఆ యూజర్ 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్గా తేలితే ఆ అకౌంట్ను వెంటనే టీన్ అకౌంట్గా మారుస్తారు. ఈ అకౌంట్ల వ్యక్తిగత గోప్యత సెట్టింగ్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి. ఈ యూజర్లకు ఏ వయసు వారు మెసేజ్ పంపొచ్చు? అనేది ఏఐ టూల్ నిర్ణయిస్తుంది. ఈ టీనేజర్లు ఎలాంటి కంటెంట్ను యాక్సెస్ చేయొచ్చు అనే దానిపై కృత్రిమ మేథ టూల్దే తుది నిర్ణయం. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు లైంగికసంబంధ కంటెంట్ను వీక్షించేందుకు, తల్లిదండ్రులకు తెలీకుండా చూసేందుకు తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారం ఇచ్చి లాగిన్ అవుతున్నారు. వీటికి త్వరలో అడ్డుకట్ట పడనుంది.వచ్చే ఏడాది షురూ అడల్ట్ క్లాసిఫయర్ను వచ్చే ఏడాది నుంచి అమలుచేసే వీలుంది. 18 ఏళ్లలోపు టీనేజర్ల ఖాతాలను టీన్ అకౌంట్లుగా మారుస్తాయి. అయితే త్వరలో 18 ఏళ్లు నిండబోయే 17, 16 ఏళ్ల వయసు వారికి కొంత వెసులుబాటు కల్పించే వీలుంది. అంటే నియంత్రణ సెట్టింగ్లను మార్చుకోవచ్చు. అయితే ఇది కూడా కాస్తంత కష్టంగా మార్చొచ్చు. సామాజికమాధ్యమ వేదికపై హానికర అంశాలను పిల్లలు చూసి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ దిశగా యాప్లో మార్పులు చేస్తోంది. టీనేజీ అమ్మాయిలపై ఇన్స్టా గ్రామ్ పెను దుష్ప్రభావాలు చూపుతోందని ప్రజావేగు ఫ్రాన్సెస్ హాగెన్ సంబంధిత అంతర్గత పత్రాలను బహిర్గతం చేయడంతో ఇన్స్టా గ్రామ్ నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు అధికమయ్యాయి. కొత్త టూల్ కారణంగా టీనేజీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చేమోగానీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చని స్వయంగా మెటానే భావిస్తోంది. ఎవరైనా యూజర్ తాను టీనేజర్ను కాదు అని చెప్పి టీన్అకౌంట్ను మార్చాలనుకుంటే ఆ మేరకు లైవ్లో నిరూపించుకునేలా కొత్త నిబంధన తేవాలని చూస్తున్నారు. బయటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. సంబంధిత యూజర్ వీడియో సెల్ఫీ లైవ్లో తీసి పంపితే ఈ బయటి సంస్థ వీడియోను సరిచూసి అకౌంట్ స్టేటస్పై తుది నిర్ణయం తీసుకుంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇన్స్టాగ్రామ్లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్బుక్కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతూ ఈ ఏడాది డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు తొలిసారిగా జంటగా కనిపించారు. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి పనులు మొదలైన ఫోటోలను శోభిత తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి.అయితే గతంలో సమంతను పెళ్లాడిన నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు 2021లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టులో శోభిత-చైతూ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆయన ఇన్స్టాలో సమంతతో ఉన్న ఫోటోలను నెటిజన్స్ గుర్తించారు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్, 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్పై తీసిన చిత్రం కూడా ఉంది. అందులో "బ్యాక్ త్రో ...మిసెస్ అండ్ ది గర్ల్ఫ్రెండ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.అయితే తాజాగా ఆ ఫోటోను నాగ చైతన్య తన ఇన్స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల చైతూ నిశ్చితార్థం సమయంలో ఆమెపై గౌరవంతో ఆ పోస్ట్ను తొలగించాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో శోభితతో పెళ్లికి ముందే ఆ పోస్ట్ నాగచైతన్య తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా.. 2017లో పెళ్లి చేసుకున్న సమంత- చైతూ వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు. -
నా చిరకాల స్వప్నం, గుడ్ న్యూస్ : రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
నటి రేణుకా దేశాయ్ శుభవార్తను ఫ్యాన్స్తో పంచుకుంది. చిన్న నాటి కల నెలవేరింది అంటూ ఇంటూ ఇన్స్టాలో ఒకపోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, వ్యక్తిగత విషయాలతో పాటు , ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం, పలు సామాజిక అంశాలపై స్పందించడం అలవాటు. అలాగే అభిమానుల సాయంతో తోచిన సహాయం చేస్తూ ఉంటుంది. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగాలో ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. క్తికరమైన విషయాన్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసింది. తనకు చిన్నప్పటినుంచి జంతువులు ముఖ్యంగా కుక్కలు, పిల్లులు మీద ఇష్టం ఎక్కువ అనీ, పెద్దాయ్యక వాటి కోసంఏదైనా చేయాలని కోరిక ఉండేదని, కోవిడ్ సమయంలో దీని ప్రాధాన్యతను తాను మరింత గుర్తించానని తెలిపింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఒక ఎన్జీవోను రిజిస్టర్ చేసినట్టు వెల్లడించింది. గతంలో ప్రమాదాలకు గురైన కుక్కలు లాంటివాటిని రక్షించడంలో తనకు చాలామంది గొప్పవాళ్లు సాయం చేశారని తెలిపింది. ఇపుడిక తానే స్వయంగా ఒక సంస్థను, ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పింది. అలాగే ఈ ప్రయాణంలో మరింత ముందుకు పోవాలంటే దాతల సాయం కూడా చాలా అవసరం అంటూ, సాయం చేసి, మూగజీవాల రక్షణలో తనకు తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేసింది.‘‘ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు, చిన్ననాటి కల నెరవేరింది, అందుకే క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ తన సంస్థకు సంబంధించిన వివరాలను, తన ఆశయాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఆభినందిస్తున్నారు. జంతువుల సంరక్షణ, వైద్య సాయం అందించే క్రమంలో విజయం సాధించాలి అంటూ విషెస్ అందించారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
దీవుల్లో అమలాపాల్ చిల్.. జలకాలాడుతున్న బిగ్బాస్ బ్యూటీ!
ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతోన్న అమలాపాల్ జలకాలాడుతున్న బిగ్బాస్ బ్యూటీ దివి.. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి లేటేస్ట్ లుక్స్.. బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ లుక్.. కలర్ఫుల్ శారీలో ఉప్పెన భామ కృతిశెట్టి.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
గుర్తించారు... చాలు! క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్
‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్స్టాగ్రామ్లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్స్టాగ్రామ్లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. View this post on Instagram A post shared by Shreyanka Patil (@shreyanka_patil31) -
ఉద్యోగులను తొలగిస్తున్న మెటా
టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్కు ప్రత్యర్థి కాదా?కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది. -
బ్లాక్ శారీలో త్రిప్తి డిమ్రీ.. దుర్గామాత పూజలో శ్రద్ధాదాస్
దుర్గామాత పూజలో హీరోయిన్ శ్రద్దాదాస్ బ్లాక్ శారీలో యానిమల్ బ్యూటీ హోయలు.. స్టన్నింగ్ అవుట్ ఫిట్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. శారీలో కీర్తి సురేశ్ అందాలు.. బతుకమ్మ సంబురాల్లో అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
విశాఖ: పెళ్లి చేసుకోవాలంటూ యువకుడికి...
తగరపువలస: విశాఖలోని షీలానగర్కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్లు, డ్రింక్లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది. ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి..మురళీనగర్లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. -
నువ్వు లేకుండా నేను ఏదీ చేయలేను.. లవ్యూ: మృణాల్ ఠాకూర్ (ఫొటోలు)
-
Disha Patani: నా జీవితంలో ఆనందాన్ని నింపావ్.. కల్కి హీరోయిన్ ఎమోషనల్ (ఫోటోలు)
-
Tech Talk: యూట్యూబ్లో.. ఈ ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయని మీకు తెలుసా!
క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఇన్నోవేటివ్ ఫీచర్లను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అధునాతన వీడియో జనరేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.వీయో ఇన్ డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్లో బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయడం కోసం రూపొందించిన యూట్యూబ్ డ్రీమ్స్క్రీన్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ డీప్మైండ్ వీయోను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ అప్గ్రేడ్ క్రియేటర్లకు సహజత్వంతో కూడిన బ్యాక్గ్రౌండ్, స్టాండ్లోన్ వీడియో క్లిప్లను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. షార్ట్–ఫామ్ కంటెంట్ నాణ్యతను పెంచుతుంది.ఇన్స్పిరేషన్ ట్యాబ్ అప్గ్రేడ్: ఐడియాలు, టైటిల్స్, థంబ్ నెయిల్స్, ఔట్లైన్స్ను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.కమ్యూనిటీస్: ఈ సరికొత్త కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా క్రియేటర్లు, సబ్స్క్రైబర్లు వీడియోలు, టాపిక్స్ గురించి చర్చించుకోవచ్చు.ఆటో డబ్బింగ్: యూట్యూబ్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్ని విస్తరించనుంది. డబ్బింగ్ ఆడియో ట్రాక్లను ఆటోమేటిక్గా యాడ్ చేయడానికి క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది వీడియోలను ప్రపంచ ప్రేక్షలకు చేరువ చేస్తుంది. భాష అడ్డంకులు లేకుండా చేస్తుంది.హైప్ ఫీచర్: ‘హైప్’ ఫీచర్ ద్వారా ఔత్సాహిక క్రియేటర్లు కొత్త ఆడియెన్స్తో కనెక్ట్ కావచ్చు. అయిదు లక్షల కంటే తక్కువ చందాదారులు ఉన్న క్రియేటర్ల నుంచి వీడియోలను హైప్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చిన్న, మధ్యతరహా క్రియేయేటర్ల అభివృద్ధికి ఉపయోగపడే ఫీచర్ను తీసుకురావాలనే జెన్ జెడ్లోని అత్యధికుల విన్నపం మేరకు ‘హైప్’ ఫీచర్ని తీసుకువచ్చారు. గూగుల్ పిక్సెల్ 9ప్రో..డిస్ప్లే: 6.30 అంగుళాలు ; బరువు: 199 గ్రా.మెమోరీ: 128జీబి 16జీబి ర్యామ్/256జీబి 16జీబి ర్యామ్/ 512 జీబి 16జీబి ర్యామ్బ్యాటరీ: 4700 ఎంఏహెచ్ఫ్రంట్ కెమెరా: 42 ఎంపీడిజిటెక్ స్మార్ట్ఫోన్ జింబల్..బ్రాండ్: డిజిటెక్ బరువు: 400 గ్రా. కలర్: లైట్ గ్రే 3 క్రియేటివ్ ఆపరేషన్ మోడ్స్:ఆల్ ఫాలో మోడ్హాఫ్ ఫాలో మోడ్ ఆల్ లాక్ మోడ్పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ఇన్స్టా ‘రీల్స్’ (ఆండ్రాయిడ్) డౌన్లోడ్ చేయడానికి...‘వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్లను ఉపయోగించి ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ‘రీల్స్’ లింక్ను కాపీ చేసి యాప్లో పేస్ట్ చేయడం ద్వారా ఫోన్ గ్యాలరీలో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్లు ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవడానికి ‘ఇన్సేవర్:రీపోస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్లను ఉపయోగించవచ్చు. థర్డ్–పార్టీ యాప్లపై మీకు ఆసక్తి లేకపోతే ‘స్క్రీన్ రికార్డింగ్’ అనేది ఒక ఆప్షన్.కొత్త ఇమోజీలు..మన భావోద్వేగాలను వేగంగా వ్యక్తీకరించడానికి ఇమోజీ అనేది చక్కటి మార్గం. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఉత్సాహం... ఇలా ప్రతి భావోద్వేగానికి ఒక ఇమోజీ ఉంది. ఇప్పుడు ఉన్న ఎన్నో ఇమోజీలకు కొత్తగా మరో 8 యాడ్ కానున్నాయి. దీంతో ఇమోజీల ప్రపంచం మరింతగా విస్తరించనుంది.కొత్త ఇమోజీలను సృష్టించే బాధ్యత యూనికోడ్ స్టాండర్డ్ తీసుకుంటుంది. సార్క్ అధికారిక జెండా, పార, రూట్ వెజిటేబుల్, కంటికింద సంచులతో అలిసిపోయిన ముఖం, పెయింట్ స్పా›్లట్, చెట్టు కొమ్మ, వేలిముద్ర, హర్ప్(మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్)... ఇలాంటి కొత్త ఐకాన్లను యూనికోడ్ ఎనౌన్స్ చేసింది.ఇవి చదవండి: హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్! -
ఒక్క మొక్కజొన్న గింజ.. 8.7 కోట్ల వీక్షణలు
సామాజిక మాధ్యమాల్లో కొత్తరకంగా కనిపించే ప్రతి ఒక్క వీడియోను కోట్ల మంది చూస్తారనడానికి నిదర్శనం ఈ వీడియో. అలోనా లోయివెన్ అనే యువతి కంటెంట్ క్రియేటర్గా పేరొంది ఇన్స్టా గ్రామ్లో వీడియోలు చేస్తోంది. తాజాగా ఈమె చేసిన కొత్త రకం వీడియోను జనం అదేపనిగా చూస్తున్నారు. అసలు ఆ వీడియో చివర్లో ఏం జరుగుతుందా అని వీడియో చివరికంటా చూసి కోట్లాది మంది అవాక్కయ్యారు. అలా ఒకరి తర్వాత మరొకరు షేర్ చేస్తూ పోవడంతో ఇప్పుడా వీడియో వీక్షణలు ఏకంగా 8.7 కోట్లు దాటిపోయాయి. View this post on Instagram A post shared by Alona Loewen (@alonaloewen)ఏముందా వీడియోలో? మొక్కజొన్న పొత్తును ఒలిచి అందులో ఒకే ఒక్క గింజను తీసుకుని వేడి నాన్స్టిక్ పెనం మీద వేసింది. దానిపై చాలా చిన్నగా ఉన్న చెంచాతో ఒకే ఒక్క చుక్క నూనె వేసింది. తర్వాత కాసింత ఉప్పు వేసి దోరగా కాల్చడం మొదలెట్టింది. గింజ కింద పడిపోకుండా మధ్యలో రంధ్రం ఉన్న చెక్క చెంచాను తీసుకుని దాని మధ్యలోకి గింజ వచ్చేలా చేసి గింజను బాగా వేడెక్కించింది. అలా గింజ వేడెక్కినంత సేపూ వీడియో చూస్తున్న ఇన్స్టా గ్రామ్ ఆప్ వీక్షకులు అలాగే కన్నార్పకుండా చూశారు. చిట్టచివరికి అది ఒక్కసారిగా పగిలి పాప్కార్న్ అయింది. అంతే.. View this post on Instagram A post shared by Alona Loewen (@alonaloewen)వ్యాఖ్యానాల వెల్లువ కొద్ది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చూసి నవ్వుకున్న వారు కొందరైతే చిర్రెత్తిపోయిన వారు మరికొందరు. అసలు ఇందులో ఏముంది? అని ప్రశ్నించిన వారూ లేకపోలేదు. అయితే రోజువారీ రోటీన్ జీవితంలో బోరు కొట్టిన మాలాంటి వాళ్లకు ఒక్క మొక్కజొన్న గింజ మహా ఉపశమనం కలి్పంచిందని నవ్వుతూ కామెంట్లు పెట్టినవాళ్లు కూడా ఉన్నారు. తమ సహనాన్ని పరీక్షించిందని ఆగ్రహం వ్యక్తంచేసిన వాళ్లకు కొదువేలేదు. ‘‘చివరిదాకా సస్పెన్స్ నన్ను చంపేసింది’అని ఒకతను పోస్ట్చేశాడు. ‘ఒక్క గింజ పేలడం చూడ్డం కోసం ఇంత సేపు వీడియో చూశానా!’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘డైటింగ్ తొలి రోజు ఇంతే తినాలి’, ‘ఎట్టకేలకు అది పేలింది’, ‘మొత్తం వీడియో చూసే సరికి నా ఓపిక మొత్తం పోయింది’అని ఎవరికి నచి్చనట్లు వాళ్లు కామెంట్లు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కన్నడిగులపై అనుచిత వ్యాఖ్యలు
దొడ్డబళ్లాపురం: రాజధాని బెంగళూరు నుండి ఉత్తర భారతీయులు వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అవుతుందని ఇన్స్టాలో రీల్స్ చేస్తూ అవమానకరంగా మాట్లాడిన ఉత్తర భారత యువతిని ఆమె పని చేస్తున్న కంపెనీ నుండి తొలగించారు. ఉత్తర భారత్కు చెందిన సుగంధ శర్మ అనే యువతి ఇటీవల రీల్స్ చేసి నార్త్ ఇండియన్స్ బెంగళూరు వదిలి పోతే బెంగళూరు ఖాళీ అవుతుందని, కన్నడిగులు కొన్ని విషయాలలో మరీ ఎక్కువ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడింది. పీజీలు ఖాళీ అవుతాయని, కోరమంగలలో అన్ని క్లబ్లు మూసుకోవాలని, అందమైన ఆడపిల్లలు చేసే పంజాబీ నృత్యాలు మిస్ అవుతారని వెటకారంగా మాట్లాడింది. మేమంతా వెళ్లిపోతే బెంగళూరు కనుమరుగు అవుతుందని వ్యాఖ్యలు చేసింది.దీంతో కన్నడిగులు తక్షణం బెంగళూరు వదిలిపోవాలని ఆమెకు కౌంటర్ ఇచ్చారు. సదరు రీల్ గంటల్లోనే వైరల్గా మారింది. దీంతో కంపెనీ వారు ఆమెను ఉద్యోగంలోంచి తొలగించారని సమాచారం. -
టిక్ టాక్ బామ్మ.. వయసు 78.. ఫాలోవర్లు 23 వేలు
ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ట్రెండింగ్ డ్యాన్స్ ఇరగదీస్తున్న విజయలక్ష్మి బంజారాహిల్స్: ఆమె భామ కాదు.. బామ్మ.. స్టేజీ ఎక్కి డ్యాన్స్ మొదలెట్టిందంటే చాలు.. కుర్రకారు ఈలలు, గోలలు.. ఆమె డ్యాన్స్ చూస్తే పెద్దవాళ్లు ఐనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. ఆమె వేసే స్టెప్పులకు కురీ్చల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు చరవాల్సిందే.. ఇంతకూ ఆ బామ్మ వయసు ఎంతో తెలుసా..! సరిగ్గా 78 ఏళ్లు.. ఆమెకు ఇన్స్టాలో దాదాపు 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ భామ్మగా పిలుచుకునే ఆమె పేరు విజయలక్ష్మి. పదేళ్ల పాటు హోంగార్డుగా.. బాలానగర్కు చెందిన విజయలక్ష్మి పదేళ్లపాటు హోంగార్డుగా పనిచేసింది. బాలనగర్, కూకట్పల్లి, చందానగర్, జీడిమెట్ల, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. మనువడు ఫోన్ చూసే క్రమంలో ఆమె టిక్ టాక్లో తనకు ఒక ఖాతాను ఏర్పాటు చేసుకుంది. డ్యాన్స్ చేయడం, నటులను అనుకరించడం, డైలాగ్లకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది. ఇంకేముంది ఆమెను ఫాలో చేసే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. దీంతో టిక్ టాక్ బామ్మగా ఆమెకు ఎక్కడలేని గుర్తింపు వచి్చంది. అదే సమయంలో టిక్టాక్ నిషేధించడంతో టికి అనే మరో యాప్లోకి వెళ్లింది. అందులోనూ దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అది కూడా బ్యాన్ కావడంతో బామ్మ తాజాగా ఇన్స్టా వైపు మళ్లింది.యూత్ ఫిదా.. తన ఇద్దరు కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ క్రమంలోనే సినీనటి కరాటే కళ్యాణితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ఆమెతోనే ఉంటోంది. బామ్మ నృత్యాలకు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇన్స్టాలో ఇప్పటికే దాదాపు 3300 డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసింది. ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. క్లాస్ అయినా, మాస్ అయినా పాట ఏది వచి్చనా ఆమె స్టెప్పులను ఎవరూ ఆపలేరు. యువతతో కలిసి డ్యాన్స్ చేయడానికి బామ్మనే పోటీపడుతుంది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా డ్యాన్స్ చేసే ఆ బామ్మ ప్రతిరోజు యోగ చేస్తుంది. మితమైన, పోషకాహారం తీసుకుంటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది.సినిమాల్లోకి.. ప్రస్తుతం బామ్మ సినిమాల వైపు అడుగులు వేసింది. విడుదలకు సిద్ధమైన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది. ఇదే కాకుండా కొన్ని ఛానెళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషిౠతాలు, విలువలు, మానవ సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు ఇన్స్టా అభిమానులు ఉన్నారు. -
రీల్స్ పిచ్చి.. బావి అంచున కూర్చొని పిల్లాడితో మహిళ వేషాలు
యువతతోపాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో రీల్స్పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపులర్ కావాలని వింత చేష్టలతో రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేసి ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు. తాజాగా ఓ మహిళ సైతం రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది.బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్న మహిళ.. ఒక చేతితో పిల్లాడిని పట్టుకొని రీల్ చేసింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ కదలికల కోసం బాలుడిని నిర్లక్ష్యంగా పలుమార్లు చేతులు మార్చింది. బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అతడి శరీరం బావి పైన గాలిలో వేలాడుతూ ఉంది.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. పిల్లవాడి రిస్క్ గురించి పట్టించుకోని ఆ మహిళ రీల్ పిచ్చిపై నెటిజన్లు మండిపడున్నారు. పిల్లవాడి గురించి పట్టించుకోని ఆమె రీల్కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్ వ్యామోహంలో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు.Family court in custody case: Only mother can love child more. Even more than father.Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj— Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024 -
నెట్టింట్లో తెగ వైరల్.. ఈ బుజ్జి హిప్పోకు ఎందుకందరూ ఫిదా!
