international crude oil
-
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా వాహన చోదకులకు స్వల్ప ఊరట. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ పై 63 పైసలు తగ్గించగా, డీజిల్ పై 1.06పైసలు తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తగ్గిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. అంతకుముందు లీటర్ పెట్రోల్పై 50 పైసలు, డీజిల్పై 46పైసలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్లో పెట్రోల్ ధర లీటర్కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్కు 25 పైసలు చొప్పున తగ్గాయి. కాగా అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే దేశీయంగా మాత్రం ఆ ప్రభావం తక్కువగా ఉంది. -
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై ధరలను మంగళవారం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఆ మరుసటి రోజే వాటిపై ఎక్సైజ్ సుంకం పెంచింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.1.17 పెంచాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, దేశీయంగా మాత్రం ఆ ప్రభావం తక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ లపై తగ్గించిన ధరలు అమలులోకొచ్చిన రోజే ఎక్సైజ్ సుంకాన్ని పెంచటం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. -
స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వాహనదారులకు స్వల ఊరట. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటర్ పెట్రోల్పై 50 పైసలు, డీజిల్పై 46పైసలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తగ్గిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్లో పెట్రోల్ ధర లీటర్కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్కు 25 పైసలు చొప్పున తగ్గాయి. కాగా అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే దేశీయంగా మాత్రం ఆ ప్రభావం తక్కువగా ఉంది. -
డీజిల్, పెట్రోల్ ధరల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనమైంది. దాంతో బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 55 డాల్లర్లకు తగ్గిపోయింది. దీంతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను రూ. 2 మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. న్యూఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 5051, ముంబైలో రూ. 57.91గా ఉంది. గతేడాది డిసెంబర్ 15వ తేదీన లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ. 2 మేర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే సబ్సీడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 43.50 మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది. దాంతో 14.2 కేజీల సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ. 708 ఉండగా, ముంబైలో రూ. 725.50గా ఉంది.