JeM chief Masood Azhar
-
మసూద్ అజర్ పై రెడ్ కార్నర్ నోటీసు
-
భారీ సంఖ్యలో స్టేట్ బ్యాంక్ అకౌంట్లు బ్లాక్
-
పాక్ సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్: పఠాన్ కోట్, ఉడీ ఉగ్రదాడుల సూత్రధారి, జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజాద్ సహా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న 5100 మంది బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాల గుండా ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ(నాక్టా)..ఆ మేరకు వాటిని స్తంభింపజేయాలని ప్రభుత్వాన్ని కోరింది. పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 5100 అకౌంట్లను స్తంభిపజేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్(ఎస్ బీపీ) సోమవారం ఒక ప్రకటన చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం-1997ను అనుసరించి ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. కేటగిరీలుగా విభజించిన అకౌంట్ల వివరాలను నాక్టా గత నెలలో ఎస్బీపీకి అందించిందని, మసూద్ అజార్ అకౌంట్ వివరాలను 'ఏ'కేటగిరిలో ఉంచినట్లు బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రభుత్వం బ్లాక్ బ్యాంక్ అకౌంట్లలో 3,078 అకౌంట్లు ఒక్క ఖైబర్ ఫక్తుక్వా రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన 26 అకౌంట్లతోపాటు పంజాబ్ రాష్ట్రంలో 1,443, సింధ్ లో 226, బలూచిస్థాన్193, గిల్గిట్ 106, ఇస్లామాబాద్ కు చెందిన 27 మంది అకౌంట్లను అక్కడి ప్రభుత్వాలు స్తంభింపజేశాయి. ఉగ్రవాద నిర్మూలకు కట్టుబడి ఉంటామని అంతర్జాతీయ వేదికలపై ప్రకటించే పాకిస్థాన్.. ఉగ్రసంబంధిత అకౌంట్లను భారీగా స్తంభింపజేయడం ఇదే మొదటిసారి. అయితే అసలు ఉగ్రవాదులు మాత్రం పాక్ సైన్యం రక్షణలో స్వేచ్ఛగా జీవిస్తుండటం దాయాది ద్వంద్వస్వభావానికి నిదర్శనం. -
'మసూద్ అరెస్టు గురించి తెలియదు'
-
'మసూద్ అరెస్టు గురించి తెలియదు'
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. పఠాన్కోట్ దాడి కేసులో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ను అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో చర్చలను రీషెడ్యూల్ చేయనున్నట్టు పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకన్నా ముందే మొదట భారత్తో జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలు చేపట్టనున్నామని, ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శుల చర్చలు ఉంటాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే వైఖరిని వెల్లడించాయి. పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడికి సంబంధించిన తమ దర్యాప్తు వివరాలు ఇంకా భారత్తో పంచుకోలేదని, ఆ వివరాలు పరస్పరం పంచుకునేందుకు వీలుగా మొదట ఎన్ఎస్ఏ చర్చలు నిర్వహించనున్నట్టు పాక్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తును మరింత ముందుకు కొనసాగించేందుకు తమకు మరింత సమాచారం కావాలని, తమ విచారణ బృందం భారత్ సందర్శించాలనుకుంటున్నదని పాక్ వర్గాలు తెలిపాయి. మసూద్ అజార్ అరెస్టు వార్తలపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖలిలుల్లా ఖాజి గురువారం స్పందిస్తూ 'ఆ వార్తల గురించి నాకు తెలియదు. చర్చలు మరో తేదీన నిర్వహించడంపై ప్రస్తుతం ఉమ్మడిగా చర్చలు జరుగుతున్నాయి. అందరికీ ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు అని మేం చెప్తూనే ఉన్నాం. దీనిని అంతమొందించేందుకు మనం కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది' అని అన్నారు.