మూ డెంగ్.. రెండు నెలల వయసున్న ఆడ పిగ్మీ హిప్పో అదరినీ అలరిస్తోంది. థాయ్లాండ్లో చోన్ బురిలోని జంతుప్రదర్శనశాలలో ఇది నివసిస్తోంది. దీని ఫోటోలు ఇన్స్టాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ ప్రత్యేకమైన హిప్పో కాస్త బొద్దుగా, చాలా చిన్నగా ఉండటంతో ఆన్లైన్లోనూ చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు.మూ డెంగ్’ అంటే థాయ్లో ఎగిరిపడే పంది మాంసం అని అర్ధం. ఇది స్థానికంగా ప్రసిద్ధి చెందిన చిరుతిండి. ఇప్పుడు అంతరించిపోతున్న పిగ్మీ హిప్పోకు ఈ పేరు పెట్టారు. ఇది పశ్చిమ ఆఫ్రికాకు చెందినది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం.. ప్రపంచంలో 2,000 నుంచి 2,500 మాత్రమే మిగిలి ఉన్నాయి.กินคลีน ☘️#hippo #PygmyHippo #ขาหมูแอนด์เดอะแก๊ง #หมูเด้งจะเด้งกี่โมง pic.twitter.com/gOn2s5Fb57— Khamoo.andthegang (@and_khamoo) September 10, 2024 ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు పట్టాయాకు సమీపంలోని ఒక జంతు ప్రదర్శనశాల (జూ)కు జనాలు పోటెత్తుతున్నారు. వందలాది మంది సందర్శకులు ఐదు నిమిషాల పాటు ఎన్క్లోజర్ క్యూలో ఉండి దీనిని చూస్తున్నారు. కొంతమంది అయితే రెండు గంటల ప్రయాణి చేసి మరి దానిని సందర్శించేందుకు వస్తున్నారు. జులైలో ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని ఖ్యావ్ ఖ్యూ ఓపెన్ జూ నిర్వాహకులు వెల్లడించారు.pic.twitter.com/SSUHf775RW— X (@X) September 15, 2024 అయితే బుజ్జి హిప్పోను సందర్శకులు ఇబ్బంది పెడుతున్నట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మూ డెంగ్ను చూడటానికి వచ్చే వారు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు. ఈ జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వాటికి సురక్షితమైన, సౌకర్యమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కాగా ఈ హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం, వస్తువులు విసిరేస్తున్నట్లుగా నెట్టింట్లో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి. దీంతో మూ డెంగ్ స్థావరం చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, బుజ్జి హిప్పో పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. అది మేల్కొని ఉన్నప్పుడే దానిని చూడాలని ఆయన కోరారు. -
టెక్కీ.. వెయిటెక్కీ
ఎక్కువ పనివేళలు టెకీలను ఊబకాయులుగా మారుస్తున్నాయా?! అనే సందేహానికి ‘అవును’ అనే సమాధానం సాఫ్ట్వేర్ రంగం నుంచి వస్తోంది. ఈ విషయంపైన ‘చైనీస్ ఇన్స్టాగ్రామ్ జియాహోంగ్షులో వా΄ోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద’ని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడి చేసింది. టెకీ ఉద్యోగçస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచన లు ΄ాటిద్దాం..చైనాలోని ఓయాంగ్ వెన్జింగ్ అనే 24 ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గత ఏడాది కాలంలో 20 కేజీల బరువు పెరిగిందని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడించింది. ‘నా శారీరక, మానసిక ఆరోగ్యానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక విపత్తుగా మారింది. ఎక్కువ పని గంటలు, మారుతూ ఉండే షిప్ట్ వేళల కారణంగా ఆహారం తీసుకోవడంలో అపసవ్యత చోటు చేసుకునేది. దీంతో ఏడాది కాలంలో 60 కేజీల నుంచి 80 కేజీల బరువు పెరిగాను. ఇలా అయితే నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో అని జూన్లో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యంలో మెరుగైన మార్పులు వచ్చాయి’ అని ఇన్స్టాలో ΄ోస్ట్ చేసింది ఓయాంగ్. ఆమె ఇప్పుడు ఫ్రీలాన్స్ వెయిట్లాస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. తన ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, ్ర΄ోటీన్లను చేర్చుతూ 6 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఓయాంగ్ అనుభవం చెప్పడంతో ఆమెలాంటి వ్యక్తులు తమ పని కష్టాలను పంచుకోవడానికి ముందుకు వచ్చారు. చైనాలోనే కాదు ఏ దేశంలోనైనా సాఫ్ట్వేర్ ప్రపంచంలో పనిచేసే టెకీలందరికీ ఇది వర్తిస్తుంది. మానసికమైన అలసట ‘పని ఒత్తిడి కారణంగా డిజర్ట్లను అతిగా తినడం వల్ల నెల రోజుల్లోనే 3 కిలోల బరువు పెరిగాను’ అని తన అనుభవాన్ని ఇన్స్టా ద్వారా పంచుకుంది మరో టెక్ ఉద్యోగిని 33 ఏళ్ల షాంఘై.. అతిగా ఆకలిఎక్కువ గంటలు పనిచేయడం అనేది పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరిస్థితి సందడిగా ఉండే నగరాల్లో ఆందోళనకరమైన ధోరణిగా మారుతోంది. వర్క్ షిప్ట్ వల్ల సరైన నిద్ర వేళలు ఉండవు. దీంతో కార్టిజోల్ హార్మోన్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మెలటోనిన్ తగ్గి΄ోతుంది. లేట్నైట్స్ మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరగడంతో ఫుడ్ తెప్పించుకుని తింటారు. దీంతో కదలికలు ఉండవు. ఇక వర్క్ఫ్రమ్ హోమ్ వచ్చాక పడుకొని వర్క్ చేసే వారున్నారు. దీంతో వారి శరీరంలో ఏ ఆర్గాన్ అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన త్వరగా ప్రభావం పడుతుంది. తినే వేళలు సరి చేసుకోవాలిచైనాలో పని సంస్కృతి ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వారానికి ఆరు రోజుల ΄ాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. న్యూట్రిషన్ విభాగానికి చెందిన డాక్టర్ జువో జియోక్సియా హెల్త్ టైమ్స్తో మాట్లాడుతూ ‘ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నిద్రలేమి, ‘అధిక పని ఊబకాయానికి దారితీస్తుందని చె΄్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ కూరగాయలు, తక్కువ మాంసాహారం తీసుకోవాలి. అంతేకాదు, తినే వేళలను సక్రమంగా ΄ాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి’ అని సూచిస్తోంది. ఈ సమాచారం టెకీలందరికీ వర్తిస్తుంది.అరకేజీ ఫ్రూట్ –వెజ్ సలాడ్వయసులో ఉన్నప్పుడు పని, జీతం అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే, సరైన జీవన శైలి ΄ాటించక΄ోతే నలభై దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ చూస్తుంటాం. లుక్ కోసం అవసరం లేని కాస్మటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. లుక్ కాదు ఆరోగ్యమే ప్రధానమని గుర్తించాలి. పని ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ ఔషధంలా పనిచేస్తుంది. ∙నిద్ర వేళలు సరిగ్గా చూసుకోవాలి. 6–8 గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. ∙వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ∙టైమ్కి ఆహారం తీసుకోవాలి. దీంతో΄ాటు ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల కొవ్వు పెరగదు. అతిగా ఆకలి అవడం ఉండదు. – డాక్టర్ జానకి, ΄ోషకాహార నిపుణులు -
సమంత రోజు ఎలా గడుస్తుందంటే...???
అందం, అభినయంతో సినీ పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగిన నటి సమంత రూత్ ప్రభు. మోడల్ నుంచి మొదలై స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, అంతే దృఢంగా నిలబడుతోంది. ఆరోగ్యం సహకరించక పోయినా అచంచల విశ్వాసంతో తన కలల సాకారంకోసం నిబద్ధతగా సాగుతోంది. పురుషాధిక్య సినీ ప్రపంచంలో హీరోయిన్గా రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎపుడూ టచ్లో ఉంటూ అనేక ఆరోగ్య విషయాలను పంచుకోవడం సమంతాకు అలవాటు. ఈ క్రమంలో తన దినచర్య వివరాలను పంచుకుంది. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, క్రీడలతోపాటు, వృత్తి జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ తన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటోంది అనే ‘ది డే ఇన్ మే లైఫ్’ అనే చిన్న వీడియోలో షేర్ చేసింది. ఆరోగ్యాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తన అభిమానులకు చెప్పకనే చెప్పేసింది. ఆరోగ్యం పట్ల సమంత తీసుకుంటున్న శ్రద్ధకు, ఫిటె్నెస్కు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే మీరు స్టార్. చాలా స్ఫూర్తి దాయకం! అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)కాగా మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ ఫీనిక్స్ పక్షిలో తనను తాను నిరూపించుకుఉంటోంది. ఈక్రమంలోనే ప్రతిష్టాత్మక “సిటాడెల్” సిరీస్తో బాగానే ఆకట్టుకుంది. అలాగే వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా కొత్త ప్రయాణం ప్రారంభించినట్టు సమంత స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కూతురి కోసం ప్రియాంక చోప్రా ఏం చేసిందంటే?
బాలీవుడ్ నటి, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల తన సోదరుడి ఎంగేజ్మెంట్ వేడుకలకు హాజరైంది. ముంబయిలో జరిగిన సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేసింది.అయితే హాలీవుడ్ సింగర్ నిక్జోనాస్ను పెళ్లాడిన ప్రియాంక చోప్రాకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. ఇండియా పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన కూతురి ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా తన కూతురి పేరుతో ఇన్స్టా అకౌంట్ పేరును పంచుకుంది.తన కుమార్తె మాల్టీ మేరీతో ఇన్స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. కూతురి పేరుతో ఖాతాను ఓపెన్ చేసిన ప్రియాంక చోప్రా తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంది.కాగా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం పానీ అనే మరాఠీ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా హెడ్స్ ఆఫ్ స్టేట్లో అనే మూవీలో నటిస్తున్నారు. ఆ తర్వాత యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ది బ్లఫ్ మూవీలో ప్రియాంక కనిపించనున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్గా శ్రద్ధా కపూర్
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం స్త్రీ 2 విజయంతో భారీగా అభిమానులను పెంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా పాపులారిటీలో ప్రధాని మోదీనే వెనక్కి నెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రియాంక చోప్రాను కూడా వెనక్కు నెట్టి టాప్ ప్లేస్లో చేరిపోయారు.బాలీవుడ్ నటుడు శక్తికపూర్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను కట్టిపడేస్తుంది. తన దినచర్యతో పలు విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటుంది. అలా భారీ సంఖ్యలో ఇన్స్టాగ్రామ్ నుంచి అభిమానులకు సంపాదించుకుంది. ఆమెకు ప్రస్తుతం 91.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండియన్ హీరోయిన్ల పాపులారిటీలో ఆమె టాప్ వన్ స్థానంలో ఉన్నారు. ఇండియన్ అందరి సెలబ్రిటీల జాబితాలో అయితే రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాలోని ప్రముఖల జాబితాలో శ్రద్ధా కపూర్ టాప్-4 లో ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రముఖులుఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో - 636 మిలియన్లు లియోనెల్ మెస్సీ- 504 మిలియన్లుక్రికెటర్ విరాట్ కోహ్లీ - 270 మిలియన్లుశ్రద్ధా కపూర్ - 91.9 మిలియన్లు ప్రియాంక చోప్రా - 91.8 మిలియన్లుప్రధాని నరేంద్ర మోదీ - 91.3 మిలియన్లు అలియా భట్ - 85.1 మిలియన్లు.కత్రినా కైఫ్ - 80.4 మిలియన్లు.దీపికా పదుకొనే - 79.8 మిలియన్లు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
గాల్లోకి డబ్బులు.. యూట్యూబర్ హర్షను అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్లో రీల్స్ చేయడంపై తెలంగాణ పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం పబ్లిక్ను ఇబ్బంది పెట్టొదని తెలిపారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా.. పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూకట్పల్లిలో ట్రాఫిక్ మధ్యలో డబ్బులు గాల్లోకి చల్లి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన యూట్యూబర్ హర్ష అలియాస్ మహాదేవ్ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.‘తమ కెరీర్ లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనక బందీ చేస్తారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు. pic.twitter.com/j2MEdYuiLx— Telangana Police (@TelanganaCOPs) August 23, 2024కాగా గురువారం కూకట్పల్లి యూట్యూబర్ పవర్ హర్ష అలియాస్ మహదేవ్ హల్చల్ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఇంతకముందు కూడా చాలాసార్లు ట్రాఫిక్లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ పోస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్పై స్టాంట్లు కూడా చేశాడు. వీటిని సోషల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పోస్టు చేస్తుంటాడు. హర్ష వ్యవహారంపై వాహనదారులు మండిపడుతున్నారు. -
పాపం.. హీరోయిన్ ఒక్క ఫొటో ఎంత పనిచేసింది!
