jubleehils
-
పబ్ కేసు: ముందు చాలా జరిగింది.. డ్యామిట్ అతడే వల్లే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్ కేసులో పోలీసు కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్తో పాటు మైనర్ల కస్టడీ నేటితో ముగిసింది. కాగా, కస్టడీలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. ఈ సందర్బంగా పోలీసులు.. ‘‘సామూహిక లైంగిక దాడి ఘటనలో నిందితుల్లో పశ్చాత్తాపం కనిపించలేదు. విచారణ సమయంలో నిందితులు జాలీగా ఉన్నారు. తప్పు చేయలేదన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇక, వీడియో లీకేజీపై నిందితుల మధ్య గొడవ జరిగింది. వీడియో షూట్ చేసిన ఓ మైనర్పై మిగిలిన నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో బయటికి రాకపోయి ఉంటే.. కేసు ఉండదని నిందితులు ధీమా వ్యక్తం చేశారు. మైనర్కు కారు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కుమార్తెపై కేసు నమోదైంది. బెంజ్ కారు నడిపిన మైనర్ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశాము. బెంజ్ కారును పోలీసులకు చిక్కకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. బెంజ్ కారు విషయంలో నిందితుల కుటుంబ సభ్యులు.. పోలీసులను తప్పుదోవపట్టించారు. వక్ఫ్బోర్డ్ చైర్మన్కు అధికారికంగా కారు కేటాయించలేదు. సొంత కారుపైనే వక్ఫ్బోర్డ్ చైర్మన్ గవర్నమెంట్ స్టిక్కర్ వేసుకున్నారు. ఇంటి నుంచి ఇన్నోవా కారును డ్రైవర్ తీసుకెళ్లాడు. కాన్సూ బేకరీ వద్ద డ్రైవర్ను దింపేసి కారును మైనర్లు తీసుకెళ్లారు. ఇన్నోవా కారు దొరక్కుండా ప్రయత్నాలు చేశారు. బాలిక గొంతుపై గాట్లు ఉండటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు ముందే బంజారా హిల్స్లోని ఆశ హాస్పిటల్లో మైనర్కు సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఆమె పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పించారు. తమ కూతురుపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించి, బాలికను పబ్కు తీసుకువెళ్లిన హాదీని మైనర్ పేరెంట్స్ ప్రశ్నించారు. మైనర్ను పబ్కు తీసుకు వెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో ఘటన బయటకు వచ్చింది. దీంతో, నిందితులు, ఎమ్మెల్యే తనయుడు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇక, ఇన్నోవా కారులోనే మైనర్పై ఐదుగురు నిందితులు లైంగిక దాడి చేశారు అని వెల్లడించారు. -
భూవివాదం: మంత్రి దేవినేనిపై కేసు నమోదు
-
'మంత్రి దేవినేని నుంచి ప్రాణహాని ఉంది'
సాక్షి, హైదరాబాద్: ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమతో పాటు ఆయన అనుచరులు, విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ యూసుఫ్గూడకు చెందిన అట్లూరి ప్రవిజ ఆరోపించారు. తనను కిడ్నాప్ చేసేందుకు లేదా హత్య చేసేందుకు ప్రయత్నాలు జరగొ చ్చని గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పిం చాలని కోరారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అమరావతి దగ్గర్లోని కంచికచర్ల మండలం చౌటుకల్లు గ్రామంలో తనకు రెండెకరాల స్థలం ఉందని, ఈ భూమి పంపకాల విషయంలో మంత్రి దేవినేని తమ్ముడు దేవినేని చంద్రశేఖర్, చవలం శ్రీనివాసరావు, మన్నె నాయుడు, మంత్రి పీఏ చౌదరి, మరో పీఏ శివరావు, గన్మన్ ప్రసాద్, ఆయన క్లాస్మేట్ ఎనిగళ్ల రాజేంద్రప్రసాద్, సొసైటీ ప్రెసిడెంట్ కోగంటి విష్ణువర్ధన్రావు వేధిస్తున్నారని బాధితురాలు వాపోయారు. ‘వీరిపై గతేడాది జూన్ 21న విజయవాడ సీపీ సవాంగ్కు ఫిర్యాదు చేశాను. మంత్రి దేవినేనితో పాటు ఆయన సోదరుడిపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిం టుందని, కేసును వెనక్కి తీసుకోవాలంటూ నాపై మంత్రి కార్యాలయంతో పాటు పోలీసు లు ఒత్తిడి చేస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలిపై గతేడాది సెప్టెంబర్ 19న మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశాను. ఏపీ డీజీపీకి హెచ్ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసింది. గత గురువారం కొందరు పోలీసులు విజయవాడలోని మా ఇంటికెళ్లి నా కదలికలపై ఆరా తీశారు. 2015 నవంబర్లో అప్పటి పట మట సీఐ దామోదర్ నన్ను కిడ్నాప్ చేసి గొల్లపూడిలోని మంత్రి ఇంటికి తీసుకెళ్లారు’అని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
స్పాలో ఎమ్మెల్యే..
