Jada Sravan Kumar
-
నీ నక్క తెలివితేటలు... జగన్ దెబ్బకు ఢిల్లీలో దాక్కున్నావ్...
-
కులాలు, మతాలతో డేంజరస్ గేమ్
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. కొంతమంది మూర్ఖుల ద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కారణమవుతోందని ఆరోపించారు. కులాలు, మతాలతో కూటమి ప్రభుత్వం డేంజరస్ గేమ్ ఆడుతోందన్నారు. కులాలు, మతాల పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లేసి గద్దెనెక్కించిన ప్రజలపై ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం ఆశించి కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ''2014- 19 , 2019-24 మధ్య ప్రభుత్వాల్లో ఏపీలో ఎలాంటి మత ఘర్షణలు జరగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏపీలో కుల, మత ఘర్షణలు మొదలయ్యాయి. రెండు కులాలు, రెండు ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలనే దుర్మార్గకరమైన ప్రయోగం చేస్తున్నారు. కులాలు, మతాలను ముడిపెట్టి రాజకీయం చేయడం రాష్ట్రానికి మంచిది కాదు. ఒక కులం వారు ఓటేయడం వల్లే మీకు 164 సీట్లు వచ్చాయా? ఆకువీడు ఘటన అత్యంత దురదృష్టకరం. అంతకంటే దురదృష్టకరమైన ఘటన తిరుపతి లడ్డూపై కల్తీ ప్రచారం. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని 6 నెలల పాటు చేసిన యాగీ ఎవరూ మర్చిపోలేదు. నిజమైన వెంకటేశ్వరస్వామి భక్తుడైతే చంద్రబాబు ఇలా చేసేవాడు కాదు. కానీ చంద్రబాబు భక్తుడి కంటే పొలిటీషియన్గానే వ్యవహరించారు. లడ్డూ ప్రసాదంపై, హిందూ సమాజంపై చంద్రబాబు తీవ్రమైన దాడి చేశారు. లడ్డూపై ప్రచారం చేస్తూనే క్రిస్టియన్లు, ముస్లింలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆత్మ గౌరవంతో మొదలైన టీడీపీని చంద్రబాబు అధోగతి పాలు చేసే స్థాయికి తెచ్చారు. డిప్యూటీ స్పీకర్లు, స్పీకర్ల స్థానంలో ఉన్న వ్యక్తులు.. క్రిస్టియానిటీ, ఎస్సీలపై వ్యవస్థీకృతమైన దాడి చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు చేస్తున్న దాడికి టీడీపీ సమాధానం చెప్పాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు ఇచ్చిన అలుసు కారణంగానే రఘురామ కృష్ణంరాజు రెచ్చిపోతున్నారని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మీరు ఇచ్చిన అలుసు కారణంగానే పోలీసులు రఘురామ కృష్ణంరాజుకు ఊడిగం చేస్తున్నారు. కుల మతాలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆద్యులు. క్రిస్టియన్లు, ముస్లింలు ఓటేయకుండానే మీకు 164 సీట్లు వచ్చాయా? మీకు ఓట్లేసిన పాపానికి క్రిస్టియన్లు, ముస్లింలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందా?నన్ను విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజుకు సంస్కారం లేదు. నీ ల్యాంగ్వేజ్లో మాట్లాడటానికి నాకు రెండు నిమిషాలు పట్టదు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శకుని పాత్రకు సరిగా సరిపోతాడు. ఆకువీడులో రఘురామకృష్ణంరాజు మొదలుపెట్టిన డేంజరస్ క్రీడ టీడీపీ పునాదులను కదిలించడానికే. ఉండి నియోజకవర్గంలో ఎస్సీలు, క్రిస్టియన్లు ఓటేయకుండానే నువ్వు గెలిచావా? ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ , బీసీలు ఓటేయకుండానే మీకు భారీ మెజారిటీలు వచ్చాయా? రఘురామ కృష్ణంరాజు ఒక మతంపై దాడి చేస్తుంటే చంద్రబాబు, పవన్, లోకేష్ ఏం చేస్తున్నారు? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి దళితుడు కాబట్టి నోటీసులిచ్చారు. రఘు రామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ కాబట్టి అతను ఏం చేసినా వంత పాడుతున్నారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగిపోయిందని చంద్రబాబు, పవన్ హడావిడిగా ఖండించారు. మరి దళితులపై జరిగిన దాడులు మీకు కనిపించవా? పి.గన్నవరంలో ఒక శవాన్ని అడ్డుకుంటే ఖండించడం మీకు చేతకాదా? కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ మునిగిపోవడం ఖాయం. హిందూత్వ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని దుర్మార్గపు ఆలోచన మీది. మీరు ఎన్ని కుట్రలు చేసినా హిందు, ముస్లిం, మైనార్టీలు ఒక్కటే. కులమతాల మధ్య గొడవలు పెట్టే మిమ్మల్ని ప్రజలు నమ్మర''ని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. -
అమరావతి ముందు సింగపూర్ దేనికి పనికిరాదు.. భూములు ఇవ్వండి.. నిండా మునగండి
-
నీ వికృత చేష్టలన్ని బద్దలైపోద్ది.. నాకు ఎల్లో మీడియా ఉందని రెచ్చిపోతే..
