KL Rahul
-
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీ అనంతరం సోషల్మీడియాలో ఓ టాపిక్ హైలైట్గా మారింది. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్తో మ్యాచ్ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్ను ఏకి పారేసి, రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్తో కలిసి ఐదో వికెట్కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
ఆ ఇద్దరి విషయంలో అగార్కర్తో గంభీర్ గొడవ.. ఆఖరికి!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టు విషయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)- హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చే అంశమై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అదే వాగ్యుద్దానికి దారి తీసిందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియాను అక్కడికి పంపడం లేదు. యశస్వి జైస్వాల్పై వేటుఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం తటస్థ వేదికైన దుబాయ్లో భారత్ తమ మ్యాచ్లు ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు జనవరి 18న తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 11న ఫైనల్ టీమ్ను ఖరారు చేసింది. తొలుత ఈ జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసిన యాజమాన్యం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది. మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదనఅదే విధంగా వెన్నునొప్పి కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కాగా.. హర్షిత్ రాణాను జట్టులో చేర్చింది. అయితే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం గంభీర్- అగార్కర్ మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సీనియర్ అయిన కేఎల్ రాహుల్కు మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదించగా.. అగార్కర్ మాత్రం రిషభ్ పంత్కు పెద్దపీట వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆఖరికి గంభీర్ తన మాటను నెగ్గించుకున్నట్లు ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ ద్వారా నిరూపితమైనట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా బరిలోకి దిగగా.. పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కాగా ఈ సిరీస్ను 3-0తో టీమిండియా క్లీన్స్వీప్ చేసిన తర్వాత గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా నంబర్ వన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పగలను.రిషభ పంత్కు కూడా అవకాశాలు వస్తాయి. అయితే, కేఎల్ రాహుల్ రికార్డు బాగుంది. అందుకే అతడి వైపు మొగ్గుచూపాం. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఒకేసారి ఆడించలేము కదా!’’ అని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూఇక కేఎల్ రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ గంభీర్.. అగార్కర్తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్ను తప్పక ఎంపిక చేయాలని గౌతీ పట్టుబట్టగా.. అగార్కర్ మాత్రం అతడి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఇంగ్లండ్తో తొలి వన్డే తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి కూడా! తాను తొలుత తుదిజట్టులో లేనని.. విరాట్ కోహ్లి మోకాలి నొప్పి కారణంగానే తనకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.ఏది ఏమైనా ఇంగ్లండ్తో వన్డేలో సిరీస్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో వరుసగా 59, 44, 78 పరుగులు సాధించాడు. ఇక జట్టుకూర్పులో తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న గంభీర్.. అగార్కర్తో విభేదించినప్పటికీ ఘన విజయం సాధించడం జట్టుకు సానుకూలాంశంగా మారింది.అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసం అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి ప్రమోట్ చేసి.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ ఆటగాడిగా పంపడం బెడిసికొట్టింది. దీంతో మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో పంపగా.. 29 బంతుల్లోనే 40 పరుగులతో దంచికొట్టాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!? -
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్లో తమ తొలిమ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
రాహుల్ పై 'గంభీర్' నమ్మకం.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుస్తాడా?
ఆస్ట్రేలియా పర్యటన లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని కీలకమైన మార్పులు చేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో ఇందుకోసం తన ఫార్ములా ని పరీక్షించేందుకు ఉపయోగించుకున్నాడు.భారత్ జట్టులోని కీలక బ్యాటర్ కూడా సొంత గడ్డపై మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ కి జట్టులోని ప్రధానబ్యాటర్లు అందరూ మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్్ కోహ్లీ, ఓపెనర్ శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు పరుగులు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.రాహుల్ వైపే గంభీర్ మొగ్గు..అయితే గంభీర్ తీసుకొచ్చిన మరో పెద్ద మార్పు. రిషబ్ పంత్ స్థానంలో భారత్ నెంబర్ 1 వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ ని ఎంచుకోవడం. రాహుల్ కి పంత్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరి బ్యాటింగ్ విధానంలో చాలా తేడా ఉంది. పంత్ భారీ షాట్లతో కొద్దిసేపటి లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నవాడు. రాహుల్ అందుకు భిన్నంగా ఆచి తూచి ఆడతాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటాడు. టెక్నికల్ గా రాహుల్ సమర్ధుడైన బ్యాటర్ అయినప్పటికీ, అతను స్వతహాగా ఆచి తూచి ఆడే స్వభావం గల బ్యాటర్.ఇక్కడ మ్యాచ్ లో పరిస్థితులని బట్టి వీరిద్దరినీ ఉపయోగించుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాటర్ బాగా రాణించి స్కోర్ బాగా చేసినట్టయితే,అలాంటి పరిస్థితుల్లో శరవేగంగా మరిన్ని పరుగులు సాధించడానికి పంత్ సరిగ్గా సరిపోతాడు. అయితే పంత్ బ్యాటింగ్ శైలి వల్ల అతను నిలకడ రాణించగలడన్న గ్యారెంటీ లేదు.కానీ రాహుల్ అందుకు భిన్నంగా, క్రీజులో నిలదొక్కుకుంటే తనదైన శైలిలో నేర్పుగా పరుగులు రాబట్టగలడు. ఇంత వైరుధ్యం గల ఇద్దరు వికెట్ కీపర్లలలో ఒకరిని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇద్దరూ వ్యక్తిగతంగా ఎంతో సామర్ధ్యం గల బ్యాట్స్మన్. ఇలాంటి క్లిష్టమైన విషయంలో కోచ్ గంభీర్ తన ప్రధాన వికెట్ కీపర్ గా రాహుల్ నే ఎంచుకోవడం. ఎందుకంటె రాహుల్ చాల నిలకడైన బ్యాటర్ కావడమే.రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్అయితే ఈ నిర్ణయం చాల మందికి రుచించలేదు. ఇక్కడ మరో విషయం ఉంది. అది రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్. రాహుల్ సాధారణంగా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వస్తాడు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లోని తొలి రెండు వన్డేల్లో రాహుల్ ఆరో నెంబర్ బ్యాట్స్మన్ గా రంగంలోకి వచ్చాడు. “ప్రస్తుతానికి, కెఎల్ మాకు నంబర్ 1 వికెట్ కీపర్. ప్రస్తుతానికి అతను జట్టు తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు" అని గంభీర్ అహ్మదాబాద్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. "జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నప్పుడు, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం సాధ్యం కాదు. భారత్ జట్టులోని ఇతర బ్యాట్స్మన్ నైపుణ్యం, వారి అపార అనుభవం దృష్ట్యా చూస్తే, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక పంత్ విషయానికి వస్తే అతను అవకాశం వచ్చిన్నప్పుడు ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి నేను ఈ విషయం గురించి అంతే చెప్పగలను,," అని గంభీర్ తన నిర్ణయాన్ని తేటతెల్లం చేసాడు.ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కి బ్యాటింగ్ కి పంపించాలన్న గంభీర్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఫలితంగా, మొదటి రెండు మ్యాచ్లలో రాహుల్ ప్రదర్శన నిరాశపరిచింది - మొదటి రెండు మ్యాచ్లలో రాహుల్లో కేవలం రెండు, పది పరుగులు మాత్రమే చేసాడు. చేసాడు. అయితే మూడో మ్యాచ్ లో రాహుల్ తనకి అనుకూలంగా ఉండే ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు.“రాహుల్ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కి పంపించి అతనిని వృధా చేస్తున్నారు,” అని భారత మాజీ స్టంపర్ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. రికార్డులను చూడనని చెబుతూ గంభీర్ అలాంటి సూచనలను తోసిపుచ్చాడు. దుబాయ్లో రాహుల్ ఆరవ స్థానంలో కొనసాగాల్సి రావచ్చని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. .రాహుల్ ప్రపంచ కప్ రికార్డ్ 2023 ప్రపంచ కప్ కి ముందు పంత్ గాయపడ్డాడు. ఆ దశలో రాహుల్ భారత్ జట్టు కి అండగా నిలిచి రాణించాడు. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 75.33 సగటుతో 452 పరుగులు చేశాడు భారత్ ఫైనల్ కి చేర్చడంలో కీలక భూమిక పోషించాడు.పైగా రాహుల్ భారత్ మిడిల్ ఆర్డర్ను పటిష్టంగా ఉంచాడు. ప్రస్తుతం కోచ్ గంభీర్ కూడా రాహుల్ నుంచి అదే ఆశిస్తున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ని కూడా పటిష్టంగా ఉంచి జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో తోడ్పడుతాడని భావిస్తున్నాడు. మరి గంభీర్ వ్యూహం ఫలిస్తుందేమో చూడాలి. -
CT 2025: రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ వన్డే మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో పాల్గొనే ఎనిమిది జట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఈ ఐసీసీ టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో టీమ్ను ఖరారు చేసింది.యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఈ జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ(BCCI).. అతడి స్థానంలో ఐదో స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులో చేర్చింది. అదే విధంగా.. స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తుదిజట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనని ప్రకటించిన ఈ మాజీ బ్యాటర్.. అనూహ్యంగా వన్డే వరల్డ్కప్-2023 హీరోలను మాత్రం పక్కనపెట్టాడు.అద్బుత ప్రదర్శనస్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆలస్యంగా అడుగుపెట్టినా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్ షమీ. మెగా ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేశాడు.సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్లలో షమీ ఆడాడు. అయితే, ఇంగ్లండ్తో మ్యాచ్లలో ఈ బెంగాల్ పేసర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లండ్తో వన్డేల్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐదో స్థానంలో వచ్చే ఈ కర్ణాటక బ్యాటర్ను మేనేజ్మెంట్ ఆరో స్థానంలో పంపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల్లో రాహుల్(2, 10) విఫలమయ్యాడు.రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్అయితే, మూడో వన్డే సందర్భంగా తన రెగ్యులర్ ప్లేస్లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్(29 బంతుల్లో 40) ఆడాడు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్కప్లోనూ రాహుల్ రాణించాడు. అయినప్పటికీ షమీతో పాటు కేఎల్ రాహుల్కు కూడా సురేశ్ రైనా తన చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటివ్వకపోవడం గమనార్హం.ఇక షమీని కాదని యువ పేసర్ హర్షిత్ రాణా వైపు మొగ్గు చూపిన సురేశ్ రైనా.. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్ను ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో యాజమాన్యం రిషభ్ పంత్ను పూర్తిగా పక్కనపెట్టడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి సురేశ్ రైనా ఎంచుకున్న తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
అహ్మదాబాద్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్వుడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్కు జతైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్లో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ బ్యాటర్గా పంపింది. ఈ క్రమంలో నాగ్పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్క్లాస్ ప్లేయర్గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలని హితవు పలికాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ చురకలు అంటించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England ODIs)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరిగింది. 248 పరుగులుఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 32)లు శుభారంభం అందించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 52), జాకొబ్ బెతెల్(64 బంతుల్లో 51) అర్ధ శతకాలతో మెరిశారు.అయితే, భారత బౌలర్ల విజృంభణ కారణంగా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాతో పాటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.అయ్యర్ మెరుపు అర్ధ శతకంఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోగా.. శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ పట్టుదలగా క్రీజులో నిలబడి కాస్త నెమ్మదిగానే ఆడగా.. అయ్యర్ మెరుపు అర్ధ శతకం(36 బంతుల్లో 59), అక్షర్ పటేల్(52) విలువైన హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించారు.ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుబ్మన్ గిల్కు తోడయ్యాడు. అప్పటికి గిల్ సెంచరీకి 19 పరుగులు, టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో స్ట్రైక్లో ఉన్న రాహుల్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కేఎల్ రాహుల్ వ్యవహారశైలిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించే క్రమంలో రాహుల్ తన ఆటపై శ్రద్ధ పెట్టలేక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అతడు తన సహజశైలిలో ఆడాల్సింది.కానీ తన బ్యాటింగ్ పార్ట్నర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అందుకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి. ఇది టీమ్ గేమ్. కాబట్టి ఏ ఆటగాడు కూడా ఇలా చేయకూడదు. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఏదో కొత్తగా ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇది పూర్తిగా అతడు అనాసక్తితో ఆడిన షాట్’’ అని గావస్కర్ కేఎల్ రాహుల్ తీరును విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
కేఎల్ రాహుల్ సతీమణి బేబీ బంప్ ఫోటోలు.. అక్కినేని వారి కోడలు కామెంట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(Kl Rahul) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. 2023లో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని(Athiya Shetty) కేఎల్ పెళ్లాడారు. గతేడాది నవంబర్లో ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. బాలీవుడ్ భామ అతియా శెట్టి ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సన్ఫ్లవర్ సింబల్ను పోస్ట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీతారలు సైతం బ్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫోటోలకు అక్కినేని కోడలు శోభిత ధూళిపాల, ఆదిరావు హైదరీ, సోనాక్షి సిన్హా, అమీ జాక్సన్ లాంటి అగ్ర సినీతారలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతియా శెట్టి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్)కాగా.. ఈ ఏడాది జనవరి 23 తమ రెండో వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు కేఎల్ రాహుల్- అతియా జంట. 2023లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. చివరికీ పెద్దల అంగీకారంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ముంబయిలోని తన ఫామ్హౌస్లోనే వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేని వైనం
చాలాకాలం తర్వాత రంజీ (Ranji Trophy) బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (KL Rahul) తొలి ఇన్నింగ్స్లోనే నిరాశపరిచాడు. హర్యానాతో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్లో రాహుల్ 26 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్ 37 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాది మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అన్షుల్ కంబోజ్ ఓ సాధారణ బంతితో రాహుల్ను బోల్తా కొట్టించాడు. వికెట్కీపర్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.కాగా, ఈ మ్యాచ్లో రాహుల్ బరిలోకి దిగే సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ రాహుల్ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో (బెంగళూరు) జరుగుతుంది. సొంత మైదానంలో రాహుల్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించి వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ ఇన్నింగ్స్లో తొలుత రాహుల్ను చూసి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. వరుస పెట్టి బౌండరీలు బాదడంతో భారీ స్కోర్ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సూపర్ టచ్లో కనిపించిన రాహుల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే నిష్క్రమించాడు.ఈ మ్యాచ్లో హర్యానా టాస్ గెలిచి కర్ణాటకను బ్యాటింగ్కు ఆహ్వానించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేవీ అవనీశ్ ఔట్ కావడంతో కర్ణాటక 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాహుల్.. మయాంక్ అగర్వాల్తో కలిసి రెండో వికెట్కు 54 పరుగులు జోడించాడు. రాహుల్ ఔటయ్యాక దేవ్దత్ పడిక్కల్ క్రీజ్లోకి వచ్చాడు. ఈ లోగా మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ల అనంతరం కర్ణాటక స్కోర్ 121/2గా ఉంది. మయాంక్ 63, పడిక్కల్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ను ఔట్ చేసిన కంబోజ్ అనీశ్ను కూడా పెవిలియన్కు పంపాడు.బీజీటీలోనూ నిరాశపరిచిన రాహుల్రాహుల్ ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ 5 టెస్ట్ల్లో కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. గాయాలు, ఫామ్ లేమి కారణంగా రాహుల్ ఇటీవలికాలంలో తరుచూ జట్టులోకి వస్తూ పోతున్నాడు. రాహుల్ టీ20 జట్టులో చోటు కోల్పోయి చాలాకాలమైంది. వన్డేల్లోనూ రాహుల్ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. రాహుల్కు బీజీటీ 2024-25లో ఐదు టెస్ట్లు ఆడే అవకాశం దక్కినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో (77).. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో (84) మాత్రమే రాహుల్ రాణించాడు. -
రంజీల్లో ‘స్టార్స్’ వార్!
