justice kalyan sengupta
-
సుప్రీం నోటిఫై చేసేవరకు ఉమ్మడి హైకోర్టే
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనను సుప్రీంకోర్టు నోటిఫై చేసే వరకు ఉమ్మడి న్యాయస్థానంగానే కొనసాగుతుందని హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టుకు అప్పటి వరకు రెండు రాష్ట్రాలపై న్యాయపరిధి ఉంటుందని, ఇరు రాష్ట్రాల కేసులను విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులెవరూ తిరిగి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసులను విచారించే న్యాయ పరిధిపై సింగిల్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. అంతేకాక న్యాయమూర్తులు తిరిగి ప్రమాణం చేసే విషయంలోనూ ధర్మసందేహం లేవనెత్తారు. దీనిపై ఆయన కేంద్రప్రభుత్వ వివరణను సైతం కోరారు. ఈ విషయాన్ని ఓ న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ కేసును జస్టిస్ నరసింహారెడ్డి వద్ద నుంచి తమ బెంచ్కు బదిలీ చేసుకుని విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం బుధవారం తీర్పు వెలువరించింది. -
హైకోర్టు విభజనపై ఊపందుకున్న చర్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనపై చర్యలు ఊపందుకున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా ఢిల్లీ వెళ్లారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెల్ ఎల్ దత్తుతో కళ్యాణ్సేన్ గుప్తా సమావేశమయ్యే అవకాశముంది. హైకోర్టు విభజనకు సంబంధించి కళ్యాణ్సేన్ గుప్తా నివేదిక సమర్పించే అవకాశముంది. హైకోర్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించాల్సివుంది. -
జూడాలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు సోమవారం స్పందించింది. విధులను బహ్కిరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది. జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారని, దీనివల్ల రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ హైదరాబాద్కు చెందిన బి.రవికిరణ్ స్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం జూనియర్ డాక్టర్ల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.