-
ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..
-
‘కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’
సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు. -
శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.
-
‘దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితుల ఓట్లు మాత్రమే కావాలి తప్ప, వారిపై దాడులు జరిగితే మాత్రం పట్టించుకోవడం లేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మరోసారి ధ్వజమెత్తారు. అంబేద్కర్ పేరు పెట్టిన జిల్లాలో దుర్మార్గం జరిగితే చర్యలేవి చంద్రబాబు? అని ప్రశ్నించారు.‘పవన్ సొంత నియోజకవర్గంలో దళితులపై వివక్ష కొనసాగుతుంది. దళితుడి చనిపోతే అగ్రకులాలు శవాన్ని తీసుకెళ్లనివ్వని పరిస్థితి. ఇంత జరుగుతుంటే పవన్ ఎందుకు స్పందించడం లేదు. పిఠాపురం నియోజకవర్గంలో కులవివక్ష కనిపించడం లేదా పవన్? అని నిలదీశారు. టీటీడీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే, డ్రగ్స్ తీసుకున్న ఎంపీపై చర్యలేవని ప్రశ్నించారు. బర్త్ డే పార్టీలు, ఆట పాటల్లో హోంమంత్రి బిజీగా ఉన్నారని, ఇక డిప్యూటీ సీఎం పవన్ షూటింగ్స్లో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. -
కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు... మాకు ఆకలేస్తే అడగాల్సింది మిమ్మల్నే కదా..
-
ఏమే, ఒసేయ్ నా.. దళితులంటే అంత చులకన.. మహిళతో ఆదిరెడ్డి ఆడియో.. జడ శ్రవణ్ మాస్ వార్నింగ్
-
కంప్లైంట్ ఇవ్వడానికి పోతే.. పోలీసులు పోండ్రా నా కొడకల్లారా అంటారా
-
కులాన్ని భట్టి రోడ్లు ఉన్నాయా రాష్ట్రంలో? AC రూంలో విస్కీలు తాగుతున్నావ కలెక్టర్..?
-
కాకినాడ కలెక్టర్ గుడుంబా శంకర్, ఖుషి సినిమా చూసి.. కలెక్టర్ అయ్యాడు
-
‘దళితులపై వివక్ష చూపడం దారుణం’
కుందాలపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం కుందాలపల్లిలో కుల వివక్షకు గురైన బాధితులను జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పరామర్శించారు. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుందాలపల్లిలో దళితులపై వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు జడ శ్రవణ్. ఎస్సీ వర్గాలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితు కుటుంబానికి తానే న్యాయవాదిగా ఉండి వాదిస్తానని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. -
యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్
-
చంద్రబాబు పరిస్థితి మన్మధుడు సినిమాలో బ్రహ్మనాదంలా... బాబుపై జడ శ్రవణ్ సెటైర్లు
-
సినిమాలో బ్రహ్మానందం రాజకీయాల్లో చంద్రబాబు...
-
దేశంలో తొలిసారి మిస్టేక్ అఫ్ ఫ్యాక్ట్ కింద కేసులను కొట్టేశారు
-
భువనేశ్వరి భారీ స్కెచ్ బాబు బండారం బయటపెట్టిన జడ శ్రవణ్
-
మీరు చేస్తే సంసారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం పోలీస్ వ్యవస్థ, చంద్రబాబు పై జాడ శ్రవణ్ నిప్పులు
-
తినేది పెరుగన్నం నిమ్మకాయ బద్ద ఆస్తులు మాత్రం 20 లక్షల కోట్లు.. శ్రవణ్ షాకింగ్ నిజాలు
-
చంద్రబాబుకు బిగ్ షాక్, ACB కోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ
-
ఇదే కదా సాంగ్ పెట్టుకొని.. బిల్డప్ బాబాయ్.. జడ శ్రవణ్ సూపర్ పంచులు
-
బాబు మీ శేష జీవితం జైలులోనే..! అంత ఈజీగా తప్పించుకోలేరు
-
పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో దొరికినవెంటనే.. అనిత ఫోన్ చేసి...