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. దీని బారిన పడి ఇబ్బందులు పడినవాళ్లు ఈపాటికే బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడీ లిస్టులో మరో హీరోయిన్ చేరింది. నాగార్జున-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'సూపర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయేషా టాకియా తాజాగా నెటిజన్ల దెబ్బకు బలైపోయింది. ఏకంగా ఇన్ స్టా అకౌంట్నే డిలీట్ చేసేంత వరకు వెళ్లింది.(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)ముంబయికి చెందిన ఆయేషా టాకియా.. 2004-11 మధ్య హిందీలో పలు సినిమాలు చేసింది. సల్మాన్, అజయ్ దేవగణ్, సంజయ్ దత్ లాంటి స్టార్స్తో కలిసి సినిమాలు చేసింది. 2009లో పెళ్లి చేసుకుని.. ఓ రెండేళ్ల తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. అప్పటినుంచి ఎప్పుడో ఓసారి కనిపిస్తుండేది. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో కొడుకుతో కలిసి కనిపించింది.అయితే ఈమె గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని చెప్పి ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ తాకిడికి తట్టుకోలేకపోయిన ఆయేషా.. ఏకంగా తన ఇన్ స్టా ఖాతానే డిలీట్ చేసి పడేసింది. ఈ ట్రోలింగ్ అంతా కాస్త సద్దుమణిగిన తర్వాత వస్తే రావొచ్చేమో! ఏదేమైనా ఇలా ట్రోల్ చేసి మరీ హీరోయిన్ని హడలగొట్టేశారు!(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్
మన దేశ గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా సరే ఈయన్ని చూసేందుకు అభిమానులు గట్టిగానే వస్తుంటారు. సోషల్ మీడియాలోనూ మోదీకి గుర్తింపు గట్టిగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈయన్ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దాటేసింది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)ప్రస్తుతం మన దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడి తర్వాత ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్లు, ప్రధాని మోదీకి దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మూడో స్థానికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వచ్చేసింది. 'స్త్రీ 2' సక్సెస్తో ఈమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు చేరింది. దీంతో మోదీని ఈమె అధిగమించినట్లయింది.ట్విటర్లో మాత్రం 101.2 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇక శ్రద్ధా కపూర్ విషయానికొస్తే చాన్నాళ్ల నుంచి హిందీలో సినిమాలు చేస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్తోనూ 'సాహో' మూవీలో హీరోయిన్గా చేసింది. ఆ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఏదేమైనా ఇప్పుడు 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది.(ఇదీ చదవండి: ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. త్వరలో సన్యాసం) -
కలర్ఫుల్ శారీలో నా సామిరంగ హీరోయిన్.. రెడ్ శారీలో తంగలాన్ బ్యూటీ!
వెకేషన్లో చిల్ అవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్...కలర్ఫుల్ శారీలో నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ హోయలు..ఆదితి రావు హైదరీ న్యూ లుక్స్..రెడ్ శారీలో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ప్రకృతి ఒడిలో సీతారామం బ్యూటీ.. రాజస్థాన్లో మహేశ్ బాబు ఫ్యామిలీ చిల్!
ప్రకృతి ఆస్వాదిస్తోన్న సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. రాజస్థాన్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ.. దసరా మూడ్లోనే కీర్తి సురేశ్.. కళ్లతోనే మాయ చేస్తోన్న పూనమ్ బజ్వా.. రెడ్ డ్రెస్లో శ్రద్ధాకపూర్ అందాలు.. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
సామ్ జ్ఞాపకాల్లో చైతూ.. ఆ ఒక్క ఫొటో డిలీట్ చేయలేదుగా! (ఫొటోలు)
-
శారీ షో రూమ్ లో తళుక్కుమన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ (ఫొటోలు)
-
Turkey: ఇన్స్టాగ్రామ్ను బ్లాక్ చేసిన టర్కీ
ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే టర్కీ తాజాగా ఇన్స్టాగ్రామ్ను బ్లాక్ చేసి హెడ్లైన్స్లో చోటుదక్కించుకుంది. అమెరికన్ కంపెనీ ఇన్స్టాగ్రామ్పై సెన్సార్షిప్ ఆరోపణలు చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టర్కీ నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ను ఆగస్టు 2 నుంచి బ్లాక్ చేస్తున్నట్లు బీటీకే కమ్యూనికేషన్స్ అథారిటీ తన వెబ్సైట్లో ఒక పోస్ట్లో వెల్లడించింది.టర్కీలోని వినియోగదారులు తమ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ను రిఫ్రెష్ చేయలేకపోయామంటూ ఎక్స్ ప్లాట్ఫారమ్లో ఫిర్యాదు చేశారు. కాగా టర్కీ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్.. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్పై పలు ఆరోపణలు చేశారు. ‘హమాస్ అమరవీరుడు హనియాకు సంతాప సందేశాలను పోస్టు చేయకుండా యూజర్స్కు ఇన్స్టా ఇబ్బందులు కలిగించిందని’ పేర్కొన్నారు. కాగా టర్కీ అధికారులు సోషల్ మీడియా సైట్స్కు యాక్సెస్ను బ్లాక్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దీనికిముందు 2017 ఏప్రిల్, 2020 జనవరి మధ్య దేశ అధ్యక్షుడు- ఉగ్రవాదం మధ్య సంబంధాలపై రాసిన రెండు కథనాల కారణంగా వికీపీడియాను టర్కీ బ్లాక్ చేసింది.హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా టెహ్రాన్లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేశారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడికాలేదు. ఇతని మరణానికి 94 రోజుల ముందు, అతని ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు పాలస్తీనాలో హతమయ్యారు. "Turkey’s communications authority blocked access to the social media platform Instagram,” apparently because Instagram had removed "posts by Turkish users that expressed condolences over [Israel's] killing of Hamas political leader Ismail Haniyeh." https://t.co/Mc4pERy9j5— Kenneth Roth (@KenRoth) August 2, 2024 -
అనుష్క ఆ పోస్ట్ ప్రభాస్ కోసమేనా..?
-
సోషల్ మీడియా.. మార్కెట్ మేనియా
విస్తృతమవుతున్న ప్రకటనల మార్కెట్ ⇒ 2024 మార్చి నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్: రూ. 10 వేల కోట్లు. ⇒ 2027 నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్ (అంచనా): రూ. 14 వేల కోట్లు. ⇒ ఏదో ఒక బ్రాండు, బ్రాండ్ అంబాసిడర్ను అనుసరిస్తున్న సోషల్ మీడియా ఖాతాదారులు: 90 శాతం ⇒ ప్రకటనను చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు: 11 శాతం ⇒ ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులను బయట స్టోర్స్లో కొనుగోలు చేస్తున్న వారు: 21 శాతం ⇒ దేశంలో సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనలపై ఆధారపడుతున్న పెద్ద, మధ్య తరహా వ్యాపార సంస్థలు: 77 శాతం ⇒ సోషల్ మీడియాలో చూసిన వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు: 76 శాతం ⇒ ప్రకటన చూశాక ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నవారు: 44 శాతం సాక్షి, అమరావతిప్రస్తుత స్మార్ట్ ఫోన్ల యుగంలో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఇక భారత్లో అయితే సోషల్ మీడియా మేనియా అన్ని దేశాలకన్నా ముందుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంలో భారత్ మొదటిస్థానంలో ఉండగా.. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. భారత్లో సెల్ ఫోన్ వినియోగదారులు రోజుకు సగటున రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిన్న స్థాయి సంస్థల వరకూ ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. ఇన్ఫ్లుయన్సర్స్ హవా.. ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్ఫ్లుయన్సర్స్ హవా కొనసాగుతోంది. కనీసం 10లక్షల మంది ఫాలోయర్లు ఉండే ఇన్ఫ్లుయన్సర్స్కు డిమాండ్ భారీగా ఉంటోంది. వారికి భారీ పారితోషికాన్ని చెల్లించేందుకు పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటున్నాయి. యూ ట్యూబ్లో 10 లక్షల వ్యూస్ వచ్చే వీడియోకు రూ. 3 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ.. ⇒ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 500 కోట్ల మంది సోషల్ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2027 నాటికి ఈ సంఖ్య 585 కోట్లకుచేరుతుందని అంచనా. ⇒ సోషల్ మీడియా ఖాతాదారుల్లో అత్యధికంగా భారత్లో 42 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 40 శాతం సోషల్ మీడియా ఖాతాదారులు కావడం గమనార్హం. ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నవారిలో 67 శాతం మంది సగటున కనీసం ఒక సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుతున్నారు. ⇒ భారత్లో రోజుకు సగటున 150 నిమిషాల పాటు అంటే రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రకారం 73 ఏళ్లు జీవించే పౌరుడు తన జీవిత కాలంలో 5.7 ఏళ్ల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసినట్టు అవుతుందని ఫోర్బ్స్ సంస్థ అంచనా వేసింది. ⇒ దేశంలోని ఖాతాదారుల్లో 78 శాతం మంది తమ మొబైల్ ఫోన్ ద్వారానే సోషల్ మీడియాను వీక్షిస్తున్నారు. ⇒ భారత్లో సోషల్ మీడియా వేదికల్లో మొదటి స్థానంలో ఫేస్బుక్, రెండో స్థానంలో ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన సోషల్ మీడియా ఖాతాదారుల్లో 74 శాతం మంది ఫేస్బుక్, 71 శాతం మంది ఇన్స్టాగ్రామ్ మాధ్యమాన్ని అనుసరిస్తున్నారు. కాగా 49 శాతం మంది ఎక్స్ను ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్ మరికొన్నేళ్లపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేశారు. -
అల్లు స్నేహ పోస్టుకు సామ్, రకుల్ కామెంట్
అల్లు స్నేహా రెడ్డి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నారామె. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా తన పిల్లల వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేగాక ఇంట్లోనూ పిల్లల బాధ్యతలు చూస్తూ.. బన్నీకి పూర్తి అండగా ఉంటూ వస్తున్నారు.తాజాగా బన్నీ తన కుటుంబం సమేతంగా వెకేషన్స్కు వెళ్లారు. పుష్ప 2 సినిమా షూటింగ్కు గ్యాప్ రావడంతో యూరప్లోని నార్వే దేశంలో భార్య, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ భార్య స్నేహ నార్వే వెకేషన్కు సంబంధించిన అందమైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ స్నేహను హగ్ చేసుకొని ఉండగా.. ఆమె తన పక్కనుంచి సెల్ఫీ తీసింది. ఈ ఫోటోలో పక్కనే పిల్లలు అయాన్, అర్హ కూడా ఏదో అల్లరి చేస్తూ పోజులు ఇవ్వడం కనిపిస్తోంది.ఈ పోస్టుకు నెటిజన్లతో సైతం సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ‘హార్ట్ సింబల్’ను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింటా వైరల్గా మారింది. వీటికంటే ముందు నార్వేలో బాగా ఫేమస్ అయిన పల్పిట్ రాక్ అనే పర్యాటక ప్రాంతంలో భారీ కొండ పైకి ఎక్కి దాని అంచున కుటుంబమంతా కలిసి దిగిన ఫోటో కూడా స్టోరీలో షేర్ చేసింది స్నేహ రెడ్డి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) మరోవైపు బన్నీ ఈ వెకేషన్ నుంచి తిరిగొచ్చాక ఆగస్టులో మళ్ళీ పుష్ప 2 షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈ వీడియోలు యమా టేస్టీ..
సాక్షి, అమరావతి : జేక్ డ్రయాన్, ఆండ్రియా, చెయ్సింగ్, సారా టాడ్, బెరిల్ షెరెషెవ్స్కీ.. వీరంతా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. జేక్ డ్రయాన్ది ఇంగ్లండ్ అయితే.. ఆండ్రియా ఒక జర్మన్.. సారా టాడ్ ఒక ఆస్ట్రేలియన్.. బెరిల్ షెరెòÙవ్స్కీది న్యూయార్క్. వీరందరిలో ఒక సారూప్యత ఉంది. రకరకాల భారతీయ వంటకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఈ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇలా వారు ఇన్స్ట్రాగాం రీల్స్, యూట్యూబ్ షాట్స్ ద్వారా సోషల్ మీడియా వేదికపై లక్షలకొద్దీ ఫాలొవర్లను సంపాదించుకుని ఘుమఘుమలాడే మన దేశీయ రుచులకు ఎక్కడలేని ప్రాచుర్యం కల్పిపస్తున్నారు. యూట్యూబ్ వంటల వీడియోల్లో ఇటీవల కాలంలో కొత్త ఒరవడి మొదలైంది. కేవలం మన దేశానికి పరిమితమై ఉండే, లేదంటే ఇక్కడే కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండే చాలారకాల వంటలపై మన దేశంతో ఏ సంబంధంలేని విదేశీయులు కొందరు రూపొందిస్తున్న వీడియోలు లక్షల మంది భారతీయులు మెచ్చుకునేలా ఉంటున్నాయి. ఫుడ్ బ్లాగర్ అయిన జేక్ డ్రయాన్ తనకు తానుగా దక్షిణాది భారతీయులకు అత్యంత ప్రియమైన సాంబారు–ఇడ్లీ వండుతూ చేసిన వీడియోను 25 లక్షల మంది వీక్షించారు. కేవలం ఇన్స్టాలోనే దాదాపు 18 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న డ్రయాన్ మన దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన 17 రాష్ట్రాలకు చెందిన వంటకాలపై వీడియోలు చేశారు. ఇతను మన దేశాన్ని ఎప్పుడూ సందర్శించనప్పటికీ మనవాళ్ల ఆసక్తి, అభిరుచుల నాడి పట్టుకుని పసందైన వీడియోలు చేస్తున్నారు. బిహార్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ‘సత్తు కా పరంత’.. రాజస్థాన్ ‘దాల్ బాటి చుర్మా’ వీడియోలకు నెట్టింట అత్యంత ఆదరణ దక్కింది. అలాగే, జర్మనీకి చెందిన అండ్రియా మన దేశంలోని పంజాబ్ యువకుడిని పెళ్లి చేసుకుంది. దాంతో భారతీయ వంటకాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. అలా ఆండ్రియా రూపొందించిన భారతీయ వంటల వీడియోలకు సోషల్ మీడియా ఇన్స్ట్రాగాంలో ఆమెకు 1.69 లక్షల మంది ఫాలోవర్లును తెచి్చపెట్టింది. అంతేకాదు.. ఆ్రస్టేలియాకు చెందిన సారా టాడ్, న్యూయార్క్లో నివాసం ఉండే బెరిల్ షెరెషెవ్స్కీ లాంటి విదేశీయుల భారతీయ వంటల వీడియోలు మన దేశంలో యమా క్రేజ్ పొందాయి. ఉపాధి అవకాశాల్లోనూ అదరహో.. ఇక మన దేశంలో అత్యధిక మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిపస్తున్న రెండో అతిపెద్ద రంగంగా కూడా ఆహార రంగం ప్రగతి సాధించిందని ఆరి్థక నిఫుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఏటా 85 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు తెచ్చి పెడుతుండగా, 2028 నాటికి ఏటా కోటికి మందికి దక్కే అవకాశం ఉందని అంచనా. ది ఇండియా ఫుడ్ సర్వీవస్ రిపోర్టు–2024 ప్రకారం..ప్రస్తుతం దేశంలో ఏటా ఆహార రంగ వ్యాపారం రూ.5.69 లక్షల కోట్లు 2028 నాటికి చేరుకునే మొత్తంరూ.7.76 లక్షల కోట్లు ప్రస్తుతం ఈ రంగంలో ఏటా ఉపాధి అవకాశాలు 85 లక్షలమందికి 2028 నాటికి ఉపాధికోటి మందికి 2028 నాటికి ఈ రంగం వ్యాపార లావాదేవీల్లో సంఘటిత రంగంవాటా 53 %ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో అసంఘటిత రంగం వాటా56.7 %వంటలపైనే ఏటా రూ.5.69 లక్షల కోట్ల వ్యాపారం.. ఇలా యూట్యూబ్లో వంటల వీడియోలు చూస్తూ నచి్చన వంటలను చేసుకుని తినడమే కాదు.. అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి రుచులను ఆస్వాదించే సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రెస్టారెంట్లు వీకెండ్స్, సెలవు రోజుల్లో కిక్కిరిసిపోయి ఉంటున్నాయంటే ఫుడ్ బిజినెస్కు ఏ స్థాయిలో ఆదరణలో ఉందో తెలుస్తుంది. నిజానికి.. ఆరి్థకవేత్తలు చెబుతున్న గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం ఈ ఆహార రంగంలో జరుగుతోంది. ఇంకోవైపు.. దేశంలో అన్ని వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న వృద్ధి కంటే ఒక్క ఆహార రంగంలోని వ్యాపార వృద్ధే అధికంగా ఉన్నట్లు వారంటున్నారు. ది ఇండియా ఫుడ్ సర్వీస్ రిపోర్టు–2024 ప్రకారం.. దేశ ఆహార రంగంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం కొనసాగుతుండగా, 2028 నాటికి అది ఏకంగా రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులు.. ఇలా.. ఈ రంగంపై భారీ వృద్ధి అంచనాలు ఉండడంతో బడా పారిశ్రామిక వ్యాపారవేత్తలు సైతం ఈ రంగంపై కన్నేసి కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో 56.7 శాతం మేర అసంఘటిత రంగంలోని చిన్న హోటళ్ల ద్వారా సాగుతుండగా, 2028 నాటికి ఈ లావాదేవీలు 47 శాతానికి పరిమితమై ప్రభుత్వం వద్ద గుర్తింపు పొందిన సంఘటిత రంగం ద్వారా 53 శాతం లావాదేవీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. -
మాయమైన తండ్రి.. ప్రభుత్వ ప్రకటనలో కనిపించగానే..
