Jodhpur Police
-
కటకటాల వెనక్కి ఆశారాం
జోధ్పూర్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును సోమవారం జైలుకు తరలించారు. స్థానిక జిల్లా, సెషన్స్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన కటకటాల వెనక్కి వెళ్లారు. జోధ్పూర్లోని తన ఆశ్రమంలో ఆశారాం ఓ పదహారేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెల్లని ధోతీ, కుర్తా.. తలపై ఎర్రని టోపీ ధరించిన ఈ 72 ఏళ్ల వివాదాస్పద ఆధ్యాత్మిక గురువును భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన్ను ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాల్సిందిగా మేజిస్ట్రేట్ మనోజ్కుమార్ ఆదేశించారు. దీంతో ఆశారాంను జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు సుమారు 15 నిమిషాల సేపు ఆయన కోర్టులో గడిపారు. ఆశారాంకు బెయిల్ కోసం ఆశ్రమం తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఒకరోజు పోలీసు కస్టడీలో భాగంగా ఆదివారం అధికారులు ఆయన్ను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆయనపై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద కీలక సాక్ష్యాధారాలు ఉన్నాయని డీసీపీ అజయ్ లాంబా విలేకరులకు చెప్పారు. సాధువులేమిటి ఎవర్నైనా శిక్షించాల్సిందే: కాంగ్రెస్ ఒక్క సాధువులనే కాదు.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారంద రినీ శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తరహా నేరాలపై సాధువుల్ని జైలుకు పంపడం మంచిదేనా? అన్న ప్రశ్నకు ఆ పార్టీ స్పందించింది. చట్టం అందరికీ ఒక్కటేనని, చట్టానికి ఎవరూ అతీతులు కారనేదే సందేశమంటూ ఆశారాం అరెస్టుపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి జవాబిచ్చారు. -
ఆశారాం బాపూకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
-
14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆశారాం
జోథ్ పూర్:ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ జోథ్ పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆశారాం ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు పోలీసులు గడువు కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. అతన్ని 14 రోజులు పోలీసుల కస్టడీలో ఉంచి దర్యాప్తు చేయాలని సూచించింది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన డీసీపీ .. ఆశారాం బాపూ శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు. -
'ఆశారాం బాపూపై కేసు బలంగా ఉంది'
జోథ్ పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన కేసు చాలా బలంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆశారాంపై ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు గడువు కోరతామని ఆయన తెలిపారు. కాగా, ఆశారాం బాపూ న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అతను శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. ఆశారాంను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టి మరికొన్ని రోజులు విచారణ అనుమతి కోరతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు. -
'ఆశారాం బాపూపై కేసు బలంగా ఉంది'
జోథ్ పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన కేసు చాలా బలంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆశారాంపై ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు గడువు కోరతామని ఆయన తెలిపారు. కాగా, ఆశారాం బాపూ న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అతను శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. ఆశారాంను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టి మరికొన్ని రోజులు విచారణ అనుమతి కోరతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు.