నేడు కళ్యాణదుర్గంలో విద్యుత్ అదాలత్
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కళ్యాణదుర్గంలో డివిజన్ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.