Jr NTR
-
సరికొత్త మాస్ లుక్లో...
‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్’ వంటి విజయాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్లోప్రారంభమైంది.ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించి, లొకేషన్లోని ఓ ఫొటోని షేర్ చేసింది. ‘‘మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్ నీల్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ ఆరంభించాం.తర్వాతి షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారు. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్లో ఎన్టీఆర్ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందించనున్నాం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర సాంగ్.. నయనతార పిల్లల ఎంజాయ్ చూశారా?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే ఈ సినిమాలోని ఓ సాంగ్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలోని 'చుట్టమల్లే చుట్టేస్తావే' సాంగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ పాటతో ప్రతి ఒక్కరూ మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. అంతలా ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది ఈ సాంగ్.అయితే తాజాగా ఆ పాటను వింటూ నయనతార కవలలు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. లేడీ సూపర్ స్టార్ నయన్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తూ చుట్టమల్లే సాంగ్ తమిళ వర్షన్ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.కాగా.. నయనతార ప్రస్తుతం టెస్ట్ అనే మూవీలో కనిపించనుంది. ఈ చిత్రం నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. మరోవైపు విఘ్నేష్ శివన్.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టితో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్.. క్రేజీ కాంబో మొదలైంది!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు సమయం ఆసమన్నమైంది. ఎన్టీఆర్నీల్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సరికొత్త యాక్షన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మొదటి జనవరిలోనే షూటింగ్ ప్రారంభిస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో ఈ ఫిబ్రవరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ యాక్షన్ మొదలైంది. కాగా.. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! 🔥🔥#NTRNeel shoot has officially begun. A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses 💥💥MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial… pic.twitter.com/yXZZy2AHrA— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2025 -
విజయ్ దేవరకొండ 'వీడీ12'.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీడీ12 టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అలాగే వీడీ12 మూవీకి హిందీ టీజర్కు యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ తన వాయిస్ అందించారు. తమిళంలో స్టార్ హీరో సూర్య వాయిస్తో టీజర్ విడుదల చేశారు మేకర్స్. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్తో టీజర్ను విడుదల చేయడం విశేషం.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఆడియన్స్ను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ టీజర్తో కింగ్డమ్పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక నేటితో తీరింది. 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
జూనియర్ ఎన్టీఆర్తో విజయ్ దేవరకొండ.. మొత్తానికి లుక్ రివీల్ చేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీడీ12 టైటిల్, టీజర్ రిలీజ్పై అప్డేట్ ఇచ్చారు. ఈనెల 12న టీజర్తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఒక రోజంతా జీవితం, సమయాలు, సినిమా గురించి మీతో నవ్వుతూ మాట్లాడడం సంతోషంగా అనిపించింది.. టీజర్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు మీరు కూడా నాలాగే ఎగ్జైట్ అయ్యారని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక రోజంతా సమయమిచ్చినందుకు థ్యాంక్ యూ తారక్ అన్న అంటూ ఎన్టీఆర్కు ధన్వవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.టీజర్కు ఎన్టీఆర్ డబ్బింగ్..అయితే విజయ్ దేవరకొండ తాజా చిత్రం వీడీ12కు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. బుధవారం రిలీజ్ చేయనున్న టీజర్కు ఎన్టీఆర్ తన వాయిస్ను అందించారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. మాకు అవసరమైన సమయంలో మాకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు అన్న.. మీ వాయిస్తో వీడీ12 టీజర్ భావోద్వేగాలను మరోస్థాయికి తీసుకెళ్తుందని నాగవంశీ ట్వీట్ చేశారు.అయితే ఈ పోస్ట్లో విజయ్ దేవరకొండ లుక్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ మొహం కనిపించకుండా ఫోటోను పోస్ట్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన సందర్భంగా తన వీడీ12 లుక్ను అభిమానులకు పరిచయం చేశాడు. ఫుల్ గడ్డంతో మాస్ హీరోగా దర్శనమిచ్చారు రౌడీ హీరో. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Spent most of yesterday with him. Chatting about life, times, cinema. Laughing about the same.. Sat through the dub of the teaser, him as excited as me seeing it come to life. Thank you @tarak9999 anna for a most wholesome day and for bringing your madness to our world… pic.twitter.com/f8YpVQcJSt— Vijay Deverakonda (@TheDeverakonda) February 11, 2025 -
ట్రెండ్ అవుతున్న 'దేవర'.. ఎందుకో తెలుసా..?
బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' (#Devara) హ్యాష్ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం కూడా ఉంది. గత పదేళ్లుగా భారత్లో పలు సంగీత కార్యక్రమాలలో ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. రీసెంట్గా చెన్నైలో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్తో కలిసి పాటలు పాడి ప్రేక్షకులలో జోష్ నింపారు. తాజాగా బెంగుళూరులో జరిగిన భారీ సంగీత కచేరీలో పాల్గొన్న ఎడ్ షీరన్ 'దేవర' సినిమా నుంచి ఒక సాంగ్ పాడారు. దీంతో ట్విటర్లో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులు ఆ క్లిప్ను వైరల్ చేస్తున్నారు.ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు 'గ్రామీ'. ఆ జాబితాలో తమ పేరు ఉండటమే అత్యున్నత గౌరవంగా చాలామంది భావిస్తారు. అలాంటిది ఎడ్ షీరన్ ఏకంగా నాలుగు 'గ్రామీ' అవార్డులు దక్కించుకున్నారు. అందుకే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు. బెంగుళూరులో ఆయన తొలి ప్రదర్శన కావడంతో టికెట్ల కోసం సంగీత ప్రియులు భారీగా పోటీ పడ్డారు. స్టేజీపైన 'దేవర' తెలుగు పాటను వినిపించి కన్నడ వారిలో జోష్ నింపారు. 'దేవర' మూవీ నుంచి యూట్యూబ్లో రికార్డు వ్యూస్ సాధించిన ‘చుట్టమల్లే..’ తెలుగు వర్షన్ సాంగ్ను ఎడ్ షీరన్ పాడారు. ప్రముఖ సింగర్ శిల్పారావుతో ఆయన గాత్రం కలిపారు. దేవరలో ఈ పాటను అన్ని భాషల్లో శిల్పారావు ఆలపించడం విశేషం. దీంతో ఒక్కసారిగా కన్నడ అభిమానులు కేరింతలు వేశారు. వారి చూపిన ఆదరణపై ఎడ్ షీరన్ ఆశ్చర్యపోయారు. మరోసారి బెంగుళూరుకు వస్తానని మాట ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఎడ్ షీరన్ ఆదివారం ఉదయం సడెన్గా బెంగళూరులో ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి ప్రకటన లేకుండా ఫుట్పాత్పై పాటలు పాడటం ఆయన ప్రారంభించారు. అయితే, అక్కడ ఒక్కసారిగా భారీగా జనాలు వచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనొక అంతర్జాతీయ సింగర్ అని వారు గుర్తించలేకపోయారు.. అదే సమయంలో ఆయన కూడా చెప్పుకోలేదు. దీంతో అక్కడి మైక్ వైర్ను పోలీసులు తొలగించారు. కొంత సమయం తర్వాత ఈవెంట్ నిర్వాహకులు వచ్చి ఆయన గురించి పోలీసులకు అసలు విషయం చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. భారత పర్యటనలో భాగంగా పూణే, ఢిల్లీలో కూడా ఆయన కార్యక్రమాలు జరగనున్నాయి.#Chuttamalle Song and audience vibing is a whole different energy! ❤️🫶🏻#Devara https://t.co/cLThLtj8aR— Devara (@DevaraMovie) February 9, 2025Ed’s first Telugu song with @shilparao11 🤝 pic.twitter.com/7jJh6stkyW— Ed Sheeran HQ (@edsheeran) February 9, 2025#Chuttamalle Song and audience vibing is a whole different energy! ❤️🫶🏻#Devara https://t.co/cLThLtj8aR— Devara (@DevaraMovie) February 9, 2025 -
అల్లు అర్జున్తో నో.. ఎన్టీఆర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్కు గ్రీన్ ఇచ్చేసిందట. చిత్రపరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న ఆమెకు ఐటమ్ సాంగ్స్లో నటించమని ఇప్పటికే భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఆమె సున్నితంగానే వాటికి నో చెప్పింది. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ వార్2లో ఆమె స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది.‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన శ్రద్ధా కపూర్కు టాలీవుడ్లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మంచి డ్యాన్సర్ కూడా.. అయితే, ‘పుష్ప2’లో ప్రత్యేక పాట కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరిగింది. రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్ కాకపోవడంతో ఆమె నో చెప్పారని కూడ వార్తలు వచ్చాయి. ఫైనల్గా ఆ ఛాన్స్ శ్రీలీల దక్కించుకుంది. ఇప్పుడు వార్2 సినిమాలో శ్రద్ధా కపూర్ ఒక ఐటమ్ సాంగ్లో కనిపించనుందని గట్టిగానే వినిపిస్తుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా స్పీడ్గా జరుగుతోంది.అల్లు అర్జున్ పుష్ప2 చిత్రానికి నో చెప్పిన శ్రద్ధా కపూర్.. ఎన్టీఆర్, హృతిక్తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీప్రియుల్ని ఉర్రూతలూగించేలా ఆ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని శ్రద్ధ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎలా తీశారో తెలుసా..?
