jubilihills
-
జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
అమ్నేషియా పబ్ కేసు: మెడికల్ రిపోర్టు ఔట్.. మరీ ఇంత దారుణామా..?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్పై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు.. పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్.. లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను రెండోరోజు పోలీసులు విచారిస్తున్నారు. ఇక, మైనర్పై లైంగిక దాడి కేసులో దర్యాప్తు అధికారులు తొలిరోజు మైనర్లను విచారించారు. జువైనల్ హోంలో ముగ్గురు మైనర్లను అధికారులు విడివిడిగా విచారించారు. కాగా, A1 సాదుద్ధీన్ చెప్పిన వివరాలతో అధికారులు ముగ్గురిని ప్రశ్నించారు. మైనర్ను ట్రాప్ చేసింది ఎవరూ అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ.. చార్మినార్ వద్ద టెన్షన్.. టెన్షన్.. వీడియో -
డ్రంక్ అండ్ డ్రైవ్లో తప్పించుకోబోయి..
-
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం : యువతికి బ్రెయిన్ డెడ్
-
హైదరాబాద్లో అర్దరాత్రి కారు బీభత్సం : మహిళ మృతి
-
రామానాయుడు స్టూడియోలో భారీ చోరీ
హైదరాబాద్: హైదరాబాద్ ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియోలో ఖరీదైన సెట్టింగ్ లైట్లు చోరీకి గురయ్యాయి. స్టూడియోలో సినిమా షూటింగ్ కోసం వినియోగించే ఈ లైట్లు కొద్ది రోజులుగా కనబడటం లేదు. నిర్వాహకులు ఆరా తీయగా చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వారు స్టూడియో మేనేజర్ శ్రీనుతో పాటు మరో పదిమందిపై అనుమానం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనుతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చోరీ అయిన లైట్ల విలువ భారీగా ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిర్వాహకులు తెలిపారు.