K4
-
కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: అణు సామర్థ్యం కలిగిన కే4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. కే4 బాలిస్టిక్ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇదే. ఈ క్షిపణి రాకతో మన దేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి, నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరడం విశేషం. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, రష్యా వద్ద ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వీటిని సమకూర్చుకుంది. -
కే4 పులికి ఒంట్లో బాగోలేదా.. ?
సాక్షి, భీమారం(చెన్నూర్): రెండేళ్లుగా భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని అడవుల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేసి హతమార్చిన కే4 పెద్దపులి ఆరోగ్యం వేటకు సహకరించట్లేదు. దీంతో మరో పులి దానికి ఆహారం అందిస్తోంది. శనివారం భీమారం మండలంలోని కాజిపల్లి అడవుల్లో మేత కోసం వెళ్లిన పశువుల మందపై దాడి చేసిన సమయంలో రెండు పెద్ద పులులు ఉన్నాయని పశువుల కాపరులు పేర్కొనడంతో అటవీశాఖ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. రెండేళ్ల క్రితం ఈప్రాంతానికి వచ్చిన ఆడపులికి వేటగాళ్లు అమర్చిన ఇనుపవైర్లు శరీరం చుట్టూ ఉండి తీవ్ర గాయాలయ్యాయి. పులి ఉచ్చుని తొలగించేందుకు అటవీశాఖ తీసుకున్న చర్యలు ఫలించలేదు. పెద్దపులిని బంధించి దానికి ఉన్న ఇనుప వైర్లు తొలగించేందుకు అడవుల్లో బోన్లు ఏర్పాటు చేసి ఎరగా దూడలు కట్టేసి ఉంచినా అధికారుల పాచికలు పారలేదు. అనేక నెలల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించినా పులి చిక్కలేదు. దీంతో పులికి చికిత్స చేయించాలనే ఆలోచనని అటవీశాఖ పక్కకు పెట్టింది. (భూపాలపల్లి అడవుల్లో మగ పులి) గొల్లవాగు ప్రాజెక్ట్ కేంద్రంగా భీమారం సమీపంలోని గుట్టల మధ్య నిర్మించిన గొల్లవాగు ప్రాజెక్ట్ నీటివనరులు పెద్దపులికి అనుకూలంగా మారాయి. ప్రాజెక్ట్కు అతి సమీపంలో ఉన్న పులిఒర్రెలో పెద్దపులి నివాసం ఏర్పర్చుకొని అక్కడనుంచి చెన్నూర్ మండలం బుద్దారం, కోటపల్లి మండలంలోని అడవుల్లో సంచరిస్తోంది. అయితే సంవత్సరం క్రితం వచ్చిన మగపులి ఆడపులిని అక్కున చేర్చుకుంది. కొన్నాళ్ల పాటు రెండు వేర్వేరుగా తిరిగి వచ్చి ఆవాసానికి చేరుకునేవి. ప్రతిరోజు వేర్వేరుగా ఆహారం వేటాడి తినేవి. రెండు నెలల క్రితం ఏ2 మగపులి మరొకటి ఈప్రాంతానికి వచ్చినా ఆవాసం లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది. క్షీణిస్తున్న ఆరోగ్యం ఆడపులి శరీరం చుట్టూ ఉన్న ఇనుప వైరు కారణంగా అది ఇంతవరకూ గర్భం దాల్చడం లేదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆరునెలల నుంచి కే4 ఆడపులి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆహారం కోసం వేట కూడా చేయలేని స్థితికి అది చేరుకుంది. తోడుగా ఏ1.. క్షీణిస్తున్న ఆరోగ్యంతో వేటాడలేని పరిస్థితుల్లో ఉన్న ఆడపులికి మగ పులి తోడుగా ఉంటూ అడవిజంతువులతో పాటు పశువులపై దాడి చేసి ఆహారం అందిస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. కాజిపల్లి వద్ద రెండు పశువులను చంపిన పులి వెంట ఉన్న దానికి మరొక దానిని అప్పగించిందని వారు తెలిపారు. దాడి తరువాత భీమారానికి కాజిపల్లి వద్ద రెండు గేదెలను హతమార్చిన పులులు సాయంత్రం గొల్లవాగు ప్రాజక్ట్ సమీపంలోని వాగుకి వచ్చాయని చేపల వేటకు వెళ్లిన వారు పేర్కొన్నారు. చేపలు పడుతుండగా పులుల గాండ్రింపులు వినబడ్డాయని.. దాంతో పరుగెత్తుంటూ గ్రామానికి చేరుకున్నామని తెలిపారు. భయంభయం గతంలో వేర్వేరుగా సంచరించిన పులులు ఇప్పుడు జతకట్టి తిరుగుతుండటంతో భీమారం, నర్సింగాపూర్, కాజిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలోనే అడవి ఉంటుందని పశువులను ప్రతి రోజూ అడవికి పంపిస్తుంటామని ఆందోళన చెందుతున్నారు. -
ఎల్జీ పాంచ్ పటాకా: ఐదు స్మార్ట్ఫోన్లు లాంచ్
లాస్వేగాస్లో ప్రారంభంకాబోతున్న సీఈఎస్ 2017 ట్రేడ్ షోకు ముందుస్తుగా ఎల్జీ ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వాటిలో నాలుగు కే-సిరీస్ స్మార్ట్ఫోన్లు కాగ, ఒకటి స్టైలస్ స్మార్ట్ఫోన్. 2017 తమ కొత్త వేరియంట్లు ఎల్జీ కే3, ఎల్జీ కే4, ఎల్జీ కే8, ఎల్జీ కే10, స్టైలస్ 3గా ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. స్టైలస్ 3 స్మార్ట్ఫోన్ తమ మిడ్-రేంజ్ సెగ్మెంట్ పోర్ట్ఫోలియోను మరింత పటిష్టపరుస్తుందని తెలిపింది. ఈ కొత్త ఎల్జీ స్మార్ట్ఫోన్లను సీఈఎస్ 2017 ఈవెంట్లో ప్రదర్శించబోతున్నట్టు కూడా వెల్లడించింది. ఎల్జీ కే3(2017) ఫీచర్లు... 4.50 అంగుళాల డిస్ప్లే 1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్ 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2100 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే4(2017) ఫీచర్స్... 5.00 అంగుళాల డిస్ప్లే 1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 1జీబీ ర్యామ్ 8జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే8(2017) ఫీచర్స్.. 5.00 అంగుళాల డిస్ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 1.5 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ కే10(2017) ఫీచర్స్.. 5.30 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఎల్జీ స్టైలస్ 3 ఫీచర్స్... 5.70 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