ఎన్టీఆర్(NTR), రామ్చరణ్(Ram charan) ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాజమౌళి(Raja mouli) తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయతే, ఇందులో రామ్చరణ్ ఎంట్రీ సీన్ను ఎలా క్రియేట్ చేశారో ఒక వీడియో ద్వారా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సన్నివేశం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. సుమారు 10 నిమిషాల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సీన్ కొనసాగుతుంది.తారక్ ఎంట్రీ సీన్కు ఎంత పాపులారిటీ వచ్చిందో రామ్ చరణ్ ఎంట్రీ కూడా అంతే బజ్ను క్రియేట్ చేస్తుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. సుమారు 900 మంది ఓ పోలీస్స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించరు. కానీ, పోలీస్ అధికారి అయిన రామ్చరణ్ రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. రామరాజుగా చరణ్ చూపిన తెగువకు బ్రిటిష్ అధికారులే ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క సీన్ క్రియేట్ చేసేందుకు 32 రోజులు పడినట్లు మేకర్స్ చెప్పారు. అలాంటి సీన్ను ఎలా క్రియేట్ చేశారో మీరు చూసేయండి. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో పూర్తిగా తెలుసుకోవాలంటే.. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. -
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్ని చూపారు. టాలీవుడ్లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్ప్రైజెస్ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
ఆ 3 సినిమాలూ పుష్ప-2 కి పోటీ? ఎన్టీఆర్ - బన్నీ ఫైట్
అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్లో కలెక్షన్ల ఎర్త్క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.సీక్వెల్తో సీక్వెల్పై యుద్ధం..పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్గా నిలవడం ఖాయం. అలాగే నార్త్లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.కాంతారా... కలెక్షన్ల జాతరా?అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.కామెడీతో కొట్టగలరా?బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.అంత ఈజీ కాదు...అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్బ్లాక్గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్ను కొనసాగించగలిగితే, కంటెంట్తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా -
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫిఫా పోస్టర్.. స్పందించిన యంగ్ టైగర్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.అయితే ఈ సాంగ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులకు కాలు కదపకుండా ఉండరేమో అనేలా ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ పాటను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్(ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది.ఆ పోస్టర్లో ఫుట్బాల్ దిగ్గజాలు నేయ్మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్టర్ను రూపొందించారు. ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మన యంగ్ టైగర్. ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మాస్ టైగర్ ఎన్టీఆర్ అంటూ జూనియర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా దేవర పార్ట్ -1 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి వార్- 2 మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) -
'దయచేసి నా అభిమానులు ఆ పని చేయొద్దు'.. జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. మిమ్మల్ని కలిసేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని అన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా మాట్లాడతానని వెల్లడించారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పాదయాత్రలు చేయొద్దు..అయితే తనను కలిసేందుకు పాదయాత్రలు లాంటివి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమమే నాకు ముఖ్యమన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న మీ ఆసక్తిని అర్థం చేసుకుని వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అధికారులతో అన్ని అనుమతులు తీసుకుని.. అందరినీ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తెలిపారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది.. ఈ విషయంలో అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.గతేడాది దేవర మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.A Statement from @tarak9999 Office#JrNTR #ManOfMasses𝐍𝐓𝐑#Devara #war2 #Ntrneel pic.twitter.com/erzTOohW0R— TigerNation 🐯 (@IamGanesh1718) February 4, 2025 -
నా రెస్టారెంట్ లో jr ఎన్టీఆర్ కి బాగా నచ్చిన ఫుడ్ ఇదే..
-
బాబాయికి అభినందనలు తెలిపిన యంగ్ టైగర్
నందమూరి బాలకృష్ణకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. మీరు అటు సినిమా.. ఇటు ప్రజలకు అందించిన సేవలకు దక్కిన గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్, నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. నటసింహంగా గుర్తింపు..నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.బాలకృష్ణ హీరోగా తొలి చిత్రం..1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానం..‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.— Jr NTR (@tarak9999) January 25, 2025 -
తను..టైగర్ అన్న హాలీవుడ్ డైరెక్టర్... ఎన్టీయార్తో సినిమా?
జానియర్ ఎన్టీయార్(JR NTR) టాలీవుడ్లో టాప్ హీరో. త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో(Hollywood Movie) అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే అవునని చెప్పలేకపోయినా... ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి మాటలే అందుకు నిదర్శనం. ఇలాంటి చర్చకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పక తప్పదు. హాలీవుడ్ చిత్ర ప్రముఖులపై ’ఆర్ఆర్ఆర్’ ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీయార్లోని మహోన్నత నటరూపాన్ని ఆవిష్కరించాడు. నిజానికి ఎన్టీయార్తో ఎలాంటి సినిమా అయినా చేయవచ్చునని తెలిసిన దర్శకుడు రాజమౌళి. ’సింహాద్రి’ ’యమ దొంగ’ వంటి చిత్రాలు పెద్ద హిట్ కొట్టడానికి ఆర్ఆర్ఆర్ ప్రపంవచ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి అదే కారణం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జూనియర్, రాజమౌళిలకు హ్యాట్రిక్ హిట్తో పాటు ఇంటర్నేషనల్ పాప్యులారిటీని కూడా అందించింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ టూ హాలీవుడ్...ఆర్ఆర్ఆర్ తో తెచ్చుకున్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ను బాలీవుడ్ కూడా కోరుకునేలా చేసింది. ప్రస్తుతం జా.ఎన్టీయార్ ’వార్ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్తో కలిసి జూనియర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్తో తన తదుపరి యాక్షన్ అడ్వెంచర్కు కూడా యంగ్ టైగర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్ చిత్రంలో ఎన్టీయార్ అనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.నేను రెడీ అంటున్న సూపర్ మ్యాన్ డైరెక్టర్...ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ గన్ (James Gunn) ’సూపర్మ్యాన్,’ ’సూసైడ్ స్క్వాడ్,’ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జాతీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్మ్యాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాప్యులర్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి గొప్పగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించి మరీ ఆయన జూనియర్పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. ముఖ్యంగా ‘బోనులలో నుంచి పులులతో పాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీయార్)తో నేను పని చేయాలనుకుంటున్నాను. అతను అద్భుతమైన నటుడు. నేను అతనితో ఏదో ఒక రోజు పని చేయాలనుకుంటున్నాను‘ అని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ ఎంతగానో ఆకట్టుకున్నాడని జేమ్స్ అన్నారు. ఇప్పటి దాకా టాప్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓ తెలుగు హీరోని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. -
సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి (ఫొటోలు)
-
ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్ రామ్(Kalyan Ram) హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణించి ఆపై నాయకుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమ తాత నందమూరి తారక రామారావు సేవల గురించి వారు మరోసారి గుర్తుచేశారు. ఈ సందర్భంగా రామారావు అభిమానులు నివాళీలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నేడు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.ఆ రోజు నుంచి ఏర్పాట్లన్నీ చూసుకుంటుంన్న తారక్సుమారు ఆరేళ్ల క్రితం రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య సమాధి వద్దకు చేరుకున్నారు. జయంతి సందర్భంగా పూలతో కళకళలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసి పోవడం చూసి తారక్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు వెంటనే పూలు తెప్పించి సమాధిని ఘనంగా అలంకరించారు. తమ అభిమానుల సాయంతో కొన్ని నిమిషాల్లోనే సమాధి మొత్తం పూలతో కళకళలాడేలా చేశారు. (ఇదీ చదవండి: ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన)ఆ తర్వాత వారిద్దరూ నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్కు సంబంధించిన కార్యక్రమం ఏదైనా సరే ఆయన సమాధిని పూలతో అలంకరిస్తూ వస్తున్నారు. గతేడాదిలో కూడా తారక్ దగ్గరుండి తాత సమాధిని పూలతో అలంకరణ చేశారు. అయితే, తండ్రికి నివాళి అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అక్కడ ఎక్కువగా తారక్ ఫ్లెక్సీలు కనిపించడంతో వాటిని తొలగించాలని తన అభిమానులతో చెప్పారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు తొలగించిన చోటే మళ్లీ తారక్ అభిమానులు కొత్త కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఆపై వాటికి పాలతో అభిషేకం చేశారు. అయితే, ఈ సారి బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).@tarak9999 And @NANDAMURIKALYAN Paid His Tributes To Anna #NTR Gaaru At NTRGhat 🙏#ManOfMassesNTR #NTRVardhanti pic.twitter.com/5YqqK4sqbM— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 18, 2025 -
బాలీవుడ్లో ఎన్టీఆర్.. నాటు నాటు పాట రిపీట్?
