K kesavarao
-
సంఘటితమైతే అధికారం బీసీలదే: కేకే
హైదరాబాద్: బీసీలు సంఘటితమైతే రాజ్యాధికారం దానంతట అదే వస్తుందని టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆదివారం బీసీ కులసంఘాల జేఏసీ కన్వీనర్ కుందారం గణేశాచారి అధ్యక్షతన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘బీసీల అలయ్–బలయ్’ పేరిట ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో ఐక్యత లేకపోతే పాలకులు అసలు పట్టించుకోరన్నారు. బీసీలకు ఈరోజు కాకున్నా ఎప్పుడో ఒకరోజు రాజ్యాధికారం తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. బీసీల్లో ఐకమత్యం రానంత వరకు అగ్రకులాల పెత్తనం కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నా రు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు బీసీ క్రీమీలేయర్ను ఎత్తివేయాలని కోరారు. సహేతుకమైన నిర్ణయంతో బీసీలందరూ ముందుకు వెళ్లాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సూచించారు. కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ , తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తింపు కార్డులివ్వాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావును బుధవారం కలసి వినతిపత్రం సమర్పించా రు. ‘టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఎప్పుడు పిలుపు ఇచ్చినా ఉద్యమం చేశాం. కేసులు నమోదై జైళ్లకు వెళ్లాం. అయినా తెలంగాణ సాధించిన ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యమంలో కేసుల నమోదు, రిమాండ్, బెయిల్, కోర్టు కేసులు తదితర అంశాల ఆధారంగా పోలీసుల రికార్డుల ప్రకారం ఉద్యమకారులను గుర్తించి గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఉద్యమకారులందరినీ సమరయోధులుగా గుర్తించి నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలి. అర్హులైన విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని కోరారు. అన్ని అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేశవరావు ఉద్యమకారులకు తెలిపారు. నీరాను ప్రభుత్వమే విక్రయించాలి: గౌడ సంఘం ఔషధ గుణాలున్న కల్లును నీరాగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే బాటిలింగ్ చేసి విక్రయించాలని సర్వా యి పాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘం) టీఆర్ఎస్కు విజ్ఞప్తి చేసింది. కల్లు గీత కార్మికుల సంక్షేమంపై మేనిఫెస్టోలో చేర్చాలని కోరింది. గౌడ ఫెడరేషన్ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. గౌడ సంఘం నేతలు ఈడిగ ఆంజనేయులుగౌడ్, మల్లాగౌడ్, సునీల్గౌడ్ బుధవారం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో 80 లక్షల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారని, వీరికి 20% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో పది ఎకరాల స్థలం కేటాయించి హరితహారం కింద హైబ్రిడ్ చెట్లను నాటాలని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ 'గ్రేటర్' అభ్యర్థులు వీరే..
- 150 డివిజన్లకు గానూ తొలి, మలి విడతల్లో 80 మంది పేర్లను ఖరారుచేసిన అధికార పార్టీ - దివంగత పీజేఆర్ తనయ విజయారెడ్డికి ఖైరతాబాద్ డివిజన్ కేటాయింపు హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి అన్నింటా ముందున్న అధికార టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లకుగానూ తొలి, మలి విడతల్లో 80 డివిజన్లకు అభ్యర్థులను ఖరారుచేసింది. అభ్యర్థుల ఎంపిక కమిటీకి నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె. కేశవరావు శుక్రవారం తెలంగాణ భవన్ లో జాబితాను విడుదలచేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కొనసాగిందన్న కేకే.. సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకున్నామన్నారు. టికెట్లు దక్కినవారిలో దివంగత నేత పీజేఆర్ తనయ విజయారెడ్డి, నగర టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి సతీమణి కవితా రెడ్డి తదితరులున్నారు. టీఆర్ఎస్ తొలి జాబితాలో టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు వీరే.. 