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు... మనస్టార్లు దేశవాళీ బాటపట్టారు. కింగ్ కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే... హైదరాబాద్కు సిరాజ్ పేస్ తోడైతే... కేఎల్ రాహుల్ కర్ణాటకకు జై కొడితే... జడేజా ఆల్రౌండ్ ఆటతో సౌరాష్టకు ఆడితే అవి రంజీ మ్యాచ్లేనా? రసవత్తర మ్యాచ్లు కావా? కచ్చితంగా అవుతాయి. తదుపరి రంజీ దశ పోటీలు తారలతో కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. అభిమానులకు నాలుగు రోజులూ ఇక క్రికెట్ పండగే! చూస్తుంటే గంభీర్ సిఫార్సులతో రూపొందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త మార్గదర్శకాలు ఎంతటి స్టార్లయినా దేశవాళీ కోసం తగ్గాల్సిందేనని నిరూపించబోతున్నాయి. న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ ట్రోఫీలోని చివరి రౌండ్ మ్యాచ్లూ పసందుగా సాగనున్నాయి. అభిమాన క్రికెటర్లు నాలుగు రోజుల ఆటకు అందుబాటులోకి రావడమే దేశవాళీ క్రికెట్కు సరికొత్త పండగ తెస్తోంది. ఇదివరకు చెప్పినట్టుగానే విరాట్ కోహ్లి ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ డి్రస్టిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించడమే కాదు... రైల్వేస్ జట్టుతో ఈ నెల 30 నుంచి జరిగే పోరుకోసం ఢిల్లీ జట్టును ప్రకటించింది. అందులో కింగ్ కోహ్లి ఉండటమే విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను తన అభిమానులను దేశవాళీ మ్యాచ్ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యాడు. కేవలం మ్యాచ్ రోజుల్లోనే కాదు... ఢిల్లీ సహచరులతో పాటు కలిసి కసరత్తు చేసేందుకు అతను మంగళవారం జట్టుతో చేరతాడని ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ ధ్రువీకరించారు. కొన్నిరోజులుగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (ప్రస్తుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్)తో కలిసి బ్యాటింగ్లో శ్రమిస్తున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు రంజీతో అతను రియల్గా బ్యాటింగ్ చేయనున్నాడు. ఇదే జరిగితే 2012 తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డీడీసీఏ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్లో బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం కాస్త వెలతే! కానీ ‘రన్ మెషిన్’ కోహ్లి శతక్కొట్టే ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆ వెలతి తీరుతుంది. హైదరాబాద్ పేస్కా బాస్... సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా, షమీలాంటి అనుభవజ్ఞులతో పాటు భారత జట్టు పేస్ దళానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ బలం అయ్యాడు. గురువారం నుంచి నాగ్పూర్లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. నాగ్పూర్ ట్రాక్ పేస్కు అవకాశమిచ్చే వికెట్. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగే అవకాశముంది. అతను నిప్పులు చెరిగితే సొంతగడ్డపై విదర్భకు కష్టాలు తప్పవు! సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు. జడేజా వరుసగా రెండో మ్యాచ్ ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఉన్న సౌరాష్ట్ర తరఫున ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఆడిన స్టార్, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ ఆడేందుకు సై అంటున్నాడు. గత మ్యాచ్లో అతని ఆల్రౌండ్ ‘షో’ వల్లే నాలుగు రోజుల మ్యాచ్ కాస్త రెండే రోజుల్లో ముగిసింది. రెండు ఇన్నింగ్స్ (5/66, 7/38)ల్లో కలిపి 12 వికెట్లు తీసిన జడేజా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో 38 పరుగులు కూడా చేశాడు. సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. గురువారం నుంచి అస్సామ్తో జరిగే పోరులో మళ్లీ జోరు కనబరచాలనే లక్ష్యంతో రంజీ బరిలోకి దిగుతున్నాడు. అస్సామ్ను హిట్టర్ రియాన్ పరాగ్ నడిపిస్తున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న పరాగ్ ఐపీఎల్ ద్వారానే అందరికంటా పడ్డాడు. ఫిట్నెస్తో రాహుల్ రెడీ కర్ణాటక తరఫున ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్తో జరిగిన గత మ్యాచ్లోనే కేఎల్ రాహుల్ ఆడాలనుకున్నాడు. కానీ మోచేతి గాయం కారణంగా ఆ రంజీ పోరు ఆడలేకపోయిన స్టార్ ఓపెనర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో హరియాణా జట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్ చివరి సారిగా 2020లో బెంగాల్తో జరిగిన రంజీ సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సొంతరాష్ట్రం తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడనున్నాడు. అతని చేరికతో కర్ణాటక బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం అయ్యింది. అంతేకాదు. దేవదత్ పడిక్కల్, సీమర్ ప్రసిధ్ కృష్ణలు కూడా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ముగ్గురు ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రోహిత్, జైస్వాల్, అయ్యర్ గైర్హాజరు ఈ రంజీ ట్రోఫీలో ముంబై ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్లోనూ భారత కెపె్టన్ రోహిత్ శర్మ సహా యువ సంచలనం యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు ఆసక్తి కనబరిచారు. ఈ త్రయం జమ్మూకశ్మీర్తో జరిగిన గత మ్యాచ్లో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్తో వచ్చే నెల 6, 9, 12 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం వీరంతా భారత జట్టులో చేరాల్సివుండటంతో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే పోరుకు అందుబాటులో ఉండటం లేదని ముంబై వర్గాలు వెల్లడించాయి. -
పంత్తో పోటీలో సంజూ వెనుకబడటానికి కారణం అదే: డీకే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టులో రిషభ్ పంత్కు చోటు దక్కడంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. సంజూ శాంసన్(Sanju Samson)ను కాదని.. సెలక్టర్లు ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి వైపు మొగ్గుచూపడానికి గల కారణాన్ని విశ్లేషించాడు. ఇద్దరూ సూపర్ బ్యాటర్లే అయినా.. పంత్(Rishabh Pant)లోని ఓ ప్రత్యేకతే అతడిని రేసులో ముందు నిలిపిందని పేర్కొన్నాడు.పాకిస్తాన్ వేదికగావన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికైన దుబాయ్లో మ్యాచ్లు ఆడనున్న టీమిండియా.. తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇక ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా క్వాలిఫై అయింది.మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే వరల్డ్కప్-2023 పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా అర్హత సాధించాయి. ఇందుకు సంబంధించి ఈ ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం ఇంకా టీమ్ వివరాలు వెల్లడించలేదు.సంజూకు దక్కని చోటుఇదిలా ఉంటే.. జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో కేరళ ఆటగాడు సంజూ శాంసన్కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ల కోటాలో వన్డే వరల్డ్కప్- 2023లో రాణించిన కేఎల్ రాహుల్తో పాటు.. రిషభ్ పంత్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిజానికి వన్డేల్లో పంత్ కంటే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.అప్పుడు కూడా ఇదే తరహాలోఇప్పటి వరకు టీమిండియా తరఫున 31 వన్డేల్లో పంత్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు.. సంజూ 16 వన్డేల్లో 56.66 సగటుతో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 510 పరుగులు సాధించాడు. నిజానికి సంజూకు వన్డే వరల్డ్కప్-2023 జట్టులో కూడా చోటు దక్కాల్సింది. కానీ నాడు అతడిని కాదని.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోయాడు. దీంతో సంజూకు అవకాశం ఇచ్చి ఉంటే.. ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య కోసం అతడిని బలిచేసి.. మరోసారి అన్యాయం చేశారంటూ బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి కూడా పంత్ కోసం సంజూను కావాలనే పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.పంత్ను చేర్చడం ద్వారానే అది సాధ్యంఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్.. లేదా సంజూ శాంసన్.. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇద్దరూ అచ్చమైన బ్యాటర్లే. అయితే, రిషభ్ పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపడానికి కారణం.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడమే.బ్యాటింగ్ ఆర్డర్లో మేనేజ్మెంట్ కోరుకుంటున్న వైవిధ్యం పంత్ను చేర్చడం ద్వారా సాధ్యమవుతుంది. ఏదేమైనా సంజూ శాంసన్ కూడా చివరి వరకు పోటీలో నిలిచాడని చెప్పవచ్చు.విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఉంటే..అయితే, ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపింది. ఈ దేశీ టోర్నీలో ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని దినేశ్ కార్తిక్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)తో అతడికి విభేదాలు తలెత్తిన కారణంగానే ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు. మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరానికి సంజూ రాలేదని కేసీఏ పెద్దలు వేటు వేయగా.. సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మాత్రం తన కుమారుడిపై కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించాడు. సంజూ మాదిరి ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాని ఎంతో మంది ఆటగాళ్లకు కేరళ జట్టులో చోటు ఇచ్చారని పేర్కొన్నాడు.చదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
రంజీ బాట పట్టిన మరో టీమిండియా స్టార్ ప్లేయర్
టీమిండియా స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబై), యశస్వి జైస్వాల్ (ముంబై), శుభ్మన్ గిల్ (పంజాబ్), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శ్రేయస్ అయ్యర్ (ముంబై) తమతమ జట్ల తరఫున బరిలోకి దిగారు. జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (ఢిల్లీ) కూడా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగుతాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తాడు. ఈనెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్లో కర్ణాటక.. హర్యానాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కర్ణాటక హోం గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది.కాగా, రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తన సహచరులు రోహిత్, యశస్వి, గిల్, పంత్, జడేజాలతో పాటు రంజీ బరిలో దిగాల్సి ఉండింది. అయితే మోచేతి గాయం కారణంగా అతను ఇవాళ (జనవరి 23) ప్రారంభమైన మ్యాచ్కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లి సైతం గాయం కారణంగానే ఇవాళ మొదలైన మ్యాచ్కు అందుబాటులో లేడు.ఇదిలా ఉంటే, ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక భారత ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. టీమిండియా స్టార్లంతా విఫలం.. ఒక్క జడేజా తప్ప..!రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్లంతా దారుణంగా విఫలమయ్యారు. వేర్వేరు జట్లతో జరిగిన మ్యాచ్ల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే సత్తా చాటాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.రంజీల మాట అటుంచితే, ప్రస్తుతం భారత టీ20 జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (జనవరి 22) జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జోస్ బట్లర్ (68) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఓపెనర్లు సంజూ శాంసన్ (26), అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపరిచినా తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కేవలం 12.5 ఓవర్లలోనే (3 వికెట్లు) భారత్ గెలుపు తీరాలు తాకింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్(Sanju Samson) తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెరమీదకు వచ్చారు. తన కుమారుడి ఎదుగులను ఓర్వలేక.. కావాలనే తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)పై మండిపడ్డారు. అసోసియేషన్లోని ‘పెద్ద తలకాయల’పై తనకేమీ కోపం లేదని.. సమస్యంతా అబద్దాలను కూడా నిజంలా ప్రచారం చేసే ‘చిన్నవాళ్ల’ గురించేనని పేర్కొన్నారు.కాగా ఇటీవల అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజూ శాంసన్. ఈ క్రమంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) జట్టులో చోటు దక్కడం ఖాయమని సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయపడ్డారు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో సంజూ సత్తా చాటగలడని మద్దతు పలికారు.సంజూ శాంసన్కు మొండిచేయిఅయితే, ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్కు టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు రిషభ్ పంత్(Rishabh Pant)ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కాగా దేశీ క్రికెట్ టోర్నీల్లో కేరళ జట్టుకు సంజూ కెప్టెన్గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం కేసీఏ అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. తాము నిర్వహించిన మూడు రోజుల శిక్షణా శిబిరానికి హాజరుకానుందున సంజూకు విజయ్ హజారే ట్రోఫీ ఆడే జట్టులో చోటివ్వలేదని తెలిపింది.అదే విధంగా.. సెలక్షన్కు అందుబాటులో ఉంటాడో.. లేదో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని సంజూపై ఆరోపణలు చేసింది. తనకు నచ్చినపుడు వచ్చి ఆడతామంటే కుదరదని.. అందరి ఆటగాళ్లలాగే అతడు కూడా అని స్పష్టం చేసింది.నా కుమారుడిపై పగబట్టారునిజానికి విజయ్ హజారే ట్రోఫీలో గనుక తనను తాను నిరూపించుకుంటే సంజూ కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండేవాడే! ఈ పరిణామాల నేపథ్యంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు. ‘‘కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పగ సాధిస్తున్నారు.ఇంతవరకు మేము అసోసియేషన్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి వారి చేష్టలు శ్రుతిమించాయి. సంజూ ఒక్కడే క్యాంపునకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది శిక్షణా శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్లను ఎంపిక చేశారు.వారి ప్రమేయం లేదుకేసీఏ అధ్యక్షుడు జయేశ్ జార్జ్, కార్యదర్శి వినోద్కు ఈ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నా. అయితే, కొంతమంది కిందిస్థాయి వ్యక్తులు సంజూ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి మనసులలో విషాన్ని నింపుతున్నారు’’ అని విశ్వనాథ్ మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు ఆరోపణలు చేశారు.కాగా గతంలోనూ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనం అయిందని.. పదేళ్ల పాటు అతడి సమయం వృథా అయిందని పేర్కొన్నారు. ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాగా సంజూ ప్రస్తుతం ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
అందుకే సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాల్గొనబోయే భారత జట్టులో సంజూ శాంసన్కు చోటివ్వాల్సిందని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో వరుస శతకాలతో చెలరేగినా అతడికి మొండిచేయి ఎదురుకావడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ సంజూ తిరస్కారానికి గురైనట్లుగా భావించరాదని.. క్రికెట్ ప్రేమికులంతా అతడికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నాడు.జట్టు కూర్పు దృష్ట్యానే సంజూను కాదని.. సెలక్టర్లు రిషభ్ పంత్(RIishabh Pant) వైపు మొగ్గుచూపారని గాసవ్కర్ అభిప్రాయపం వ్యక్తం చేశాడు. కాగా హైబ్రిడ్ విధానంలో పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం(జనవరి 18) జట్టును ప్రకటించింది.వారిద్దరికే చోటురోహిత్ శర్మ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు.. రిషభ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. నిజానికి వన్డేల్లో పంత్తో పోలిస్తే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంతేకాదు.. ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడు మూడు శతకాలు బాది సూపర్ ఫామ్లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి వారు సంజూను చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్ను బలంగా వినిపించారు. అయితే, బీసీసీఐ మాత్రం పంత్ వైపే మొగ్గుచూపింది. దీంతో సంజూకు గతంలో మాదిరే మరోసారి భంగపాటు తప్పలేదు.అందుకే సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదు!ఈ విషయంపై గావస్కర్ తాజాగా స్పందిస్తూ సంజూ శాంసన్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఆటగాడిని పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. అసలు అతడిని ఎంపిక చేయకపోవడానికి సరైన కారణం లేదనే చెప్పవచ్చు.సంజూను కాదని.. రిషభ్ పంత్ను ఎంపిక చేశారు. గేమ్ ఛేంజర్గా అతడికి పేరుండం ఒక కారణం కావచ్చు. ఇక అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరొక ప్లస్ పాయింట్. అంతేగాక.. సంజూ కంటే బెటర్ వికెట్ కీపర్ కావడం కూడా అతడికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సత్తా పంత్ సొంతం. అయితే, సంజూకు అలాంటి ఫేమ్ లేదు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ.. సంజూ ఎందులోనూ తక్కువ కాదు. అతడు తిరస్కార భావంతో ముడుచుకుపోవాల్సిన పనిలేదు. ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతడికి మద్దతు ప్రకటిస్తున్నారు’’ అని సునిల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’ -
రంజీల్లో ఆడనున్న రోహిత్, పంత్.. కోహ్లి, రాహుల్ దూరం
టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు సిద్దమయ్యారు. ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్లో ఉత్తర్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.కోహ్లి, రాహుల్ దూరంమరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.ఢిల్లీ జట్టులో పంత్రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్గా వ్యవహరిస్తాడు.ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్వంశీ (వికెట్కీపర్), వైభవ్ కంద్పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్. -
IPL 2025: కేఎల్ రాహుల్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే..!
భారత మాజీ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తాడని జోస్యం చెప్పాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం కేఎల్ రాహుల్ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నా, అక్షర్ పటేల్కే ఢిల్లీ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. క్రిక్బజ్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డీకే ఈ విషయాలను పంచుకున్నాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ను టీమిండియా వైస్ కెప్టెన్గా నియమించడంపై డీకే స్పందిస్తూ.. హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం కూడా కనిపించడం లేదు. హార్దిక్ వైస్ కెప్టెన్గా ఉండగా టీమిండియా బాగా రాణించింది. హార్దిక్, సూర్యకుమార్ ఆథ్వర్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్లో (సౌతాఫ్రికా) గెలిచింది. అక్షర్ పటేల్ విషయానికొస్తే.. అతనికి ఇదో మంచి అవకాశం. మరి ముఖ్యంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కూడా ఉండబోతున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్ అక్షర్కు బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్ కెప్టెన్గా కూడా అక్షర్కు అనుభవం ఉంది. అక్షర్కు నా శుభాకాంక్షలు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.డీకే ఏ ఆధారంగా అక్షర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అన్నాడో తెలీదు కానీ, అక్షర్కు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. అక్షర్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో అక్షర్ ఓ మ్యాచ్లో డీసీ కెప్టెన్గా సేవలందించాడు. మెగా వేలానికి ముందు డీసీ యాజమాన్యం అక్షర్ను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది. 30 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన అక్షర్.. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్లో భాగమై ఉన్నాడు. కాగా, అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని తేల్చి చెప్పిన దినేశ్ కార్తీక్ గతంలో ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్గా వ్యవహరించాడు.సాధారణ ఆటగాడిగా రాహుల్..?అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్గా ఎంపికైతే పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2020 సీజన్ తర్వాత తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. 2020, 2021 సీజన్లలో పంజాబ్ కెప్టెన్గా.. 2022-24 వరకు లక్నో కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ను ఇటీవల ముగిసిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాహుల్ డీసీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతాడో లేక మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ను మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
Shreyas Iyer: వరల్డ్కప్లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ!
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే జట్టులో తాను తప్పక చోటు దక్కించుకుంటాననే ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తాను ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.కాగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఐపీఎల్తో పాటు దేశీ క్రికెట్కే పరిమితమైన ఈ ముంబై బ్యాటర్.. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా జట్టుకు టైటిల్ అందించాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు.అదే విధంగా తన కెప్టెన్సీలో ముంబైకి దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ దుమ్ములేపాడు. రెండు భారీ శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి అయ్యర్ ఎంపిక కావడం లాంఛనప్రాయమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.వరల్డ్కప్లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ!ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. వన్డే వరల్డ్ప్-2023 ప్రదర్శన ఆధారంగా తనకు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను.గత వరల్డ్కప్ టోర్నీలో నేను, కేఎల్ రాహుల్(KL Rahul) మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాం. మా ఇద్దరికీ ఆ ఈవెంట్ అద్భుతంగా సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ ఫైనల్లో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ ఆడే టీమిండియాకు ఎంపికైతే నాకు అంతకంటే గర్వకారణం మరొకటి ఉండదు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’’ అని శ్రేయస్ అయ్యర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.రెండు శతకాలు బాదికాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశారు. ఈ టోర్నమెంట్లో మిడిలార్డర్లో బరిలోకి దిగిన అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పదకొండు ఇన్నింగ్స్లో కలిపి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ సగటు 66.25తో 530 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.ఫైనల్లో మాత్రం విఫలంఅయితే, అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో(India vs Australia) మాత్రం అయ్యర్ తేలిపోయాడు. ఆసీస్ కెప్టెన్, పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. మరోవైపు.. ఈ మెగా టోర్నీలో కేఎల్ రాహుల్ 452 పరుగులు సాధించాడు. ఫైనల్లో 66 పరుగులు చేసి.. టీమిండియా ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.పంజాబ్ కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్పై కాసుల వర్షం కురిసిన విషయం తెలిసిందే. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించి ట్రోఫీ అందించిన ఈ ఆటగాడి కోసం పంజాబ్ కింగ్స్ భారీ మొత్తం ఖర్చు పెట్టింది. ఏకంగా రూ. 26.75 కోట్లకు అయ్యర్ను సొంతం చేసుకుంది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఇక అతడిని తమ కెప్టెన్గా ప్రకటిస్తూ పంజాబ్ కింగ్స్ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా సూపర్స్టార్ రిషభ్ పంత్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ మెగా లీగ్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
IND vs ENG: బీసీసీఐ యూ టర్న్..! కేఎల్ రాహుల్కు నో రెస్ట్?
భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు సిద్దమవుతోంది. ఈ వైట్బాల్ సిరీస్లలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలుత ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. జనవరి 22న ఈడెన్గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ఈ సిరీస్ల కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం(జనవరి 13) ప్రకటించే అవకాశముంది. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించారు.కానీ ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 దృష్ట్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాహుల్ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2 అనంతరం స్వదేశానికి చేరుకున్న రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లకు దూరంగా ఉన్న ఈ కర్ణాటక ఆటగాడు.. తిరిగి ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. కాగా రాహుల్కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ఎనిమిదో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇప్పటివరకు 77 వన్డేలు ఆడిన రాహుల్.. 49.15 సగటుతో 2851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 18 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్లో భారత్కు వెన్నెముకగా రాహుల్ ఉంటాడు.తన వన్డే కెరీర్లో రాహుల్ 5 స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ఏకంగా 1269 పరుగులు చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఆడనున్నారు. అయితే ఈ సిరీస్కు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)చదవండి: 'కోహ్లి వల్లే యువీ ముందుగా రిటైరయ్యాడు'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు -
వన్డే సిరీస్ నుంచి రాహుల్కు విశ్రాంతి!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా అతను కోరినట్లు సమాచారం. ‘ఆ్రస్టేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత రాహుల్ విరామం కోరుకుంటున్నాడు. అందుకే ఈ సిరీస్కు తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని అతను చెప్పాడు. అయితే చాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం తాను అందుబాటులో ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసీస్తో ఐదు టెస్టులూ ఆడిన రాహుల్ 10 ఇన్నింగ్స్లలో 2 అర్ధసెంచరీలతో 276 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. చాంపియన్స్ ట్రోఫీకి తాను సిద్ధమని చెప్పినా... వన్డే జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం పంత్, సంజు సామ్సన్ల నుంచి అతను పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు కర్ణాటక జట్టు ఆడే విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కూ తాను అందుబాటులో ఉండనని రాహుల్ ఇప్పటికే సమాచారం అందించాడు. -
‘బుమ్రాను కెప్టెన్ చేయొద్దు.. కేఎల్ రాహుల్ బెటర్ ఆప్షన్’
టెస్టుల్లో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు?... ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన, రోహిత్ శర్మ(Rohit Sharma) వైఫల్యం నేపథ్యంలో ఈ ప్రశ్న తెర మీదకు వచ్చింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఓటమిభారంతో ఇంటిబాట పట్టింది.దాదాపు పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక సిరీస్ను భారత జట్టు ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ఇక ఆసీస్తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తనంతట తానుగా తప్పుకొన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా జట్టుకు భారంగా మారడం ఇష్టం లేక తుదిజట్టు నుంచి స్వయంగా వైదొలిగాడు. నాయకుడిగా బుమ్రా సఫలం!ఈ రెండు సందర్భాల్లోనూ పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. పెర్త్లో 295 పరుగుల తేడాతో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఐదో టెస్టులో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోయాడు. అయితే, సిరీస్ ఆసాంతం జట్టు భారాన్ని తన భుజాలపై మోసిన బుమ్రా.. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.గాయం వల్ల జట్టుకు దూరమయ్యే పరిస్థితిఫలితంగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో టీ20, వన్డేలతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా బుమ్రా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ పర్యటన తర్వాత రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ గురించి ప్రచారం ఊపందుకుంది. అతడి వారసుడిగా బుమ్రా పగ్గాలు చేపడతాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వవద్దుఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. బుమ్రాను టెస్టు కెప్టెన్ చేయవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి అతడు విజ్ఞప్తి చేశాడు. ‘‘జస్ప్రీత్ బుమ్రా సమీప భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టబోతున్నాడా? రోహిత్ శర్మ వారసుడిగా అతడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు.ఎందుకంటే.. జట్టు భారం మొత్తాన్ని మోస్తూ.. టీమ్ కోసం ప్రాణం పెట్టి మరీ పోరాడగల ఏకైక బౌలర్ అతడే. మిగతా పేసర్ల నుంచి అతడికి పెద్దగా సహాయం అందడం లేదు. కాబట్టి బుమ్రాపైనే అధిక భారం పడుతోంది. అందుకే అతడు గాయపడుతున్నాడు.పంత్ లేదంటే రాహుల్ బెటర్అందుకు తోడు కెప్టెన్సీ భారం పడితే ఇంకా కష్టం. కాబట్టి బుమ్రాను అస్సలు కెప్టెన్గా నియమించవద్దు. అతడికి బదులు బ్యాటర్ను సారథిగా ఎంపిక చేస్తే బాగుంటుంది. రిషభ్ పంత్ లేదంటే.. కేఎల్ రాహుల్ను టెస్టులకు కెప్టెన్ చేయాలి. వాళ్లిద్దరికీ ఐపీఎల్లో సారథులుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అనిపించుకుంటుంది’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.అలా చేస్తే తిప్పలు తప్పవు‘‘బుమ్రాను పూర్తి స్థాయి కెప్టెన్గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అతడు ఫిట్గా ఉండి.. వికెట్లు తీయడంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. అంతేకానీ.. నాయకత్వ భారం కూడా మోపితే గాయాల బెడద వేధించడం ఖాయం. తన అద్భుతమైన కెరీర్కు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి.. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపకండి’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.చదవండి: BCCI: గంభీర్పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది'
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా 3-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం అందుకున్న భారత జట్టు.. తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా భారత్ ఘోరంగా విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా బ్యాటర్ల తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.దీంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలను కూడా భారత్ చేజార్చుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ఈ సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో మొత్తం ఐదు మ్యాచ్లకు సర్ఫారాజ్ బెంచ్కే పరిమితమయ్యాడు.తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫారాజ్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు. "కేఎల్ రాహుల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్ను పూర్తిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఈ విషయం గురించి మొదటి టెస్టు సమయంలోనే మేము కామెంటేటరీ బాక్స్లో చర్చించాము. సర్ఫరాజ్కు టీమ్ మేనేజ్మెంట్ మరి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ కారణంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ స్ధాయిలో కూడా సత్తాచాటాడు. అతడు కేవలం 6 మ్యాచ్లు మాత్రమే ఆడి మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో విఫలమయ్యాడు. దీంతో అతడిని ఆసీస్ సిరీస్కు ఎంపిక చేసినప్పటికి తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. సర్ఫరాజ్కు కనీసం ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశమివ్వాల్సింది. అప్పటికీ అతడు రాణించకపోయింతే పక్కన పెట్టాల్సింది. ఇది నావరకు అయితే సరైన నిర్ణయం కాదని అన్పిస్తోంది. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ వార్మాప్ మ్యాచ్ల్లో విఫలమయ్యాడని అతడిని తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం వార్మాప్ మ్యాచ్లతోనే వారి ఆటతీరును అంచనా వేయకూడదు. అతడికి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది.ఓ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడని భావించయారు. కానీ పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హజారీలో భారత ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. ఆ తర్వాతి మ్యాచ్లలోనూ టాపార్డర్లోనే కొనసాగాడు.చదవండి: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్కు మరో షాక్ -
స్టార్స్ ఫ్లాప్ షో...
ఆఫ్స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్రౌండరే అయినా అటు బ్యాట్తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా... పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది. గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు. విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడలేమే ప్రధాన సమస్య రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఐదు మ్యాచ్ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది. చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీశ్, యశస్వి అదుర్స్ పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు మ్యాచ్ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్కు తోడు చక్కటి బ్యాటింగ్తో అతడు ఈ సిరీస్పై తనదైన ముద్రవేశాడు. 9 ఇన్నింగ్స్లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు. టి20 ఫార్మాట్లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఇక ఈ సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్లో బౌలింగ్కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్లో జస్ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. -
బేబీబంప్తో కేఎల్ రాహుల్ సతీమణి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియాశెట్టి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ జంట మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్నారు. అతియా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా అతియా శెట్టి సైతం ఆస్ట్రేలియాలోనే ఉంది.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ బిజీగా ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతోంది. తాజాగా మెల్బోర్న్ స్టేడియంలో అతియాశెట్టి కనిపించింది. ఆమెతో పాటు అనుష్క శెట్టి, నితీశ్ కుమార్ రెడ్డి ఫాదర్ కూడా కనిపించారు. అయితే అతియాశెట్టి బేబీబంప్తో కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న ముంబయిలో జరిగింది. రాహుల్ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు. Athiya Shetty with the baby 🥹❤️🧿🤞🏻🥹🧿❤️🪬😭💗😭🥹🪬🥺💗❣️🤍Also anushka and nitish family 🥹 pic.twitter.com/okzKM5umY4— Tia'world (@singh36896) December 29, 2024 -
Ind vs Aus: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్పై వేటు
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్లో పది వికెట్ల తేడాతో చిత్తైన రోహిత్ సేన.. బ్రిస్బేన్ టెస్టులో వర్షం వల్ల ఓటమి నుంచి తప్పించుకుందనే విమర్శలు మూటగట్టుకుంది.ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, తొలి రోజు ఆటలో మాత్రం టీమిండియాకు కలిసిరాలేదు. టాస్ ఓడి తొలుత బౌలింగ్కు దిగిన భారత్.. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చింది.ఆఖరి సెషన్లో భారత బౌలర్లు ప్రభావం చూపినా.. అప్పటికే కంగారూలు పైచేయి సాధించారు. మెల్బోర్న్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో.. గురువారం నాటి మొదటిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో.. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా తమ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.అందుకే గిల్పై వేటు..ఇప్పటికే శుబ్మన్ గిల్(Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. రెగ్యులర్ ఓపెనింగ్ జోడీతోనే బరిలోకి దిగనుంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే శుబ్మన్ గిల్ను తప్పించి.. వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టులోకి తీసుకున్నాం.ఓపెనర్గా మళ్లీ అతడేవాషీ కోసం గిల్ త్యాగం చేయాల్సి వచ్చింది. జట్టు ప్రయోజనాల కోసం మేము తీసుకున్న నిర్ణయాన్ని అతడు గౌరవించాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పు ఉంటుంది. అతడు భారత్ తరఫున ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు’’ అని అభిషేక్ నాయర్ మీడియాతో పేర్కొన్నాడు.కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తొలి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా సారథ్యంలో టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. అయితే, రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా అదే జోడీని కొనసాగించగా.. రోహిత్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు.వ్యూహం మార్చిన టీమిండియాకానీ రెండు టెస్టుల్లోనూ రోహిత్(3, 6, 10) విఫలమయ్యాడు. కెప్టెన్గానూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మెల్బోర్న్లో తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగనుండగా.. గిల్ ఆడే మూడో స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం.. ఆతిథ్య జట్టుతో కలిసి 1-1తో సమంగా ఉంది.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్ -
బాక్సింగ్ డే వీరులపై భారత్ ఆశలు
బాక్సింగ్ డే టెస్ట్ దగ్గర పడే కొద్దీ భారత్, ఆస్ట్రేలియా జట్లలో వేడెక్కువవుతోంది. ఈ సిరీస్ లో రెండు జట్లు 1-1తో సమఉజ్జీలుగా ఉండటం, అదీ క్రిస్టమస్ పర్వ దినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ఈ మ్యాచ్ జరుగనున్న తరుణంలో ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్ లో గెలిచేందుకు రెండు జట్లు పై ఒత్తిడీ ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. క్రిస్టమస్ సెలవల్లో 90,000 ప్రేక్షకుల మధ్య మెల్బోర్న్ వేదిక పై ఈ మ్యాచ్ జరగడం, ఆస్ట్రేలియా క్రికెట్ సీజన్లో ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.ఆశాజనకంగా భారత్..అయితే మెల్బోర్న్ వేదిక పై భారత్ కి మంచి రికార్డు ఉండటం రోహిత్ సేనకు అనుకూలమైన అంశం కాగా, ఈ మ్యాచ్ కి రోహిత్ తన సన్నద్ధత తెలపడం మరో ప్రధానాంశం. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ కు రోహిత్ ఎడమ మోకాలికి గాయం కారణంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆస్ట్రేలియా ఎడమచేతివాటం బ్యాట్సమెన్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా వైదొలిగే అవకాశం ఉండటం మరో కీలకమైన పరిణామం. ఈ సిరీస్ లో ట్రావిస్ హెడ్ విజృంభించి రెండు, మూడు టెస్టుల్లో వరుసగా సెంచరీలు సాధించి, ఇప్పటికే 81 .80 సగటుతో మొత్తం 409 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అరుదైన రికార్డు చేరువలో రాహుల్ బాక్సింగ్ డే న ప్రారంభమైన గత రెండు టెస్టుల్లో భారత్ ఓపెనర్ కె ఎల్ రాహుల్ వరుసగా రెండు సెంచరీలు సాధించడం విశేషం. 2021 లో దక్షిణాఫ్రికాతో సెంచురియన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ 124 పరుగులు సాధించాడు. మళ్ళీ అదే వేదికపై రెండేళ్ల అనంతరం జరిగిన టెస్ట్ లో రాహుల్ 101 పరుగులతో మరో సెంచరీ సాధించాడు.2014 లో మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ పేలవంగా ఆడి కేవలం 3, 1 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ప్రస్తుత సిరీస్ లో మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో 235 పరుగులు సాధించి, భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా మంచి ఫామ్ లో ఉన్నందున, రాహుల్ ఈ టెస్ట్ మ్యాచ్ లో రాణిస్తాడని భారత్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.గతంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 2014 లో మెల్బోర్న్ వేదిక పై జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో 169 పరుగులతో సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ పరాజయం చవిచూసింది. అయితే కోహ్లీకి ఆస్ట్రేలియా గడ్డపై 16 టెస్ట్ మ్యాచ్ ల్లో 1,478 పరుగులు సాధించి, అక్కడ అత్యధిక పరుగులు సాధించిన భారత్ బ్యాట్సమెన్ గా రికార్డు ఉంది. అత్యంత ప్రాధాన్యత గల మ్యాచ్ ల్లో రాణించే బ్యాట్సమెన్ గా ఖ్యాతి గడించిన కోహ్లీ మరోసారి విజృంభింస్తాడని భారత్ జట్టు ఆశిస్తోంది. -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్కు గాయం!?