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత హిట్టో తెలియంది కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకెత్తయితే ఆ ఒక్క పాట ఒకెత్తు అన్నట్టుగా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ పాట దునియాని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఓ రేంజ్లో పాప్యులరైంది. అదే ఊపులో ఇండియాకి ఆస్కార్ని కూడా తెచ్చేసింది. మరోసారి ఈ తరహా పాట రిపీట్ కానుందా? అందులో మన యంగ్ టైగర్ తన కాలు కదపనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న భారీ చిత్రం వార్ 2 చిత్ర విశేషాలను గమనిస్తున్నవారు దీనిని దాదాపుగా ధృవీకరిస్తున్నారు. తొలిసారిగా ఎన్టీయార్ వార్ -2లో నటిస్తుండటంతో ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మన ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.హృతిక్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశం స్పెషల్గా ఉండాలని కాబట్టి తప్పకుండా తగినన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అందరూ భావిస్తున్నారు. మరోవైపు నాటునాటు పాట తరహాలో ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట. బాలీవుడ్లో హృతిక్ నృత్యాలకు కూడా మంచి పేరుంది. మరోవైపు ఎన్టీయార్ డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో సాంగ్ అనే ఆలోచన నిజమైతే... ఇక ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. ఇటీవల హృతిక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్తో డ్యాన్స్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు. . ఆయనతో పాటుగా స్టెప్స్ వేయాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని అభిప్రాయపడ్డాడు. .ఈ సినిమాలో పాట నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉండేలా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.మరోవైపు తొలిసారిగా ఒక అగ్రగామి తెలుగు హీరో...విలన్ తరహా పాత్రను బాలీవుడ్లో పోషిస్తుండడంతో వార్ 2 సినిమా చర్చనీయాంశంగా మారింది: ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్తో ఉంటుందని టాక్. అటు డ్యాన్స్, ఇటు యాక్షన్లో హృతిక్తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ 2 విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సంచలనాత్మక సినిమాల్లో వార్ -2 ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి బాలీవుడ్, టాలీవుడ్ పూర్తి స్థాయి మల్టీ స్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్లో ఉంది. -
సైఫ్ అలీఖాన్పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఆయన ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్ను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో ఆయనకు ఆరుచోట్ల గాయాలయ్యాయి. అందులో రెండు చోట్ల లోతైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆనయ్ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక పక్కనే తీవ్రగాయం కావడంతో వైద్యులు నటుడికి సర్జరీ చేస్తున్నారు. దొంగతనం చేసే క్రమంలోనే..ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడు దొంగతనానికి వచ్చాడా? లేదా పక్కా మర్డర్ ప్లాన్తోనే సైఫ్పై దాడి చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై కరీనా కపూర్ (Kareena Kapoor) టీమ్ ఓ లేఖ విడుదల చేసింది. సైఫ్- కరీనా ఇంట్లో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునే క్రమంలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లోని మిగతా సభ్యులు క్షేమంగానే ఉన్నారు. పోలీసుల విచారణ జరుగుతోంది అని లేఖలో పేర్కొన్నారు.షాక్కు గురయ్యాఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సైఫ్ సర్పై జరిగిన దాడి గురించి విని షాక్కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. చిరంజీవి (Chiranjeevi) సైతం సైఫ్ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి నన్నెంతగానో కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.హీరో నుంచి విలన్గా..సైఫ్ అలీఖాన్ ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కానీ ఇటీవల మాత్రం ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే మెప్పిస్తున్నాడు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన దేవర చిత్రంలో విలన్గా నటించాడు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో యాక్ట్ చేశాడు. వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి! -
హృతిక్ రోషన్ vs జూనియర్ ఎన్టీఆర్ భీభత్సమైన డ్యాన్స్ పోటీ
-
ఎన్టీఆర్ డ్రాగన్లో టొవినో?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో మలయాళ నటులు టొవినో థామస్, జోజూ జార్జ్ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణీ వసంత్, టొవినో థామస్ల లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ సినిమా చిత్రీకరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. తొలి షెడ్యూల్ను కర్ణాటకలో ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక... కెరీర్లో యాభైకిపైగా సినిమాల్లో నటించిన టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో, 2024లో వచ్చిన ‘ఏఆర్ఎమ్’ చిత్రాల్లో టొవినో థామస్ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్ మూవీస్గా నిలిచాయి. -
హృతిక్, జూ.ఎన్టీయార్ల మధ్య ‘వార్’కి టైమ్ బాగుందట!
ప్రముఖ బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తదుపరి చిత్రం వార్ 2(War 2) పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయర్ సైతం నటిస్తుండడంతో దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ జ్యోతిష్కుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కానుందంటూ జోస్యం చెప్పడం విశేషం.బాలీవుడ్లో ప్రఖ్యాత జ్యోతిష్కుడు విక్రమ్ చంద్రరమణి హృతిక్ జ్యోతిష శాస్త్ర చార్ట్ను విశ్లేషించారు, దీని ప్రకారం 2025 అతని కెరీర్లో కీలకమైన సంవత్సరంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ తన కెరీర్లో 10వ సూర్య దశను అనుభవిస్తున్నాడనీ ఈ సూర్య దశ జూలై 2025లో ముగిసి చంద్ర దశగా మారుతుందనీ ఆయన వివరిస్తున్నారు. ఆల్–టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘కహో నా... ప్యార్ హై’ (2000) సమయంలోనూ హృతిక్ విజయంలో వీనస్ కీలక పాత్ర పోషించిందని జ్యోతిష్కుడు విక్రమ్ అంటున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా హృతిక్కు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. హృతిక్ వ్యక్తిగత వృత్తి జీవితంలో కీలక పరిణామాలు ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే అవకాశం ఉందనీ, జనవరి ఫిబ్రవరిలో రియల్ ఎస్టేట్, స్టాక్లు లేదా ప్రైవేట్ ఈక్విటీలో వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన పెడతారని కూడా జ్యోతిష్కుడు చెబుతున్నారు. బహుభాషా చిత్రాల ఒప్పందాలతో సహా, వినోద పరిశ్రమలో తన స్థాయిని మరింతగా విస్తరించవచ్చునన్నారు. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా హృతిక్ కొత్త మార్గాలను, నైపుణ్యాలను సంపాదించడంతో పాటుగా తన సినిమాల పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా మారుస్తారని చెప్పారు. హృతిక్ గత చిత్రాలలో ’వార్’ (2019) బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక ’విక్రమ్ వేద’ (2022), ’ఫైటర్’ (2024) విమర్శకుల ప్రశంసలు పొందడంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 10న హృతిక్ రోషన్ తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో, ఆయనకు ఇది మరో విజయవంతమైన సంవత్సరం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానున్న వార్ 2 హిందీ సినిమాల్లో రికార్డ్–బ్రేకింగ్ ఓపెనర్గా అంచనా వేస్తున్న నేపధ్యంలో పండితుడు చెప్పిన ఈ జోస్యం అభిమానులను సంతోషపెట్టేదే అని చెప్పాలి. మరోవైపు జోస్యం ఫలించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిస్తే ఈ సినిమాలో తొలిసారి విలన్గా నటిస్తున్న జూ.ఎన్టీయార్(Jr NTR) బాలీవుడ్ కెరీర్ కూడా మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. -
'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్
‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj ) సినిమా నుంచి తాజాగా విడుదలైన 'దబిడి సాంగ్'లో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులలో వెగటును తెప్పించేలా ఉన్నాయి. గతంలో పైసా వసూల్ అంటూ చేతి వెకిలి సైగల స్టెప్పులే మేలు అనేలా ఇప్పుడు విడుదలైన సాంగ్ ఉందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే, ఇదీ చాలదన్నట్లు జూ.ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య సినిమాపై భగ్గుమంటున్నారు. డాకు మహారాజ్ను బాయ్కాట్ చేస్తామంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీనంతటికీ కారణాలు కూడా ఉన్నాయని వారు తెలుపుతున్నారు.డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్లో బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్గా వ్యవహరిస్తున్న షోలో చిత్ర దర్శకుడు బాబితో పాటు నాగవంశీ, తమన్ (Thaman S) గెస్టులుగా వెళ్లారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్కు వచ్చింది. బాబి ఇప్పటి వరకు డైరక్ట్ చేసిన సినిమాలతో పాటు అందులో నటించిన హీరోల గురించి మాట్లాడారు. అయితే బాబి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన జై లవకుశ సినిమా, ఎన్టీఆర్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. బాలయ్య సూచనమేరకే ఈ టాపిక్ రాలేదని వైరల్ అయింది. ఈ షోకు గెస్టులుగా ఎవరు వచ్చినా సరే.. ఎవరూ కూడా ఎట్టి పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని బాలయ్య చెప్పాడని వైరల్ అయింది. బాబి తను తీసిని సినిమా హీరోల అందరి పేర్లు ప్రస్తావించి ఎన్టీఆర్ పేరు తెరపైకి తీసుకురాకపోవడంతో తారక్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ డాకు మహారాజ్ సినిమాకు వెళ్లొద్దని తారక్ ఫ్యాన్స్కు సూచన చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్' ఊచకోత ట్రైలర్ వచ్చేసింది)సోషల్మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నిర్మాత నాగవంశీకి (Suryadevara Naga Vamsi) అసలు విషయం అర్థమైనట్లు ఉంది. నెట్టింట ఇలాగే కొనసాగితే డాకు మహారాజ్కు డ్యామేజ్ తప్పదని గ్రహించిన ఆయన ఇలా ట్వీట్ చేశారు. 'ఇది మన అందరి సినిమా.. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్బస్టర్ చేసేందుకు ప్రయత్నిద్దాం.' అంటూ రాసుకొచ్చారు. దీంతో నాగవంశీపై కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్కు వీరాభిమానినని అన్నావ్.. కేవలం తారక్పై ఇష్టంతోనే దేవర సినిమా రైట్స్ తీసుకున్నానని చెప్పుకున్నావ్. మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్గా చెప్పుకోవడం ఏంటి అంటూ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో తాము డాకు మహారాజ్ను బాయ్కాట్ చేస్తున్నామని కామెంట్ చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరికొందరు మాత్రం ‘ఈ ఒక్కసారి నీ సినిమా చూడం’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకూ డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇంతకీ మీరు ఏం సినిమా తీసినారో చెప్పలేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, బాలకృష్ణ అభిమానులు కూడా తమకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ అక్కర్లేదంటూ తిరిగి సమాధానంగా చెప్పుకొస్తున్నారు.ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం. మీNaga Vamsi— Naga Vamsi (@vamsi84) January 4, 2025 -
