Jawaharlal University
-
పార్లమెంట్ ముట్టడి: జేఎన్యూలో 144 సెక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోరుతూ దేశ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జేఎన్యూ (జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) విద్యార్థులు పార్లమెంట్ మార్చ్కు పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన నేపథ్యంలో భారీ ధర్నాకు విద్యార్థులు బయలుదేరారు. ఫీజుల పెంపునకు నిరసనగా ఢిల్లీ వీధుల్లో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్, జేఎన్యూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. యూనివర్సిటీలో 144 సెక్షన్ను విధించారు. 1400 మంది అదనపు బలగాలను వర్సిటీకి తరలించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్కోడ్లను విధించేందుకు వీలుగా హాస్టల్ మాన్యువల్లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే జేఎన్యూ వ్యవహారాలను చర్చించేందుకు వర్సిటీ మానవ వనరుల శాఖ ఇదివరకే త్రిసభ్య కమిటీని నియమించింది. -
జేఎన్యూలో కుల వివక్ష?
9 మంది విద్యార్థుల ఫిర్యాదు.. పరిష్కరించండి: హెచ్ఆర్డీ ఆదేశం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహార్లాల్ యూనివర్సిటీ (జేఎన్యూ)లో కుల వివక్ష తీవ్రస్థాయిలో ఉందని.. దీన్ని పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ విద్యార్థి వీసీకి లేఖ రాసిన సంగతిపై విచారణ జరుగుతుండగానే.. తమను కులం పేరుతో వేధిస్తున్నారంటూ మరో 9 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వచ్చే ఏడాది వరకు తన పరిశోధన గ్రాంటును పెంచకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ విద్యార్థి బెదిరించాడు. తన డిపార్ట్మెంట్ నుంచి పీహెచ్డీ ఆపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. కాగా.. ఈ తొమ్మిది మంది విద్యార్థుల కూడా తమను వేధిస్తున్నారని లేఖలు రాశారు. వీటిపై స్పందించిన మానవ వనరుల అభివృద్ధిశాఖ కూడా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వర్సిటీ అధికారులను ఆదేశించింది. కాగా.. జేఎన్యూ కొత్త వీసీగా ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్, తెలుగువాడైన జగదీశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.