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం.. భారత జట్టు ఇప్పటికే మెల్బోర్న్కు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్ భారీ షాక్ తగిలింది.ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్ చేతి మణికట్టుకు గామైంది. వెంటనే ఫిజియో వచ్చి రాహుల్ మణి కట్టుకు టేప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే రాహుల్ గాయంపై మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు.పెర్త్ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టెస్టుకు ముందు కూడా రాహుల్ కుడి చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో అతడు తొలి టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో పెర్త్ టెస్టులో భారత జట్టులో భాగమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే చేతి మణికట్టుకు గాయం కావడంతో భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.సూపర్ ఫామ్లో రాహుల్.. కాగా రాహుల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత తరపున లీడింగ్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత సిరీస్లో మూడు టెస్టులు ఆడిన రాహుల్ 235 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు డ్రా కావడంలో రాహుల్ ది కీలక పాత్ర పోషించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ KL Rahul suffered a hand injury at the MCG nets today during practice session. #INDvAUS pic.twitter.com/XH8sPiG8Gi— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 21, 2024 -
ఫస్ట్ ఈజీ క్యాచ్ వదిలేశాడు.. కట్ చేస్తే! స్టన్నింగ్ క్యాచ్తో షాకిచ్చాడు
బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ను స్మిత్ పెవిలియన్కు పంపాడు. తొలుత స్లిప్స్లో రాహుల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను విడిచిపెట్టిన స్మిత్.. రెండోసారి మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.భారత తొలి ఇన్నింగ్స్ 43 ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్.. రెండో బంతిని లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని రాహుల్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ థిక్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ కార్నర్ దిశగా వెళ్లింది.ఈ క్రమంలో ఫస్ట్స్లిప్లో ఉన్న స్మిత్ తన కుడివైపనకు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. అతడి క్యాచ్ చూసిన రాహుల్ బిత్తరపోయాడు. దీంతో 84 పరుగులు చేసిన రాహుల్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: కెప్టెన్గా రింకూ సింగ్ WHAT A CATCH FROM STEVE SMITH!Sweet redemption after dropping KL Rahul on the first ball of the day.#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/d7hHxvAsMd— cricket.com.au (@cricketcomau) December 17, 2024 -
IND vs AUS 3rd Test: ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్
IND vs AUS 3rd Test Day 4 live updates and highlights: బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.ఫాలో ఆన్ గండం గట్టెక్కిన భారత్బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. టెయిలాండర్లు ఆకాష్ దీప్(27 బ్యాటింగ్), జస్ప్రీత్ బుమ్రా(10 బ్యాటింగ్) అద్బుతమైన పోరాటంతో భారత్ను మ్యాచ్లో నిలిపారు. పదో వికెట్కు వీరిద్దరూ 39 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వెలుతురు లేమి కారణంగా నాలుగో రోజు ఆటను 14 ఓవర్ల ముందే అంపైర్లు నిలిపేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులుచేసింది. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్లో 193 పరుగులు వెనకంజలో ఉంది. భారత ఫాలో ఆన్ తప్పించుకోవడంలో వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(84), జడేజా(10) కీలక పాత్ర పోషించారు.జడ్డూ అవుట్కేఎల్ రాహుల్(84) మినహా స్పెషలిస్టు బ్యాటర్లంతా విఫలమైన వేళ టీమిండియాను ఆదుకున్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇన్నింగ్స్కు తెరపడింది. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్లో మార్ష్కు క్యాచ్ ఇచ్చి జడ్డూ వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా స్కోరు: 215/9 (66.2). ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 30 రన్స్ చేయాలి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్సిరాజ్ (1) రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి సిరాజ్ పెవిలియన్ చేరాడు. బుమ్రాక్రీజులోకి వచ్చాడు.భారత్ ఏడో వికెట్ డౌన్నితీశ్ రెడ్డి రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన నితీశ్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 52 పరుగులు కావాలి. ప్రస్తుతం భారత్ స్కోర్: 194/710:45 AM: మొదలైన ఆటవర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.09:53 AM: వర్షం వల్ల మరోసారి ఆగిన ఆటటీమిండియా స్కోరు: 180/6 (51.5)జడేజా 52, నితీశ్ రెడ్డి 9 పరుగులతో ఉన్నారు జడేజా హాఫ్ సెంచరీ..బ్రిస్బేన్ టెస్టులో రవీంద్ర జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(50)తో పాటు నితీశ్(8) పరుగులతో ఉన్నారు.వరుణుడు ఎంట్రీ.. నిలిచిన పోయిన ఆటబ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట నిలిచిపోయింది. లంచ్ విరామం తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో ఆట ఇంకా ప్రారంభం కాలేదు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్కు భారత్ స్కోర్: 167/6లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫాల్ ఆన్ గండం దాటాలంటే భారత్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా(41), నితీశ్ కుమార్(7) పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్ ఔట్..కేఎల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 84 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. నాథన్ లియోన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు.సెంచరీ దిశగా కేఎల్ రాహుల్..42 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(26) నిలకడగా ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న రాహుల్, జడేజా..34 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(76), రవీంద్ర జడేజా(10) నిలకడగా ఆడుతున్నారు. భారత్ ఇంకా 328 పరుగులు వెనకబడి ఉంది.రోహిత్ శర్మ ఔట్...నాలుగో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(10) వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు.మూడో రోజు ఆట ఆరంభం..బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), రోహిత్ శర్మ(0) ఉన్నారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ అమిర్ జాంగూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్తో మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు.సొంతగడ్డపై సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడింది వెస్టిండీస్. ఇందులో భాగంగా తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆతిథ్య జట్టు.. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక వార్నర్ పార్క్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. అదరగొట్టిన మహ్మదుల్లాసౌమ్య సర్కార్(73) హాఫ్ సెంచరీతో రాణించగా.. మెహదీ హసన్ మిరాజ్(77) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మహ్మదుల్లా 84 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అతడితో కలిసి జాకర్ అలీ(62*) ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు, గుడకేశ్ మోటీ, షెర్ఫానే రూథర్ఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు.అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగాఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్లు బ్రాండన్ కింగ్(15), అలిక్ అథనాజ్(7) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ షాయీ హోప్(3) పూర్తిగా విఫలం కాగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్(30) కూడా నిరాశపరిచాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ జట్టును ఆదుకున్నాడు.ఫాస్టెస్ట్ సెంచరీ.. మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న కార్టీ 95 పరుగులతో రాణించగా.. అతడికి జతైన అరంగేట్ర బ్యాటర్ అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 80 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కార్టీతో కలిసి ఐదో వికెట్కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన 27 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 104 పరుగుల సాధించాడు. గుడకేశ్ మోటీ(31 బంతుల్లో 44 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కార్టీ, జాంగూ, గుడకేశ్ విజృంభణ కారణంగా వెస్టిండీస్ 45.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్లు నష్టపోయి 325 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది. అమిర్ జాంగూ ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’, రూథర్ఫర్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు. రీజా హెండ్రిక్స్ ప్రపంచ రికార్డు బద్దలుకాగా ట్రినిడాడ్కు చెందిన అమిర్ జాంగూకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి మ్యాచ్. బంగ్లాదేశ్తో మూడో వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. వచ్చీ రాగానే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి.. సౌతాఫ్రికా స్టార్ రీజా హెండ్రిక్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జాంగూ బద్దలు కొట్టాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 18వ క్రికెటర్గా నిలిచాడు. ఇక వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా ఇంగ్లండ్ బ్యాటర్ డెనిస్ అమీ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా మీద 134 బంతుల్లో అతడు 103 పరుగుల సాధించాడు.వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు1. అమిర్ జాంగూ(వెస్టిండీస్)- బంగ్లాదేశ్ మీద- 83 బంతుల్లో 104* రన్స్2. రీజా హెండ్రిక్స్(సౌతాఫ్రికా)- శ్రీలంక మీద- 89 బంతుల్లో 102 రన్స్3. కేఎల్ రాహుల్(ఇండియా)- జింబాబ్వే మీద- 115 బంతుల్లో 100* రన్స్4. మార్క్ చాప్మన్(హాంగ్కాంగ్)- యూఏఈ మీద- 116 బంతుల్లో 124* రన్స్5. మైకేల్ లాంబ్(ఇంగ్లండ్)- వెస్టిండీస్ మీద- 117 బంతుల్లో 106 రన్స్.చదవండి: నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. వారి సాయం తీసుకుంటా: వినోద్ కాంబ్లీAn unforgettable moment on debut!🔥Amir Jangoo takes today's CG United Moment of the Match!👏🏾#WIvBAN #MatchMoment #WIHomeForChristmas pic.twitter.com/TzNnmWvHwG— Windies Cricket (@windiescricket) December 12, 2024Amazing Amir! 🙌A century on debut, only the second West Indian to do so.#WIvBAN | #WIHomeForChristmas pic.twitter.com/UGWGBiNNmm— Windies Cricket (@windiescricket) December 12, 2024 -
ఏంటి రాహుల్ ఇది?.. ఒకే ఓవర్లో రెండు ఛాన్స్లు వచ్చినా! వీడియో
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు ఆదృష్టం కలిసొచ్చింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి రాహుల్ తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే యశస్వీ జైశ్వాల్ను మిచిల్ స్టార్క్ పెవిలియన్కు పంపాడు.దీంతో మరో ఓపెనర్గా ఉన్న రాహుల్ కాస్త ఆచితూచి ఆడాడు. మొదటి 6 ఓవర్లలో 18 బంతులు ఆడి తన ఖాతా తెరవడానికి కష్టపడ్డాడు. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. తమ స్టార్ పేసర్ స్కాట్ బోలాండ్ను ఎటాక్లో తీసుకొచ్చాడు. ఒకే ఓవర్లో రెండు ఛాన్స్లు..భారత ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన బోలాండ్ తొలి బంతిని రాహుల్కు వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని రాహుల్ బ్యాక్ ఫుట్లో డిఫెండ్ ఆడాడు. అయితే రాహుల్ మూమెంట్ కాస్త స్లోగా ఉండడంతో బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో బౌలర్తో పాటు ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్కు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అంపైర్ ఔట్ ఇవ్వకముందే రాహుల్ మైదానాన్ని వీడేందుకు సిద్దమయ్యాడు. కానీ ఇక్కడే అస్సులు ట్విస్ట్ చోటు చేసుకుంది. బౌలర్ బోలాండ్ ఓవర్ స్టప్ చేయడంతో అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో కేఎల్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే రిప్లేలో బంతి బ్యాట్కు తాకనట్లు తేలడం గమనార్హం.అనంతరం అదే ఓవర్లో రాహుల్కు మరో లైఫ్ వచ్చింది. స్లిప్లో రాహుల్ ఇచ్చిన క్యాచ్ను ఖవాజా జారవిడిచాడు. అయితే తనకు వచ్చిన అవకాశాలను రాహుల్ అందిపుచ్చుకోలేకపోయాడు. ఆఖరికి 37 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు.చదవండి: ఆ రోజు జైశ్వాల్ ఏమన్నాడో వినలేదు.. కానీ అతడికి అస్సలు భయం లేదు: స్టార్క్pic.twitter.com/yAVVCSKmFI— Sunil Gavaskar (@gavaskar_theman) December 6, 2024 -
ఆసీస్తో రెండో టెస్టు.. టీమిండియా ఓపెనర్లుగా వారే: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘పింక్ బాల్’ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీపై స్పష్టతనిచ్చాడు. యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని హిట్మ్యాన్ పేర్కొన్నాడు.ఇక.. తాను మిడిలార్డర్లో బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్ శర్మ.. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తనకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేనని.. అయినా జట్టు కోసం ఓపెనింగ్ స్థానం త్యాగం చేయక తప్పలేదని పేర్కొన్నాడు.పితృత్వ సెలవులుకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. తన భార్య రితికా సజ్దే కుమారుడు అహాన్కు జన్మనివ్వడంతో పితృత్వ సెలవులు తీసుకున్నాడు. అయితే, మొదటి టెస్టు మధ్యలోనే ముంబై నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు హిట్మ్యాన్.జైస్వాల్తో కలిసి రాణించిన రాహుల్ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లో భారీ శతకం(161) బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్(26, 77) సైతం మెరుగ్గా రాణించాడు.అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్ జోడీని మారుస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రాహుల్ను మిడిలార్డర్లోకి పంపి రోహిత్ ఓపెనర్గా వస్తాడేమోనని అంతా భావించారు. అయితే, తానే మిడిలార్డర్లో వస్తానని రోహిత్ శర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పింక్ బాల్తోకాగా అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్. దీనిని పింక్ బాల్తో నిర్వహిస్తారు. ఇక ఇందుకోసం రోహిత్ సేన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ(3) విఫలం కాగా.. ఓపెనర్లు జైస్వాల్ 45, రాహుల్ 27(రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్
‘పింక్ బాల్’తో మ్యాచ్ అంత ఈజీ కాదంటున్నాడు టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్. క్రీజులోకి వెళ్లిన తర్వాతే దాని సంగతేమిటో పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ప్రస్తుతం భారత జట్టులో ఎనిమిది మందికి మాత్రమే డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్టు ఆడిన అనుభవం ఉంది. అందులోనూ విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఆస్ట్రేలియా గడ్డపై పింక్ బాల్తో ఆడారు.ఇక కేఎల్ రాహుల్కు ఇదే తొలి ‘పింక్ బాల్ టెస్టు’ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎర్ర బంతికి, గులాబీ మధ్య తేడా తనకు స్పష్టంగా కనిపిస్తోందని... డే అండ్ నైట్ టెస్టులో ‘పింక్ బాల్’ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రాహుల్ వ్యాఖ్యానించాడు. నాకు ఇది కొత్త అనుభవం‘బౌలర్ చేతినుంచి బంతి విడుదలయ్యే సమయంలో దానిని గుర్తించడం కష్టంగా ఉంది. ఎర్ర బంతితో పోలిస్తే చాలా గట్టిగా ఉండటంతో పాటు వేగంగా కూడా దూసుకొస్తోంది. ఫీల్డింగ్లో క్యాచ్ పట్టే సమయంలో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వింగ్ కూడా భిన్నంగా అవుతోంది కాబట్టి అదే మాకు పెద్ద సవాల్ కానుంది. నాకు ఇది కొత్త అనుభవం. క్రీజ్లోకి వెళ్లాకే దాని సంగతేమిటో చూస్తాను. ఎలాంటి స్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ చెప్పాడు.అయితే ప్రాక్టీస్ ద్వారా అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని కేఎల్ రాహుల్ అన్నాడు. ‘గులాబీ బంతి ఎలా స్పందిస్తోందో, ఆడటం ఎంత కష్టమో తెలుసుకునేందుకే మాకు కొంత సమయం పట్టింది. బౌలర్ చేతి నుంచి వచ్చే బంతిని గుర్తించడమే తొలి అడుగు. అప్పుడే సరైన షాట్ ఆడేందుకు తగిన అవకాశం ఉంటుంది. అందుకే మేమంతా ఎక్కువ బంతులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాం’ అని రాహుల్ వెల్లడించాడు. కాగా రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్తో వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పింక్ బాల్ టెస్టుకు వేదికైన అడిలైడ్ చేరుకున్న టీమ్ రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది.ఓపెనర్గా ఆడిస్తారా?ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టు కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో అతని ఓపెనింగ్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. అతను ఓపెనర్గా కొనసాగాలా లేక మిడిలార్డర్లో ఆడాలా అనేదానిపై చర్చ మొదలైంది. దీనిపై రాహుల్ స్పందించాడు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై అతడు మాట్లాడాడు. ‘అడిలైడ్ టెస్టులో నా బ్యాటింగ్ స్థానం ఏమిటనేది నాకు ఇప్పటికే చెప్పేశారు. అయితే మ్యాచ్ జరిగే వరకు దాని గురించి మాట్లాడవద్దని కూడా చెప్పారు. నేను దేనికైనా సిద్ధమే. ఏ స్థానమైనా తుది జట్టులో ఉండటమే నాకు అన్నింటికంటే ముఖ్యం. అవకాశం రాగానే బరిలోకి దిగి జట్టు కోసం ఆడటమే ప్రధానం. నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను.ఆరంభంలో తొలి 20–25 బంతులు కొంత ఇబ్బందిగా అనేపించేవి. డిఫెన్స్ ఆడాలా లేక అటాక్ చేయాలనే అని సందేహ పడేవాడిని. అయితే ఇన్నేళ్ల అనుభవం తర్వాత నా ఇన్నింగ్స్ను ఎలా నడిపించాలో స్పష్టత వచి్చంది. తొలి 30–40 బంతులు సమర్థంగా ఎదుర్కోగలిగితే అది ఓపెనింగ్ అయినా మిడిలార్డర్ అయినా అంతా ఒకేలా అనిపిస్తుంది. దానిపైనే నేను దృష్టి పెడతా’ అని రాహుల్ వెల్లడించాడు. ముందే చెప్పారుఇక టెస్టు సిరీస్లో ఓపెనింగ్ చేయాల్సి రావచ్చని తనకు ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందే టీమ్ మేనేజ్మెంట్ చెప్పిందని... అందుకే అన్ని రకాలుగా సన్నద్ధమయ్యానని రాహుల్ చెప్పాడు. సరిగ్గా పదేళ్ల క్రితం రాహుల్ ఇదే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ పదేళ్ల కెరీర్లో అతను 54 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో పలు గాయాలను అధిగమించిన అతడు... మానసికంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ‘పదేళ్లు కాదు...25 ఏళ్లు గడిచినట్లుగా అనిపిస్తోంది. ఇన్నేళ్లలో నాకు ఎదురైన గాయాలు, ఆటకు దూరమైన రోజులు అలా అనిపించేలా చేస్తున్నాయి. అయితే ఈ దశాబ్దపు కెరీర్ను ఆస్వాదించాననేది వాస్తవం. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నాచిన్నప్పుడు నాన్నతో కలిసి ఉదయమే టీవీలో టెస్టులు చూసిన రోజులను దాటి అదే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఆడే సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఆ సమయంలో నా బ్యాటింగ్, చేయాల్సిన పరుగుల గురించి ఆలోచనే రాలేదు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గుర్తుంచుకునే క్షణాలతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. ఇన్నేళ్లలో ఏ స్థానంలో అయిన ఆడగలిగేలా మానసికంగా దృఢంగా తయారయ్యా. వచ్చే పదేళ్ల కెరీర్ కోసం ఎదురు చూస్తున్నా’ అని రాహుల్ వివరించాడు.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
రోహిత్ వచ్చాడు!.. మరి మీ పరిస్థితి ఏంటి?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న పింక్ బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్లో తలమునకలైంది. ఇక ఈ టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో.. భారత తుదిజట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి.రాణించిన రాహుల్కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ గైర్హాజరైన నేపథ్యంలో.. పెర్త్లో ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఈ పేస్ బౌలర్ కెప్టెన్సీల్లో భారత్ కంగారూలను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ విజయంలో.. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77)లతో పాటు విరాట్ కోహ్లి(100 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఓపెనర్గా వస్తాడా? లేదంటే ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రాకతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అడిలైడ్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ ఓపెనర్గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తుదిజట్టులో చోటు ఉండాలి కదా!‘‘ముందుగా నాకు తుదిజట్టులో చోటు దక్కడమే ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతా. ఓపెనర్గా అయినా.. మిడిలార్డర్ బ్యాటర్గా అయినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా.మొదట్లో కాస్త కష్టంగా ఉండేది..ఇప్పటి వరకు నా కెరీర్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే, అది కూడా టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉండేది. తొలి 20 -25 బంతుల పాటు కఠినంగా తోచేది.ఇక ఇప్పటికి చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. తొలి 30- 40 బంతుల పాటు నిలదొక్కుకోగలిగితే.. ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్లో ముందుకు సాగడం తేలికవుతుంది’’ అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.విదేశీ గడ్డపై ఐదుకాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 54 టెస్టులు ఆడి 3084 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉండగా.. వీటిలో రెండు సౌతాఫ్రికా, రెండు ఇంగ్లండ్, ఒకటి ఆస్ట్రేలియాలో సాధించినవి. ఇక పెర్త్ టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్లో కీలకమైన అర్ధ శతకం(77)తో రాణించాడు.శుబ్మన్ గిల్ కూడా వచ్చేశాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మతో పాటు శుబ్మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మారటంతో పాటు.. ధ్రువ్ జురెల్పై వేటు పడే అవకాశం ఉంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
ఆసీస్తో రెండో టెస్ట్.. మిడిలార్డర్లో హిట్మ్యాన్..?