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ సినిమా దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేశారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.ఆరు థియేటర్లలో 100 రోజులుఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్ఎన్ఆర్), రొంపిచర్ల (ఎమ్ఎమ్ డీలక్స్) వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
ఫ్యాన్స్కి ‘స్టార్స్’ న్యూ ఇయర్ విషెస్
కొత్త సంవత్సరం వచ్చేసింది. 2024కు గుడ్బై చెప్పి 2025కి వెల్కమ్ చెప్పేశారు. దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇక తెలుగు స్టార్ హీరోల్లో చాలా మంది విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. యూరప్లో మహేశ్, ప్రభాస్..లండన్లో ఎన్టీఆర్ కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే తామ ఎక్కడున్నా..అభిమానులను మాత్రం మరిచిపోమంటున్నారు మన హీరోలు. న్యూ ఇయర్ సందర్భంగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ‘అందరికి నూత సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ లండన్లో ఉన్నారు. ఇటీవల వార్ 2 షూటింగ్కి గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి రాగానే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.Wishing you all a very Happy New Year 2025. May this year bring you joy and success.— Jr NTR (@tarak9999) December 31, 2024 ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ‘ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్ చేశారు. Happy New Year to each and every one of you . Happy New year to all my Fans . I l love you all 🖤— Allu Arjun (@alluarjun) December 31, 2024ఇక నేచురల్ స్టార్ నాని కాస్త భిన్నంగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్. 2025 ‘సర్కార్’ ఇయర్’ అంటూ ‘హిట్: ది థర్డ్ కేస్’ కొత్త పోస్టర్ని వదిలాడు.శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇది వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy new year.2025. pic.twitter.com/CDLQ6DgieO— Nani (@NameisNani) December 31, 20242025వ సంవత్సరం మనందరికీ కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, భారతీయ సినిమా వైభవం మరింత విస్తరించి ప్రకాశవంతంగా వెలగాలని కోరకుంటూ మెగాస్టార్ చిరంజీవి నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.Bye Bye 2024 & Welcome 2025 !! 🎉🥳🎊🍾May the year 2025 give all of us New Hopes,Aspirations, Life & Career goals and the Drive & Energy to realise them all. May the Glory of Indian Cinema spread farther and shine brighter!!Happy New Year to All ! May Love, Laughter and Joy…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 1, 2025Happy New Year ❤️❤️! May we all thrive in greater harmony, peace, and positivity. Om Namah Shivaya 🙏🙏🙏.— Dhanush (@dhanushkraja) December 31, 2024Wishing you all a fantastic New Year ahead, filled with joy, growth, and success ❤️❤️🤗Let’s make 2025 a great one 👍👍#HappyNewYear2025— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2025Wishing you all a fantastic New Year ahead, filled with joy, growth, and success ❤️❤️🤗Let’s make 2025 a great one 👍👍#HappyNewYear2025— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2025 View this post on Instagram A post shared by jetpanja (@sai_dharam_tej_43) -
లండన్లో చిల్ అవుతోన్న యంగ్ టైగర్.. వీడియో వైరల్
ఈ ఏడాది దేవర మూవీతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ యాక్షన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2లో కనిపించనున్నారు. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల నిర్మాత ప్రకటించారు.అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు యంగ్ టైగర్. లండన్లో తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా లండన్లోని హైడ్ పార్క్లో తన పిల్లలతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. #JrNTR anna at London with his family...@tarak9999 #prideofindia pic.twitter.com/CEtShHW8r4— i am Rajesh(NRT)“🐉” (@rajeshntripati) December 28, 2024 Tiger @tarak9999 chilling on the streets of London ♥️🐯#JrNTR #War2 #NTRNeel #Dragon pic.twitter.com/LLxLG5N7zc— poorna_choudary (@poornachoudary1) December 28, 2024 -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. ఆడియన్స్ను కంటతడి పెట్టిస్తోన్న ఆ సీన్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్ను సొంతం చేసుకుని ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నటనతో అభిమానులను కట్టిపడేశారు. 2022లో మార్చి 25 విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది.అయితే ఈ మూవీ జర్నీపై ఆర్ఆర్ఆర్ మేకర్స్ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈనెలలోనే థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే నెట్ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ డాక్యుమెంటరీలోని ఓ సన్నివేశం ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ను కొరడాతో కొట్టిన సీన్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇందులో ఎన్టీఆర్ను రామ్ చరణ్ కొరడాతో కొడతాడు. కానీ వెంటనే ఎక్కడ జూనియర్కు దెబ్బ తగిలిందేమోనని దగ్గరికి వచ్చిన గట్టిగా హత్తుకుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహంపై కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రాణ మిత్రులని పోస్టులు పెడుతున్నారు. I want to thank whoever decided to make this documentary about the making of the best movie ever. You must watch this! Every person in the entire world should watch this.#RRRBehindAndBeyond pic.twitter.com/W1zF7VZouu— Tarak Forever (@Charanlucky22) December 27, 2024 them pic.twitter.com/J6Gn3yu7OO— xy (@ssmbbakthudu) December 27, 2024 NTR ♥️ RC bonding 🥹🥹♥️#RRRBehindAndBeyond #RRRMovie#RRRBehindAndBeyondOnNetflix @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/PQKC0axFB7— Gopi tarak 9999 DevaraOnSep27th (@7799_gopi) December 27, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ
ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ రేంజ్కు ఈ చిత్రం తీసుకెళ్లింది. ఈ సినిమాకు సంబంధించి తెరవెనుక జరిగిన ఆసక్తికర విషయాలను 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో థియేటర్స్లో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మూడు గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా వెనక దాగి ఉన్న మూడేళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్ అనుకున్నారు.ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్గణ్, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి 'ఆస్కార్' అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే దీనిని విడుదల చేశారు. అయితే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ జక్కన్నకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతన్న 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీని మీరూ చూసేయండి. దీని రన్టైమ్ 1 గంట 38 నిమిషాలు ఉంది. ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు. -
ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లిఅయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన
ఆదుకుంటానని హామీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాట తప్పారంటోంది ఓ అభిమాని తల్లి మహిళ. ఇప్పటివరకు అతడి దగ్గరి నుంచి ఏ సాయమూ అందలేదని వాపోయింది. కాగా తారక్ అభిమాని కౌశిక్ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దేవర సినిమా చూసి చనిపోవాలనుందని, అదే తన చివరి కోరిక అంటూ అప్పట్లో అతడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఎలాంటి సాయం అందలేదుఇది చూసిన తారక్.. చావుబతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటానని గతంలో హామీ ఇచ్చాడు. ఈమేరకు వీడియో కాల్ ద్వారా మాట్లాడి కౌశిక్కు గుండెధైర్యం చెప్పాడు. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సాయం అందలేదని, తన కొడుకును కాపాడాలని కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చింది. సోమవారం నాడు ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరి నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. ఆయన అభిమానులు మాత్రం రూ.2.5 లక్షలు ఇచ్చారు.ఎటువంటి స్పందన లేదు సీఎం సహాయక నిధి నుంచి రూ.11 లక్షలు, టీటీడి నుంచి రూ.40 లక్షలు రాగా, ఈ డబ్బుతో అతడికి ఆపరేషన్ చేయించాం. అయితే ఇంకా రూ.20 లక్షలు ఇస్తేనే నా కొడుకును డిశ్చార్జ్ చేస్తాంటుమన్నారు. సహాయం చేస్తానని మాటిచ్చిన ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.చదవండి: షో చేస్తున్నావేంటి? నీ కంటికి మా హీరోయిన్ ఎలా కనిపిస్తోంది?' -
స్టార్ హీరోలను మెప్పిస్తున్న యంగ్ డైరెక్టర్స్
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్కుమార్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్హిట్ ఫిల్మ్తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్నగర్ భోగట్టా. కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్కు వినిపించగా, శౌర్యువ్కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్కెరీర్లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు. -
ఢీ అంటే ఢీ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించారని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ ఇటీవల ఎన్టీఆర్కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్చరణ్కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్బాబు, శరత్కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
'దేవర'కు 50 రోజులు... ఎన్ని కేంద్రాల్లో అంటే..?
ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ సినిమా దేవర ఆఫ్ సెంచరీ కొట్టేసింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ అయిందని చెప్పుకునేందుకు కలెక్షన్స్ కొలమానం అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ఆడిందనే మాట వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పాటు ఆడిందని మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు. చాలారోజుల తర్వాత ఇలా సెంటర్స్ లిస్ట్ చూడటం జరిగిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుక చేసుకుంటున్నాడు. దీంతో నేడు థియేటర్స్ అన్నీ మళ్లీ హౌస్ఫుల్ అవుతున్నాయి. అయితే, దేవర సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ వందల కిలోమీటర్ల పాదయాత్ర
తనని ప్రేమించే ఫ్యాన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్కు ఎనలేని అభిమానం. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులపై కూడా ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు. అందుకే తారక్ ప్రతి ఆడియో ఫంక్షన్లో అభిమానులు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, వారి కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ఉంటారని సూచిస్తాడు. ఫ్యాన్స్పై ఆయన చూపించే ఇలాంటి ప్రేమనే నేడు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది.కుప్పంలోని గుడుపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులు తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ను కలిసేందుకు హైదరాబాద్కు పాదయాత్ర చేశారు. సోడిగానిపల్లి పంచాయతీ పాళెం గ్రామానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శివ, హరి, లక్ష్మీపతి, కదిరప్ప పాద యాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. నవంబర్ 3న వారు తమ ఇంటి నుంచి ప్రయాణించారు. తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్లోని జూనియర్ ఎన్టీఆర్ నివాసం వరకూ ‘వేసే ప్రతి అడుగు జూనియర్ ఎన్టీఆర్ అన్న కోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 650 కిలోమీటర్లు పైగా కాలినడకన హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ కలుసుకున్నారు. కుప్పం నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు వారికి సుమారు 13 రోజుల సమయం పట్టింది. తారక్పై వారు చూపించిన ప్రేమకు కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివరాయల్ వారికి సంఘీభావం తెలిపారు.This is why he’s the PEOPLE’S HERO ❤️❤️MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024 -
దమ్మున్న హీరోకే 'దేవర' సాధ్యం.. ఆ ఒక్కటి చేసుంటేనా..: పరుచూరి
దేవరతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేవర సినిమాపై రివ్యూ ఇచ్చారు.దమ్మున్న హీరోఆయన తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. 'సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే! సంగీతం మరీ అంత గొప్పగా లేదు. డిఫరెంట్ టాక్ వచ్చినా కూడా సినిమా విజయవంతంగా ఆడాలంటే అక్కడ దమ్మున్న హీరో ఉండాలి. అలాంటివారిలో మా చిన్న రామయ్య (జూనియర్ ఎన్టీఆర్) ఒకడు. సముద్రపు దొంగ మంచివాడిగా ఎలా మారాడన్నదే కథ. కథ చిన్నదే..ఇంత చిన్న పాయింట్పై ఆధారపడి మూడుగంటల నిడివితో సినిమా తీయడమనేది జోక్ కాదు. ఎక్కువ సన్నివేశాలు సముద్రానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ విషయంలో కొరటాల శివ 'స్క్రీన్ప్లే మాస్టర్' అనిపించుకున్నాడు. ఈ కథ తారక్కు సెట్ కాదేమోననుకున్నా.. కానీ డైరెక్టర్.. ఎన్టీఆర్కు తగ్గట్లుగా మూవీ తీసి వసూళ్లు రాబట్టాడు. అలా చేసుంటేనా..!ఇదే కథ హాలీవుడ్లో తీస్తే సూపర్ అంటారు. కథ గొప్పగా లేకపోయినా కథనం బాగుంటే సినిమాలు ఆడతాయనడానికి దేవర ప్రత్యక్ష ఉదాహరణ. ట్విస్టులు బాగున్నాయి. జాన్వీ కపూర్తో ఎన్టీఆర్కు రొమాంటిక్ సీన్లు, వినోదాత్మక సన్నివేశాలు పెట్టుంటే రూ.1000 కోట్లు ఈజీగా దాటేసేది. తారక్ నటన సహజంగా ఉంది' అని పేర్కొన్నారు.చదవండి: తల్లిని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన నిఖిల్.. మరి తేజ సంగతి? -
దేవర సీక్వెల్.. ఆ పాత్ర కోసం కసరత్తులు: దేవర నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర పార్ట్-1. సముద్రపు బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే దేవర పార్ట్-2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దేవర నటుడు తారక్ పొన్నప్ప. ఆయన దేవర మూవీలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం వికటకవి అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవర-2లో యతి పాత్రకు సంబంధించిన ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు.తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..' ప్రస్తుతం స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయి. దేవర-2 2026లో జనవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్నీల్తో సినిమా చేయాల్సి ఉంది. దేవర-2లో కీలకమైన యతి పాత్రపై వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ పాత్రకు బెస్ట్ పర్సన్ కోసం చూస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది' అని అన్నారు. కాగా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన వికటకవి వెబ్సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను జీ5 ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. ఈ వెబ్సిరీస్లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనౌన్స్చేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. -
సూపర్ హిట్ డైరెక్టర్తో 'తారక్' పాన్ ఇండియా సినిమా
ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తారక్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆయన దేవర2, వార్2, చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో స్టార్ డైరెక్టర్తో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలిప్కుమార్తో తారక్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు జైలర్ వంటి బ్లాక్ బస్టర్ను అందించిన దర్శకుడు నెల్సన్ దిలిప్కుమార్.. ఆయనతో సినిమా అంటే మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. వరుస డిజాస్టర్ సినిమాలతో ఉన్న రజనీకాంత్కు జైలర్ సినిమాతో నెల్సన్ భారీ విజయానందించారు. ఏడాది క్రితం జైలర్తో బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఆయన ఇప్పటికీ ఎలాంటి సినిమా చేస్తారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి.నెల్సన్ దిలిప్కుమార్ డైరెక్ట్ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. డాక్టర్,జైలర్,బీస్ట్ వంటి సినిమాలు సత్తా చాటాయి. ఇప్పుడు తారక్తో ఆయన సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తుండంతో ఇరువురి ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్గా ఆయన నిర్మాతగా 'బ్లడీ బెగ్గర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కవిన్ హీరోగా మెప్పించాడు. ఈ సినిమా అనంతరం జైలర్ 2 సీక్వెల్ తెరకెక్కించేపనిలో నెల్సన్ ఉన్నాడు . ఈ ప్రాజెక్ట్ అనంతరం తారక్ కోసం నెల్సన్ ఒక బిగ్ ప్లాన్ వేయనున్నట్లు టాక్. -
దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాప్డ్రాప్లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్ ఈ ఫుల్ వీడియో సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.ఓటీటీకి దేవరనవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్తో అలరించింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్ర పెళ్లి పీటలెక్కనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట.నార్నే నితిన్ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు వారి కుమారులు అభయ్, భార్గవ్లు సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్రామ్, వెంకటేశ్ పాల్గొన్నారు. కాబోయే వధూవరులను వారు ఆశీర్వదించారు.ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన రీసెంట్గా ఆయ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. View this post on Instagram A post shared by NTR Trends (@ntrfantrends) -
ఎన్టీఆర్ టాలీవుడ్ ఎంట్రీ.. యంగ్ టైగర్ ట్వీట్ వైరల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలయ్య, హరికృష్ణ ఇలా ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. తాజాగా ఈ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు.ఈ సినిమాను వైవీఎస్ చౌదరి తెరకెక్కించనున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైవీఎస్ చౌదరి ప్రకటించారు. కొత్త హీరో యంగ్ ఎన్టీఆర్ను ఆయన పరిచయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ..'రామ్ మొదటి అడుగుకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్పకుండా వస్తుంది. మీ ముత్తాత ఎన్టీఆర్ , తాత హరికృష్ణ , నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది' అంటూ పోస్ట్ చేశారు. All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7— Jr NTR (@tarak9999) October 30, 2024 -
'దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత'.. ఫియర్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 'దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత' అంటూ సాగే ఫియర్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దేవర ఫియర్ ఫుల్ వీడియో సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. The thumping #FearSong Video is out now! 🔥https://t.co/ifDty3vMEi Let the fear grip every nerve and ignite the madness ❤️🔥#Devara #BlockbusterDevara— Devara (@DevaraMovie) October 29, 2024 -
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. దావూదీ అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను ఫ్యాన్స్కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ పాటలో హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్తన డ్యాన్స్తో అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దావూదీ ఫుల్ సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. -