అది 2021 డిసెంబర్ నాటి ఘటన. మహారాష్టలోని పూణేలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. 63 ఏళ్ల దత్తాత్రేయ విష్ణు తాంబే ఇంటికి దూరమయ్యాడు. అతను ఎక్కడకు వెళ్లాడనే విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. అతనికోసం తెలిసిన అన్నిచోట్లా గాలించారు. విసిగివేసారి ఏదోఒక రోజు అతనే ఇంటికి తిరిగి వస్తాడని భావిస్తూ, కుటుంబసభ్యులు కాలం గడుపుతున్నారు.అయితే తాజాగా విష్ణు తాంబే కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించే వార్త వినిపించింది. దత్తాత్రేయ విష్ణు తాంబే అధికార శివసేన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఒక ప్రకటనలో కనిపించడం అతని కుటుంబ సభ్యులకు ఆనందం కలిగింది. శివసేన ఇన్స్టా ఖాతాలోని ప్రకటనలో కనిపిస్తున్నది దత్తాత్రేయ విష్ణు తాంబే అని అతని కుటుంబం తెలిపింది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ‘మహాయుతి’ ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లకు రూ.30,000 వరకు సబ్సిడీ అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై జోరుగా ప్రచారం సాగిస్తోంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం దత్తాత్రేయ విష్ణు తాంబే కుమారుడు భరత్ ఇటీవల శివసేన ప్రకటనను చూసి షాక్ అయ్యాడు. దానిని ఒక స్నేహితుడు తనకు వాట్సాప్లో పంపాడని తెలిపారు. షిక్రాపూర్లో తినుబండారాల దుకాణం నడుపుతున్న భరత్ మాట్లాడుతూ ‘ఆ స్క్రీన్షాట్ చూశాను. నేను వెంటనే నమ్మలేకపోయాను. ప్రభుత్వ తీర్థ దర్శన్ పథకం ప్రకటనలో మా నాన్న కనిపించారు’ అని అన్నారు.కాగా తమ తండ్రిని తమను కలపాలని భరత్ సీఎం షిండేను కోరారు. తమ తండ్రి సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాడని తెలుసుకుని తామంతా సంతోషపడుతున్నామన్నారు. షిక్రాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దీపారాతన్ గైక్వాడ్ మాట్లాడుతూ భరత్ తమను సంప్రదించి, తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. డీఎస్పీ ప్రశాంత్ ధోలే మాట్లాడుతూ తాము దత్తాత్రేయ విష్ణు తాంబే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు, వారు గతంలో చాలాసార్లు దత్తాత్రేయ విష్ణు తాంబే తమకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయేవాడని, తరువాత తనంతట తానే తిరివచ్చేవారని పేర్కొన్నారన్నారు. దత్తాత్రేయ విష్ణు తాంబే చివరిసారిగా 2021, డిసెంబర్లో కరోనా సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. అతను ఏదో ఒకరోజు తిరిగివస్తాడని భావించి కుటుంబ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. -
రీల్స్ కోసం కెమెరా కొనేందుకు ఓనర్ ఇంట్లో చోరీ
ఢిల్లీ: ఇన్స్ట్రామ్లో రీల్స్ చేసి ఫేమస్ కావాలనుకున్న ఓ పని మనిషి కెమెరా కొనుక్కొవటం కోసం.. ఓనర్ ఇంట్లోనే రూ.లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. నగలతో పరారైన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వివరాలు.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ బంగ్లాలో నీతూ యాదవ్ అనే మహిళ పని చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావాలనుంది.అందుకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్టు చేస్తుండేది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ ఒక ఛానెల్ను ఓపెన్ చేసి డబ్బు సంపాదించాలిని ప్లాన్ వేసింది. అయితే దానికి రీల్స్ చేసేందుకు మంచి క్వాలిటీ ఉన్న డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనాలనుకుంది. అయితే ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో కుటుంబ సభ్యులును డబ్బు అడిగింది. కానీ వారం సహాయం చేయకపోవటంతో తాను పనిచేసే ఓనర్ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ఓనర్లు లేని సమయం చూసి బంగారం, వెండి వస్తువులతో పారిపోయింది. ఇంట్లో కనిపించని ఆమెకు ఒనర్లు కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంట్లో ఉండే నగలు కనిపించకపోవడంతో పనిమనిషిపై వచ్చి.. ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక.. స్థానికుల సమాచారంతో నగల బ్యాగ్తో ఢిల్లీ దాటాలనుకున్న ఆమెన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కెమెరాను కొనడానికి ఎవ్వరు అప్పుగానైనా డబ్బు ఇవ్వకపోవటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. -
వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?
‘నిద్రపోయే ముందు మీరు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు– ‘చక్కని సంగీతం వింటాను. నచ్చిన పుస్తకం చదువుకుంటాను’... ఇలాంటి జవాబులు వినిపించడం సాధారణమే. అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ టియా విల్సన్ నోటి నుంచి వచ్చిన మాట విని నెట్ లోకులు షాకు అయ్యారు. ‘సౌకర్యవంతంగా. సుఖంగా నిద్రపోవడానికి నా భుజాన్ని డిస్లొకేట్ చేస్తాను. నిద్ర నుంచి లేచిన తరువాత తరిగి యథాస్థానంలో అమర్చుకుంటాను’ అంటుంది విల్సన్. ‘జోక్ చేస్తోందా?’ అనుకోవద్దు. ఆమె చెప్పింది నిజమే. ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (ఈడీఎస్)తో బాధపడుతోంది టియా విల్సన్. ‘ఈడీఎస్’ అనేది జన్యుపరమైన రుగ్మత. చర్మం సాగదీయబడినట్లుగా ఉంటుంది. కీళ్లు వదులవుతాయి. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. భుజాన్ని డిస్లొకేట్ చేసినప్పుడు అచేతనంగా మారి వేలాడబడుతున్నట్లుగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ‘హౌ ఐ స్లీప్’ క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో టియా విల్సన్ పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్ల వీక్షకుల గుండెలను చెమ్మగిల్లేలా చేసింది. View this post on Instagram A post shared by Tia Wilson (@tortillawilson) (చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు..చివరికి?) -
ఫేస్బుక్, ఇన్స్టా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్.. ప్రారంభ ధర ఎంతంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. భారతదేశంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ కోసం వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పరిచయం చేసింది. గత ఏడాది లిమిటెడ్ యూజర్లతో మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్ టెస్ట్ చేసిన తరువాత.. ఇప్పుడు మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రూ. 639 నుంచి రూ. 21000 వరకు ఉన్నాయి. అయితే వివిధ సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్షిప్ ప్యాకేజీని ఎంచుకోవడంలో ఉపయోగకరంగా ఉండటానికి నాలుగు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ఈ వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి వెరిఫైడ్ బ్యాడ్జ్, భద్రత, కనెక్టివిటీకి సపోర్ట్ చేసే అదనపు ఫీచర్స్ కూడా పొందవచ్చు.టెస్టింగ్ సమయంలో ఒకే ప్లాన్ అందించిన మెటా.. ఇప్పుడు మొత్తం నాలుగు ప్లాన్స్ అందించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్స్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ అనేది గతంలో ఎక్స్ (ట్విటర్) ప్రారంభించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా చేరాయి. -
రీల్స్ చేస్తూ జలపాతంలో పడి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మృతి
మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతిచెందింది. మహారాష్ట్రలోని రాయ్ఘడ్ సమీపంలోని కుంభే జలపాతంలో వద్ద ఉన్న కొండగట్టులో ఈ ఘటన జరిగింది.ముంబైకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్దార్ జూలై 16న రీల్ చిత్రీకరించేందుకు ఏడుగురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది.ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, కోస్ట్ గార్డ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి యువతిని బయటకు తీసుకుని వచ్చారు. అయితే కిందకు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన యువతిని మనగావ్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.విహారయాత్ర.. విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరోవైపు మనగావ్ పోలీసులు, తహలసీల్దార్ పర్యాటకులకు సూచనలు చేశారు. జలపాతాలను, కొండలను సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర ప్రవర్తనలను నివారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. -
ఇన్స్టాగ్రామ్లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.షేఖా మహ్రాకు దుబాయ్లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్) రాసుకొచ్చారామె. View this post on Instagram A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra) దుబాయ్ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాఖ్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు. -
అంబానీ ఇంట అందగాడు
అందమైన కాలర్తో పింక్, గోల్డెన్ జాకెట్ ధరించి అనంత్ అంబానీ కుటుంబ వస్త్రధారణతో పోటీ పడుతూ వివాహ కార్యక్రమాల్లో తనూ విశేషంగా ఆహూతులను ఆకట్టుకుంది ‘హ్యాపీ’ అనే డాగ్. అహ్మదాబాద్కు చెందిన ఖ్యాతి అండ్ కరణ్ షా పంఖ్ డిజైనర్ పెట్ వేర్ దుస్తులను డిజైన్ చేసింది. స్వచ్ఛమైన సిల్క్ జాక్వర్డ్ ఫ్యాబ్రిక్తో ఆమె అంబానీల కోసం తయారు చేసిన పెంపుడు జంతువుల దుస్తుల్లో ఇది ఇరవై తొమ్మిదవది. వివాహ వేడుకలు జరుగుతున్నంతసేపూ హ్యాపీ హాయిగా మండపంపై తన స్థానాన్ని ఆక్రమించుకుని, చుట్టూ పరిశీలిస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలతో వీడియోల్లో సందడి చేసింది. ఇషా అంబానీ కూతురు బేబీ ఆదియుశక్తి ప్రేమతో హ్యాపీని ఆలింగనం చేసుకుంటుండగా, ఆమె తండ్రి ఆనంద్ పిరమల్ కూతురును అనుసరిస్తూ కనిపిస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోని ‘అత్యంత అందగాడు’ అంటూ అభివర్ణించారు వ్యూవర్స్. అంబానీ కుటుంబం పెంపుడు జంతువు హ్యాపీ ఈ యేడాది జనవరిలో అనం –రాధికల నిశ్చితార్థంలో ఉంగరం మోసే పాత్రను పోషించింది. అప్పుడే అంబానీ కుటుంబ ఫొటోలో ఇది ప్రధాన స్థానం పోందింది. -
ఇన్స్టాలో లైక్ల కోసం వన్యప్రాణుల వేట
వేంపల్లె: ఇన్స్ట్రాగామ్లో లైక్ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్గా మారాయి. వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్వో సందీప్రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు. -
Insta Reels: పోలీస్ స్టేషన్ను వదల్లేదు!
హైదరాబాద్, సాక్షి: సోషల్ మీడియాలో మోజుతో ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నీమధ్య తిరుమల పుణ్యక్షేత్రంలోనూ రీల్స్ చేసి ఆకతాయిలు భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ను వదల్లేదు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్న స్నేహితుడిని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడ ఇన్స్టా రీల్ చేశాడు. పీఎస్ ఆవరణలో అంతా వీడియో తీశాడు. పైగా దానికి బ్యాక్గ్రౌండ్లో ఓ పాటను ఉంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. A viral video filmed at the Bandlaguda Police Station in Hyderabad's Old City shows a suspect in lock-up meeting another person while recording a reel, they had posted on Instagram also. This incident highlights the issue of VIP treatment to suspects, rowdies and criminals at… pic.twitter.com/WRaLmYJoLH— Naseer Giyas (@NaseerGiyas) July 16, 2024 -
ఇన్స్టా రీల్స్ చేస్తోందన్న కోపంతో భార్యను..!
ఉప్పల్: ఫోన్లో నిత్యం రీల్స్ చూస్తోందని.. ఇన్స్టాలో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందని భార్యపై కక్షగట్టిన ఓ భర్త.. ఆమెను చంపేసి పరారైన కేసును ఉప్పల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ చక్రపాణి వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న ఉప్పల్ న్యూభరత్నగర్లోని ఓ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూడగా ఓ గోనే సంచిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత (28) దంపతులు ఆరు నెలలుగా ఉప్పల్ న్యూ భరత్నగర్లో ఉంటున్నారు. వీరికి కేన్సర్తో బాధపడుతున్న 8 నెలల కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగు తున్నాయి. ఇంటికి వచ్చిన భర్త ప్రదీప్ను మధుస్మిత పట్టించుకోకపోవడం, పలకరించకపోవడం.. ఎప్పుడు చూసినా ఫోన్లో రీల్స్ చూస్తూ ఉండేది. మధుస్మిత నిత్యం వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడేదని, దీంతో ఆమెపై అనుమానంతో ఈ నెల 7న రొట్టెల పీటతో కొట్టి చంపేశాడు. 8 నెలల కూతురును వెంట తీసుకుని సికింద్రాబాద్కు రైల్వేస్టేషన్కు వెళ్లాడు. తన కూతురును కాస్త చూస్తూ ఉండండని పక్కవాళ్లకు చెప్పి ప్రదీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు బేగంపేట్లోని ఓ హోటల్ పని చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో శనివారం ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడు ప్రదీప్ బోలాను పట్టుకున్నారు. భార్య తనను పట్టించుకోకపోయేదని, రోజంతా ఫోన్లో రీల్స్ చూస్తుండట.. రీల్స్ చేస్తుండటం.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో అనుమానం పెంచుకుని భార్యను చంపినట్లు విచారణంలో తేలిందని పోలీసులు చెప్పారు. కేసు మిస్టరీని ఛేదించిన సీఐ ఎలక్షన్ రెడ్డి, స్పెషల్ టీమ్ బృందాన్ని ఏసీపీ అభినందించారు. -
అధ్యక్ష బరిలో ట్రంప్.. మెటా కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 2021లో యూఎస్ క్యాపిటల్పై హింసాత్మకంగా దాడి చేశారు. ఆ సమయంలో హింసకు కారకులైనవారిని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశంసించినట్లు మెటా నిర్దారించింది. ఆ తరువాత ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ట్రంప్ మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించే అవకాశం ఉందని మెటా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా తప్పకుండా కొన్ని నియమాలకు లోబడి ఉండాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటివి చేస్తే.. శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మెటా తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాకుండా.. ట్రంప్ ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్ అకౌంట్లపై కూడా గతంలో సంబంధిత సంస్థలు ఆంక్షలు విధించాయి. గత ఏడాది ఈ పరిమితులను ఎత్తివేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా తన సందేశాలను జనాలకు చేరవేస్తూ వస్తున్నారు. -
'దయచేసి ఎవరు సీరియస్గా తీసుకోవద్దు'.. విశ్వక్ సేన్ విజ్ఞప్తి!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్. గోదావరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విశ్వక్ లైలా చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తన కెరీర్లో తొలిసారి లేడీ గెటప్లో కనిపించనున్నారు. అయితే తాజాగా విశ్వక్ సేన్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.తాజా పోస్ట్లో విశ్వక్ సేన్ రాస్తూ..'అందరికీ హాయ్.. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అయితే నా ఇన్స్టాగ్రామ్కు చిన్న విరామం మాత్రమే. మీరు ఎవరు చింతించాల్సిన పనిలేదు. ట్విట్టర్ ఖాతాను నా టీమ్ నిర్వహిస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేషన్ గురించి ఒత్తిడికి గురికావద్దని' సూచించారు.అంతేకాకుండా.. 'ఇటీవల నా సోషల్ మీడియా ఖాతా డియాక్టివేషన్ కారణంగా అందరూ మేసేజులు పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని. ఇది చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా నా వ్యక్తిగత జీవితాన్ని నిర్వచించదు. సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్గా తీసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. అయితే విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్ నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. Hey everyone, just a heads up—I posted a story about starting a social media detox. It's a small break from Instagram, nothing to worry about. Try being productive during this time! My team mostly manages my Twitter, so don't stress over my Instagram deactivation. Lately, I've…— VishwakSen (@VishwakSenActor) July 5, 2024 -
సమంత పోస్ట్పై వివాదం.. మద్దతుగా నిలిచిన నటుడు!
ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలాగే ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సామ్ నెట్టింట సలహాలు ఇస్తోంది. అయితే ఇటీవల సమంత చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.అయితే సామ్ సలహాను ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా "ది లివర్ డాక్" తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని ఆయన అన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశాడు. అయితే సమంత కూడా దీనిపై స్పందించింది. ఓ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది.తాజాగా ఈ విషయంపై నటుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. సామ్కు మద్దతుగా ట్విటర్లో పోస్ట్ చేశాడు. సమంత ట్యాగ్ చేసిన డాక్టర్ని మీరు డిబేట్కి ఆహ్వానించి ఉంటే బాగుండేందని అన్నారు. మనలో చాలా మందిలాగే సైన్స్ నిరక్షరాస్యురాలనడంలో సందేహం లేదు.. కానీ ఆమె చికిత్స తీసుకునే ముందు దాని గురించి కచ్చితమైన పరిశోధనలు చేసే వ్యక్తి అని తెలిపారు. అంతే కాదు సమంతకు అర్హత కలిగిన వైద్యుడే ఈ చికిత్సను సూచించాడని.. అందుకే ఆమె దానిని సిఫార్సు చేసిందని ట్విటర్లో రాసుకొచ్చారు. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ..'మనకు అందరిలాగే ఏది సరైందో తెలియదు. అర్హత కలిగిన వైద్యులే భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అనిపించినప్పుడు.. మనం ఇలాంటి సలహాలపైనే ఆధారపడతాం. ఇలాంటి థెరపీని ఆమె తీసుకుంటున్నది తప్ప.. నాకు దాని గురించి ఎలాంటి విషయాలు తెలియవు. ఒకవేళ ఆమెకు అది మంచిది కాకపోతే... నేనే తనను హెచ్చరిస్తా. నేను కూడా దయగల చాలా మంది వైద్యులను చూశా. చికిత్స అవసరమయ్యే పేషంట్కు ఇది ఎంత అవసరమో తెలుసు. ' పోస్ట్ చేశారు.ఒక వైద్యుడిగా ఈ సమాచారాన్ని బయటపెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ.. తోటి వైద్యుడితో డిబేట్ పెట్టి ఉంటే బాగుండేది. మీరు ప్రజలకు సలహాలు సూచించే వైద్యులు అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. అంతే కాదు దాని ప్రభావం గురించి కథనాలను ప్రచురించాలి. కోవిడ్ వ్యాక్సిన్ల నుంచి సైన్స్పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు... సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నభిప్రాయాలు ఉంటే... మనం ఎవరిని నమ్మాలి?' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయంలో సమంతకు రాహుల్ రవీంద్రన్ మద్దతుగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Dear Doctor, it would have been really nice if you had invited the Doctor she had tagged in her same post to a debate and engaged with him. We would have all learned a lot from it. Would have helped us make up our minds about this alternate therapy. She is science illiterate like… https://t.co/UpUYnL7VlJ— Rahul Ravindran (@23_rahulr) July 5, 2024 -
T20 World Cup 2024: విరాట్ కోహ్లినా మజాకా.. ఆల్టైమ్ రికార్డు
సోషల్మీడియాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కింగ్ సోషల్మీడియాలోని ఏ ప్లాట్ఫాంలో పోస్ట్ పెట్టినా కోట్లల్లో వ్యూస్, లైక్స్ వస్తాయి. తాజాగా విరాట్కు సంబంధించిన పోస్ట్ ఒకటి ఆల్టైమ్ రికార్డును సెట్ చేసింది.టీమిండియా టీ20 వరల్డ్కప్ 2024 గెలిచిన అనంతరం విరాట్ సహచరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ ఇన్స్టాగ్రామ్ చరిత్రలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన పోస్ట్గా రికార్డు సృష్టించింది. Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024ఈ వీడియోను ఏకంగా 126 మిలియన్ల మంది వీక్షించారు. 9.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఐసీసీ ఇన్స్టా చరిత్రలో ఇది అత్యధిక జనాధరణ పొందిన పోస్ట్గా రికార్డైంది. ఇన్స్టాలో 20 మిలియన్ లైక్స్ పొందిన తొలి భారతీయుడిగా, తొలి ఏషియన్ అథ్లెట్గా, సెకెండ్ ఏషియన్గా, ప్రపంచంలో ఐదో అథ్లెట్గా విరాట్ రికార్డులు నెలకొల్పాడు.ఐసీసీ ఇన్స్టా వీడియోకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన వీడియోలో కోహ్లి ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహింది పాడిన ఆల్టైమ్ హిట్ సాంగ్ "తునుక్ తునుక్ తన్"కు డ్యాన్స్ చేశాడు. కోహ్లికి జతగా అర్ష్దీప్, సిరాజ్, అక్షర్ పటేల్, బుమ్రా, రింకూ సింగ్ చిందులేశారు.VIRAT KOHLI'S INSTAGRAM POST ON T20 WORLD CUP VICTORY NOW HAS 20 MILLION LIKES...!!!! 🇮🇳- King Kohli becomes the first Asian to have 20 Million likes on a Instagram post in the History. 🐐🙌 pic.twitter.com/noofdlRQfP— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్కప్ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది. విరాట్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్కప్ విజయానంతరం విరాట్.. సహచరులు రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. కోహ్లి, రోహిత్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
ఇలా ఎవరైనా చేయగలరా?
కోలీవుడ్లో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడని నటీమణుల్లో సాక్షిఅగర్వాల్ ఒకరు. కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగని కథానాయకి పాత్రలోనే నటిస్తానని మడి కట్టుకుని కూర్చోకుండా, వచ్చిన ఎలాంటి అవకాశాన్ని అయినా ఒప్పేసుకుని నటిస్తున్నారు. అలా రాజారాణి చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమైన సాక్షి అగర్వాల్ ఆ తర్వాత కాలా, విశ్వాసం, టెడీ వంటి పలు చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం పంచ చిత్రాల్లో కథానాయకిగా నటిస్తున్నారు. అలా ఈమె నటించిన గెస్ట్, ది నైట్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలు తన కెరీర్కు ప్లస్ అవుతున్నాయనే నమ్మకంతో ఉన్న సాక్షిఅగర్వాల్ తన పబ్లిసిటీ యుక్తిని బాగానే ప్రదర్శిస్తున్నారు. తరచూ ఇన్స్ట్రాగామ్లో తన గ్లామరస్ ఫొటోలను, వర్కౌట్స్ వీడియోలను పొందుపరుస్తూ అభిమానులను బాగా ఎంటర్టెయిన్ చేస్తున్నారు. అలా తాజాగా ఈమె వర్కౌట్ చేస్తున్న ఒక వీడియోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అందులో ఎవరైనా ఇలా చేసి తనను అధిగమించగలరా అంటూ సవాల్ విసిరారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫ్రీ పబ్లిసిటీ కోసం సాక్షి అగర్వాల్ ఇలాంటివి తరచూ చేస్తుంటారన్నది గమనార్హం. అదేవిధంగా మంచి సత్తా కలిగిన పాత్ర లభిస్తే నటిగా తానేంటో నిరూపించుకుంటానని సాక్షిఅగర్వాల్ అంటున్నారు. -
18 ఏళ్ల తర్వాత తప్పిపోయిన సోదరుడిని కలిపిన ఇన్స్టా రీల్!
లక్నో: ఇంటి నుంచి తప్పిపోయిన పులువురిని సోషల్ మీడియా వాళ్ల కుటుంబాలకు చేరవేస్తోంది. తప్పినపోయిన వారు చేస్తున్న ఇస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు వైరల్గా మారటంతో వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తిపట్టి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉద్విగ్నభరిత సీన్స్ను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది.చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన సోదరుడిని ఒక అక్క ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశారు. ఆయనకు విరిగిన పన్ను ఉండటంతో తన సోదరుడేనని ఆమె గుర్తుపట్టారు. ఈ ఘటన ఆయన వెళ్లిపోయిన 18 ఏళ్ల తర్వాత జరగింది. ఇన్స్టాగ్రామ్ రీల్లో కనిపించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వివరాలు.. ఉత్తరప్రదేశ్లోని హతిపూర్కు చెందిన రాజ్కుమారి మొబైల్లో ఒక రీల్స్ చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన ఆయన పన్ను చూసి 18 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి ముంబై వెళ్లిన తన సోదరుడు బాల్ గోవింద్లా ఉన్నాడని అనుమానించారు. వెంటనే ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆయన్న సంప్రదించారు. అనంతరం చిన్నప్పడు తను సోదరుడితో గడిపిన విషయాలు ప్రస్తావించారు. పాత విషయాలకు ఆయన కూడా స్పందించడంతో.. తన సోదరుడేనని రాజ్ కుమారి నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రాజస్తాన్లోని జైపూర్లో ఉంటున్న ఆయన 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకున్నారు. తప్పిపోయిన తన సోదరుడిని సోషల్మీడియానే కలిపిందని రాజ్కుమారి ఆనందం వ్యక్తం చేశారు. -
ఇన్స్టా పోస్ట్ వైరల్ కావాలంటే.. సీఈఓ సూచన
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఇన్స్టాగ్రామ్కు చాలా క్రేజ్ ఉంది. ఏదైనా పోస్ట్ వైరల్గా మారాలంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాల్సిందే. అయితే ఎన్ని పోస్ట్లు పెట్టినా రీచ్ ఎక్కువగా రావడం లేదనుకునేవారికి ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి కొన్ని చిట్కాలు చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్గా మారింది.ఆయన వీడియోలో మాట్లాడుతూ..‘సాధారణంగా మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో లేదా ఫొటో వైరల్గా మారాలని కోరుకుంటాం. మన కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఏదైనా కంటెంట్ను పోస్ట్ చేసి అలా వదిలేయకుండా నిత్యం కామెంట్లను పరిశీలిస్తుండాలి. మన ఫాలోవర్లు, ఇతరులు మన కంటెంట్ తీరుపై చాలా విలువైన కామెంట్లు చేస్తారు. వారీ ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం చేసుకుని దానికి తగిన కంటెంట్ను ఇవ్వడానికి ప్రయత్నించాలి. పోస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కనీసం రెండు వారాలపాటు కామెంట్లను ట్రాక్ చేయాలి. వాటికి తగిన రిప్లై ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) -
ప్రేమ పేరుతో వల.. బాలికపై లైంగిక దాడి
హిమాయత్నగర్: ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో సుల్తాన్బజార్ ఏసీపీ కె.శంకర్, ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్, అడ్మిన్ ఎస్సై జి.నరేష్ కుమార్తో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆగాపురాకు చెందిన షేక్ అర్బాస్(23) బైక్ మెకానిక్. ఇన్స్ట్రాగామ్లో 13 ఏళ్ల మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రతిరోజూ చాటింగ్ చేస్తూ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఈ నెల 24న పాఠశాలకు వచి్చన బాలికను తనతో పాటు గుల్బర్గాకు తీసుకెళ్లాడు. దీంతో బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అఘాపురాకు చెందిన షేక్ అర్బాస్ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకున్న నిందితుడు భయంతో బాలికను తన కుటుంబ సభ్యులకు అప్పగించి పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్కు తరలించి, వాగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు నిందితుడు రెండు రోజుల పాటు బాలికతో లాడ్జీలో ఉండి లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం నాంపల్లి రైల్వేస్టేషన్లో షేక్ అర్బాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. -
మళ్లీ పుట్టానంటున్న స్టార్ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తెలియనివారు ఉండరు. 1990ల్లో స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత ప్రతిష్టను పెంచింది. మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. సుస్మిత సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేసింది.అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా బయోలో కీలక మార్పులు చేసింది. ఏకంగా తన రెండో పుట్టినరోజు అంటూ బయోలో రాసుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అదేేంటని నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.అయితే గతేడాది సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2023లో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆమె... ఆ తర్వాత కోలుకుంది. అందుకే తాజాగా ఆమె తన ఇన్స్టా బయోలో బర్త్ డే తేదీని రాసుకొచ్చింది. నా రెండో పుట్టిన రోజు ఇదేనంటూ.. 27 ఫిబ్రవరి 2023 అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా.. తనకు పునర్జన్మగా భావించి ఆ తేదీని అలా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది.కాగా.. 1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్లలో నటించింది. స్టార్ హీరోయిన్గా ఎదిగిన సుస్మితా సేన్ చివరిసారిగా ఆర్య సీజన్ 3లో కనిపించింది. -
‘ఏం చేసావ్ నాగ్ ? అసలేంటి ఇదంతా!’ కల్కి నటి భావోద్వేగ పోస్ట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి హిట్ టాక్తో దూసుకుపోతోంది. ప్రధానంగా నాగ్ అశ్విన్ కథ, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ఇలా పలు రకాలుగా మేజిక్ చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సెన్సేషనల్ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించిన ఫరియా అబ్దుల్లా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మేరకు ఇన్స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అలాగే షూటింగ్ సందర్భంగా తీసుకున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)ఏం చేసావ్ నాగ్ అశ్విన్? అసలేంటి ఇదంతా! ఇప్పుడే కల్కి 2898AD చూసాను. అయినా మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తోంది అని పేర్కొంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరి అంచనాలను మించిపోతోంది అద్భుతమైన ఫీలింగ్ ఇది అంటూ వైజయంతి మూవీస్ అండ్ టీంకు అభినందనలు తెలిపింది. ఫరియా షేర్ చేసిన ప్రభాస్తో సెల్ఫీ , తన పాత్రకు సంబందించిన లుక్ ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంది.వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్కి అడియన్స్ ఫిదా. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటన పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా దీపికా పదుకోనె, దిశా పఠాని, స్టార్ హీరో కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
ఏడేళ్ల సావాసం.. ప్రియుడితో పెళ్లి.. అంతలోనే మొదటిదెబ్బ! (ఫోటోలు)
-
రీల్స్ పిచ్చి పీక్స్కు.. సముద్రంలో కార్లతో ఇరుక్కపోయిన యువకులు
కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. తాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగు చూసింది.ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యుకులు రీల్స్ కోసం తమ రెండు మహీంద్రా థార్ ఎస్యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీరు లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రెడ్, వైట్ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్వీలను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b— IANS (@ians_india) June 23, 2024 -
ఈ స్పైడర్ మ్యానుడు చపాతీలు కూడా చేస్తాడు
స్పైడర్ మ్యాన్ అంటే... పది అంతస్తుల బిల్డింగ్ నుంచి అవలీలగా జంప్ చేసేవాడు. అగ్నిగుండంలో హాయిగా మార్నింగ్ వాక్ చేసేవాడు... టోటల్గా చెప్పుకోవాలంటే ‘స్పైడర్ మాన్’ అంటే సాహసాల సాగరం.‘స్పైడర్ మ్యాన్ అంటే అస్తమానం సాహసాలేనా? ఇలా కూడా’ అని ఒక జైపూర్ యువకుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 13 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది.‘ఇంతకీ అతడు ఏంచేశాడు?’ అనే విషయానికి వస్తే.... స్పైడర్మ్యాన్ డ్రెస్ వేసుకొని చపాతీలు చేశాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. గిన్నెలు శుభ్రం చేశాడు. ఎండలో తల మీద ఇటుకలు మోశాడు. ‘అసలు సిసలు సాహసాలంటే ఇవే’ అన్నారు నెటిజనులు. ‘గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ స్పైడర్–మ్యాన్ సినిమాలలోని ఐకానిక్ డైలాగును ఉటంకించారు. -
ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం 'క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్' అనే సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్ అనేది ఫాలోవర్స్ అందరికి కనిపించేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తుంది.క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో కావలసిన వాళ్ళను యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇన్స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.ఇన్స్టాగ్రామ్.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ అనే సరికొత్త ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, మెటా ఇన్స్టాగ్రామ్ను మరింత ప్రైవేట్ ప్లేస్గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్లో.. గ్రిడ్లో పోస్ట్లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ ప్రవేశపెట్టింది.🚨 NEW 🚨Go Live with your Close Friends to ask for OOTD advice or just chat in real time 🎥✨ pic.twitter.com/wDYjqw1N4f— Instagram (@instagram) June 20, 2024 -
సెలబ్రిటీనే ఇలా చేస్తే ఎలా?.. మీకు రూల్స్ వర్తించవా?
సోషల్ మీడియా వచ్చాక రీల్స్ చేయడం ఓ పిచ్చి అలవాటుగా మారిపోయింది. ఎక్కడపడితే రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మెట్రో, బస్సులు, రైళ్లు, రోడ్లను కూడా వదలడం లేదు. కొందరైతే రీల్స్ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రీల్స్ చేస్తున్నారు.అలాంటి లిస్ట్లో మన సెలబ్రిటీ, యాంకర్ సావిత్రి కూడా చేరిపోయింది. హైదరాబాద్లో ఓఆర్ఆర్పై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తప్ప మనుషులకు నడవడానికి అవకాశం లేదు. ఓఆర్ఆర్పై దాదాపు 120 స్పీడుతో వాహనాలు వెళ్తుంటాయి. అప్పడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.మరి నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆమెను చూసి.. మరికొందరు రీల్స్ చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వారిని ఓఆర్ఆర్పై రీల్స్ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదంటే రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్ను రీల్స్కు అడ్డాగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆమెపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
ట్విట్టర్లో కోహ్లి అరుదైన ఫీట్..
-
Tech Talk: గూగుల్ 'ఆస్క్ ఫొటోస్' తో.. ఈ వెతుకులాటకి చెక్!
టెక్ దిగ్గజం గూగుల్ రకరకాల కొత్త ఫీచర్ల గురించి ప్రకటించింది. అందులో ‘ఆస్క్ ఫొటోస్’ ఒకటి. అడ్వాన్స్డ్ జెమిని ఏఐ మోడల్తో వస్తున్న ఈ ఫీచర్ను యూజర్లు తమ ఫొటో కలెక్షన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. యూజర్లు తమ గ్యాలరీని విస్తరించినప్పుడు వారికి అవసరమైన ఫొటోను కనుక్కోవడం కష్టంగా ఉండవచ్చు.దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పెసిఫిక్ ఫొటోను త్వరగా కనిపెట్టడానికి ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. కీవర్డ్ కాంబినేషన్స్తో పనిలేదు. ప్రాంప్ట్ చాలు. ఉదాహరణకు... ‘షో మీ ది బెస్ట్ ఫొటో ఫ్రమ్ ఈచ్ నేషనల్ పార్క్ ఐ హ్యావ్ విజిటెడ్’ అని ప్రాంప్ట్ ఇస్తే సంబంధిత ఇమేజ్లను చూపిస్తుంది. ఈ ఏఐ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.... యూజర్లు తమ ఫొటోల గురించి వివరంగా అడగవచ్చు.హువావే వాచ్ ఫిట్ 3డిస్ప్లే: 1.82 అంగుళాలురిజల్యూషన్: 480“408 పిక్సెల్స్బరువు: 26 గ్రా బ్యాటరీ: 400 ఎంఏహెచ్- ఆటోమెటిక్ప్రాంప్ట్స్ – ట్రాక్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, వెదర్ వార్నింగ్స్ డిస్ప్లేఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కు సంగీతం..ఇన్స్టాగ్రామ్ప్రొఫైల్కు పర్సనలైజ్డ్ టచ్ ఇవ్వడానికి, మ్యూజిక్ ద్వారా మన మూడ్ను రెఫ్లెక్ట్ చేయడానికి ఉపకరించే లేటెస్ట్ ఫీచర్ ఇది. దీని కోసం...– ఇన్స్టాగ్రామ్ యాప్ను అప్డేట్ చేయాలి– ప్రొఫైల్ స్క్రీన్తో యాక్సెస్ కావడానికి బాటమ్ రైట్ కార్నర్లోనిప్రొఫైల్ పిక్చర్ ట్యాప్ చేయాలి– ఎడిట్ప్రొఫైల్–ట్యాప్– మ్యూజిక్–ట్యాప్– పాటను ఎంపిక చేసుకోవడానికి ప్రొఫైల్ సాంగ్ సెక్షన్లో ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయాలి.షావోమీ ప్యాడ్ 6ఎస్ ప్రో 12.4..డిస్ప్లే: 12.40 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 10000 ఎంఏహెచ్ రిఫ్రెష్ రేట్: 144 హెచ్జడ్మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 256జీబి 12జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్డ్రీమ్ స్క్రీన్..‘డ్రీమ్ స్క్రీన్’ అనే కొత్తఫీచర్ని పరీక్షిస్తోంది యూట్యూబ్. ఏఐ ద్వారా ‘షార్ట్స్’కు బ్యాక్డ్రాప్ను జెనరేట్ చేసే ఫీచర్ ఇది. యూజర్లు డ్రీమ్ స్క్రీన్కు యాక్సెస్ ΄÷ందిన తరువాత బ్యాక్గ్రౌండ్లో తమకు ఏమి కావాలో వివరిస్తూప్రాంప్ట్ ఇవ్వవచ్చు.ఉదా: ఒక ద్వీపంలో ఫ్యాన్సీ హోటల్. ఇమేజ్ జనరేట్ అయిన తరువాత వెంటనే బ్యాక్గ్రౌండ్కు జత చేయవచ్చు. ఈ ప్రయోగాత్మక ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన ‘షార్ట్స్’ క్రియేటర్స్ మాత్రమే అందుబాటులో ఉంది.ఇవి చదవండి: Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్లో ఉంటాయి’ -
Viral Video: అబ్బో! ఇది బైకే, కాదు కాదు... కారే! అదేంటో మీరే చూడండి!