-
పుట్టాపై సీరియస్... BR నాయుడుపై మాత్రం నో సీరియస్... జడ శ్రవణ్ సెటైర్లు
-
స్కూల్లో, కాలేజీల్లో చాక్లెట్లు అమ్మినట్టు గంజాయి అమ్ముతున్నారు
-
ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. నీ కేసులన్నీ రీ ఓపెన్ చేయించలేకపోతే నా వృత్తినే వదిలేస్తా..
-
తెల్ల చొక్కా.. మాసిపోయిన గడ్డం.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు..!
-
మీరు భయపెడితే భయపడతా అనుకున్నారా? జడ శ్రవణ్ వార్నింగ్
-
మీ సార్ కు ఏడు కొండలు గుర్తు రావడం లేదా? BR నాయుడు మిస్సింగ్ పై జడ శ్రవణ్ సెటైర్లు
-
పవన్ కళ్యాణ్ ని సార్ అనలేదని ఒక మహిళ నాకు ఫోన్ చేసి...
-
అయ్యా TV5 సాంబా మీ సార్ కు ఏడు కొండలు గుర్తు రావడం లేదా? BR నాయుడు మిస్సింగ్...
-
‘రాష్ట్ర ప్రజలకు మాటిస్తున్నా.. చంద్రబాబును వదలను’
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్ల అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తమ బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో అతిపెద్ద భాగస్వామి పవన్ కల్యాణ్ అంటూ ధ్వజమెత్తారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి నేతలకు చర్యలు ఎందుకు తీసుకోలేదని శ్రావణ్కుమార్ నిలదీశారు.అలా చేయకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తాచంద్రబాబు తన పై ఉన్న చాలా కేసులను కొట్టేయించుకుంటున్నారు. నేను చంద్రబాబు కేసులపై పోరాటం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు నేను మాటిస్తున్నా. చంద్రబాబు పై ఉన్న ప్రతీ కేసునూ రీ ఓపెన్ చేయించి తీరుతా. ఒకవేళ నేను చంద్రబాబు కేసులను రీ ఓపెన్ చేయించలేకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తా. చంద్రబాబు తనపై ఉన్న నాలుగు కేసుల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సిందే. న్యాయస్థానాల్లో మ్యానేజ్ చేసి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. 2029లో నైనా ప్రతీ కేసును రీ ఓపెన్ చేయిస్తానని శ్రావణ్ కుమార్ అన్నారు. -
మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..
-
ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు
-
6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట... లైవ్ లో చంద్రబాబు వీడియో చూపిస్తూ..!
-
ABN, TV5 లాంటి ఛానళ్లు పెట్టాలని ఉంది..! ఎందుకు చెప్తున్నా అంటే..
-
BR నాయుడు రాసలీలలు వీడియో చూపిస్తూ TV5 మూర్తిని రఫ్ఫాడించిన జడ శ్రవణ్
-
వేట్లపాలెం ఘటనపై బాబు, పవన్ కు శ్రవణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
-
నేను ఆయనలా భయపడతా అనుకోకు.. లోకేష్కు జడ శ్రవణ్ వార్నింగ్
-
దేవుడా లేక...త్రివిక్రమ్ స్క్రిప్ట్ మాట్లాడించిందా... ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు
-
లోకేష్ మైండ్ ఇట్.... గిల్టా.. గాడిద గుడ్డా... ఏకిపారేసిన జడ శ్రవణ్
-
ఆలీ మాట్లాడినట్టే మాట్లాడుతున్నావ్ పవన్పై జడ శ్రవణ్ పంచులు
-
ఒక నిష్ట దరిద్రుడివి.. పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్
-
ఈ నీచుడికా మనం ఓటేసింది.... ఇలాంటి ఉప ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడా..?
-
నువ్వెలా సీఎం అయ్యావ్ సామి.. నీ తలా తోకా లేని స్పీచ్కు ఆ గొర్రెలు చప్పట్లు..