ఆ.. చుట్టమల్లే పాట వీడియో సాంగ్ వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో బ్లాక్బస్టర్ అయిన సాంగ్స్లో చుట్టమల్లే పాట ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటకు థియేటర్లు సైతం ఊ కొడుతూ ఊగిపోయాయి. అంతలా యూత్ను పిచ్చెక్కించిన ఈ పాట ఫుల్ వీడియోను శనివారం రిలీజ్ చేశారు. విడుదలైన నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది.ఈ పాటలో తారక్, జాన్వీ కపూర్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించాడు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవల్కు తీసుకెళ్లింది. దేవర సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. -
దేవర ఆయుధ పూజ.. ఫుల్ వీడియో వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఎన్టీఆర్ సరసన తనదైన నటన, డ్యాన్స్తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం దేవర విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.అయితే తాజాగా దేవర టీమ్ ఆయుధ పూజ సాంగ్ను విడుదల చేసింది. ఈ పాట ఫుల్ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్లో వ్యూస్పరంగా దూసుకెళ్తోంది. ఇంకేందుకు ఆలస్యం ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పార్ట్-2 కూడా ఉందని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. The most celebrated #AyudhaPooja video song is here! 🔥 https://t.co/LYPF5fA8Se #Devara #BlockbusterDevara— Devara (@DevaraMovie) October 22, 2024 -
'దేవర'కు భారీ లాభాలు.. గ్రాండ్గా పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. ఈ చిత్రం విజయంతో హీరో ఎన్టీఆర్తో పాటు ఆయన అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దేవర వల్ల భారీ లాభాలు రావడంతో వారందరూ గ్రాండ్గా పార్టీ చేసుకున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత నెల 27న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 509 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.దేవర విజయం వల్ల థియేటర్ ఓనర్ల నుంచి క్యాంటీన్ నిర్వాహకుల వరకు అందరూ లాభపడ్డారని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు తాను కూడా సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దేవర వల్ల చాలామంది లాభ పడ్డారని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో కలిసి నాగవంశీ ఒక పార్టీ చేసుకున్నారు. ఈమేరకు వారందరూ దుబాయ్ వెళ్లారట. దేవర విజయంతో భారీ లాభాలు రావడం వల్ల చాలా ఆనందంతో దుబాయ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారట.వరల్డ్ వైడ్గా మూడు వారాల్లో దేవర సినిమాకు రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికీ దేవర కలెక్షన్ల విషయంలో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు బాగానే రన్ అవుతున్నాయి. 183 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన దేవర.. ఆ మార్క్ను ఎప్పుడో అందుకున్నాడు. మూడు వారాలకే సుమారు రూ. 80 కోట్ల నెట్ కలెక్షన్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. -
భుజాలపై మోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27 థియేటర్ల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే దేవర బ్లాక్బస్టర్ హిట్ కావడంపై జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్, అభిమానులపై ప్రశంసలు కురిపించారు. దేవరలో హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ నటనను కొనియాడారు. తమ పాత్రలకు ప్రాణం పోసి, కథకు జీవం ఇచ్చారన్నారు.అలాగే దేవర డైరెక్టర్ కొరటాల శివతో పాటు మూవీకి పనిచేసిన సాంకేతిక సిబ్బందికి సైతం ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతమందిచాడన్నారు. దేవర సినిమాను తమ భుజాలపై మోసి ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని వెల్లడించారు. మీ ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చిందని ఎన్టీఆర్ ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. Grateful. pic.twitter.com/YDfLplET7S— Jr NTR (@tarak9999) October 15, 2024 -
యుద్ధానికి సిద్ధం
‘వార్’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర:పార్ట్ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్ సూచించారట.ఇక ఎన్టీఆర్ మాత్రం ‘వార్ 2’ చిత్రం షూట్లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్లో ‘వార్ 2’ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్ షెడ్యూల్స్లో హృతిక్–ఎన్టీఆర్లపై కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్. అయితే ‘దేవర:పార్ట్ 1’ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్కి కాస్త గ్యాప్ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ల మధ్య క్లైమాక్స్ ఫైట్ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. -
'దేవర'లో చూసింది 10 శాతమే.. పార్ట్2పై అంచనాలు పెంచేసిన కొరటాల
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. సినిమా విడుదలరోజు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మీద అంతగా ప్రభావం చూపలేదు. ఒక వర్గానికి చెందిన వారు కావాలనే దేవర సినిమాపై దుష్పచారం చేశారని తారక్ అభిమానులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారు సమర్థవంతంగా అలాంటి ప్రచారాలను తిప్పికొట్టారు. ఇప్పడు సినిమా చూసిన ప్రేక్షకులు దేవర 2 కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సీక్వెల్ గురించి దర్శకులు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దేవర పార్ట్2లో అసలు మలుపు ఉంది. ఇందులో జాన్వీ కపూర్ పాత్ర ఎవరూ ఊహించలేనంతగా ఉంటుంది. సీక్వెల్లో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పాత్రను చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. పార్ట్2 మీద నాకు చాలా నమ్మకం ఉంది. తారక్ అభిమానులకు మాటిస్తున్నా.. దేవర పార్ట్1లో మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే.. సీక్వెల్లో అసలు కథ ఉంది. 100 శాతం చూస్తారు. సీట్ ఎడ్జ్లో మిమ్మల్ని కూర్చోపెడుతాం. ఊహించలేనంతగా ట్విస్ట్లు ఉంటాయి. కథ ఇప్పటికే పూర్తి అయింది. అందరికీ మంచి ఫీల్ కలిగేలా సినిమా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా.' కొరటాల శివ చెప్పారు.దేవర ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 466 కోట్లు కలెక్ట్ చేసింది. దేసర సెలవులు కొనసాగుతుండటంతో సులువుగా రూ. 500 కోట్ల మార్క్ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా జాన్వీ కపూర్ మెప్పించగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. View this post on Instagram A post shared by RAW NTR (@rawntrofficial) -
తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ను దాటేయనుంది.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
డ్యాన్స్ టైమ్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డ్యాన్స్ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ ఈ సాంగ్కు స్టెప్స్ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
దేవర సాంగ్.. నాగార్జున డ్యాన్స్ చూశారా!
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం రజినీకాంత్ కూలీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో కూలీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. నాగార్జున యాక్షన్ సీన్స్కు సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల నెట్టింట లీక్ అయ్యాయి.అయితే నాగార్జున ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-8కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా నాగార్జున బిగ్బాస్ షో సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీలోని సాంగ్కు స్టెప్పులతో అదరగొట్టారు. ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.(ఇది చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్)కాగా.. ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. Nagarjuna performance for Ayudhapooja song ❤🔥#Nagarjuna #NTR @tarak9999 pic.twitter.com/5xuXrHS3Yr— Devara NTR (@DevaraTsunamiOn) October 5, 2024 -
'దావూది సాంగ్ ఎందుకు పెట్టలేదంటే'.. అసలు కారణం చెప్పేసిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేవర బ్లాక్బస్టర్ హిట్ కావడంతో టీమ్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.తాజాగా డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్.. యాంకర్ సుమతో ఇంటర్వ్యూరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బ్లాక్బస్టర్ జర్నీ ఆఫ్ దేవర’ పేరుతో ఎన్టీఆర్, కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దేవరలోని దావూది సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్ వర్షన్లో దావూది సాంగ్ పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చారు.'ఒక పాటను అదనంగా జత చేయాలంటే సెన్సార్ అనుమతులు తప్పనిసరి. మనం ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేం. ఐదు భాషల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. దావూది పాట తీసేయడానికి మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. మీరు సినిమా చూస్తు ఉంటే కథ సీరియస్గా మొదలైపోయింది. ఆ సమయంలో సాంగ్ పెడితే బ్రేక్లా అనిపించింది. కథను చెప్పేటప్పుడు మనం బ్రేక్ ఇవ్వకూడదు. కథను చెప్పే ప్రయత్నంలో బయటకు తీసుకెళ్లడం సరికాదని భావించాం. అక్కడ దావుది సాంగ్ పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగా ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సినిమా కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయాలని నిర్ణయించాం' అని అన్నారు. -
దేవర తొలివారం వసూళ్లు ఎంతంటే..?