ఈ రోజుల్లో యువకులు వినూత్నంగా ఆలోచిస్తూ తమ బుర్రకు పదును పెడుతున్నారు. సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వేదికగా తమ ఆలోచనలను షేర్ చేస్తున్నారు. ఏదో ఒకరకంగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ విధంగానే ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో తనకున్న పల్సర్ బైక్రూపాన్నే మార్చేశాడు. అదేంటో మీరే చూసేయ్యండి!వాహనాలను కొత్తగా, కొద్దిగా చేర్పులతో సవరించేటువంటి వీడియోలను మీరు సోషల్ మీడియాలో ఇది వరకే చూసుంటారు. ఇది మాత్రం అందుకు భిన్నం. అది ట్రాక్టర్.. కాదు కాదు.. కారు. అసలే కాదు.. నాలుగు చక్రాల పల్సర్ బైకే! ప్రస్తుతం ఈ వీడియే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతా @kuldeepsinghrawat2లో పోస్ట్ అయ్యింది. దీని ప్రకారం పల్సర్ బక్కు రెండు చక్రాలైతే, దీనికి మాత్రం నాలుగు చక్రాలను అమర్చాడు ఆ కుర్రాడు. ఆ బైక్ రోడ్డుపై కారులా మారి రయ్ రయ్మంటూ.. దూకినప్పుడు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్కి.. స్పోర్ట్స్ కారు లుక్ అందించాడు. ఇందులో విశేషం ఏంటంటే? నాలుగు చక్రాలను అమర్చడంతో.. కాలు కింద పెట్టకుండా బైక్ బ్యాలెన్స్ చెదిరిపోకుండా ఉండడమే. సూపర్ కదూ!ఇవి చదవండి: క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే! -
Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా
బంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని ఉదయ్నగర్లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి’.. సీఈఓ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు
మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్స్టాగ్రామ్లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
ఇన్స్టాగ్రామ్ ‘పీక్’ ఫీచర్ని ఎప్పుడైనా ట్రై చేశారా!
‘పీక్’ అనే కొత్త ఫీచర్ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్ చేయని, అన్ఫిల్టర్, ఇన్–ది–మూమెంట్ ఫొటోలను యూజర్లు స్పీడ్గా క్యాప్చర్, షేర్ చేయవచ్చు. స్నాప్చాట్, బీరియల్ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్’పై దృష్టి పెట్టింది ఇన్స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్స్టాగ్రామ్లోని ప్రస్తుత ‘స్టోరీస్’ ఫీచర్లా కాకుండా ‘పీక్’ ఫొటోలు సింగిల్ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్ మూమెంట్స్ విత్ ది పీపుల్ యూ లవ్’ అని ‘పీక్’ గురించి చెప్పింది ఇన్స్టాగ్రామ్.గూగుల్ కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్..కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్ వియో, ఇమాజెన్ 3లను గూగుల్ లాంచ్ చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్ల నుంచి వీడియోలను జనరేట్ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్ 3 అనేది గూగుల్కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్–టు–ఇమేజ్’ మోడల్. ‘ఇమాజెన్ 3 అనేది టెక్స్›్ట–టు–ఇమేజ్ హైక్వాలిటీ మోడల్.ఫొటోరియలిస్టిక్, లైఫ్లైక్ ఇమేజ్లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్. మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్గా గూగుల్ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ ‘టైమ్ల్యాప్స్’ ‘ఏరియల్ ష్టార్స్’లాంటి సినిమాటిక్ కాన్సెప్ట్లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్లకు ఇది గేమ్–చేంజర్ అవుతుందని ప్రకటించింది గూగుల్.హువావే మేట్ బుక్ 14..సైజ్: 14.2 అంగుళాలు రిజల్యూషన్: 2880్ఠ1920 పిక్సెల్స్బరువు: 1.31 కేజీ మెమోరీ: 16జీబి స్టోరేజ్: 512 జీబి/1టీబిబ్యాటరీ లైఫ్: 19 గంటలు, ఏఐ ఫీచర్స్, ఇన్టెల్ కోర్ ఆల్ట్రా చిప్ఆల్ట్రా హ్యూమన్ రింగ్ ఏయిర్..థిక్: 2.5 ఎంఎంవైడ్: 8.1 ఎంఎం బరువు: 3 గ్రా. కలర్ ఆప్షన్: టైటానియం పీపీజీ ఆప్టికల్ సెన్సర్: హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, వాటర్ రెసిస్టెంట్,సపోర్ట్స్: 22 వర్కవుట్ మోడ్స్హెచ్ఎండీ టీ21 ట్యాబ్..సైజ్: 10.36 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13రిజల్యూషన్: 1200్ఠ2000 పిక్సెల్స్ కలర్: బ్లాక్ స్టీల్ఇంటర్నల్: 64జీబి 4జీబి ర్యామ్/ 128జీబి 4జీబి ర్యామ్ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్, స్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ఇవి చదవండి: గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు! -
ఇన్స్టా రీల్ కోసం వందడుగుల ఎత్తు నుంచి దూకి..
ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం సాహసం చేయబోయి ఓ టీనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుల కళ్లెదుటే.. అదీ మొబైల్లో చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.జార్ఖండ్లోని షాహిబ్గంజ్కు చెందిన 18 ఏళ్ల తౌసిఫ్.. స్నేహితుల ప్రొత్సహాం నేపథ్యంలో ఓ క్వారీలోని సరస్సులోకి 100 ఫీట్ల ఎత్తులోంచి దూకాడు. దూకిన వెంటనే ఈత కొడుతూ కనిపించిన తౌసిఫ్ ఆ తరువాత కొంచెం దూరం వెళ్లకముందే మునిగిపోయాడు. అప్పటికే ఆ సరస్సులో ఈత కొడుతున్న స్నేహితులు రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది.స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా.. కాసేపటికి తౌసిఫ్ మృతదేహాన్ని వెలికితీశారు. డీఎస్పీ విజయ్ కుమార్ కుష్వా వెల్లడించిన వివరాల ప్రకారం.. నీళ్లలో దూకగానే ఆ లోతుకు టీనేజర్ తనను తాను నియంత్రించుకోలేక మునిగిపోయడు. -
డార్లింగ్ లైఫ్లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
-
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ తన ఇన్స్టాలో క్యూఆర్ కోడ్ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్ను ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ను అడుగుతున్నా. యానిమల్స్, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) స్తంభించాయి. అవుట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్’ (ట్విటర్)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్బ్లాక్స్ రెండు సామాజిక వెబ్సైట్లు (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్లో పేర్కొంది. -
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్ని రోజులు ఆన్లైన్లో సైబర్ నేరస్తులు.. దొంగచాటుగా ఓటీపీ సాయంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్లలో సొమ్మును కాజేయడం రివాజుగా మారింది.కానీ రాను రాను సైబర్ మోసగాళ్లు తెలివి మీరుతున్నారు. తాజాగా, చెల్లెమ్మా.. మేం మీకు దేవుడిచ్చిన అన్నయ్యలం అంటూ అందిన కాడికి సొమ్మును దోచేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో లక్నోకు చెందిన ఓ మహిళను రవికుమార్, రాణా ప్రతాప్ సింగ్, మనోజ్ కుమార్లు పరిచయం చేసుకున్నారు. ఆ మహిళ తమపై నమ్మకం పెరిగేలా మెసిలారు. రోజులు గడుస్తున్నాయి. మాటలు కోటలు దాటాయి.ఆన్ లైన్ స్నేహాలు కాస్తా.. ఆఫ్ లైన్లోనే ఇరువురి ఫోన్నెంబర్లు ఇచ్చు పుచ్చుకునే వరకు వెళ్లింది. గుడ్ మార్నింగ్లు, గుడ్నైట్లు..ఫెస్టివల్ విషెస్తో ఆమెపై అన్న ప్రేమను ఒలకబోసేవారు. వారిపై ఆమెకు నమ్మకం కలగడంతో వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండేది. అయితే ఓ రోజు త్వరలో తన పెళ్లి రోజు అంటూ ఇన్ స్టాగ్రామ్లో ఆ ముగ్గురికి చెప్పింది. అంతే ఆమె డబ్బును కాజేయాలని కేటుగాళ్లు ప్లాన్ చేశారు.ప్లాన్లో భాగంగా మనోజ్కుమార్ బాధితురాలికి ఫోన్ చేసి పెళ్లి రోజు సందర్భంగా ఖరీదైన పెళ్లి కానుక ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు షిప్పింగ్ అవసరాల కోసం తన ఆధార్ కార్డు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లను షేర్ చేసింది.కట్ చేస్తే విమానాశ్రయంలో తాను కొన్న ఖరీదైన గిఫ్ట్ను ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకున్నారని, దానిని విడిపించేందుకు కొంత మొత్తం చెల్లించాలని మనోజ్ ఆమెకు ఫోన్ చేశాడు. డబ్బులు చెల్లించేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఫలితంగా బెదిరింపులు ఎక్కువయ్యాయి. నేను చెప్పినట్టు చేయకుంటే సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని ప్రమేయం చేసి నన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించాడు. బెదిరింపుల కారణంగా, ఒత్తిడికి గురైన ఆమె క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో రూ.1.94 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో మోసపోయామంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అభిజిత్ శంకర్ తెలిపారు. ఆన్లైన్లో దొరికే ప్రేమల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇలాగే నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. -
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్ని చేస్తూ ఆమె చివరి ఇన్స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
Video: ఇదేం పిచ్చి.. ఇన్స్టా రీల్స్ కోసం హైవేపై పిస్తోల్తో డ్యాన్స్
ఇది సోషల్ మీడియా కాలం.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ 24 గంటలు ఆన్లైన్లోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో పాపులర్ అయ్యేందుకు తహతహలాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ లైకులు, వ్యూవర్షిప్ కోసం అట్రాక్ట్ చేస్తున్నారు. రోజురోజుకీ ఈ పిచ్చి పీక్స్కు వెళుతోంది. వాటి కోసం ఒక్కోసారి ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు.. తాజాగా ఓ యువతి వైరల్ అవ్వడం కోసం తుపాకీతో నడిరోడ్డుపై రీల్స్ చేయడంతో ఇరకాటంలో పడింది.ఉత్తర ప్రదేశ్లోని లక్నో హైవేపై ఓ అమ్మాయి తన చేతిలో పిస్తోల్తో ఆ రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. పాపులర్ యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ .. లక్నో హైవేపై ఓ భోజ్పురి పాటైకు స్టెప్పులేసింది. యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఓ అడ్వకేట్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు. వీడియో వైరల్కావడంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ అమ్మాయిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక యువతి డ్యాన్స్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. instagram star सिमरन यादव लखनऊ सरेआम नियम कानून व आचार संहिता की धज्जियाँ उड़ाते हुए highway पर पिस्टल को लहराकर video वायरल करके समाज में अपनी बिरादरी का रौब जमा रहीं हैं परंतु अधिकारी चुप्पी साधे हुए है l @dgpup @ECISVEEP @Splucknow_rural @Igrangelucknow @adgzonelucknow @myogi pic.twitter.com/GN4zWsc1P9— Advocate kalyanji Chaudhary (@DeewaneHindust1) May 9, 2024 -
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. -
Lok sabha elections 2024: దుమ్ము రేపుతున్న సోషల్ మీడియా
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో పారీ్టలు కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. ప్రజల మూడ్తో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ‘లైక్ చేయండి.. షేర్ చేయండి.. సబ్ర్స్కయిబ్ చేసుకోండి’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎడాపెడా యాడ్లు కుమ్మరిస్తూ డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. పలు పారీ్టలు లోక్సభ ఎన్నికల సీజన్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి..! పదేళ్లుగా దేశాన్నేలుతున్న బీజేపీయే సోషల్ మీడియాలోనూ రాజ్యమేలుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నాయి. ప్రస్తుత లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్కు పెద్దగా సోషల్ ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. నేతల విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులెవరకీ అందనంత ఎత్తులో మూడు లైక్లు.. ఆరు షేర్లు అన్నట్టుగా ‘సోషల్’ జర్నీలో దూసుకుపోతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పార్టీలు, నేతల సోషల్ మీడియా పేజీలు/ఖాతాల్లో యూజర్ల సంఖ్య పెరుగుదల, డిజిటల్ యాడ్ వ్యయాలు తదితరాలను ‘సోషల్ బ్లేడ్’ అనే ఎనలిటిక్స్ సంస్థ విశ్లేషించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ‘ఎక్స్’ ఫ్యాక్టర్! సోషల్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ప్రతి పార్టీ నిలకడగా యూజర్లను పెంచుకుంటూ వస్తోంది. బీజేపీ ఎక్స్ ఖాతాకు గత మూడు నెల్లలో 4 లక్షల పైచిలుకు యూజర్లు జై కొట్టారు. కాంగ్రెస్ 2.37 లక్షల కొత్త ఫాలోవర్లను సాధించింది. ఆప్కు 12,000 మంది నయా యూజర్లు దక్కారు. టీఎంసీని కొత్తగా ఫాలో అయిన వారి సంఖ్య 9,800. మైక్రో బ్లాగింగ్కు కీలక వేదికగా నిలుస్తున్న ఈ సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2.18 కోట్ల ఫాలోవర్లున్నారు! కాంగ్రెస్ను 1.04 కోట్లు, ఆప్ను 65 లక్షల ఎక్స్ యూజర్లు ఫాలో అవుతున్నారు. టీఎంసీ మాత్రం 6.9 లక్షలతో వెనకబడి ఉంది. యూట్యూబ్లో ‘ఆప్’ షో పారీ్టల ప్రసంగాలు, ప్రచార వీడియోలు, మీడియా సమావేశాలకు కీలక వేదికగా నిలుస్తున్న యూట్యూబ్లో ఆప్ ‘చీపురు’ తిరగేస్తోంది. కొత్త సబ్్రస్కయిబర్లను పెంచుకోవడంలో ఆప్తో పాటు కాంగ్రెస్ కూడా ముందుండగా బీజేపీకి మాత్రం క్రమంగా తగ్గుముఖం పట్టారు. గత మూడు నెలల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 5.9 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఒక్క మార్చిలోనే ఆప్ యూట్యూబ్ చానల్ను ఏకంగా 3.6 లక్షల మంది సబ్ర్స్కయిబ్ చేసుకున్నారు! బీజేపీ మాత్రం జనవరిలో 3 లక్షలకు పైగా కొత్త యూజర్లు జతయినా ఫిబ్రవరి, మార్చిల్లో భారీగా తగ్గారు. మొత్తమ్మీద 3 నెలల్లో బీజేపీ చానల్కు 5.3 లక్షలు, కాంగ్రెస్క 5 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. టీఎంసీ 28,000 మంది యూజర్లను సంపాదించింది. అయితే బీజేపీ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. జనవరి–మార్చి మధ్య ఏకంగా 43.2 కోట్ల వీక్షణలు దక్కాయి. తర్వాతి స్థానంలో ఆప్ (30.78 కోట్లు), కాంగ్రెస్ (16.69 కోట్లు), టీఎంసీ (93 లక్షలు) ఉన్నాయి. 59.9 లక్షల సబ్స్క్రయిబర్లు, 10 వేలకు పైగా వీడియోలతో యూట్యూబ్ను ఆప్ ఊడ్చేస్తోంది. బీజేపీ యూట్యూబ్ చానల్ 58.2 లక్షల సబ్ర్స్కయిబర్లు, 41 వేల వీడియోలతో ‘టాప్’ లేపుతోంది. కాంగ్రెస్కు 44.8 లక్షలు, తృణమూల్ను 5.91 లక్షల మంది సబ్్రస్కయిబ్ చేసుకున్నారు. ఎదురులేని మోదీ... సోషల్ మీడియా వేదికేదైనా దేశంలోనే గాక ప్రపంచంలోనే తిరుగులేని నాయకునిగా మోదీ దుమ్మురేపుతున్నారు. భారత్లో ఏ నాయకుడూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు! గత మూడు నెలల్లో మోదీ ‘ఎక్స్’ యూజర్ల సంఖ్య 26 లక్షలు పెరిగి 9.73 కోట్లకు చేరింది. కేజ్రీవాల్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్ష పెరిగి 2.74 కోట్లుగా ఉంది. రాహుల్గాం«దీకి కొత్తగా 5 లక్షల మంది జతయ్యారు. ఆయన యూజర్ల సంఖ్య 2.54 కోట్లకు పెరిగింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వల్పంగా 52,000 మంది యూజర్లు దక్కారు. ఎక్స్లో ఆమెను 74 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఎక్స్లో అత్యంత యాక్టివ్గా ఉండే రాజకీయవేత్తగా కూడా మోదీ నిలుస్తున్నారు. గత మూడు నెలల్లో మోదీ 1,367 పోస్టులు పబ్లిష్ చేశారు. కేజ్రీవాల్ 270, రాహుల్ 187 పోస్టులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇన్స్టాలోనూ మోదీకి ఏకంగా 8.85 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అందులో గత మూణ్నెల్లలోనే 52 లక్షల మంది మోదీని కొత్తగా ఫాలో కావడం జెన్ జెడ్లోనూ ఆయన క్రేజ్కు అద్దం పడుతోంది. ఇన్స్టాలో రాహుల్కు 68 లక్షలు, కేజ్రీవాల్కు 22 లక్షలు, మమతాకు కేవలం 3.84 లక్షల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు! ఇక యూట్యూబ్లోనూ మోదీదే హవా! 2.29 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఆయన సొంతం. రాహుల్ (44.7 లక్షలు), కేజ్రీవాల్ (7.58 లక్షలు) మోదీకి ఆమడ దూరంలో ఉన్నారు. గత మూడు నెలల్లో మోదీ చానల్లో పబ్లిషైన వీడియోలకు అత్యధికంగా 47.7 కోట్ల వ్యూస్ దక్కాయి! ఇది రాహుల్, కేజ్రీవాల్ వీడియోల కంటే రెట్టింపు కావడం విశేషం. ఇన్స్టా.. జెన్–జెడ్ ఓటర్ల ‘డెన్’ ఇన్స్టాగ్రామ్లో రీల్స్.. స్టోరీస్.. పోస్ట్లు.. లైవ్ వీడియోలతో చెలరేగిపోతున్న నవతరం యువత (జెనరేషన్ జెడ్)కు చేరువయ్యేందుకు పారీ్టలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఓటేయనున్న యూత్కు అడ్డగా మారిన ఈ సోషల్ వేదికపై మరింతగా ఫోకస్ చేస్తున్నాయి. తాజా డేటా ప్రకారం మెటా ఫ్లాట్ఫాంలైన ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ల్లో బీజేపీ, కాంగ్రెస్ గత నాలుగు నెలల్లో చేసిన యాడ్ వ్యయాల్లో సింహ భాగం ఇన్స్టాపైనే వెచి్చంచడం దీని ప్రాధాన్యానికి నిదర్శనం. గత మూడు నెలల్లో ఈ ప్లాట్ఫాంలో కాంగ్రెస్ 13.2 లక్షల మంది ఫాలోవర్లను పెంచుకోగా బీజేపీ (8.5 లక్షలు), ఆప్ (2.3 లక్షల)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఎంసీకి 6,000 మంది కొత్త యూజర్లు దక్కారు. మొత్తం ఫాలోవర్ల విషయానికొస్తే, బీజేపీకి 76 లక్షలు, కాంగ్రెస్కు 43 లక్షలు, ఆప్కు 12 లక్షలు, తృణమూల్కు కేవలం 1.1 లక్షల మంది ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్నెస్కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
యోగాసనాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ను చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ , యోగా వర్కౌట్స్తో ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంటుంది. సండే యోగా అంటూ క్లిష్టమైన కరీనా డైనమిక్ యోగా చక్రాసనం ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఫిట్నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ కరీనా ఆసనాల ఫోటోలు సోషల్మీడియాలోపోస్ట్ చేసింది.దీన్ని విరాభద్రసనా II అని కూడా పిలుస్తారంటూ ఆమె ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను పెళ్లాడింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాక్డైన్ సమయంలో నుంచి నిత్యం యోగా సాధన చేస్తూ వర్కౌట్స్ వీడియోలను ఇన్స్టాలో షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
రీల్స్తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్గా సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్కు సమ్మర్ వెకేషన్కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్ను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
హత్య చేసి.. ఆపై ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసి
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్ షరీఫ్ గ్యాంగ్స్టర్. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్ షరీఫ్ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్–2గా ఉన్న తరుణ్రాయ్ గ్యాంగ్ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్రాయ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్ గ్యాంగ్ తరుణ్రాయ్ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్లో హత్యకు గురైన తేజస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం బెయిల్పై వచ్చిన తేజస్ బెయిల్పై బయటకు వచ్చాక తేజస్ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్ తన స్నేహితులతో నెక్ట్స్ టార్గెట్ సమీర్ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్లు ప్రగతినగర్కు వచ్చారు. తేజస్ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్లకు కామన్ ఫ్రెండ్. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్ షేర్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ప్రగతిగనగర్లోని తేజస్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్గా తాగిన తేజస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్ చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న డ్రైవర్: ఆనంద్ మహీంద్ర ఫిదా!
ప్రస్తుతకాలంలో ఏ వృత్తిలో ఉన్నా, ఆధునిక టెక్నాలజీని, ట్రెండ్ని పట్టుకోవడంలోనే ఉంది సక్సెస్. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు, యూ ట్యూబ్ ప్రపంచానికి తన టాలెంట్ ఏంటో చూపించి సత్తా చాటుకున్నారు చాలామంది. ఇంటి వంట,ఇంటి పంట, గాత్రం,వ్యవసాయ క్షేత్రం ఇలా ఏదైనా చివరికి తమ రోజువారీ జీవితాల్లోని మామూలు అంశాలతో వైరల్ అయి పోతున్నారు. మట్టిలో మాణిక్యాల్లా యూట్యూబ్లో సంచలనం క్రియేట్ చేస్తున్నారు అలాంటి వారిలో ఒక ట్రక్ డ్రైవర్ విశేషంగా నిలుస్తున్నాడు. 1.47 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో నెటిజన్లుల చేత 'మాస్టర్చెఫ్' గా ప్రశంసలు పొందుతున్న కార్గో ట్రక్ డ్రైవర్ రాజేష్ రావాని గురించి తెలుసు కుందాం రండి. రాజేష్ రావాని ఒక ట్రక్ డ్రైవర్. వృత్తిపరంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ట్రక్ డ్రైవర్ నా జీవితంలో ఏముంది స్పెషల్ అనుకోలేదు. తన జీవితం నుంచే ఏదో సాధించాలనుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మార్చింది. సాధారణంగా సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేసే వెళ్లే లారీ, ట్రక్ డ్రైవర్లు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే వారుమధ్యలో ఎక్కడో ఒక చోట ఆగి వండుకొని తినేలా ఏర్పాటు చేసుకుంటారు. కానీ రాజేష్ రావాని ఇంకొంచెం స్పెషల్. తనకొక స్పెషల్ కిచెన్ క్రియేట్ చేసుకుని నచ్చిన వంటల్ని, రుచికరంగా వండుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు. దీన్నే స్మార్ట్ఫోన్ ద్వారా వీడియో తీసి పోస్ట్ చేయడం షురూ చేశాడు. దీనికి కొడుకుల సాయం తీసుకున్నాడు. రాజేష్కు ఇద్దరు కుమారులు సాగర్, శుభం. వీరే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి ప్రోత్సహించారని ఒకసారి నెటిజన్లుతో పంచుకున్నాడు. ముఖ్యంగా సాగర్ వీలైనప్పుడు ట్రక్కుపై అతనితో పాటు వీడియోలు చిత్రీకరిస్తూ, ఎడిట్ చేస్తూ ఉంటాడని చెప్పాడు. "యూట్యూబ్ అంటే ఏమిటో కూడా తెలియదు, అబ్బాయిలే ఛానెల్ని ప్రారంభించారని వెల్లడించాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన పదార్థాలతో ప్రయోగాలు చేస్తూండటంతో స్పందన బాగా వచ్చింది. 2021 ఏప్రిల్లో తన సొంత YouTube ఛానెల్, Instagram పేజీని ప్రారంభించాడు. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూడలేదు. తన వెళ్లే ప్రదేశాలు, వండుకునే సూపర్ వంటకాలు, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, మఠర్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకటీ రెండూకాదు రోడ్డు పక్కన జరిగిన సంఘటనలు,ఎన్నోఅద్భుతాలు వీడియోల ద్వారా నెటిజనులకు పరిచయం చేశాడు. ప్రతీ వీడియోకు లక్షలకు పైగా వ్యూస్. సబ్స్క్రైబర్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. 786 వీడియోలు చేశాడు. 50, 60 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోలున్నాయటే రాజేష వీడియోల క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by R_ Rajesh (@r_rajesh_07) ఆర్ రాజేష్ వ్లాగ్స్ ఛానెల్తో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు ఆయన భాష కూడా నిజంగా సూపర్ చెఫ్లాగా ఉండటంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో "మాస్టర్చెఫ్" , బెస్ట్ ఫుడ్ వ్లాగర్" గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు నెటిజన్లు అతని ట్రక్కును "ఫైవ్ స్టార్ రెస్టారెంట్" లేదా "చల్తా ఫిర్తా దాభా" అని పిలవడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే డ్రైవర్లు నిర్జన ప్రదేశంలో ట్రక్ చెడిపోయినప్పుడు, చెత్త రోడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే మరమ్మత్తు ఎలా చేసుకోవాలి లాంటివాటితో పాటు తన ట్రక్కు నుండి డ్రోన్ షాట్ను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ నుండి పాట్నాకు వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ను చూపించింది. ఈ క్లిప్కి ఐదు లక్షలకు పైగా లైక్లు వచ్చాయి.ఇన్స్టాగ్రామ్లో అతని వంటకాలు, వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. ఎనిమిది లక్షలకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్నారు. దీంతో సంపాదన కూడా బాగానే ఉంది. రాజేష్ కుమారుడు కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే ఇపుడొక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఇద్దరూ. కొత్త ఇంటిపార్టీ వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. రాజేష్ సక్సెస్ జర్నీని పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను బాగా ఆకట్టుకుంది. మండే మోటివేషన్ను అంటూ రాజేష్ స్టోరీని ట్విటర్లో షేర్ చేశారు. 25 సంవత్సరాలకు పైగా ట్రక్ డ్రైవర్గా ఉన్న రాజేష్ రావాని, తన వృత్తికి ఫుడ్ & ట్రావెల్ వ్లాగింగ్ యాడ్ చేసి ఇపుడొక ఇంటి వాడయ్యాడు అంటూ ట్వీట్ చేశారు. -
Hyd: యువకుడిని హత్యచేసి ఇన్స్టాలో రీల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని బాచుపల్లిలో భయంకరమైన ఘటన జరిగింది. తేజస్(21) అలియాస్ సిద్దూను అనే యువకుడిని కొంత మంది యువకులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. చంపడమే కాకుండా ఆ ఘటనను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కలకలం రేపింది. బాచుపల్లి పోలీసు స్టేషన్లో పరిధిలోని ప్రగతి నగర్లో తేజస్ అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. తన తల్లి ఊరు వెళ్లటంతో.. ఆదివారం రాత్రి తేజస్ తన మిత్రులైన మహేశ్, శివస్ప, సమీర్లతో కసిలి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజూమున ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న తేజస్ను గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు బైక్లపై వచ్చి దారుణంగా పొడిడి చంపారు. హత్య చేసిన తర్వాత యువకులు రీల్ చేసి ఇస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రతీకారంగానే తాము హత్య చేసినట్లు ఆ పోస్టులో వాళ్లు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత ఏడాది తరుణ్ అనే వ్యక్తి హత్య కేసులో సిద్దూ ఏ3గా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో.. ఆ హత్యకు ప్రతీకారంగానే తేజస్ను హతమార్చినట్లు స్పష్టత వచ్చింది. -
పెద్దలు అడ్డుకుంటారని.. ప్రేమజంట ఆత్మహత్య
కొందుర్గు: వారిద్దరూ ఇన్స్ట్రాగామ్లో పరిచయమయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అమ్మాయి మైనర్ కావడంతో కుటుంబ పెద్దలు, బంధువులు అడ్డు చెబుతారని భావించిన ప్రేమ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి శ్రీకాంత్(24) షాద్నగర్లో ఓ కిరాణ షాపులో పని చేస్తున్నాడు. కిస్మత్పూర్ గ్రామానికి చెందిన మాధవి(16)తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అమ్మాయి మైనర్ కావడంతో పాటు ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవచ్చని ఇద్దరూ గత నెల 27న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ జంటగా స్వగ్రామానికి గత నెల 30న వచ్చారు. కుటుంబ సభ్యులు ఆక్షేపిస్తారన్న భయంతో శ్రీకాంత్, మాధవి గ్రామ శివారులోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనమేరకు మార్చి 31 హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మాధ«వి మృతి చెందింది. ఈ క్రమంలో మంగళవారం శ్రీకాంత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై శ్రీకాంత్ తల్లి లక్ష్మమ్మ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనయ్య తెలిపారు. -
హాయి హాయిగా... కూల్ కూల్గా!
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్గా ప్రయాణిస్తున్నారు. -
కలర్ఫుల్ డ్రెస్లో మెగా కోడలు.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ భామ చిల్!
కలర్ఫుల్ డ్రెస్లో కనిపించిన మెగా కోడలు.. హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. బ్లాక్ డ్రెస్లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్... గ్రీన్ శారీలో తళుక్కుమన్న అమృత అయ్యర్.. వైట్ డ్రెస్లో నోరా ఫతేహీ అలాంటి లుక్స్.. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన 'బర్రెలక్క'
బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా అందరికీ పరిచయమే. ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్తో పాటు యువతను ఆలోచించే విధంగా పలు వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలో తన భర్త వివరాల గురించి నెటిజన్లు ఆరా తీశారు. దీంతో ఆమె తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ప్రకటించిన శిరీష తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోలను కూడా ఆమె రివీల్ చేసింది. వారిద్దరూ కలిసి ఓక ఫోటో షూట్ కూడా చేశారు. ఆ వీడియోను కూడా శిరీష్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చి 28న వెంకటేశ్ అనే అబ్బాయితో శిరీష వివాహం జరగబోతుంది. అతను ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తిచేశాడని తెలుస్తోంది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. మరికల్ గ్రామానికి చెందిన శిరీష ఆమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీకి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చదవుతున్నట్లు ఆమె గతంలో పంచుకుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఎంపీగా కూడా పోటీ చేస్తానని చెప్పింది. తాను ఓడిపోయిన పర్వాలేదు అంటూనే తన పోటీ యువతను మేలుకొల్పేందుకే అని చెప్పింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
ఈ హోలీ రంగులను హాయిగా తినవచ్చు!
ముంబైకి చెందిన ఇద్దరు సోదరుల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గౌరంగ్, సౌరభ్ అనే సోదరులు ‘మాంక్స్ బూఫీ’ బ్రాండ్పై ‘అబీర్ హోలి కలర్స్’ పేరుతో సహజ రంగులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. పువ్వులు, మొక్కజొన్న పిండి... మొదలైన వాటితో భిల్ తెగ గిరిజనులు తయారు చేసిన ఈ రంగులను తినవచ్చు కూడా! -
పెళ్లి వార్తను ప్రకటించిన 'బర్రెలక్క'
తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన పేరు బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు సంబంధించిన పలు వీడియోల ద్వారా ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరులో ఈ యువతి బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె పేరు వైరల్ అయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ రెండూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది. గతంలో ఆమె పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో రావడం అందుకు ఆమె రియాక్ట్ కావడం జరిగింది. అవన్నీ కొట్టిపారేస్తూ.. తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ఆమె ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు బర్రెలక్క తాజాగా తెలిపింది. తన ఎంగేజ్మెంట్ కార్యక్రమం సడెన్గా సెట్ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని ఆమె చెప్పింది. పెళ్లి కోసం షాపింగ్ చేసిన వీడియోలను కూడా ఆమె పంచుకుంది. కాబోయే భర్త ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ అవాస్తవాలనీ ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని బర్రెలక్క కొట్టిపారేసింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోలు వీరే
హీరో అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని ఫాలో అయ్యేవారి సంఖ్య (ఫాలోవర్స్) 25 మిలియన్స్ కు చేరుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించి, తగ్గేదే లే అంటున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. అదే విధంగా ఆ మూవీకి ఉత్తమ నటుడి కేటగిరీలో తెలుగులో జాతీయ అవార్డు సాధించిన తొలి హీరోగా అరుదైన ఘనత సాధించారాయన. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు అల్లు అర్జున్. అందులో భాగంగానే దక్షిణాదిలో అత్యధిక ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డ్ను క్రియేట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో హీరో విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), మూడో స్థానంలో హీరో రామ్ చరణ్ (20.8మిలియన్లు) ఉన్నారు. -
థాయ్లాండ్ బీచ్లో గుంటూరు కారం భామ.. జిమ్లో శివాత్మిక సెల్ఫీ లుక్స్!