-
కూటమి వదిలిన బాణం హెరిటేజ్కే గుచ్చుకుంది
సాక్షి విజయవాడ: తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కూటమి నేతలు కుట్ర పన్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నేత జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. దేవుడి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటిలయత్నం చేశారని విమర్శించారు. తిరుపతి లడ్డు వివాదంలో వీరిద్దరే దోషులని వ్యాఖ్యానించారు. ఎన్డీడీబీ రిపోర్టును అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలన్న దుర్బుద్ధితో ఇదంతా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడారని మండిపడ్డారు. ప్రజల సంపదతో నడిచే శాసనసభ పూర్తి అవాస్తవాలు, అబద్ధాలతో జరిగిందన్నారు. దుర్మార్గమైన, జుగుప్సాకరమైన, ప్రజలను తప్పు దోవ పట్టించే చర్చ అసెంబ్లీలో నిన్న జరిగిందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.''కన్ను ఆర్పకుండ అబద్దాలు ఆడే వ్యక్తి చంద్రబాబు. అబద్దాలు ఆడడంలో చంద్రబాబుతో పవన్ పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ స్వార్థం కోసం తిరుపతి లడ్డుపై మాట్లాడారు. 164 మంది ఎమ్మెల్యేలు చెప్పినా అబద్ధం అబద్ధమే. పోయే కాలం వచ్చినప్పుడు దేవుడు చెప్పినా వినరు. శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీసింది ఎవరు? దెబ్బ తీస్తుంది ఎవరు? మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీసి గత ప్రభుత్వం మీద నెట్టమని ఏం ధర్మం చెప్పింది?2024 జూలై 12న నెయ్యి శాంపిల్ తీశారు. శాంపిల్స్ తీసినపుడు ఏ ప్రభుత్వం అధికారంలో వుంది? 5 రోజుల పాటు శాంపిల్ మీ దగ్గర పెట్టుకొని కల్తీ చేశారు. కస్టమర్ ఇచ్చిన శాంపిల్నే తాము పరీక్షించామని ఎన్డీడీబీ తెలిపింది. మీరు ఏవిధంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పారో.. అదే మేము రిపోర్ట్లో పేర్కొన్నాం తప్పా మాకు ఎటువంటి సంబంధం లేదని ఎన్డీడీబీ పేర్కొంది. ఈ రిపోర్ట్కు చట్టబద్దత లేదని.. దీన్నిఎక్కడా బయట పెట్టకూడదు, మాట్లాడకూడదని చెప్పింది. మరి ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని కూటమి నేతలు ఎలా మాట్లాడారు? దేవుడిని రాజకీయాలకు వాడాలనే ఉద్దేశంతో రిపోర్ట్ ఇప్పించుకుని కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది.తిరుపతి లడ్డూ వివాదంలో కూటమి వొదిలిన బాణం హెరిటేజ్కే గుచ్చుకుంది. హెరిటేజ్ షేర్లు భారీగా పతనమయి, వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. శీవారిని అప్రదిష్ట పాలు చేసినందుకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా నష్టపోతారు. హెరిటేజ్, కొన్ని సంస్థలు సప్లే చేస్తున్న పాలు కల్తీనే. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు. కూటమి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. రాజ్యాంగం బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కులమతాలకు అతీతంగా వ్యవహరించాలి. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడనని'' జడ శ్రవణ్ కుమార్ అన్నారు. -
ఇంకోసారి లడ్డు గురించి మాట్లాడాలంటే... బాబుపై కన్నెర్రజేసిన జడ శ్రవణ్
-
చరిత్రలో దేవుని మీద రాజకీయాలు చేయాలంటే గజగజ వణికి పోవాలి
-
ఎందుకు అంత ఆవేశం.. అసెంబ్లీలో అచ్చైన్నాయుడు ఓవరాక్షన్
-
మళ్ళీ అవినీతి సామ్రాజ్యానికి నేనే మహా చక్రవర్తిని అన్నట్టు మాట్లాడతాడు
-
Jada: తన కేసులు మాఫీ చేయించుకోవడం తప్ప ఏమీ చేయలేదు...
