మరో నెల రోజుల్లో ఆర్టీసీ విభజన పూర్తి: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్: మరో నెల రోజుల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు. ఏపీ, తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ వేరు పడుతందని తెలిపారు. ఈ ఏడాది మార్చినాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 1000 బస్సులు, అలాగే తెలంగాణకు 1300 బస్సులు రానున్నాయని ఎండీ పూర్ణచంద్రరావు చెప్పారు.