థాయ్లాండ్ బీచ్లో చిల్ అవుతోన్న గుంటూరు కారం భామ.. బ్లాక్ డ్రెస్లో శివాని రాజశేఖర్ లుక్స్.. జిమ్లో సెల్ఫీ తీసుకుంటోన్న శివాత్మిక రాజశేఖర్.. బ్లూ డ్రెస్లో సలార్ భామ పోజులు... View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
నెట్టింట వైరల్ అవుతున్న 'సిల్క్ స్మిత' మదర్ ఫోటో
సిల్క్ స్మిత.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. బావ బావమరిది చిత్రంలోని బావలు సయ్యా అనే పాటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. ఇప్పటికీ ఆ పాట రేంజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. సిల్క్ స్మిత మరణించి 35 ఏళ్లు దాటింది. అయినా కూడా ఆమె పేరును ఇండస్ట్రీ మరిచిపోలేదు. ఏదో రూపంలో ఆమె పేరు తరుచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సిల్క్ స్మిత అమ్మగారి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. డిసెంబర్ 2, 1960లో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో రాములు, సరసమ్మలకు జన్మించిన సిల్మ్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 450కి పైగా చిత్రాల్లో నటించింది. అలా సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్ల ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. సెప్టెంబర్ 23, 1996న 35 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. స్టార్ హీరోలు నటించిన పెద్ద చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. సిల్క్ తమిళం, మలయాళం, తెలుగు, హిందీతో సహా అన్ని భాషల్లోని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో మెరిసింది. మలయాళ స్టార్ మోహన్లాల్, కోలీవుడ్ స్టార్ కమల్హాసన్ వంటి పెద్ద స్టార్ల చిత్రాల్లో నటించింది. వెండితెరపై ఆమెకు గొప్ప ప్రశంసలు దక్కినప్పటికీ.. ఆమె తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా సాగలేదు. ఆ తర్వాత ఆమె ఓ వైద్యుడిని వివాహం చేసుకుందని.. ఆమె సంపాదన మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అతను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కోల్పోయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సిల్క్ స్మిత సెప్టెంబరు 23, 1996న ఓ హోటల్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో సిల్క్ స్మిత.. తన జీవితం సంతోషంగా లేదని.. నమ్మినవారే మోసం చేశారంటూ.. అందుకే ఈ లోకాన్ని విడిచివెళుతున్నట్లు రాసుకొచ్చింది. తాజాగా తన అమ్మగారి ఫోటో నెట్టింట వైరల్గా మారింది. -
ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అందరూ ఈజీగా ఫేమస్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వినియోగించుకుంటున్నారు. అందులో ఇన్స్టాగ్రామ్కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. దాదాపు ప్రతిఒక్కరు ఈ యాప్ను వాడుతున్నారు. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపార, వృత్తి పరమైన అంశాలను పంచుకోవడానికి ఇదో వేదికగా మారింది. దాంతో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా పరిగణిస్తున్నారు. కొంతమంది తమని తాము ఎక్కువ మందికి పరిచయం చేసుకోవడానికి ఫాలోవర్లను పెంచుకుంటే, కంపెనీలు, బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి, సెలెబ్రెటీలు తమ అభిమానులకు చేరువలో ఉండడానికి ఇలా ఎవరికి వారు ఇందులో ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లను పెంచుకోవడానికి, అందులో ఫేమస్ అవ్వడానికి ఉన్న మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అకౌంట్ ఆప్టిమైజేషన్ అకౌంట్కు ఏదో ఒక పేరు పెట్టేసి, నాలుగు మాటలు రాసేసి, ఒక ఫొటోను ప్రొఫైల్ పిక్చర్గా అప్లోడ్ చేస్తే సరిపోదు. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్గా అకౌంట్ను క్రియేట్ చేయాలి. బయోలో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఆసక్తికరమైన ట్యాగ్లైన్ను రాయాలి. ఒకవేళ ఏదైనా బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలంటే అందుకు సంబందించిన లింక్ను బయో, హోమ్ పేజీలో ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ల వాడకం మీ అకౌంట్ను రిప్రజెంట్ చేసేలా మంచి హ్యాష్ ట్యాగ్ను క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసాధారణమైన హ్యాష్ ట్యాగ్ మీకంటూ ఒక గుర్తింపుని తీసుకువస్తుంది. మీ ఆలోచనలను తెలియచెప్పడానికి హ్యాష్ ట్యాగ్లను ఉపయోగిస్తే, అవి మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తాయి. ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఎక్కువ మంది ఫాలోవర్లు రారనే విషయాన్ని గమనించాలి. కచ్చితమైన సమయంలో.. రోజులో ఏ సమయానికి పోస్ట్లు అప్లోడ్ చేయాలి.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే ఒక నిర్దేశిత క్యాలెండరు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని పోస్టులు పెడుతున్నారనే దానికంటే ఏ టైమ్లో పెడుతున్నాం అనేదే ముఖ్యం. మీ ఫాలోవర్లు ఎలాంటి సమయాల్లో పోస్టులు ఎక్కువగా చూస్తారో, ఎలాంటి పోస్టులు ఇష్టపడతారో ఒక సర్వే చేయాలి. వాటి ఆధారంగా పోస్టులని క్రియేట్ చేయాలి. లైవ్ వీడియోస్ చాలా మంది ఫొటోలు పోస్ట్ చేస్తున్నాం కదా, వీడియోస్ ఎందుకులే అనే ధోరణిలో ఉంటారు. వీటితోనే ఫాలోవర్లను పెంచుకుందాం అనుకుంటారు. మారుతున్న ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు వీడియోస్కే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీడియోస్, లైవ్ వీడియోస్ , స్టోరీలను అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! కంటెంట్పై దృష్టి కొంతమంది తమ బ్రాండ్ను పాపులర్ చేయాలనే క్రమంలో ఫాలోవర్లు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోరు. అలాంటి సందర్భాల్లో కొత్త ఫాలోవర్లు రాకపోగా, ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి, మీ ఫాలోవర్లు ఎలాంటి కంటెంట్ను ఎక్కువ ఇష్టపడుతున్నారో రీసెర్చ్ చేయాలి. దానికి అనుగుణంగా మీరు కంటెంట్పై దృష్టి సారించాలి. ట్రెండింగ్ విషయాల గురించి పోస్టులు పెట్టాలి. -
జోర్డాన్లో అందాల భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ పోజులు!
జోర్డాన్లో ఆపరేషన్ వాలైంటైన్ భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ హోయలు.. వైట్ డ్రెస్లో దిశా పటానీ స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్లో మంచు లక్ష్మి లుక్స్ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
మీరో ‘గీతాంజలి’ కావద్దు
గీతాంజలి.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి. ట్రోలింగ్కు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం మీరందరూ చదివే ఉంటారు. ఆ తర్వాత కూడా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. రాజకీయపార్టీలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె మరణాన్ని రకరకాలుగా వక్రీకరించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మరెవ్వరూ గీతాంజలిలా కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సొరచేపలతో జాగ్రత్త... ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఇందులో విలువైన ఆణిముత్యాలు ఉన్నట్లే, అమాంతం మింగేసే సొరచేపలు కూడా ఉంటాయి. ముత్యాలకోసం తీవ్రంగా అన్వేషించాలి. సొరచేపలు మాత్రం మీకేమాత్రం సంబంధం లేకుండానే మింగేస్తాయి. ట్రోలింగ్ చేసేవారు కూడా సొరచేపల్లా విపరీతమైన ఆకలితో ఉంటారు.. గుర్తింపుకోసం ఆకలి. ఆ గుర్తింపుకోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. వారిలో మానవత్వం ఉండదు. తమ పోస్టులు వైరల్ అవ్వాలన్న కోరిక తప్ప, తన పోస్టుల వల్ల బాధపడే వ్యక్తుల పట్ల సహానుభూతి ఉండదు. ఇంకా చెప్పాలంటే బాధపడుతుంటే చూసి ఆనందించే శాడిజం ఉంటుంది. అలాంటి సొరచేపల బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండువైపులా పదునున్న కత్తి... సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. సక్రమంగా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. వక్రమార్గంలో వినియోగిస్తే ప్రాణాలు తీయవచ్చు. మనకు తెలిసిన వ్యక్తిని ఒక మాట అనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. వారు బాధపడతారేమోనని సున్నితంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మనల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి. కానీ సోషల్ మీడియాలో ఎవరూ ఎవరికీ ప్రత్యక్షంగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ముక్కూమొహం చూపించాల్సిన అవసరం లేదు. వివరాలు తెలియకుండా, రహస్యంగా ఉంటూ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ట్రోలర్స్లో సహానుభూతి కనిపించదు. వికృతమైన పోస్టులు పెడుతుంటారు. అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. వాటిని తట్టుకోవడం అందరికీ సులభం కాదు. గీతాంజలి లాంటి సున్నిత మనస్కులకు అసలే కాదు. చదవండి: టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర మరేం చెయ్యాలి? ►ఈత తెలిసినవారే సముద్రంలో అడుగుపెట్టాలి. అలాగే మాటల బాణాల నుంచి తప్పించుకోవడం తెలిసినవారే సోషల్ మీడియాలో అడుగుపెట్టాలి. చిన్న చిన్న విమర్శలకు కూడా విపరీతంగా బాధపడే సున్నిత మనస్తత్వం ఉన్నవారు ఈ వైపు చూడకపోవడమే మంచిది. ►మనం రాసే రాతలు, పెట్టే ఫొటోలు వీలైనంత వరకూ వివాదాస్పదం కానివిగా చూసుకోవాలి. అయినా ఒక్కోసారి మనం ఊహించని కోణాలను మనకు అంటగట్టి విమర్శిస్తుంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. ►మీరు ఊహించని రీతిలో విమర్శలు వస్తున్నప్పుడు, మీపై ట్రోలింగ్ నడుస్తున్నప్పుడు కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. చూసి బాధపడటం కంటే, చూడకుండా ప్రశాంతంగా ఉండటం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ►సోషల్ మీడియా వల్ల కొందరు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంటున్న మాట వాస్తవమే. వారి ఉద్దేశాలు స్పష్టం. వారు విమర్శలను పట్టించుకోరు. కానీ సామాన్యుల ఉద్దేశం.. కేవలం టైమ్ పాస్ లేదా కొంచెం గ్నానం సంపాదించుకోవడం. అందువల్ల సోషల్ మీడియా లైకులు, షేర్ల గురించి ఆందోళన చెందకుండా, ఆరాటపడకుండా ఉండటం నేర్చుకోవాలి. ►ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయిన వార్తలు నిత్యం పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం. అందువల్ల ఆన్లైన్ స్నేహాలను సీరియస్ గా తీసుకోకపోవడం, పరిధులు తెలుసుకుని మసలుకోవడం మంచిది. ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మీ ప్రమేయం లేకుండా మీపై ట్రోలింగ్ మొదలైనప్పుడు.. వెంటనే కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు తీసుకోండి. ఆయా అకౌంట్లపై రిపోర్ట్ కొట్టించండి. అవసరమనుకుంటే పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. ►ట్రోలింగ్ వల్ల మీలో ఆందోళన పెరుగుతుంటే, కుంగిపోతుంటే... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ ను కలవండి. మీ ఆందోళన తగ్గేందుకు, ఆనందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు సహాయపడతాడు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
Priya Atlee: డైరెక్టర్ అట్లీ భార్యలో ఈ యాంగిల్ కూడా ఉందా! (ఫోటోలు)
-
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
సూపర్ లుక్
‘‘హాలీవుడ్ హీరోలా ఉన్నారు.. సూపర్ లుక్’’ అంటూ మహేశ్బాబు తాజా లుక్ గురించి నెటిజన్లు పోస్ట్లు షేర్ చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా మహేశ్బాబు తన స్టయిలిష్ లుక్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. ముందు నలుపు రంగు సూట్లో ఉన్న ఫొటోలు షేర్ చేసినప్పుడు సూపర్ అంటూ అభిమానులు మురిసిపోయారు. శనివారం గళ్ల చొక్కాతో ఒత్తయిన జుట్టుతో ‘త్రూ ది లెన్స్’ అంటూ మహేశ్ మరో ఫొటోను షేర్ చేయగా, ఆ లుక్కి కూడా మంచి స్పందన వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్తో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం మహేశ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. మహేశ్తో పలు రకాల లుక్స్ని ట్రై చేస్తున్నారట రాజమౌళి. మరి.. మహేశ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది రాజమౌళి సినిమా లుక్కా? లేక ఏదైనా యాడ్ షూటా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో పలువురు విదేశీ తారలు కూడా నటించనున్నారు. -
అమ్మా, నాన్న ఆనంద విహారం
ఇన్స్టాగ్రామ్ యూజర్ వివేక్ వాఘ్ సర్ప్రైజ్ ట్రావెల్ ప్లాన్తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్లో మనం జైపూర్కు వెళుతున్నాం’ అని చెప్పి తల్లిదండ్రులను ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లాడు. పాస్పోర్ట్లను వారి చేతికి అందిస్తూ ఆఖరులో అసలు విషయం చెప్పాడు. తాము వెళుతున్నది జైపూర్ కాదని సింగపూర్కు అని తెలుసుకున్న వివేక్ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ ప్రయాణం. ‘సీ దెయిర్ రియాక్షన్... సర్ప్రైజ్ ట్రిప్’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా యూజర్లు, సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టర్ జై భానుశాలి ‘ప్రౌడ్ సన్. విషయం తెలిసిన తరువాత మీ తండ్రి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఎంతగానో నచ్చింది. మా అబ్బాయి మమ్మల్ని సింగపూర్ తీసుకువెళ్లాడు అని ఆయన గర్వంగా స్నేహితులతో చెప్పుకోవచ్చు’ అని కామెంట్ పెట్టారు. -
ఇన్స్టాలో అందాల ముద్దుగుమ్మల సందడి (ఫోటోలు)
-
క్యాన్సర్తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్!
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. జాండిస్తో ఆమె సోదరి మృతి.. పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్కు దగ్గరైంది. View this post on Instagram A post shared by Dolly Sohi (@dolly_sohi) -
టెక్ టాక్: ఇన్స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్.. మీకొసమే..!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్గా వాడే వస్తువులైనా ఉండొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామైనా ఉండొచ్చు. ఫీచర్కి తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీ పరికరాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మరవేంటో చూద్దాం. ఇన్స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్! మెసేజ్లను పంపిన తరువాత పదిహేను నిమిషాల వరకు ఎడిట్ చేయవచ్చని ప్రకటించింది ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. పదిహేను నిమిషాల ఈ ఎడిట్ విండో వాట్సాప్లాంటి ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్లాగే ఉంటుంది. సరిగ్గా అనిపించని మెసేజ్లను సరిచేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు ఒకే సందేశాన్ని పలుమార్లు ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేయబడిందనే విషయం హైలెట్ అవుతుంది. యాపిల్ న్యూ మ్యాక్బుక్ ఎయిర్ సైజ్ : 13.30 అంగుళాలు రిజల్యూషన్ : 2560్ఠ1600 పిక్సెల్స్ బరువు (కేజీ) : 1.29 మెటీరియల్ : అల్యూమినియం స్టోరేజ్ : 256జీబి కలర్ : గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే గెలాక్సీ ఎఫ్ 15 లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్15 గురించి ప్రకటించింది శాంసంగ్. 4/6 జీబి ఆఫ్ ర్యామ్, 128 జీబి ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్తో కూడిన రెండు మెమోరీ వేరియంట్స్తో వస్తోంది. కొన్ని వివరాలు.. డిస్ప్లే : 6.5 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 90 హెచ్ ప్రైమరీ కెమెరా : 50 ఎంపీ బ్యాటరీ : 6,000 ఎఏహెచ్ కలర్స్ : యాష్ బ్లాక్, జాజ్ గ్రీన్, వయోలెట్ ఇవి చదవండి: వరల్డ్ బెస్ట్ లిస్ట్లో భారత ఫిల్టర్ కాఫీ -
శారీలో రంగమ్మత్త క్యూట్ లుక్స్.. క్రేజీ అవుట్ఫిట్లో సమంత పోజులు!
లైట్ బ్లూ శారీలో ప్రియమణి పోజులు.. కలర్ఫుల్ డ్రెస్లో మంచు లక్ష్మి స్మైలీ లుక్స్.. అలాంటి అవుట్ఫిట్లో సమంత క్రేజీ లుక్స్.. శారీలో రంగమ్మత్త అలాంటి పోజులు.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టా యాప్స్కు తీవ్ర అంతరాయం
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్తోపాటు ఇతర మెటా యాజమాన్య ప్లాట్ఫారమ్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు మెటా యాప్స్ సర్వీసుల్లో అంతరాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు సోషల్ మీడియా నెట్వర్క్ ఔటేజ్ ట్రాకర్ ప్లాట్ఫాం డైన్ డిటెక్టర్ వెల్లడించింది. మరోవైన తోటి సోషల్ నెట్వర్క్ సైట్లలో అంతరాయాలను వెక్కిరిస్తూ ఎలోన్మస్క్ స్పందించారు. ‘మీరు(యూజర్లు) ఈ పోస్టును చదువుతున్నారంటే మా సర్వర్లు పక్కాగా పని చేస్తున్నాయని అర్థం’ అంటూ పోస్ట్ చేశారు. If you’re reading this post, it’s because our servers are working — Elon Musk (@elonmusk) March 5, 2024 ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ మెటా స్పోక్స్పర్సన్ ఆండీస్టోన్ స్పందిస్తూ తమ యూజర్లు మెటా యాప్స్ ద్వారా సమస్యను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. We're aware people are having trouble accessing our services. We are working on this now. — Andy Stone (@andymstone) March 5, 2024