1.మీర్ పేట్ - అంజయ్య 2.హబ్సిగూడ - స్వప్నా సుభాష్ రెడ్డి 3.సైదాబాద్ - సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి 4.గుడిమల్కాపూర్ - బంగారు ప్రకాష్ 5.సోమాజిగూడ - విజయలక్ష్మీ 6.కాచిగూడ - చైతన్య కన్నాయాదవ్ 7.గచ్చిబౌలి - సాయిబాబా 8.గాంధీనగర్ - పద్మా నరేష్ 9.ముషీరా బాద్ - భాగ్యలక్ష్మీ యాదవ్ 10.శేరిలింగంపల్లి - నాగేంద్ర యాదవ్ 11.జీడిమెట్ల - పద్మా ప్రతాప్ గౌడ్ 12.అల్వాల్ - విజయశాంతి రెడ్డి 13.గోల్నాక - జయశ్రీ 14.కొండాపూర్ - హమీద్ పటేల్ 15.మన్సురా బాద్ - విఠల్ రెడ్డి 16.చైతన్యపురి - జి.విఠల్ రెడ్డి 17.బోలాక్ పూర్ - రామారావు 18.బన్సీలాల్ పేట - హేమలత 19.అమీర్ పేట్ - శేషుకుమారి 20.సనత్ నగర్ - లక్ష్మీ బాల్ రెడ్డి 21.రాంగోపాల్ పేట - అరుణాగౌడ్ 22.బాలానగర్ - నరేంద్రాచారి 23.కేపీహెచ్బీ కాలనీ - అడుసుమిల్లి వెంకటేశ్వరరావు 24.తార్నాక - సరస్వతి హరి 25.బౌద్ధనగర్ - ధనుంజయ దయనంద్ గౌడ్ 26.అడ్డగుట్ట - విజయకుమారి 27.జియాగూడ - కృష్ణ 28.ఎర్రగడ్డ - అన్నపూర్ణ యాదవ్ 29.కాప్రా - స్వర్ణరాజు శివమణి 30.ఎ ఎస్ రావు నగర్ - పావనిరెడ్డి 31.యూసఫ్గూడ - బి.సంజయ్గౌడ్ 32.బోరబండ - బాబా షంషుద్దీన్ 33.రెహ్మత్ నగర్ - మహ్మద్ అబ్దుల్ షఫీ 34.ఉప్పల్ - హన్మంతరెడ్డి 35.అల్లాహ్ పూర్ - సబిహా బేగం 36.అజంపుర - సిద్దాలక్ష్మీ 37.ఓల్డ్ మలక్ పేట్ - భువనేశ్వరి 38.ముసారాంబాగ్ - తీగల సునీతారెడ్డి 39.ఛాన్వీ - ఖలీం 40.ఉప్పగూడ - శీనయ్య 41.జంగంపేట్ - సీతారాం రెడ్డి 42.గన్సీ బజార్ - మహాదేవి 43.కుర్మాగూడ - పూజ అఖిల్ యాదవ్ 44.డబీర్ పూరా - మహ్మద్ అబ్దుల్ జీషాన్ 45.రియసత్ నగర్ - మహ్మద్ యూసఫ్ 46.సంతోష్ నగర్ - మహ్మద్ అక్రముద్దీన్ 47.రెయిన్ బజార్ - మహ్మద్ అయజ్ 48.మోండా మార్కెట్ - ఆకుల రూప హరికృష్ణ 49.శాలిబండ - అన్వర్ 50.మొఘల్ పూరా - వీరామణి 51.ఫత్తర్ ఘట్ - మిర్జా బేకీర్ అలీ 52.పురాణా పుల్ - మల్లికార్జున యాదవ్ 53.చాంద్రయణగుట్ట - రాజేంద్ర కుమార్ 54.తలబ్ చంచలం - ఫాతిమా 55.గౌలి పురా - మీనా 56.ఐఎస్ సదన్ - స్వప్నా సుందర్ రెడ్డి 57.కిషన్ బాగ్ - షకీల్ అహ్మద్ 58.రమ్నసపురా - అజమ్ పాషా 59.నవాబ్ షాహెబ్ కుంట - ఫర్హత్ సుల్తానా 60.జాహునుమా - గులాం నభీ 61.ఫలక్నుమా- డి. చందర్ నాయక్ 62.దూద్ బౌలీ- బి. రాజేశ్ 63.మల్లాపూర్- పన్నాల దేవేందర్ రెడ్డి 64.నాచారం- మేడాల జ్యోతి మల్లికార్జున్ గౌడ్ 65.రామాంతపూర్- గంధం జ్యోస్త్నా నాగేశ్వర్ రావు 66.చర్లపల్లి- బొంతు రామ్మోహన్ 67.బంజారాహిల్స్- గద్వాల విజయలక్ష్మి 68.సేలేమాన్ నగర్- ఎ. సరితా మహేశ్ 69.శాస్త్రీ పురం- బండ రాజేశ్ యాదవ్ 70.రాజేంద్రనగర్- కోరం లత 71.లంగర్ హౌస్- బి. భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి 72.ఆర్.కె. పురం- తీగల అనితా రెడ్డి 73.మాదాపూర్- వి. జగదీశ్ గౌడ్ 74.వెంగళరావు నగర్- కిలారి మనోహర్ 75.రామ్ నగర్- వి. నివాస్ రెడ్డి 76.చందానగర్- బొబ్బ నవతారెడ్డి 77.పటాన్ చెరువు- ఆర్ సమర్ యాదవ్ 78.ఖైరతాబాద్- పి. విజయారెడ్డి 79.భారతీనగర్- వి. సింధు ఆదర్శ్ రెడ్డి 80.వెంకటేశ్వర కాలనీ- మన్నె కవితా గోవర్ధన్ రెడ్డి -
టీఆర్ఎస్ 'గ్రేటర్' అభ్యర్థుల తొలి జాబితా విడుదల