-
మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్
అభిమానులపై ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్తో తనకున్న ఎమోషనల్ బాండింగ్ గురించి దేవర సినిమా సక్సెస్ పార్టీలో పంచుకున్నారు. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'దేవర' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినా దానిని తారక్ అధిగమించాడని చెప్పవచ్చు. అలా మొదటివారంలో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 405 కోట్లు రాబట్టి సత్తా చాటాడు. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానుల గురించి తాజాగా తారక్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.'ఏ జన్మలో చేసుకున్న రుణమో నాకు తెలియదు. కలిసి ఒక గర్బంలో పుట్టకపోయిన.. కలిసి రక్తాన్ని పంచుకోకపోయినప్పటికీ.. మీ అందరితో రుణానుబంధం ఏర్పడింది. మీరందరూ ఎప్పుడూ నా వెన్నంటే ఉంటూ.. ప్రతి క్షణం నా కోసం పోరాడుతూ ఎల్లప్పుడు మీ ఆశీస్సులను అందిస్తున్నారు. అందుకు శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా. ఈ జన్మలో కాకపోయిన ఇంకోక జన్మలోనైన మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అప్పటి దాకా వడ్డీనీ లెక్క వేసుకుంటూనే ఉంటాను. దేవర చిత్రాన్ని ఇంత భారీ విజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.' అంటూ తన అభిమానుల గురించి తారక్ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు.తారక్ మాటలకు ఆయన అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. 'ఎప్పటికీ నీ కష్టంలో అండగా నిలుస్తాం' అంటూ తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు. View this post on Instagram A post shared by TeamTarakTrust (@teamtaraktrust) -
సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్ చిత్రం దేవర పార్ట్-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ..'ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవర విజయం వెనుక డైరెక్టర్స్, సాంకేతిక నిపుణులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు ముఖ్యమైంది నా అభిమానులే. ఏ జన్మలో చేసుకున్న రుణమో కానీ.. మీతో అలాంటి బంధం ఏర్పడింది. ఎల్లప్పుడు నాకు అండగా నిలుస్తున్న ప్రతి అభిమానికి నా పాదాభివందనాలు. మరో జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా.' అంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్రబృందం సమష్టి కృషితో దేవర మూవీ భారీ విజయం దక్కిందని తెలిపారు.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఈ చిత్రానికి అనిరుధ్ అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించారని ప్రశంసలు కురిపించారు. నా తండ్రి తర్వాత ఆ ప్లేస్లో ఉండి నన్ను నడిపిస్తున్న కల్యాణ్ రామ్ అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కొరటాల శివ అన్నతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు.. బృందావనం నుంచి మా రిలేషన్ మొదలైంది. కేవలం సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం.. ఒక దర్శకుడిగా కాదు.. సోదరుడిగా నాకు సపోర్ట్గా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారో నాకు తెలుసన్నారు. ఈ విజయం కొరటాల శివ అన్నకు మనశ్శాంతిని కలిగించిందని ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. -
దేవర ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. అదేంటంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్ చిత్రం దేవర పార్ట్-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మూవీ టీం సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.అయితే దేవర చిత్రంలో ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసిన విషయం ఆ ఒక్కటే. మాస్ సాంగ్ దావూది సాంగ్ థియేటర్లో రాకపోవడంతో డైహార్డ్ ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సాంగ్ను యాడ్ చేసినట్లు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే బిగ్ స్క్రీన్పై దాపూది సాంగ్ చూసేయండి అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.To all the fans who have been waiting to get into the KILI KILIYE mood 🕺🏻Enjoy #Daavudi at your nearest cinemas now! 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/MIxMveHW8b— Devara (@DevaraMovie) October 4, 2024 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.(ఇది చదవండి: దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త)దేవర రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. వీక్ డేస్లోనూ దేవరకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సౌత్తో పాటు బాలీవుడ్లోనూ దేవరకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకోనుంది. కాగా.. ఈచిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. He’s the Dark Cloud of FEAR looming over all rivals 🔥See it. Feel it. Fear it in Cinemas now.#Devara #DevaraBlockbuster pic.twitter.com/v707pr9GGZ— Devara (@DevaraMovie) October 4, 2024 -
జైలర్ డైరెక్టర్ తో దేవర మీటింగ్..
-
'దేవర' కోసం అనుమతి ఇవ్వలేదు.. ఫ్యాన్స్ను క్షమాపణ కోరిన నాగవంశీ
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'దేవర'. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఆరు రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా రూ. 396 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టంది. దీంతో సక్సెస్ మీట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, తాజాగా ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ సోషల్మీడియాలో ఒక ప్రకటన చేశారు. అభిమానుల సమక్షంలో దేవర విజయోత్సవాన్ని ఘనంగా జరపాలని తాము కూడా భావించినట్లు అన్నారు. కానీ, రెండు ప్రభుత్వాల నుంచి తమకు అనుమతులు రాకపోవడంతో ఈ సక్సెస్ మీట్ను నిర్వహించలేకపోతున్నట్లు నాగవంశీ తెలిపారు.ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దేవర అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో విజయోత్సవ వేడుకనైనా ఎంతో ఘనంగా చేయాలని ఎన్టీఆర్ ఎంతో బలంగా భావించారు. అందుకోసం మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం. అయితే, దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉన్న కారణంగా దేవర వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు రాలేదు. ఇదీ చదవండి: 'మా' కుటుంబాలను బాధపెడితే మౌనంగా ఉండను: మంచు విష్ణుఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు. ఈ ఈవెంట్ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరితో పాటు మా ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, అనుమతి కోసం మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. మీ ప్రేమతో అన్న (ఎన్టీఆర్) మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను.' అని ఒక పోస్ట్ చేశారు.సెప్టెంబర్ 27న విడుదలైన దేవర.. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబడుతుందిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్గా మెప్పించారు. A big thank you to each and every one of you who played a part in creating the #DevaraStorm and setting unprecedented records at the BOX OFFICE.Since the pre-release event couldn’t be held, Tarak anna was adamant about having an event to CELEBRATE the Success of Devara in a BIG… pic.twitter.com/kyxAhy3CnN— Naga Vamsi (@vamsi84) October 3, 2024 -
బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. ఆరు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దేవర.. ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని దేవర చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. కేవలం ఆరు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.207.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.45.87 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి వారంలోనే మూడు వందల కోట్ల మార్క్ దాటిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే రోజు కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో దేవర చేరడం ఖాయంగా కనిపిస్తోంది.(ఇది చదవండి: ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్)కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు.BIZ JUMPS ON WEDNESDAY... A national holiday can significantly impact #Boxoffice numbers, provided the film has merits... The #JrNTR-starrer #Devara makes a big splash on Wednesday, capitalizing on the #GandhiJayanti holiday, further solidifying its status.The numbers of… pic.twitter.com/LdUycX7PPq— taran adarsh (@taran_adarsh) October 3, 2024 It’s his Brutal Massacre…Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo— Devara (@DevaraMovie) October 3, 2024 -
మంత్రి కొండా సురేఖ Vs టాలీవుడ్.. ఎవరెవవరు ఏమన్నారంటే..? (ఫొటోలు)
-
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్
-
మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోం: కొండా సురేఖపై ఎన్టీఆర్ ఆగ్రహం
సమంత-నాగచైతన్య విడాకులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్పై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. క్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదన్నారు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాతనం, ఇతరుల గోప్యతను గౌరవించాలన్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి నిర్లక్ష్యంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే నిజంగా బాధాకరమని ట్వీట్ చేశారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ..'కొండా సురేఖ గారూ.. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా ఉండాలి. సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యంగా నిరాధారమైన కామెంట్స్ చేయడం చూస్తుంటే బాధగా ఉంది. మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. ఒకరినొకరు గౌరవించుకావాలి.. పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సమాజం ఏమాత్రం హర్షించదు' అంటూ పోస్ట్ చేశారు.(ఇది చదవండి: మీలాంటి వారిని చూస్తుంటే అసహ్యమేస్తోంది: కొండా సురేఖపై నాని ఫైర్)కాగా.. అంతకుముందు సమంత-నాగ చైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ ప్రముఖులు అంతా ఖండించారు. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…— Jr NTR (@tarak9999) October 2, 2024 -
దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాను ఇంతటి విజయవంతం చేసిన అభిమానుల కోసం ఒక కానుకను ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారీ సక్సెస్ మీట్ను అభిమానుల సమక్షంలో జరపాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.ఇదీ చదవండి: 25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?దేవర సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ కార్యచరణ ప్రారంభించారట. ఈ క్రమంలో లొకేషన్ కోసం వారు సెర్చింగ్ కూడా మొదలుపెట్టేశారట. అయితే, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ భారీగా రానున్నారని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశంపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.ఎన్టీఆర్ నుంచి సింగిల్ సినిమా వచ్చి సుమారు ఆరేళ్లు అయింది. దీంతో ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు భావించారు. దీంతో మేకర్స్ కూడా సెప్టెంబర్ 22న హైదరాబాద్ నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో తమ దేవరను చూడలేకపోయామే అనే తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. అందుకుగాను వారిలో సంతోషం నింపేందుకు దేవర టీమ్ ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. -
Devara Collections Day 3: మొదటి వారంలో సత్తా చాటిన 'దేవర'
ఎన్టీఆర్ నటించిన 'దేవర' భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద తారక్ సత్తా చాటాడు. మొదటిరోజు కాస్త మిక్సిడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం రెండోరోజు కలెక్షన్లపై పడింది. అయితే, దేవరపై ఆడియన్స్ నుంచి వచ్చే రెస్సాన్స్ మారింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ వస్తుండటంతో మూడోరోజు కలెక్షన్లు నిలకడగానే కొనసాగాయి. దీంతో మొదటి వీకెండ్లో దేవర భారీ కలెక్షన్లే క్రియేట్ చేశాడు.కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడురోజులకు గాను రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు రూ. 71కోట్లు, మూడోరోజు రూ. 61 కోట్లు రాబట్టాడు. అయితే, దేవరకు బాలీవుడ్లో రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేవర రూ. 500 కోట్ల మ్యాజిక్ టార్గెట్ను సులువుగానే అందుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం మరే పెద్ద సినిమా కూడా దేవరకు పోటీగా లేకపోవడం బాగా కలిసోచ్చే అంశమని చెప్పవచ్చు. మరో రెండురోజుల్లో తెలుగురాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో కుటుంబంతో పాటు రిపీటెడ్ ఆడియన్స్ కూడా దేవర థియేటర్ వైపు అడుగులేస్తారు. ఇలా చాలా అనుకూలా అంశాలు ఉన్నాయి కాబట్టి దేవర రూ. 500 కోట్ల మార్క్ కలెక్షన్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు. -
దేవర దండయాత్ర రాజమౌళి కు చెక్ పెట్టిన ఎన్టీఆర్
-
బాక్సాఫిస్ వద్ద దేవర దూకుడు..