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్ బ్యాటింగ్కు వస్తాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. చాలామంది విశ్లేషకులు రోహిత్ మిడిలార్డర్లో రావడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. జట్టు అవసరాల దృష్ట్యా ఇదే కరెక్ట్ అని హిట్మ్యాన్ కూడా భావిస్తున్నట్లు సమాచారం.ఒకవేళ రోహిత్ మిడిలార్డర్లో రావాలనుకుంటే ఏ స్థానంలో బరిలోకి దిగాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జట్టు సమీకరణల దృష్ట్యా రోహిత్ ఐదు లేదా ఆరో స్థానాల్లో బరిలోకి దిగవచ్చు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే.. వన్డౌన్లో శుభ్మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో స్థానంలో రిషబ్ పంత్ బరిలో ఉంటారు.రోహిత్ గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. టెస్ట్ కెరీర్ ఆరంభంలో హిట్మ్యాన్ ఇదే స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. రోహిత్కు ఓపెనర్గా కంటే ఆరో స్థానంలో మంచి రికార్డు ఉంది. ఓపెనర్గా రోహిత్ 64 ఇన్నింగ్స్ల్లో 44.02 సగటున పరుగులు చేస్తే.. ఆరో స్థానంలో అతని సగటు 54.58గా ఉంది.కేఎల్ రాహుల్ను కదపకపోవడమే మంచిది..!తొలి టెస్ట్లో ఓపెనర్గా అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన కేఎల్ రాహుల్ను రెండో టెస్ట్లోనూ ఓపెనర్గా కొనసాగించడం మంచిది. రాహుల్ కోసం రోహిత్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయడం ఉత్తమమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పైగా రోహిత్ టెస్ట్ల్లో గత కొంతకాలంగా పెద్దగా ఫామ్లో లేడు.రెండో టెస్ట్లో భారత తుది జట్టు (అంచనా)..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా -
అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.మూడో ఆటగాడిగాసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడుఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్ ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 50 మ్యాచ్లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.కేకేఆర్ను చాంపియన్గా నిలపడంలోఐపీఎల్-2024లో కేకేఆర్ను చాంపియన్గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్ది కీలక పాత్ర. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్లో కేవలం 370 రన్స్ చేశాడు.చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు -
అతడు టాక్సిక్ బాస్.. ‘పంత్తో రాహుల్ ముచ్చట’? హర్ష్ గోయెంకా స్పందన వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్కు అనుకున్నంత ధర దక్కలేదు. భారీ అంచనాల నడుమ ఆక్షన్లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా మరీ అంతగా ఎగబడిపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో రాహుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు.అయితే, లోకల్ బాయ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బిడ్ వేయగా.. కోల్కతా నైట్ రైడర్స్ కూడా పోటీకి వచ్చింది. కానీ ధర కాస్త పెరగగానే ఈ రెండూ తప్పుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ కోసం పోటీపడ్డాయి. అలా ఆఖరికి రాహుల్ను ఢిల్లీ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.కాగా కేఎల్ రాహుల్ ఐపీఎల్-2022- 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్కు సారథ్యం వహించాడు. లక్నో ఫ్రాంఛైజీని అరంగేట్రంలో(2022)నే ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. మరుసటి ఏడాది కూడా టాప్-4లో నిలిపాడు. కానీ.. ఐపీఎల్-2024లో మాత్రం లక్నోకు వరుస పరాభవాలు ఎదురయ్యాయి.రాహుల్పై గోయెంకా ఆగ్రహంసీజన్ మొత్తంలో ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కేవలం ఏడు మాత్రమే గెలిచిన లక్నో.. 14 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.స్వేచ్ఛ ఉన్న చోటే ఆడాలనిఅందరి ముందే రాహుల్ను గోయెంకా తిట్టినట్లుగా ఉన్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్కు ముందు రాహుల్- లక్నోల బంధం తెగిపోయింది. ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. స్వేచ్ఛ ఉన్న చోట ఆడాలని అనుకుంటున్నట్లు పరోక్షంగా గోయెంకా వైపు మాటల బాణాలు విసిరాడు.ఈ నేపథ్యంలో మెగా వేలం సందర్భంగా సంజీవ్ గోయోంకా సైతం కేఎల్ రాహుల్కు కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. కాగా సౌదీ అరేబియాలో జరిగిన ఆక్షన్లో లక్నో.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ విషయం గురించి గోయెంకా మాట్లాడుతూ.. ‘‘మాకు కావాల్సిన ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పంత్లో ఉన్నాయి. అందుకే అతడి కోసం మేము ముందే రూ. 25- 27 కోట్లు పక్కన పెట్టుకున్నాం’’ అని పేర్కొన్నాడు.ఏదేమైనా వేలం ముగిసే సరికి పంత్, రాహుల్ల జట్లు తారమారయ్యాయి. రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్గా పంత్, పంత్ ప్లేస్లో ఢిల్లీ సారథిగా రాహుల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ వీళ్లిద్దరి ఫొటోతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అన్నీ బాగానే ఉంటాయి.. కానీరాహుల్ పంత్ చెవిలో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు.. ‘‘చూడు భాయ్.. కంపెనీ మంచిది.. డబ్బు కూడా బాగానే ఇస్తారు.. కానీ బాస్ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సంజీవ్ గోయెంకా అన్న హర్ష్ గోయెంకా స్పందించారు. ఇదేమిటబ్బా అన్నట్లుగా ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు.చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
ఆసీస్ను మట్టికరిపించిన టీమిండియా.. బుమ్రాకు చిరస్మరణీయం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందేప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్తో తమ ఆఖరి సిరీస్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్కు చేరాలంటే ఆసీస్పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.బాధ్యతలు తీసుకున్న బుమ్రాఅయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్ దళ నాయకుడు ఆసీస్ గడ్డపై కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.అప్పుడు ఆదుకున్న పంత్, నితీశ్ రెడ్డిపెర్త్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పూర్తిగా సీమర్లకే అనుకూలించిన పిచ్పై భారత బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(0) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు.అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26) పట్టుదలగా నిలబడినా.. వివాదాస్పద రీతిలో థర్డ్ అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి(5) సైతం నిరాశపరచగా.. రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించడం కలిసి వచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 150 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్. మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.చెలరేగిన బుమ్రా.. కుప్పకూలిన ఆసీస్అనంతరం తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా తన పేస్ పదునుతో చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా రాణించడంతో మొదటిరోజు కేవలం 67 పరుగులే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 104 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. బుమ్రాకు ఐదు, రాణాకు మూడు, సిరాజ్కు రెండు వికెట్లు దక్కాయి.జైస్వాల్ భారీ సెంచరీ.. శతక్కొట్టిన కోహ్లిఫలితంగా 46 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో యశస్వి భారీ శతకం(161) పూర్తి చేసుకోగా.. రాహుల్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో పెర్త్లో పట్టు బిగించిన టీమిండియా.. కోహ్లి అజేయ సెంచరీ(100)కి తోడు నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 38 నాటౌట్)కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచింది.534 పరుగుల భారీ లక్ష్యం.. చేతులెత్తేసిన ఆసీస్ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఉండగా.. రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. అయితే, ఆది నుంచే మరోసారి అటాక్ ఆరంభించిన భారత బౌలర్లు ఆసీస్ను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా జయభేరి మోగించి ఆసీస్కు సొంతగడ్డపై భారీ షాకిచ్చింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు కూల్చగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం నమోదు చేసింది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు👉వేదిక: పెర్త్ స్టేడియం, పెర్త్👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్👉టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 104 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు:487/6 డిక్లేర్డ్👉ఆసీస్ లక్ష్యం: 534 పరుగులు👉ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 238 ఆలౌట్👉ఫలితం: ఆసీస్పై 295 పరుగుల తేడాతో టీమిండియా భారీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(8 వికెట్లు)👉నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!Big wicket for India! Siraj with a beauty! #AUSvIND pic.twitter.com/NEJykx9Avj— cricket.com.au (@cricketcomau) November 25, 2024History Made Down Under! 🇮🇳✨Team India seals a memorable victory, becoming the FIRST team to defeat Australia at the Optus Stadium, Perth! 🏟💥A moment of pride, determination, and unmatched brilliance as #TeamIndia conquers new heights in the 1st Test & secures No.1 Spot in… pic.twitter.com/B61Ic9qLuO— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
IPL 2025: కేఎల్ రాహుల్కు భారీ షాక్..
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు షాక్ తగిలింది. భారీ ధరకు అమ్ముడుపోతాడనుకున్న రాహుల్ను నామమాత్రపు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ. 14 కోట్లకు రాహుల్ను ఢిల్లీ సొంతం చేసుకుంది.రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వచ్చిన రాహుల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్, కోల్కతా నైట్రైడర్స్ పోటీ పడ్డాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆర్సీబీ, కేకేఆర్ వెనక్కి తగ్గాయి. అయితే ఆఖరికి సీఎస్కే కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ ఢిల్లీ సొంతమయ్యాడు. అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పగ్గాలను అప్పగించే అవకాశముంది. కాగా ఈ వేలంలో ఆర్సీబీ రాహుల్ను కొనుగోలు చేస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ వేలంలో మాత్రం అతడికి కోసం ఆర్సీబీ ప్రయత్నించలేదు.కాగా ఐపీఎల్-2022 నుంచి 2024 వరకు రాహుల్ లక్నో కెప్టెన్గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్చేర్చాడు. కానీ అతడిని ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు లక్నో రిటైన్ చేసుకోలేదు. అందుకు జట్టు యాజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాలే కారణమని వార్తలు వినిపించాయి.కాగా ఐపీఎల్లో రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 132 మ్యాచ్లు ఆడిన రాహుల్.. 45.47 సగటుతో 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Yuzvendra Chahal: వేలంలో చహల్కు కళ్లు చెదిరే ధర.. జాక్పాట్ కొట్టేశాడు -
Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి
ఫ్రాంచైజీల చేతిలో ఉన్నవి రూ. 641.50 కోట్లు... కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు 204... అందుబాటులో ఉన్న ప్లేయర్లు 577 మంది... అత్యధిక మొత్తం ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రూ 110.50 కోట్లు. ఈ అంకెలు చాలు ఐపీఎల్ ఆటనే కాదు... వేలం పాట కూడా సూపర్హిట్ అవుతుందని! రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం వేడుకకు సర్వం సిద్ధమైంది. వేలం పాట పాడే ఆక్షనీర్ మల్లికా సాగర్, పది ఫ్రాంచైజీ యాజమాన్యాలు, హెడ్ కోచ్లు, విశ్లేషకులు వెరసి అందరి కళ్లు హార్డ్ హిట్టర్, వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్పైనే నెలకొన్నాయి. అంచనాలు మించితే రూ. పాతిక కోట్లు పలికే భారత ప్లేయర్గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు.వచ్చే సీజన్ ఐపీఎల్ ఆటకు ముందు వేలం పాటకు వేళయింది. ఆది, సోమవారాల్లో జరిగే ఆటగాళ్ల మెగా వేలంలో భారత స్టార్లతో పాటు పలువురు విదేశీ స్టార్లు ఫ్రాంచైజీలను ఆకర్శిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషభ్ పంత్పై పది ఫ్రాంచైజీలు కన్నేశాయి.మెగా వేలంలోనే మెగా ధర పలికే ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సారథ్యం, వికెట్ కీపింగ్, మెరుపు బ్యాటింగ్ ఇవన్నీ కూడా పంత్ ధరను అమాంతం పెంచే లక్షణాలు. దీంతో ఎంతైన వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.అతడితో పాటు భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఈ సీజన్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) విజయసారథి శ్రేయస్ అయ్యర్, సీమర్లు అర్ష్దీప్ సింగ్, సిరాజ్లపై రూ. కోట్లు కురవనున్నాయి.విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లివింగ్స్టోన్ (ఇంగ్లండ్), స్టార్క్, వార్నర్ (ఆస్ట్రేలియా), రబడా (దక్షిణాఫ్రికా)లపై ఫ్రాంచైజీలు దృష్టిపెడతాయి. గతేడాది వేలంపాట పాడిన ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ ఈ సారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. 116 మందిపైనే వేలం వెర్రి వేలానికి 577 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది జాబితాను సిద్ధం చేసినప్పటికీ మొదటి సెట్లో వచ్చే 116 మందిపైనే ఫ్రాంచైజీల దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాట రూ. కోట్ల మాట దాటడం ఖాయం. ఎందుకంటే ఇందులో పేరు మోసిన స్టార్లు, మ్యాచ్ను ఏకపక్షంగా మలుపుతిప్పే ఆల్రౌండర్లు, నిప్పులు చెరిగే సీమర్లు ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ముందు వరుసలో వస్తారు. దీంతో వేలం పాట రేసు రసవత్తరంగా సాగడం ఖాయమైంది.ఇక 117 నుంచి ఆఖరి దాకా వచ్చే ఆటగాళ్లపై వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే పోటీ ఉంటుంది. అంటే ఇందులో పది, పదిహేను మందిపై మాత్రమే ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. మిగతా వారంతా ఇలా చదివితే అలా కుదిరిపోవడం లేదంటే వచ్చి వెళ్లిపోయే పేర్లే ఉంటాయి. పది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మందినే ఎంపిక చేసుకుంటాయి.అర్ష్దీప్ అ‘ధర’హో ఖాయం అంతర్జాతీయ క్రికెట్లో గత మూడు సీజన్లుగా భారత సీమర్ అర్ష్దీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. 96 అంతర్జాతీయ టి20లాడిన అర్ష్దీప్ 96 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఈ ఏడాది సఫారీగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ డెత్ ఓవర్లలో సీనియర్ స్టార్ బుమ్రాకు దీటుగా బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన అతనిపై ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం.తరచూ పూర్తి జట్టును మారుస్తున్న పంజాబ్ కింగ్స్ వద్దే పెద్ద మొత్తంలో డబ్బులు (రూ.110 కోట్లు) ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్డమ్ను తీసుకొచ్చేందుకు పంత్ను, బౌలింగ్ పదును పెంచేందుకు అర్ష్దీప్ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ సానుకూలతలు పంజాబ్కే ఉన్నాయి.బట్లర్ వైపు ఆర్సీబీ చూపు పంజాబ్ తర్వాత రెండో అధిక పర్సు రూ. 83 కోట్లు కలిగివున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్పై రూ. కోట్లు వెచ్చించే అవకాశముంది. రాహుల్, అయ్యర్ సహా ఆల్రౌండర్ దీపక్ చహర్ కోసం పోటీపడనుంది.ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 73 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ.69 కోట్లు), లక్నో సూపర్జెయింట్స్ (రూ.69 కోట్లు), చెన్నై సూపర్కింగ్స్ (రూ. 55 కోట్లు), కోల్కతా నైట్రైడర్స్ (రూ. 51 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.45 కోట్లు), సన్రైజర్స్ హైదరాబాద్ (రూ. 45 కోట్లు), రాజస్తాన్ రాయల్స్ (రూ.41 కోట్లు)లు కూడా అందుబాటులో ఉన్న వనరులతో మేటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
IND VS AUS 1st Test: చరిత్ర సృష్టించిన జైస్వాల్-రాహుల్ జోడీ
పెర్త్ టెస్ట్లో భారత ఓపెనింగ్ జోడీ (యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 201 పరుగులు జోడించారు. ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డు గతంలో సునీల్ గవాస్కర్-క్రిస్ శ్రీకాంత్ జోడీ పేరిట ఉండేది. వీరిద్దరు 1986 సిడ్నీ టెస్ట్లో తొలి వికెట్కు 191 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన భారత ఓపెనింగ్ జోడీలు..కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ (201 పరుగులు)సునీల్ గవాస్కర్-కృష్ణమాచారి శ్రీకాంత్ (191)సునీల్ గవాస్కర్-చేతర్ చౌహాన్ (165)కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు తొలి సెషన్లో భారత స్కోర్ 267/1గా ఉంది. కేఎల్ రాహుల్ (77) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (141), దేవ్దత్ పడిక్కల్ (17) క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ మిచెల్ స్టార్క్కు దక్కింది. ప్రస్తుతం టీమిండియా 313 పరుగల ఆధిక్యంలో కొనసాగుతుంది.భారత్ తొలి ఇన్నింగ్స్-150 ఆలౌట్ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్-104 ఆలౌట్సిక్సర్తో సెంచరీ పూర్తి చేసిన యశస్విఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేశాడు. యశస్వికి ఆసీస్ గడ్డపై ఇది తొలి టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీతో యశస్వి దిగ్గజాల సరసన చేరాడు. తొలి ఆస్ట్రేలియా పర్యటనలోనే సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి తమ తొలి ఆసీస్ పర్యటనలోనే సెంచరీలు సాధించారు. -
పెర్త్పై పట్టు