-
తిరుమల లడ్డూ కథనాలపై ఎల్లో మీడియాకు కోర్టు నోటీసులు
సాక్షి,విజయవాడ: తిరుమల లడ్డు అంశంపై ఎల్లో మీడియాకు విజయవాడ కోర్టు నోటీసులు జారీచేసింది. తిరుమల లడ్డూ అంశంలో ఎల్లో మీడియా కథనాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంబంధిత కథనాలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కూటమి అనుకూల ఎల్లో మీడియా తిరుమల లడ్డూ అంశంపై అనువసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పదేపదే టీటీడీ లడ్డులో జంతు కొవ్వులు,కెమికల్స్ కలిసాయంటూ న్యూస్ చానల్స్ డిబెట్లు పెడుతున్నాయని జడ శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అనవసర డిబెట్ల కారణంగా శ్రీవారి భక్తుల్లో ఆందోళన రేకెత్తుతుందన్నారు. న్యూస్ చానల్స్ చేస్తున్న రాద్ధాంతాన్ని కట్టడి చేయాలని కోర్టును కోరారు. జడ శ్రవణ్ కుమార్ వాదనలపై న్యాయస్థానం ఏకీభవించింది. కథనాలపై వివరణ ఇవ్వాలని సంబంధిత మీడియా ఛానెళ్లకు పంపించిన నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. -
మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
-
తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..
-
జైల్లో అంబటి పరిస్థితి..! జడ శ్రవణ్ రియాక్షన్..
-
అంబటితో ములాఖత్..YSRCP నాయకులు సంచలన వ్యాఖ్యలు
-
మీరు పొలిమేరలు దాటే లోపే.. జడ శ్రవణ్ వార్నింగ్
-
మిమ్మల్ని పొలిమేరలు దాటే వరకు.. గల్లా మాధవి వంగలపూడి అనితకు జడ శ్రవణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
అమ్మా ఆవేశం నీకే కాదు.. 2029 లో వచ్చే ఆవేశానికి చెంగు పట్టుకుని
-
వెనుక ఒక పిలకేసుకుని..సినిమా అనుకున్నావా?
-
నీదీ పవన్ కళ్యాణ్ లాంటి చదువేనా..?? పయ్యావుల కేశవ్ ని ఆటాడుకున్న జడ శ్రవణ్
-
వెనుక ఒక పిలకేసుకుని.. సినిమా అనుకున్నావా?
-
ఒక్కరి ముఖంలో నవ్వు లేదు.. పాపం చేసామన్న భయం తప్ప
-
Jada Sravan: ఏపీకి కేంద్రం వరాల జల్లా..? ఫ్లైట్ ఎక్కడం... ఫ్లైట్ దిగడం...
-
Jada Sravan : అల్లాడిపోతున్న నాలుగు ప్రాణాలు ఎంత లాగితే అంత నష్టమే..
-
లోకేష్ ఇప్పటికైనా మారాలి.. ఎవరూ కాపాడలేరు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీలో 18 నెలలుగా దళితుల మారణహోమం జరుగుతోందని కూటమి సర్కార్పై మండిపడ్డారు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. దళితుల పట్ల దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఎక్కడికి పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. ఇదే ఘటన మరో కులానికి చెందిన వ్యక్తికి జరిగితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కందుకూరులో కాపు-కమ్మలకు మధ్య దాడి జరిగితే హోం మంత్రి అనిత పరుగు పరుగున వెళ్లారు. పవన్ కళ్యాణ్ కులం కాబట్టి మీరు వాళ్లకు సపోర్ట్ చేశారా?. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. తుని దుర్ఘటనలో 60 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపేస్తే.. చెరువులో దూకేశాడని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో ఆడవాళ్లను బట్టలు తీసేని డ్యాన్స్లు చేయమన్న జనసేన నేతను ఎందుకు అరెస్ట్ చేయలేదు?. జనసేన నాయకుడు మాట్లాడిన మాటలు మీకు కనబడవా?. ప్రతీ కేసులో అరెస్టులు చేసి రోడ్ల పై నడిపిస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్ అని హడావిడి చేస్తున్నారు. కేసు విచారణలో నిర్దోషిలుగా తేలితే వారి గౌరవాన్ని తిరిగి మీరు ఇవ్వగలరా?.పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త చట్టాలు ఇవేనా?. మీరు ఎంత రోడ్లపై నడిపిస్తే అన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకు ఇదే నా హెచ్చరిక. ఇకపై ఎవరినైనా అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపిస్తే చూస్తూ ఊరుకోను. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో 60 శాతం మంది బాధితులు దళితులే. గ్రామాల్లోని నాయకుల ఇళ్లపై వేరే పార్టీ జెండాలు ఎగరేస్తే ఊరుకోవడం లేదు. టీడీపీ, జనసేన జెండాలు ఎగరకపోతే వారిని బహిష్కరిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఇదేనా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. కూటమి కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకున్నా రెడ్ బుక్ ఉపయోగిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి కావాలి.యరపతినేనిపై కేసు కట్టాలి.. సామాన్య కార్యకర్త చనిపోయాడని ఎమ్మెల్యే యరపతనేని చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఏపీలో మర్డర్ చేస్తే మాట్లాడే వాడు లేడు. అత్యాచారం చేస్తే అడిగేవాడు లేడు. సాల్మన్ హత్య కేసులో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడు. తక్షణమే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలి. 18 నెలల కూటమి పాలనలో 276 మంది దళిత ఆడబిడ్డలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. చనిపోయిన వ్యక్తి సమాధుల వద్దకు కూడా కుటుంబ సభ్యులను వెళ్లనివ్వడం లేదు. కుటుంబసభ్యులను కూడా రానివ్వకుండా పోలీసులే దహన సంస్కారాలు చేసేయడమేంటి?. మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో చంద్రబాబు సమాధానం చెప్పాలిదళితులకు, ఆడబిడ్డలకు ఏం జరిగినా పరుగు పరుగున వస్తానని పవన్ చెప్పారు.. ఇప్పుడు ఏమైపోయారు?. సాల్మన్ కుటుంబానికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో సహా హత్యకు కారకులైన వారిపై 302 సెక్షన్ పెట్టాలి. లేనిపక్షంలో బాధితుల పక్షాన కోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తాం. యరపతినేని శ్రీనివాసరావును ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరుతాం. ఇప్పుడు తప్పించుకున్నా 2029లోనైనా యరపతినేని తప్పించుకోలేడు. ఈ కేసులో మా వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయకపోతే దళిత ఉద్యమం తప్పదులోకేశ్ శాశ్వతంగా దావోస్కే.. లోకేష్ ఇప్పటికైనా మారకపోతే.. భవిష్యత్ లో మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. ఇప్పుడు నెలకొకసారి నారా లోకేష్ దావోస్కి వెళుతున్నాడుఒక్కసారి ప్రభుత్వం మారితే నారా లోకేష్ పర్మినెంట్గా దావోస్కి పారిపోవడమే. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం కోల్పోయిన పరిస్థితి తర్వాత మీ పరిస్థితి ఏంటి?. తాటతీస్తా.. ఒంగోబెట్టేస్తా.. నారతీసేస్తా అంటున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. సనాతన ధర్మాధికారి పవన్కు జనసేన నేతల చర్యలు కనిపించడం లేదా?. దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మానప్రాణాలను కాపాడతానని పవన్ కబుర్లు చెప్పారు.పవన్ ఏం చేశారు.. భారతదేశంలో ఈ స్థాయిలో కోడి పందాలు ఎప్పుడూ జరగలేదు. మీకు 164 సీట్లు ఇస్తే మందులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీ చూపించారు. పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రికార్డింగ్ డ్యాన్స్లు వేశారు. రాజకీయాలను మార్చడానికి వచ్చానని చెప్పుకునే పవన్ ఏం మార్చారు. ఇంతకుముందు కంటే ఎక్కువ వ్యభిచారం జరిగింది. గతం కంటే ఎక్కువ జూదం జరిగింది.. ఎక్కువ క్యాసినోలు జరిగాయి. క్యాసినో పేరుతో కొడాలి నానిపై వారం రోజులు డిబేట్లు పెట్టారు. మరి ఇప్పుడు పెట్టిన క్యాసినోలు మీకు కనిపించడం లేదా?. -
Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా
-
ఏపీలో వివాదాస్పదంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తీరు
-
Jada Sravan: ఏపీలో ముగ్గురేనా మంత్రులు.. మిగతా మంత్రులకు సిగ్గు లేదా
-
జగన్ పేరు వింటే మూడు సార్లు బాత్రూం కి వెళ్లే మీరు..
-
ఫార్చ్యూన్ 500కి భూమి ఫ్రీగా ఇవ్వడానికి నువ్వెవడివి కోన్ కిస్కా గొట్టం గాడివి
-
కడుపుకు అన్నమే తింటున్నావా? లోకేష్ ను ఏకిపారేసిన జడ శ్రవణ్
-
పిల్లల్ని చూడడానికి లండన్ వెళ్తే గోలగోల చేశారుగా... జగన్కు ఒక రూల్... మీకు ఒక రూలా..?