-
రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్
ఎన్టీఆర్ 'దేవర' మొదటిరోజే భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు సాధించింది. ఇండియాలోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానం దక్కించింది. తాజాగా దేవర రెండురోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దేవర సినిమా రెండురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 243 కోట్లు రాబట్టింది. అయితే, మొదటిరోజు కంటే భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఫస్ట్ డే రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు మాత్రం కేవలం రూ. 71 కోట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే, బాలీవుడ్లో మాత్రం కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిందీ వర్షన్లో ఫస్ట్ డే రూ. 7 కోట్లు రాగా.. సెకండ్ డే నాడు రూ. 9 కోట్లు రాబట్టింది. మూడో రోజు కూడా అక్కడ భారీగానే టికెట్ల కొనుగోలు జరిగింది. ఇదీ చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్అయితే, రెండో రోజు నుంచి సినిమాపై మరింత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా సెలవులు కూడా రానున్నడంతో మొత్తంగా రూ. 500 కోట్ల క్లబ్లో దేవర చేరవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.The wave of #Devara's rage FLOODS the Box Office putting ALL TERRITORIES on notice! 🔥🔥𝟐 𝐃𝐚𝐲𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐁𝐎𝐂 𝟐𝟒𝟑 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 💥💥- https://t.co/hGPUm1Tsio#BlockbusterDevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/HbjFm2tmJ4— NTR Arts (@NTRArtsOfficial) September 29, 2024 -
దేవర దండయాత్ర.. రాజమౌళి కు చెక్ పెట్టిన ఎన్టీఆర్
-
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్పై కల్యాణ్ రామ్ ప్రశంసలు
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'దేవర'. తాజాగా విడుదలైన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్ను మెప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ కలెక్షన్స్తో దేవర దూసుకుపోతున్నాడు. సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దేవరను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న కల్యాణ్ రామ్ దేవర గురించి ఇలా చెప్పుకొచ్చారు.దేవర సినిమాను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న (ఎన్టీఆర్) యాక్టింగ్తో అదరగొట్టేశాడు. దేవరలో తన రోల్ వన్ మ్యాన్ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్కు కృతజ్ఞతలు.' అని కల్యాణ్ రామ్ చెప్పారు.అనంతరం చిత్ర దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవరతో మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ షో పడిన సమయం నుంచి నాకు వరసుగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దేవర సినిమానే నా ఉత్తమ సినిమా అంటూ వారు అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్ కష్టం వల్లే దేవర సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి.' అని ఆయన అన్నారు.నైజాంలో ‘దేవర’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్రాజు కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. సినిమాలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. 'వన్ మ్యాన్ షోతో సినిమాను తారక్ నడిపించారు. ప్రపంచదేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో రన్ అవుతున్నాయి. దీనంతటికి కారణమైన దర్శకులు, హీరోలకు నేను కృతజ్ఞతలు చెబుతుతున్నా.' అని దిల్ రాజు అన్నారు. -
దేవర.. నీ రాక కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్తో మహిళా అభిమాని
దేవర విడుదల సందర్భంగా బియాండ్ ఫెస్ట్లో పాల్గొనేందుకు జూ ఎన్టీఆర్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ ఫెస్టివల్లో ప్రదర్శితం అయిన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ రికార్డ్ నెలకొల్పింది. సినిమా ప్రదర్శన అనంతరం అక్కడికొచ్చిన అభిమానులతో ఆయన ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమానితో మాట్లాడుతూ ఆమెకు తారక్ ఒక మాటిచ్చాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఖ్యాతి పాన్ ఇండియా రేంజ్కు చేరుకోవండంతో పాటు ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా తారక్కు జపాన్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, బియాండ్ ఫెస్ట్లో ఎన్టీఆర్ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఓ మహిళ.. టోక్యో నుంచి లాస్ ఏంజెల్స్కు చేరుకుంది. అతికష్టం మీద ఆమె తారక్ను కలుసుకుని మాట్లాడింది. ఎన్టీఆర్ను చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్లో ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపింది. ఆపై తమ దేశానికి రావాలని తారక్ను ఆహ్వానించింది. ఆమె మాటలతో ఎన్టీఆర్ చాలా ఆనందించారు. ఈ క్రమంలో జపాన్కు తప్పకుండా వస్తానని, అభిమానులతో కలిసి దేవర చూస్తానంటూ తారక్ మాటిచ్చారు.ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పిస్తే.. సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రలలో నటించారు.A Priceless reaction for a Priceless moment! ❤️🔥❤️🔥@KO19830520 traveled all the way from Tokyo to Los Angeles just to watch #Devara with @tarak9999 at the @BeyondFest. #DevaraUSA pic.twitter.com/nPpYmEgj4o— Vamsi Kaka (@vamsikaka) September 27, 2024 -
'దేవర'పై అభిమానులు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్
'దేవర' సినిమా విడుదల సందర్భంగా అభిమానులను ఉద్దేశించి తాజాగా జూ ఎన్టీఆర్ ఒక పోస్ట్ చేశారు. నేడు సెప్టెంబర్ 27న దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన తారక్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పించారు.'నేను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. నాపై అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. సినిమాపై మీరు చూపుతున్న అభిమానానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. అందరినీ కదిలించేలా భావోద్వేగాలతో పాటు అద్భుతమైన డ్రామా చిత్రంగా కొరటాల శివ తెరకెక్కించారు. మై బ్రదర్ అనిరుధ్.. నీ మ్యూజిక్తో దేవర ప్రపంచానికి ప్రాణం పోశావ్. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు గారికి, సుధాకర్ మిక్కిలినేని గారితో పాటు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సాబు సిరిల్ టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. దేవర విడుదల సందర్భంగా నా అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకలు చూసి నా మనసు నిండింది. నా మాదిరే మీరూ దేవర చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయడం సంతోషంగా ఉంది.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.The day I had been waiting for is finally here... Overwhelmed by your incredible reactions.Thank you Koratala Siva garu, for envisioning Devara with such engaging drama and emotional experience. My brother @anirudhofficial, your music and background score brought this world to…— Jr NTR (@tarak9999) September 27, 2024 -
Devara X Reveiw: ‘దేవర’కు ఊహించని టాక్.. మైనస్ ఏంటంటే..?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగాను ఎదురు చూస్తున్న దేవర మూవీ ఎట్టకేల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడం.. జనతా గ్యారేజ్తో సూపర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ‘దేవర’పై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ చేయడంతో టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ దేవరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం అర్థ రాత్రి నుంచి స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దేవర ఎలా ఉంది? ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇవి కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు. ఎక్స్లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. యావరేజ్ సినిమా అని కొంతమంది అంటుంటే... బ్లాక్ బస్టర్ మూవీ అని మరికొంతమంది కామంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారని చెబతున్నారు. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుందని కామెంట్ చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని, సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #Devara A Passable Action Drama with a Good 1st Half but a 2nd half that was dragged in parts till the pre-climax. Koratala showed a lot of promise in his writing in the 1st half and setup the story well. However, the 2nd half should’ve been racier and became too predictable…— Venky Reviews (@venkyreviews) September 26, 2024#Devara - 2.25/5 ⭐⭐An average first half with a below average second half. Routine story with a weak climax and poor cliffhanger.Disappointing VFX & Sets, but #JrNTR tries to save the film and #Anirudh shine throughout the movie.Could’ve been much better#DevaraReview— bhaskark4852 (@bhaskark4852) September 27, 20241st half : Flash back tho start ayyi.. 💥 Intro 🌊🌊 Vfx 👍 Dance 🔥🔥🔥 Alaa plain ga vellipoddi.. Screenplay 👎Container shot nunchi highhhhh 🥵🔥🥵🔥🥵 Pre interval 30 mins 👌👌🔥🔥 Bgm 🔥🔥🔥 Overall good 1st half 👍 #Devara— SuRyA™ (@kingmakerrr999) September 27, 20242nd half starting 1st 10mins comedy thappa, rest lite!!! 2/5Why Kattappa Killed Baahubali range lo pettaru anukunnaru koratala but too much artificial...Most logic less 2nd half!!!! Only good thing is 2nd half lo lag ledu, aakariki Anirudh kuda sub par in 2md half!!!#Devara— MB | #Treble | #4peat (@iiishinigami) September 27, 2024My Review:- #DEVARA First Title Card Banger 💥🔥Excellent First Half With Interval Banger 💥🔥🥳Anirudh Mass Duty 👌🏻💥2nd Half Too Good With bit Lag But Climax Superb 🔥💥👌🏻Jannu The Beauty 👌🏻🤩🥳Overall:- A Block Buster 👍🏻🔥#DEVARA #DevaraOnSept27th #DevaraMassJaathara— 𝑨𝒆𝒔𝒕𝒉𝒆𝒕𝒊𝒄 💗 (@Aesthetic_1827) September 27, 2024Hearing Blockbuster reviews for #Devara from Telugu audience and reviewers ✌️💥😀The visuals, the action, the performances... everything is top-notch. ⭐️⭐️⭐️⭐️⭐️#JrNTR absolutely delivers a powerhouse performance. This is shaping up to be the next big South Indian blockbuster,…— Vignesh (@Vignesh_Ajith) September 27, 2024