సాక్షి, వీకెండ్: ఆయుర్వేద ఆరోగ్య, సౌందర్య పోషణ సేవలు అందించే స్పా సెలాన్ బ్రాండ్ వారి కేంద్రాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.36లో నెలకొల్పింది. సరైనోడు లో ఎమ్మెల్యే పాత్రలో నటించి మెప్పించిన కేథరిన్ ట్రెసా శనివారం ప్రారంభించారు. సౌందర్య పరిరక్షణకు కెమికల్ ఫ్రీ ఉత్పత్తులు వినియోగించాలని, సహజమైన పద్ధతులనే అనుసరించాలని ఆమె సూచించారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా కలుగుతున్న ఆరోగ్య, సౌందర్య పరమైన సమస్యలకు సహజమైన పరిష్కారాలను తమ సేవల ద్వారా అందిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
నగరంలో నోరూరిస్తున్న నల్ల కోడి
సాక్షి,వీకెండ్: ఫారం కోళ్లను తినీ తినీ ఉన్నాం. కాబట్టి నాటు కోడి... అంటే అబ్బ ఆ రుచే వేరు అంటూ లొట్టలేస్తాం. బ్రాయిలర్నూ, నాటుకోడినీ తలదన్నేలా.. నగరంలోకి వచ్చేసింది నల్ల కోడి. తల నుంచి పాదాల వరకు ప్యూర్ బ్లాక్ కలర్లో మిలమిల మెరిసే ఈ బ్లాక్ బ్యూటీ అంటే నాన్వెజ్ ప్రియులు వావ్ అంటున్నారు. రుచిలో మాత్రమే కాదు ఈ నల్లని కోడి మాంసం ఖరీదులోనూ ఇప్పుడు అధరహో అంటోంది. బ్రాయిలర్ కోడి రేటు కన్నా ఏడింతల ధర పలికే ఈ నల్ల కోడి మాంసం పులుసు, వేపుడు రుచులను జూబ్లీహిల్స్లోని ఉలవచారు రెస్టారెంట్ తమ మెనూలో తొలిసారి పరిచయం చేస్తోంది. సేంద్రీయ పద్ధతిలో పెంపకం... మాంసం, ఎముకలు, ఈకలు.. అంతా నల్లగా ఉండే ఈ కోడి కేరాఫ్ ఇండోనేషియా. ఈ కోడిని మిగతా కోళ్లలా కాకుండా అచ్చమైన సేంద్రీయ పద్ధతులలో పెంచుతారు. ఈ నల్లకోళ్ల వ్యాపారానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే గ్యారంటీతో మన దగ్గరా నల్లకోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. ‘ఈ నల్లకోడి మాంసానికి మనదైన తెలుగు సై్టల్ రుచిని జత చేసి నల్లకోడి పులుసు, నల్లకోడి వేపుడు... వంటి వెరైటీలను అందిస్తున్నాం’ అని చెప్పారు ఉలవచారు రెస్టారెంట్ యజమాని నరహరి వినయ్ రెడ్డి, మేనేజింగ్ పార్టనర్ విజయరెడ్డిలు. ఈ కోడి తొమ్మిది నెలల్లో కేజిన్నర బరువు పెరిగితే అంతే టైమ్లో బ్రాయిలర్ కోడి రెండున్నర కేజీల బరువు తూగుతుంది. అంటే, రెగ్యులర్గా లభించే బ్రాయిలర్ చికెన్తో పోల్చితే నల్లకోడి మాంసంలో ఏ మాత్రం కొలెస్ట్రాల్ ఉండదని, రుచి అమోఘమని దీని వల్ల తెలుస్తుందని చెబుతున్నారు విక్రేతలు. ప్రస్తుతానికి సిటీ మార్కెట్లో కేజీ నల్ల కోడి మాంసం రూ.800కు పైగా పలుకుతోంది. – సాక్షి వీకెండ్ ప్రతినిధి