-
IPS సునీల్ కుమార్ పై రఘురామా రాజు కామెంట్స్.. ఏకిపారేసిన జడ శ్రవణ్
-
ఏం సమాధానం చెప్తావ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగిన జడ శ్రవణ్ కుమార్
-
Jada Sravan: నీకు దమ్ముంటే లెక్కలు బయటపెట్టు
-
Jada Sravan: పవన్ అలా చేస్తే సెల్యూట్ చేస్తా..
-
షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..
-
పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్
-
Jada Sravan: జగన్ హయాంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే..
-
Jada Sravan: చేతకాని హోమ్ మంత్రి... ఆ జనసేన నేతను ఎప్పుడు ఎన్ కౌంటర్ చేస్తారు?
-
జనసేన నేతలకు షూ చూపించిన జడ శ్రవణ్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్నారులపై ఆకృత్యాలు పెరిగిపోయాయని జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ (jada sravan kumar) ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్టాడుతూ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై దారుణానికి పాల్పడిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ)పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.జనసేన నేత ఆత్మహత్య చేసుకుంటాడా?హోంమంత్రి అనిత (Home Minister Anitha) ప్రతాపం అంతా ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాల మీద చూపిస్తున్నారని.. అగ్రవర్ణాల వారు తప్పు చేస్తే పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోనసీమ ఘటన అధికార పత్రికల్లో రాలేదు కాబట్టి పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. 'తుని ఘటనలో టీడీపీ నేత నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నట్లు.. జనసేన నేత ఆత్మహత్య చేసుకుంటాడా?, నారాయణ ఎస్పీ కాబట్టి ఆత్మహత్య చేసుకుంటాడా?, జనసేన నేత పవన్ క్యాస్ట్ కాబట్టి ఆత్మహత్య చేసుకోడా? కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేన నేతను జైలుకు తీసుకెళ్లి సకల సౌకర్యాలు కల్పిస్తారా? హోంమంత్రి సమాధానం చెప్పాల'ని శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంఆడపిల్లల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారి తాట తీస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. కనిపించకుండా పోయిన 30 వేల మంది మహిళలను 30 రోజుల్లో తీసుకుని వస్తామని చెప్పారు. 16 నెలలు అయినా ఒక్క అమ్మాయిని తీసుకుని రాలేదని అడిగారు. బాధితులను హత్తుకున్నట్టు నటించి.. డబ్బులు తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకుంటారా అని ప్రశ్నించారు.వారిని షూతో కొట్టొచ్చా?జనసేన పార్టీ (Janasena Party) అధికారికంగా తనపై ఆరోపణలు చేసింది కాబట్టి స్పందిస్తున్నానని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ''జనసేన పార్టీ కార్యాలయానికి చర్చకు వస్తాను. మీరు సిద్దమా? చర్చకు నేను ఒక్కడినే వస్తాను.. టైం పవన్ చెప్పాలి. దమ్ముదైర్యం ఉంటే టైం చెప్పాలి. 48 గంటలు సమయం జనసేనకి ఇస్తున్నాను. మాట్లాడే ప్రతిమాట.. చేసే ప్రతికామెంట్ కౌంట్ చేస్తున్నాం. ప్రతి దానికి సమాధానం చెప్తా. రాజకీయ కామెంట్స్ చేయండి.. కానీ పర్సనల్ కామెంట్స్ చేస్తే చూస్తు ఊరుకోం. వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకున్నానని అంటున్న వాళ్లు ఆధారాలు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. గతంలో ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ఊగిపోయి, నోటికొచ్చినట్టు తిడుతూ చెప్పు చూపించారు. నేను షూ చూపిస్తున్నాను. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిని షూతో కొట్టొచ్చా? చంద్రబాబు, పవన్, లోకేష్ జడ శ్రవణ్ను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో చూస్తారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికి పవన్ పనిచేస్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మేం పోరాటం చేస్తున్నామ''ని జడ శ్రవణ్ అన్నారు. -
Jada Sravan: ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చే వ్యక్తి పవన్ కళ్యాణ్
-
Jada Sravan: రాత్రి 10 గంటలకు పోలీసులు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట..
-
నీ వల్ల ఏం ఉపయోగం.. పవన్ను ఏకిపారేసిన జడ శ్రావణ్
-
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా?