బౌలర్ల అసమాన ప్రదర్శనకు... ఓపెనర్ల సహకారం తోడవడంతో పెర్త్ టెస్టుపై టీమిండియాకు పట్టు చిక్కింది. తొలి రోజు పేస్కు స్వర్గధామంలా కనిపించిన పిచ్పై రెండో రోజు భారత ఓపెనర్లు చక్కని సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ్రస్టేలియా బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోగా... జైస్వాల్, రాహుల్ అర్ధశతకాలతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మన పేసర్ల ధాటికి ఆ్రస్టేలియా 104 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్గా 218 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్... మూడోరోజు ఇదే జోరు కొనసాగిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో బోణీ కొట్టడం ఖాయం!పెర్త్: ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అన్న చందంగా... తొలి ఇన్నింగ్స్లో పేలవ షాట్ సెలెక్షన్తో విమర్శలు ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్లో సాధికారికంగా ఆడటంతో ఆ్రస్టేలియాతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కంగారూ పేసర్ల కఠిన పరీక్షకు భారత ఓపెనర్లు సమర్థవంతంగా ఎదురు నిలవడంతో పెర్త్ టెస్టులో బుమ్రా సేన పైచేయి దిశగా సాగుతోంది. ఓవర్నైట్ స్కోరు 67/7తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మిషెల్ స్టార్క్ (112 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (21) క్రితం రోజు స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగినా... స్టార్క్ మొండిగా పోరాడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా... హర్షిత్ రాణా 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (193 బంతుల్లో 90 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువవగా... తొలి ఇన్నింగ్స్లో సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరిన రాహుల్ (153 బంతుల్లో 62 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయతి్నంచినా ఆసీస్ ఈ జోడీని విడగొట్టలేకపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా ఓవరాల్గా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి రోజు 17 వికెట్లు కూలగా... రెండో రోజు మూడు వికెట్లు మాత్రమే పడ్డాయి. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారకపోయినా... భారత బ్యాటర్లు మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఈ మ్యాచ్లో భారత్కు భారీ ఆధిక్యం లభించనుంది. స్టార్క్ అడ్డుగోడలా.. తొలి రోజు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన భారత బౌలర్ల సహనానికి రెండోరోజు స్టార్క్ పరీక్ష పెట్టాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ను తలపిస్తూ తన డిఫెన్స్తో కట్టిపడేశాడు.ఓవర్నైట్ బ్యాటర్ అలెక్స్ కేరీని కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన బుమ్రా... టెస్టుల్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. నాథన్ లయన్ (5) కూడా త్వరగానే ఔట్ కాగా... చివరి వికెట్కు హాజల్వుడ్ (31 బంతుల్లో 7 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి స్టార్క్ చక్కటి పోరాటం కనబర్చాడు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ఎన్ని ప్రయోగాలు చేసినా సాధ్యపడలేదు. ఈ ఇద్దరు పదో వికెట్కు 110 బంతుల్లో 25 పరుగులు జోడించి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించారు. చివరకు హర్షిత్ బౌలింగ్లో స్టార్క్ కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో ఆ్రస్టేలియా ఇన్నింగ్స్కు తెరపడింది. ఫలితంగా భారత జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనింగ్ అజేయం తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ... రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు సత్తాచాటారు. పిచ్ కాస్త బ్యాటింగ్కు అనుకూలంగా మారిన మాట వాస్తవమే అయినా... భీకర పేస్తో విజృంభిస్తున్న కంగారూ బౌలర్లను కాచుకుంటూ జైస్వాల్, రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. క్లిష్టమైన బంతుల్ని డిఫెన్స్ ఆడిన ఈ జోడీ... చెత్త బంతులకు పరుగులు రాబట్టింది. జైస్వాల్ కచ్చితమైన షాట్ సెలెక్షన్తో బౌండరీలు బాదాడు. రాహుల్ డిఫెన్స్తో కంగారూలను కలవరపెట్టాడు. సమన్వయంతో ముందుకు సాగిన ఓపెనర్లిద్దరూ బుల్లెట్లలాంటి బంతుల్ని తట్టుకొని నిలబడి... గతితప్పిన బంతులపై విరుచుకుపడ్డారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్లో భారత్ 3.01 రన్రేట్తో పరుగులు చేసింది. ఈ క్రమంలో మొదట జైస్వాల్ 123 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కాసేపటికి రాహుల్ 124 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. టెస్టు క్రికెట్లో జైస్వాల్కు ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్సెంచరీ కాగా... ఆ తర్వాత గేర్ మార్చిన యశస్వి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన ఆసీస్ బౌలర్లు... మూడో రోజు తొలి సెషన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేదానిపై భారత ఆధిక్యం ఆధారపడి ఉంది. మైదానంలో బాగా ఎండ కాస్తుండటంతో... నాలుగో ఇన్నింగ్స్లో పగుళ్లు తేలిన పిచ్పై లక్ష్యఛేదన అంత సులభం కాకపోవచ్చు. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు పెర్త్ టెస్టుకు అభిమానులు ఎగబడుతున్నారు. రెండో రోజు శనివారం ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 32,368 మంది అభిమానులు వచ్చారు. ఈ స్టేడియం చరిత్రలో టెస్టు మ్యాచ్కు ఇంతమంది ప్రేక్షకుల హాజరు కావడం ఇదే తొలిసారి. ‘భారత్, ఆ్రస్టేలియా తొలి టెస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రెండు రోజుల్లో 63,670 మంది మ్యాచ్ను వీక్షించారు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక టెస్టు మ్యాచ్ (2006–07 యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మ్యచ్)కు అత్యధికంగా 1,03,440 మంది హాజరయ్యారు. ఇప్పుడు తాజా టెస్టులో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... ఇంకో 39,771 మంది తరలివస్తే ఆ రికార్డు బద్దలవనుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (సి) పంత్ (బి) బుమ్రా 21; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (సి) పంత్ (బి) హర్షిత్ రాణా 26; లయన్ (సి) రాహుల్ (బి) హర్షిత్ రాణా 5; హాజల్వుడ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 5; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 104. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59, 8–70, 9–79, 10–104. బౌలింగ్: బుమ్రా 18–6–30–5, సిరాజ్ 13–7–20–2, హర్షిత్ రాణా 15.2–3–48–3, నితీశ్ రెడ్డి 3–0–4–0, సుందర్ 2–1–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 90; రాహుల్ (బ్యాటింగ్) 62; ఎక్స్ట్రాలు 20; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 172. బౌలింగ్: స్టార్క్ 12–2–43–0, హాజల్వుడ్ 10–5–9–0, కమిన్స్ 13–2–44–0, మార్ష్ 6–0–27–0, లయన్ 13–3–28–0, లబుషేన్ 2–0–2–0, హెడ్ 1–0–8–0. -
జైశ్వాల్, రాహుల్కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటలో కూడా ఆతిథ్య జట్టుపై భారత్ పై చేయి సాధించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అద్బుతమైన ఆరంభం ఇచ్చారు.వీరిద్దరూ తొలి వికెట్కు 172 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మొదటి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపరిచిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. తొలిసారి ఆసీస్ గడ్డపై ఆడుతున్నప్పటకి తన అద్భుత ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియాతో తన తొలి టెస్టు సెంచరీకి ఈ ముంబైకర్ చేరువయ్యాడు. మరోవైపు రాహుల్ సైతం తన క్లాస్ను చూపిస్తున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్గా వచ్చిన కేఎల్.. తనను తను మరోసారి నిరూపించుకున్నాడు. మూడో రోజు ఆటలో వీరిద్దరూ లంచ్ సెషన్ వరకు క్రీజులో ఉంటే భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయం.సెల్యూట్ చేసిన కోహ్లి.. ఇక ఈ ఓపెనింగ్ జోడీ ప్రదర్శనకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫిదా అయిపోయాడు. రెండో రోజు ఆట అనంతరం ప్రాక్టీస్ కోసం మైదానంలో వచ్చిన కోహ్లి.. రాహుల్, యశస్వీలకు సెల్యూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ గడ్డపై భారత ఓపెనర్లు 100 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నెలకొల్పడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్!? Virat Kohli immediately came out for practice after the day's play and appreciated Jaiswal and KL Rahul #INDvAUS pic.twitter.com/kvG1caIUXp— Robin 𝕏 (@SledgeVK18) November 23, 2024 -
కేఎల్ రాహుల్ అవుట్పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్ను అవుట్గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
చెత్త అంపైరింగ్.. కేఎల్ రాహుల్ అసంతృప్తి.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు
పెర్త్ టెస్టులో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల భారత జట్టు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అంతేకాదు.. తాను అవుటైన తీరుకు రాహుల్ సైతం ఆశ్చర్యంతో పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ఆ ముగ్గురు విఫలంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(0), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(0), నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు!అయితే, టీమిండియా ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో బరిలోకి దిగాడు. అతడి బౌలింగ్లో రాహుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ అప్పీలు చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయినా సరే.. వెనక్కి తగ్గని ఆతిథ్య జట్టు రివ్యూకు వెళ్లింది.థర్డ్ అంపైర్ మాత్రంఈ క్రమంలో థర్డ్ అంపైర్ రాహుల్ను అవుట్గా ప్రకటించాడు. నిజానికి.. బంతి కీపర్ చేతుల్లో పడే సమయంలో వచ్చిన శబ్దం.. బ్యాట్ రాహుల్ ప్యాడ్కు తాకడం వల్ల వచ్చిందా? లేదంటే బంతిని తాకడం వల్ల వచ్చిందా అన్న అంశంపై స్పష్టత రాలేదు. కానీ రీప్లేలో వివిధ కోణాల్లో పరిశీలించకుండానే.. కేవలం స్నీకో స్పైక్ రాగానే థర్డ్ అంపైర్ రాహుల్ను అవుట్గా ప్రకటించడం గమనార్హం. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహంథర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు కారణమైంది. రాహుల్ సైతం తీవ్ర అసంతృప్తితో మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదొక చెత్త నిర్ణయం. పెద్ద జోక్ కూడా’’ అంటూ మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప ఫైర్ అయ్యాడు.మరోవైపు.. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం.. ‘‘ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం నాటౌట్. అయినా స్పష్టత లేకుండానే అతడి కాల్ను ఎలా తిరస్కరిస్తారు. బ్యాట్ ప్యాడ్ను తాకినట్లు కనిపిస్తున్నా.. ఇదేం విచిత్రం. ఇది ఒక మతిలేని నిర్ణయం. చెత్త అంపైరింగ్’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం విశేషం. కాగా రాహుల్ తొలి రోజు ఆటలో భాగంగా 74 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసి నిష్క్రమించాడు. చదవండి: 77 ఏళ్లలో ఇదే తొలిసారి.. అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకి కమిన్స్, బుమ్రా! Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
IND VS AUS 1st Test: అరుదైన క్లబ్లో కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్లో చేరాడు. టెస్ట్ల్లో 3000 పరుగుల మార్కును దాటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో రాహుల్ ఈ ఘనతను సాధించాడు. టెస్ట్ల్లో భారత్ తరఫున 3000 పరుగుల మార్కును తాకిన 26వ ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్కు (15921) దక్కుతుంది. ఓవరాల్గా చూసినా టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసింది సచినే. రాహుల్ తన 54వ టెస్ట్లో 3000 పరుగుల మార్కును దాటాడు. రాహుల్ 92 ఇన్నింగ్స్ల్లో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3007 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్ టెస్ట్లో ఆది నుంచి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్.. ఓ వివాదాస్పద నిర్ణయానికి ఔటయ్యాడు. రాహుల్ 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 51/4గా ఉంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, దేవ్దత్ పడిక్కల్ ఖాతా తెరవకుండానే ఔట్ కాగా.. విరాట్ కోహ్లి 5, రాహుల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. రిషబ్ పంత్ (10), ధృవ్ జురెల్ (4) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి సెషన్లో ఆసీస్ బౌలర్ల పూర్తి డామినేషన్ నడిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తప్పుచేసిందేమో అనిపించింది. పిచ్పై బౌన్స్తో పాటు అనూహ్యమైన స్వింగ్ లభిస్తుంది. -
Ind vs Aus: ఆ ఇద్దరు డకౌట్.. కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా
టెస్టుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. స్వదేశంలో సొంతగడ్డపై న్యూజిలాండ్తో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియాలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం ఐదు పరుగులకే కోహ్లి అవుటయ్యాడు.ఫలితంగా మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతోంది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీమర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్పై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తేలిపోయాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.మరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ సైతం డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి క్రీజులోకి రాగానే ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ.. భారత ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్ రెండో బంతికి కోహ్లి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు.ఐదు పరుగులకే అవుట్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి.. ఫ్రంట్ఫుట్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా చేతిలో పడింది. అలా షార్ట్ లెంగ్త్తో వచ్చిన బంతిని తప్పుగా అంచనా వేసి కోహ్లి వికెట్ పారేసుకున్నాడు. మండిపడుతున్న ఫ్యాన్స్మొత్తంగా పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న కారణంగా తనకు వరుస అవకాశాలు ఇస్తున్నా బాధ్యతాయుతంగా ఆడకపోతే ఎలా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారుకష్టాల్లో టీమిండియాఇదిలా ఉంటే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(0) విఫలం కాగా.. కేఎల్ రాహుల్(26) ఫర్వాలేదనిపించాడు. పడిక్కల్(0), కోహ్లి(5) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. తొలిరోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25).చదవండి: IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..! తుదిజట్లు ఇవేవిధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకుExtra bounce from Josh Hazlewood to dismiss Virat Kohli. pic.twitter.com/dQEG1rJSKA— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024We need to start a serious discussion now on kohli pic.twitter.com/WMmAlfdZ8h— Div🦁 (@div_yumm) November 22, 2024 -
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో తలమునకలైంది.అయితే, ఈ ఐదు మ్యాచ్ల కీలక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.శుబ్మన్ గిల్ స్థానంలో..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్మన్ గిల్ స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్కు జోడీగా కేఎల్ రాహుల్ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.కేరళకు చెందిన దేవ్దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.ఫస్ట్క్లాస్ కెరీర్లోనూఅయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో దేవ్దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్క్లాస్ కెరీర్లోనూ 24 ఏళ్ల పడిక్కల్కు మంచి రికార్డే ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!ఇప్పటి వరకు 40 మ్యాచ్లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్ను కూడా మిడిలార్డర్లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్కు తోడుగా కేఎల్ రాహుల్ను ఓపెనర్గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.ఓపెనర్గా రాహుల్ బెస్ట్కాగా టీమిండియా తరఫున ఓపెనర్గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు -
BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.నెట్స్లోనూఅనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.శుబ్మన్ గిల్కు గాయంఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్ను వీడాడు.పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే. అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్ బలహీనం! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొననుంది.మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
ఆసీస్తో టెస్టు సిరీస్.. టీమిండియాకు మరో భారీ షాక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయపడగా.. తాజాగా ఈ జాబితాలో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ చేరాడు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం పెర్త్లోని డబ్ల్యూఎసీఎ గ్రౌండ్లో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా తన మోచేయికి బంతి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ తన బ్యాటింగ్ను తిరిగి ప్రారంభించాడు.కానీ నొప్పి తగ్గకపోవడంతో రాహుల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే రాహుల్ గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.భారత ఓపెనర్ ఎవరు?కాగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నాడు. దీంతో జైశ్వాల్ జోడీగా కేఎల్ రాహుల్ను పంపించాలని టీమ్ మేనెజ్మెంట్ నిర్ణయించుకుంది. ఇప్పుడు రాహుల్ కూడా గాయం బారిన పడడంతో మేనెజ్మెంట్ ఆందోళన చెందుతుంది. ఒక వేళ రాహుల్ దూరమైతే అభిమన్యు ఈశ్వరన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశముంది.చదవండి: IND vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్ను హెచ్చరించిన రవిశాస్త్రి -
IPL 2025: అందుకే లక్నోకు గుడ్బై.. కారణం వెల్లడించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్తో తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.లక్నో సూపర్ జెయింట్స్ను వీడిన కేఎల్ రాహుల్సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్తో కేఎల్ రాహుల్ బంధం తెంచుకున్నట్లు వెల్లడైంది. అయితే, ఇందుకు గల కారణాన్ని ఈ టీమిండియా స్టార్ తాజాగా బయటపెట్టాడు. ‘‘నా ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న ఆప్షన్లను పరిశీలించాలని భావిస్తున్నా. ముఖ్యంగా ఎక్కడైతే నాకు స్వేచ్ఛగా ఆడే వీలు ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదుఅక్కడి వాతావరణం కాస్త తేలికగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అందుకే మన మంచి కోసం మనమే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు’’ అని కేఎల్ రాహుల్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా 2022లో లక్నో ఫ్రాంఛైజీ ఐపీఎల్లో అడుగుపెట్టింది. తమ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను నియమించుకుంది.కెప్టెన్గా రాణించినాఅయితే, యాజమాన్యం అంచనాలకు తగ్గట్లుగానే రాహుల్.. లక్నోను అరంగేట్ర సీజన్లోనే ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. ఆ తర్వాతి ఎడిషన్లోనూ టాప్-4లో నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం లక్నో ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్లకు గానూ.. ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే.. లక్నో జట్టు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్ సందర్భంగా.. రాహుల్ను అందరి ముందే తిట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కెప్టెన్పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాహుల్కు ఘోర అవమానంఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అతడు నష్టనివారణ చర్యలే చేపట్టి.. రాహుల్ను తన ఇంటికి ఆహ్వానించి ఫొటోలు విడుదల చేశాడు. కానీ.. అందరి ముందు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయిన రాహుల్ ఆ జట్టును వీడినట్లు అతడి తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇక టీమిండియా టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా తాను ఇకపై అడుగులు వేస్తానని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా లక్నో తరఫున కేఎల్ రాహుల్ 2022లో 616 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో కలిపి 23 మ్యాచ్లు ఆడి 800 రన్స్ స్కోరు చేశాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్లు ఆడి 2265 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!? -
IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్కు రూ.20 కోట్లు! ఆర్సీబీ కెప్టెన్గా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లలో తమ సారథిగా వ్యవహరించిన రాహుల్ను లక్నో ఈసారి రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ కర్ణాటక బ్యాటర్-కీపర్ నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో వేదికగా జరగనున్న మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులు రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్-2025లో సీజన్లో కేఎల్ ఆర్సీబీ తరపున ఆడితే చూడాలని ఆశపడుతున్నారు. కాగా గతంలో రాహుల్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రాహుల్కు రూ.20 కోట్లు!ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో మాక్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చాలా మంది అభిమానులు పాల్గోన్నారు. కేఎల్ రాహుల్ను సొంతం చేసుకోవడానికి రూ. 20 కోట్లు వెచ్చిందేందుకు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. మరికొంతమంది ఫ్యాన్స్ రిషబ్ పంత్ కోసం పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆర్సీబీ కెప్టెన్గా రాహుల్?అయితే ఆర్సీబీ యాజమాన్యం కూడా రాహుల్పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. తమ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ను వేలంలోకి ఆర్సీబీ విడిచిపెట్టింది. విరాట్ కోహ్లి,యశ్ దయాల్, పాటిదార్ను మాత్రం బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ పర్స్లో ప్రస్తుతం రూ. 83 కోట్లు ఉన్నాయి.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల -
వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-‘ఎ’ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. బౌలర్లు మెరుగ్గానే రాణించినా.. బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఆసీస్-‘ఎ’ చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది.వారు ముందుగానే ఆస్ట్రేలియాకుకాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బీజీటీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో బీజీటీకి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులను బీసీసీఐ ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది.రాహుల్తో పాటు జురెల్ కూడారుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్-‘ఎ’ జట్టుకు కూడా వీరిని ఎంపిక చేసింది. కంగారూ గడ్డపై పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా.. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ను సైతం భారత్-‘ఎ’ రెండో టెస్టుకు అందుబాటులో ఉండేలా అక్కడకు పంపింది.సానుకూలాంశాలు ఆ రెండేఅయితే, ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక టెస్టుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. తొలి టెస్టులో ఏడు, రెండో మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్ను కోల్పోయింది. ఇక ఈ రెండు మ్యాచ్లలో సానుకూలాంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. మొదటి టెస్టులో సాయి సుదర్శన్ శతకం(103).. రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ అద్భుత హాఫ్ సెంచరీలు(80, 68).వరుసగా నాలుగు సెంచరీలతో సత్తా చాటిఇక ఈ సిరీస్లో అత్యంత నిరాశపరిచింది ఎవరంటే మాత్రం అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్(4, 10). రాహుల్ సంగతి పక్కన పెడితే.. అభిమన్యుపైనే ఈ సిరీస్ ప్రభావం గట్టిగా పడనుంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలు బాదిన ఈ బెంగాల్ బ్యాటర్ను సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బీజీటీ ఆడబోయే జట్టుకు ఎంపిక చేశారు.రోహిత్ స్థానంలో ఆడించాలనే యోచన.. కానీతొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడన్న వార్తల నడుమ.. అభిమన్యునే యశస్వి జైస్వాల్తో ఓపెనర్గా దించుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఆసీస్-‘ఎ’ జట్టుతో మ్యాచ్లలోనే అభిమన్యు తీవ్రంగా నిరాశపరిచాడు.దీంతో బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.అతడు ఫెయిల్ అయినా ఓపెనర్గానేఆసీస్-‘ఎ’తో మ్యాచ్లో విఫలమైనప్పటికీ అభిమన్యు ఈశ్వరన్ బీజీటీ మొదటి టెస్టులో టీమిండియా ఓపెనర్గా దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆసీస్- ‘ఎ’ జట్టుతో రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ.. ‘‘మరోసారి మనవాళ్లు ఫెయిల్ అయ్యారు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్.. అంతా చేతులెత్తేశారునిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు ఆటగాళ్లను సన్నద్ధం చేయడానికి బీసీసీఐ వాళ్లను అక్కడికి పంపింది. కానీ.. వాళ్లు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ సిరీస్లో అభిమన్యు ఈశ్వరన్ విఫలమైనా.. అతడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లలో మాత్రం ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. దారుణంగా విఫలంఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఆసీస్-‘ఎ’తో సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లో అభిమన్యు చేసిన పరుగులు వరుసగా.. 7, 12, 0, 17. ఇదిలా ఉంటే.. నవంబరు 22 నుంచి ఆసీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో -
గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. మా అందమైన ఆశీర్వాదం 2025లో రాబోతుందని రాహుల్, అతియా జంట తమ పోస్ట్లో రాసుకొచ్చారు. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. వీరికి బాలీవుడ్ మరియు క్రికెట్ సర్కిల్స్లో అందమైన, అన్యూన్యమైన జంటగా పేరుంది. రాహుల్ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty)కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. రాహుల్.. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. రాహుల్ ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనలు చేస్తూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో రాహుల్ భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. రాహుల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో రాహుల్ రెండు ఇన్నింగ్స్ల్లో నాలుగు, పది పరుగులు చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్కు ఆట పరంగా ఏదీ కలిసి రావడం లేదు. రాహుల్ను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కూడా వేలానికి వదిలేసింది. ఇదిలా ఉంటే, భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడని తెలుస్తుంది. రోహిత్ భార్య రితక డెలివరీకి సిద్దంగా ఉండటంతోనే రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్కు దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. -
ఏంటి రాహుల్.. మరీ ఇంత చెత్తగా అవుటవుతావా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఇప్పుడు కీలకమైన సెకెండ్ ఇన్నింగ్స్లో అదే తీరును కనబరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో రాహుల్ వినూత్న రీతిలో తన వికెట్ను కోల్పోయాడు.అసలేం జరిగిందంటే?భారత్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్పిన్నర్ కోరి రోకిసియోలి తొలి బంతిని రాహుల్ ఓవర్ ది వికెట్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. కానీ బంతి లెగ్ సైడ్ నుండి టర్న్ అవుతుండడంతో రాహుల్ తన ప్యాడ్లతో డిఫెండ్కు ప్రయత్నించాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్ను గిరాటేసింది. దీంతో రాహుల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి రాహుల్ ఇంత చెత్తగా అవుటవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(19), నితీష్ కుమార్ రెడ్డి(9) పరుగులతో ఉన్నారు. "Don't know what he was thinking!"Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz— cricket.com.au (@cricketcomau) November 8, 2024 -
Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్కు వచ్చారు.తొలిరోజు ఇలాఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది. ఈ దశలో దేవ్దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్కు 53 పరుగులు జోడించాక పడిక్కల్ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్ను ఆలౌట్కు సిద్ధం చేశాడు. ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్స్టర్ (3/19) భారత్ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.ఆసీస్ 223 ఆలౌట్ఈ క్రమంలో 53/2 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.మరోసారి విఫలమైన భారత బ్యాటర్లుఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య -
BGT 2024: సర్ఫరాజ్ ఖాన్పై వేటు.. మిడిలార్డర్లో అతడు ఫిక్స్!
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. సహచర ఆటగాళ్లంతా విఫలమైన వేళ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సెంచరీ చేజారినా తన విలువైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.కివీస్తో టెస్టులలో నో ఛాన్స్కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ఎంపిక చేసిన జట్టులో ధ్రువ్ జురెల్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్ బరిలోకి దిగగా.. జురెల్ను పక్కనపెట్టారు.అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులోఇక కివీస్తో స్వదేశంలో మూడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయి 3-0తో వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్తో పాటు ధ్రువ్ జురెల్ను ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది. బీజీటీ కంటే ముందు ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టులో వీరిద్దరిని చేర్చి.. వారి ఆట తీరును పరిశీలిస్తోంది.161 పరుగులకే ఆలౌట్ఇక ఇప్పటికే ఆసీస్-ఎ, భారత్-ఎ జట్ల మధ్య తొలి మ్యాచ్లో రుతు సేన ఓడిపోగా.. గురువారం మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. నిజానికి భారత్ ఈ మాత్రం స్కోరు చేయడానికి కారణం జురెల్.టాపార్డర్ కుప్పకూలి 11 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ.. జురెల్ ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ వికెట్ కీపర్ 80 పరుగులు(186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. సహచరులంతా ఆసీస్ బౌలర్ల ధాటికి.. పెవిలియన్కు క్యూ కడితే.. తాను మాత్రం పట్టుదలగా నిలబడి.. జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.సర్ఫరాజ్ ఖాన్పై వేటు వేసిఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ధ్రువ్ జురెల్ను కొనియాడుతున్నారు. బీజీటీలో మిడిలార్డర్లో అతడిని తప్పక ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో జురెల్కు చోటు దక్కడం అంత సులభమేమీ కాదు.వికెట్ కీపర్గా పంత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి.. మిడిలార్డర్లో ఎవరో ఒకరిపై వేటు పడితేనే జురెల్కు లైన్ క్లియర్ అవుతుంది. కివీస్ సిరీస్లో ప్రదర్శనను బట్టి చూస్తే సర్ఫరాజ్ ఖాన్ను తప్పించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కివీస్తో తొలి టెస్టులో భారీ శతకం(150) సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ముంబై బ్యాటర్ వరుసగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆరో స్థానంలో సర్ఫరాజ్కు బదులు జురెల్ ఆసీస్ గడ్డపై బీజీటీలో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయిబోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆర్ జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్కు గత మ్యాచ్లో శతకం బాదిన వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు శుభారంభం లభించలేదు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రాహుల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు.ఏమైంది రాహుల్?రాహుల్ తాజాగా న్యూజిలాండ్తో సిరీస్లోనూ విఫలమయ్యాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో నిరాశపరచడంతో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ కూడా చోటు దక్కింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అలవాటు పడేందుకు రాహుల్తో పాటు ధ్రువ్ జురెల్ ప్రధాన జట్టుకంటే ముందే ఆస్ట్రేలియాకు భారత జట్టు మేనెజ్మెంట్ పంపింది. కానీ అక్కడ కూడా రాహుల్ తనకు దక్కిన అవకాశాన్ని అంది పుచ్చుకోలేకపోయాడు. నవంబర్ 22 నుంచి ఆసీస్తో జరిగే తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్ను ఓపెనర్గా పంపాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్లో రాహుల్ ఓపెనర్గా దిగాడు. కానీ రాహుల్ మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "మరి నీవు మారావా రాహుల్, ఎక్కడికి వెళ్లినా అంతేనా? అంటూ ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.కష్టాల్లో భారత్..ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ జట్టు కేవలం 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ మైఖల్ నీసర్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు. అతడితో పాటు వెబ్స్టార్ రెండు, స్కాట్ బోలాండ్ ఒక్క పడగొట్టాడు. భారత బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(52 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.చదవండి: BAN vs AFG: ఘజన్ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన అఫ్గాన్ -
IPL 2025: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్పాట్ తగలనుందా?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా ఐపీఎల్–2025 వేలం జరగనుండగా... ఇందులో భారత్ నుంచి 23 మంది ప్లేయర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో పాల్గొననున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు... చాలా రోజుల నుంచి జాతీయ జట్టుకు దూరమైన ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి వాళ్లూ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ కూడా తమ కనీస ధరను రెండు కోట్లుగా నమోదు చేసుకోవడం విశేషం. శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకుంటున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, యుజువేంద్ర చహల్ కూడా ఉన్నారు. మూడేళ్ల కోసం చేపడుతున్న ఈ మెగా వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కనీస ధర నిర్ణయించుకునే అవకాశం ఆటగాళ్లదే కాగా... ఒక్కో జట్టు గరిష్టంగా 25 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అండర్సన్ తొలిసారి... టెస్టు క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ ఈసారి ఐపీఎల్ వేలానికి దూరమయ్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలిసారి ఐపీఎల్ వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. 42 ఏళ్ల అండర్సన్ ఈ ఏడాదే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్గా రికార్డుల్లోకి ఎక్కిన అండర్సన్... టి20 మ్యాచ్ ఆడి ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. అండర్సన్ చివరిసారిగా 2014లో ఈ ఫార్మాట్లో మ్యాచ్ ఆడాడు. అండర్సన్ తన కనీస ధరను రూ. 1 కోటీ 25 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. గత వేలంలో అత్యధిక ధర (రూ. 24 కోట్ల 50 లక్షలు) పలికిన ప్లేయర్గా ఘనత సాధించిన ఆ్రస్టేలియా పేసర్ మిచెల్ స్టార్క్తో పాటు, మినీ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2023లో చివరిసారి ఐపీఎల్లో పాల్గొన్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే ధరతో వేలంలో పాల్గొననున్నాడు. రూ. 75 లక్షలతో సర్ఫరాజ్ గత వేలంలో అమ్ముడిపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్తో పాటు... పేలవ ఫామ్తో ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈసారి వేలంలో రూ. 75 లక్షల ప్రాథమిక ధరతో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వేలంలో పేర్లు నమోదు చేసుకున్న వారిలో 1165 మంది భారతీయ ప్లేయర్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా 91 మంది ప్లేయర్లు పోటీలో ఉండగా... ఆ్రస్టేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్ నుంచి 52 మంది, న్యూజిలాండ్ నుంచి 39 మంది, వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కో ప్లేయర్ తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇటలీ నుంచి తొలి ఎంట్రీ... ఇటలీ పేసర్ థామస్ డ్రాకా ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా... ఈ ఏడాది టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆకట్టుకున్న భారత సంతతికి చెందిన అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్పై అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్న తొలి ఇటలీ ప్లేయర్గా డ్రాకా నిలిచాడు. ఇటలీ తరఫున ఇప్పటి వరకు నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన 24 ఏళ్ల డ్రాకా... గ్లోబల్ టి20 కెనడా టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ టోరీ్నలో 11 వికెట్లు పడగొట్టిన డ్రాకా... ఆల్రౌండర్ల జాబితాలో ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో ఐపీఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఐఎల్ టి20 లీగ్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఎమిరేట్స్ జట్టుకు డ్రాకా ఎంపికయ్యాడు. ఇక అండర్–19 స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత మెరుగైన ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడి అక్కడ అటు ఉద్యోగంతో పాటు ఇటు క్రికెట్లో రాణిస్తున్న నేత్రావల్కర్ కూడా రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి రానున్నాడు. -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్పై దృష్టి -
కేఎల్ రాహుల్పై దృష్టి
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ను ఒత్తిడిలోనే ఉంచే ప్రయత్నం చేస్తామని... ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 22 నుంచి ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ్రస్టేలియా ‘ఎ’తో భారత ‘ఎ’ జట్టు ఒక అనధికారిక టెస్టు ఆడి ఓడిపోగా... రెండో మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఆడేందుకు రాహుల్తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ముందుగానే ఆ్రస్టేలియాలో అడుగు పెట్టారు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న రాహుల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్కు ముందు ఈ మ్యాచ్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్తో తొలి టెస్టులో మాత్రమే ఆడి తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్... బోర్డర్–గావస్కర్ సిరీస్లోని మొదటి టెస్టు కోసం తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలరీత్యా తొలి టెస్టుకు అందుబాటులో లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ రాహుల్కే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలో బోలాండ్ మాట్లాడుతూ.. ‘గతంలో రాహుల్కు బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత స్వదేశంలో అతడికి బౌలింగ్ చేయనున్నా. అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్. అతడిని ఒత్తిడిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయడం లేదని బోలాండ్ పేర్కొన్నాడు. ‘ఇక్కడి పిచ్లపై బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ్రస్టేలియా పర్యటన కోసం టీమిండియా జట్టును ఎంపిక చేసుకునే విధానం భారత్తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని అన్నాడు. 2015లో తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన రాహుల్... సిడ్నీ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది డిసెంబర్లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై చివరిసారి సెంచరీ చేసిన రాహుల్... ఆ తర్వాత 9 ఇన్నింగ్స్ల్లో కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడు. -
మై క్రేజీ బేబీ: భార్యకు కేఎల్ రాహుల్ బర్త్డే విషెస్ (ఫొటోలు)
-
బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు?
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కివీస్పై చేసిన తప్పిదాలను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పునరావృతం చేయకూడదని గంభీర్ అండ్ కో భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆసీస్తో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లను వారం రోజుల ముందుగానే ఆస్ట్రేలియా పంపాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టుతో వీరిద్దరూ బుధవారం(నవంబర్ 6) కలవనున్నారు. నవంబర్ 7 నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్, జురెల్ భారత్-ఎ తరపున ఆడే ఛాన్స్ ఉంది.కాగా స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్కు ఎంపికైన రాహుల్ కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో మిగితా రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టనున్నాడు. రాహుల్కు ఆసీస్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్ 20.77 సగటుతో కేవలం 187 పరుగులు మాత్రమే చేశాడు.జురెల్ ఇదే తొలిసారి.. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం జురెల్కు లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే జురెల్ను కూడా జట్టు మేనేజ్మెంట్ ఆస్ట్రేలియాకు పంపింది. ఇక నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: Ind vs Aus: కివీస్ చేతిలో టీమిండియా వైట్వాష్.. ఆసీస్ స్టార్ కామెంట్స్ వైరల్ -
IPL 2025 Retention List: కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు ఇవే..!
ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగా ఢిల్లీ (రిషబ్ పంత్), లక్నో (కేఎల్ రాహుల్), కేకేఆర్ (శ్రేయస్ అయ్యర్), పంజాబ్ కింగ్స్ (శిఖర్ ధవన్), ఆర్సీబీ (ఫాఫ్ డుప్లెసిస్) తమ కెప్టెన్లను వేలానికి వదిలేశాయి. నవంబర్ చివరి వారంలో జరుగబోయే మెగా వేలంలో ఈ ఐదుగురు కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కారణాలు ఏవైనా ఆయా ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలానికి వదిలేయడం ఆసక్తికరంగా మారింది.కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..కోల్కతా నైట్రైడర్స్రింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లుపంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు -
Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్కు హెడ్కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాటర్ ఆటతీరు పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో అన్న అంశాలతో తమకు సంబంధం లేదని.. జట్టులోని ఆటగాళ్లకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాడు. అద్భుత శతకంకాగా భారత టెస్టు జట్టు మిడిలార్డర్లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్గా ఉన్న శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడుతుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదోస్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లతో సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నాడు. అయితే, ఇప్పటికే అయ్యర్ జట్టుకు దూరం కాగా.. రాహుల్, సర్ఫరాజ్ పేర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టుకు గిల్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ అద్భుత శతకం(150)తో కదం తొక్కగా.. రాహుల్ కేవలం 12 పరుగులకే పరిమితయ్యాడు.ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం కివీస్తో మొదలుకానున్న రెండో టెస్టుకు జట్టు ఎంపిక గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ రాహుల్ను విమర్శిస్తూ.. సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది విశ్లేషకులు. ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు.ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో..‘‘ప్లేయింగ్ ఎలెవన్ను సోషల్ మీడియా నిర్ణయించలేదు. విశ్లేషకులు, నిపుణులు ఏమనుకుంటున్నారోనన్న విషయాలతోనూ మాకు సంబంధం లేదు. టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదే ముఖ్యం. ఇటీవల బంగ్లాదేశ్తో మ్యాచ్లో కాన్పూర్ పిచ్పై పరుగులు రాబట్టడం కష్టమైనా కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాడు.యాజమాన్యం అతడికి అండగానే ఉందితన ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి అండగానే ఉంది’’ ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్లో గౌతీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు గిల్ తిరిగి వస్తున్నాడు కాబట్టి.. రాహుల్కు ఛాన్స్ ఇచ్చి, సర్ఫరాజ్ను తప్పిస్తారనే వాదనలు బలపడుతున్నాయి.ఇంతకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సైతం మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్కు గంభీర్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో తొలి టెస్టు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త పంచుకున్న విషయం తెలిసిందే.తండ్రిగా ప్రమోషన్తాను తండ్రినయ్యానని.. తన భార్య మగబిడ్డను ప్రసవించిందని ఈ ముంబైకర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్కు లైన్క్లియర్ చేసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పర్యాటక న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాపై మొదటి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ టీమ్కు కొత్త కెప్టెన్ -
కేఎల్ రాహుల్ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్కు 14 కోట్లు..?
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్ను రిలీజ్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ రాహుల్ స్ట్రయిక్రేట్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనకు రాహుల్ స్ట్రయిక్ రేట్ ప్రధాన కారణమని మేనేజ్మెంట్ భావిస్తుందట.రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్సీ పగ్గాలు నికోలస్ పూరన్కు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీ యాజమాన్యం పూరన్తో పాటు మరో ఇద్దరిని రిటైన్ చేసుకోనుందని సమాచారం. రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ల కోసం భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మయాంక్కు పారితోషికం కింద దాదాపు రూ. 14 కోట్లు దక్కవచ్చని అంచనా. అన్క్యాప్డ్ ప్లేయర్ల కోటాలో ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్లను కూడా రిటైన్ చేసుకోనున్నట్లు సమాచారం.కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూడు సీజన్ల పాటు కేఎల్ రాహుల్ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరిన లక్నో.. ఈ ఏడాది లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు -
Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
న్యూజిలాండ్తో సిరీస్ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా శుబ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్నే ఎంచుకుంటాం.ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్డౌన్లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు. -
IND vs NZ: పంత్కు గాయం.. కేఎల్ రాహుల్కు లక్కీ ఛాన్స్?
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో అనుహ్యంగా ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా భారత్-కివీస్ మధ్య సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కివీస్ను ఓడించి సిరీస్ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది.అయితే ఈ పుణే టెస్టుకు భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్పై వేటు పడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్టులో రాహుల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 12 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడిని సెకెండ్ టెస్టుకు పక్కన పెట్టాలని పలువురు మాజీలు కూడా డిమాండ్ చేస్తున్నారు.రాహుల్కు మరో ఛాన్స్..?అయితే భారత జట్టు మెనెజ్మెంట్ మాత్రం రాహుల్కు మరో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తుందంట. మొదటి టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. పుణే టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.ఈ క్రమంలో రాహుల్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించి, పంత్ స్ధానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ను ఆడించాలని హెడ్కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ రెండో టెస్టులో కూడా రాహుల్ విఫలమైతే కచ్చితంగా మూడో టెస్టుకు వేటు పడే ఛాన్స్ ఉంది.తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: BAN vs SA: చరిత్ర సృష్టించిన రబాడ.. ప్రపంచ రికార్డు బ్రేక్ -
సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్
టీమిండియా మిడిలార్డర్లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్కు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ను జట్టులో కొనసాగిస్తూనే.. . రాహుల్ స్థానంలో ఇతడిని ఆడించాలంటూ ఓ ‘దేశవాళీ క్రికెట్ హీరో’పేరు మనోజ్ తివారీ సూచించాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 53 టెస్టులు ఆడి 2981 పరుగులు చేశాడు. సగటు 33.88. ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్తో తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయాడు.తొలి ఇన్నింగ్స్లో డకౌట్ సొంతగడ్డ బెంగళూరులో కివీస్తో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 12 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రాహుల్ ఆట తీరును విమర్శించాడు. ‘‘91 ఇన్నింగ్స్ ఆడి కేవలం 33.88 సగటుతో బ్యాటింగ్ చేసే వాళ్లు మనకు అవసరమా?స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీభారత్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాంటపుడు కేఎల్ రాహుల్ స్థానం గురించి మనం ఎందుకు పునరాలోచించకూడదు? టెస్టు మ్యాచ్లో సర్ఫరాజ్ను నాలుగో స్థానంలో పంపించాలి. నా అభిప్రాయం ప్రకారం.. అభిమన్యు ఈశ్వరన్ను కూడా మిడిలార్డర్లో ట్రై చేస్తే బాగుంటుంది.అతడిపై ఓపెనర్ అనే ట్యాగ్ వేసి పక్కనపెడుతున్నారు. అతడు స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీ మిడిలార్డర్లో ప్రయత్నించి చూస్తే తప్పేంటి? గత కొంతకాలంగా అతడు సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు’’ అని మనోజ్ తివారీ క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మనోజ్ మాదిరే దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ ఇటీవల ఫస్ట్క్లాస్ క్రికెట్లో వరుసగా నాలుగు శతకాలు బాది జోరుమీదున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో బెంగళూరు టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తదుపరి ఇరుజట్ల మధ్య అక్టోబరు 24న రెండో టెస్టు మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టును ఇటీవల ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో అభిమన్యుకు చోటు దక్కింది.చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..? -
ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం!
క్రికెటర్ కేఎల్ రాహుల్పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా అతడి ఆట తీరులో మార్పు రావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేస్తున్నారు!ఇక రాహుల్ కోసం ఇప్పటికే ‘ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేసారని.. ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం చేయవద్దంటూ సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో తాను ఆడిన గత రెండు మ్యాచ్లలో చేసిన స్కోర్లు 16, 22*, 68. ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో ఈ మేర పరుగులు రాబట్టాడు.దారుణంగా విఫలంఈ క్రమంలో తాజాగా న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో పన్నెండు పరుగులకే పెవిలియన్ చేరాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. కివీస్కు కేవలం 107 పరుగుల లక్ష్యం విధించిన భారత్.. ఆఖరి రోజైన ఆదివారం నాటి ఆటలో ప్రత్యర్థిని 105 పరుగులకే ఆలౌట్ చేయాలి. లేదంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పదు.సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులతో దుమ్ములేపాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ సేన ఇంకా పోటీలో నిలవగలగడానికి కారణం సర్ఫరాజ్ ఇన్నింగ్స్ అనడంలో సందేహం లేదు.ఇకనైనా అతడికి అవకాశాలు ఇవ్వండిఇక తుదిజట్టు మిడిలార్డర్లో చోటు కోసం సర్ఫరాజ్ కేఎల్ రాహుల్తో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ గైర్హాజరీ వల్ల విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఆడగా.. సర్ఫరాజ్కు అనుకోకుండా ఛాన్స్వచ్చింది. లేదంటే.. రాహుల్ కోసం అతడిని డ్రాప్ చేసేవారే! ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ రాహుల్ను ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్కు ఇన్నాళ్లూ అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు.చదవండి: ‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Harsha : Do you remember last time Kl Rahul saved India from a collapse?Ravi : No, because KL Rahul himself is part of the collapse. pic.twitter.com/6LC5UNmI98— mufaddla parody (@mufaddl_parody) October 19, 2024 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
IND Vs NZ: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం
క్రికెటర్ కేఎల్ రాహుల్పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఉపయోగపడే పనులేవీ చేతకావా అంటూ మండిపడుతున్నారు. బ్యాటింగ్తో పాటు.. ఫీల్డింగ్లోనూ విఫలం కావడాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా రోహిత్ సేన న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది.వర్షం కారణంగాఇందులో భాగంగా బెంగళూరు వేదికగా బుధవారం మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా గురువారం మొదలైంది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ కారణంగా 46 పరుగులకే ఆలౌట్ అయింది.పరుగుల ఖాతా తెరవకుండానేభారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ విలియం రూర్కీ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కేఎల్ రాహుల్.. అజాజ్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈజీ క్యాచ్ మిస్ చేసిన రాహుల్ఇక ఇలా బ్యాటింగ్లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈజీ క్యాచ్ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతి.. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ బ్యాట్ను తాకి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి, రాహుల్ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది.అయితే, బంతి తన వైపునకే వస్తున్నా రాహుల్ క్యాప్ పట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. దీంతో రాహుల్ చేతిని తాకి మిస్ అయిన బాల్.. బౌండరీ వైపు వెళ్లింది. దీంతో కివీస్ ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి. రోహిత్ శర్మ ఆగ్రహంఈ క్రమంలో బౌలర్ సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనుకాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ‘‘అసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్ కావాలనే క్యాచ్ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.చదవండి: NZ vs IND 1st Test: రోహిత్ శర్మ తప్పు చేశాడా?You can't convince me that kl Rahul didn't drop this catch intentionally.Rohit Sharma is surrounded by snakes. 💔pic.twitter.com/ASh7qzHbBO— Vishu (@Ro_45stan) October 17, 2024 -
1877 నుంచి ఇదే తొలిసారి: అసలైన మజానిచ్చే రికార్డు!
బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా వీరబాదుడును క్రికెట్ ప్రేమికులు అంత తేలికగా మర్చిపోలేరు. కాన్పూర్లో పొట్టి ఫార్మాట్ తరహాలో ఒక్కో భారత బ్యాటర్ చెలరేగుతూ ఉంటే అభిమానులు పండుగ చేసుకున్నారు. అంతకు ముందు వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దైన కారణంగా ఉసూరుమన్న ఫ్యాన్స్కు.. రోహిత్ సేన పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చి లెక్క సరిచేసింది.50, 100, 200, 250 పరుగుల రికార్డుటెస్టు ఫార్మాట్లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించి.. ప్రపంచంలో ఈ ఘనతలు నమోదు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 23 పరుగులు చేస్తే.. అతడి జోడీ యశస్వి జైస్వాల్(72) కేవలం 32 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.1877 నుంచి ఇదే తొలిసారివిరాట్ కోహ్లి 35 బంతుల్లో 47 పరుగులు చేస్తే.. కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ నలుగురు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో భారత జట్టు ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు ఒకటి నమోదైంది.ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. తద్వారా ఇంగ్లండ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 1877 నుంచి ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టెస్టుల్లో 90 సిక్సర్లు నమోదు చేసిన టీమ్గా చరిత్రకెక్కింది.కాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ మూడు, యశస్వి జైస్వాల్ రెండు, శుబ్మన్ గిల్ ఒకటి, విరాట్ కోహ్లి ఒకటి,. కేఎల్ రాహుల్ రెండు, ఆకాశ్ దీప్ రెండు సిక్సర్లు బాదారు. ఇక నవంబరులో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. కాబట్టి తన సిక్సర్ల రికార్డును రోహిత్ సేన తానే బద్దలు కొట్టే అవకాశం ఉంది.టెస్టుల్లో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లుటీమిండియా- 90 సిక్స్లు(2024లో ఇప్పటి వరకు)ఇంగ్లండ్- 89 సిక్స్లు(2022లో)టీమిండియా- 87 సిక్స్లు(2021లో)న్యూజిలాండ్- 81 సిక్స్లు(2014లో)న్యూజిలాండ్- 71 సిక్స్లు(2013లో).చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
రోహిత్పై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన పంత్!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా మరో ముందడుగు వేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేసింది. తొలి టెస్టులో గెలుపొంది.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. చెన్నైలోని చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 280 పరుగులతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.పునరాగమనంలో పంత్ అదుర్స్.. కానీ రాహుల్ మాత్రంఅయితే, బంగ్లాదేశ్ కూడా అంత తేలికగా రోహిత్ సేన ముందు తలొగ్గలేదు. ఆరంభంలో గట్టిపోటీనిచ్చింది. తమ స్థాయికి మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే, టీమిండియా సమిష్ఠిగా రాణించడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో చెపాక్ మ్యాచ్ ద్వారా ద్వారా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, సీనియర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో పునరాగమనం చేశారు.పంత్ తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులకే పరిమితమైనా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సెంచరీ(109)తో దుమ్ములేపాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం తనను తాను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 16 పరుగులే చేసిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులతో ఆడుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఫలితంగా రాహుల్ మైదానాన్ని వీడకతప్పలేదు.రోహిత్పై విమర్శలుఅయితే, రాహుల్కు మరికొంత సేపు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సిందని.. అలా అయితే, అతడు ఫామ్లోకి వచ్చేవాడంటూ అభిమానులు రోహిత్ శర్మ నిర్ణయాన్ని విమర్శించారు. ఈ విషయంపై రిషభ్ పంత్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేము భోజన విరామానికి వెళ్లినపుడే ఇన్నింగ్స్ డిక్లరేషన్ గురించి చర్చ జరిగింది.ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండిఅప్పుడు రోహిత్ భాయ్.. ‘ఇంకో గంటసేపు మనం బ్యాటింగ్ చేస్తాం. ఈలోపు ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండి’ అని చెప్పాడు. దీంతో.. తిరిగి బ్యాటింగ్కు వెళ్లగానే వీలైనన్ని రన్స్ చేయాలని నిర్ణయించుకున్నా. ఏమో నేను ఇంకాసేపు క్రీజులో ఉంటే 150 పరుగులు కూడా చేసేవాడిని’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. తద్వారా రాహుల్ విషయంలో రోహిత్ను విమర్శిస్తున్న వాళ్ల నోళ్లకు తాళం వేశాడు.కాగా ఈ మ్యాచ్లో పంత్తో పాటు శుబ్మన్ గిల్ శతకంతో అలరించాడు. అయితే, గిల్ 119, కేఎల్ రాహుల్ 22 కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అప్పటికి టీమిండియా 514 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్కు 515 పరుగుల రూపంలో ముందుంచాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ కావడంతో భారీ తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. చదవండి: రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే: బంగ్లాదేశ్ క్రికెటర్Rishabh pant bodied all haters who trolled Rohit sharma for not giving enough time to kl Rahul at the creasepic.twitter.com/MVPiWkhr4w— Gillfied⁷⁷ (@Gill_era7) September 22, 2024 -
తుదిజట్టులో వారికి చోటు లేదు: కారణం చెప్పిన గంభీర్
బంగ్లాదేశ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టులో చోటు కోసం.. యువకులు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. చెన్నై టెస్టులో ఆడబోయే ప్లేయింగ్ ఎలెవన్లో ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లకు చోటు దక్కదని సంకేతాలు ఇచ్చాడు.బంగ్లాదేశ్కు వార్నింగ్ఇక చెపాక్లో ఈసారి మ్యాచ్ జరుగబోయేది ఎర్రమట్టి పిచ్ మీదే అయినప్పటికీ.. తమ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ త్రయంతో బంగ్లాదేశ్ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది.పంత్ జట్టులోకి వచ్చాడు.. కాబట్టిఈ క్రమంలో గురువారం చెన్నై వేదికగా తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై హెడ్కోచ్ గౌతం గంభీర్ బుధవారం మాట్లాడుతూ.. ‘‘మేము ఎవరినీ జట్టు నుంచి తప్పించం. అయితే, ప్లేయింగ్ ఎలెవన్లో ఫిట్ అయ్యే ఆటగాళ్లను మాత్రమే ఎంచుకుంటాం. జురెల్ అద్భుతమైన ఆటగాడు. అయితే, పంత్ జట్టులోకి వచ్చాడు.కాబట్టి.. కొన్నిసార్లు కొంతమంది ఎదురుచూడకతప్పదు. సర్ఫరాజ్కూ ఇదే వర్తిస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. కానీ ఓపికగా ఎదురుచూడటం అవసరం’’ అని పేర్కొన్నాడు. తద్వారా వికెట్ కీపర్గా రిషభ్ పంత్, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ ఆడటం ఖాయమని చెప్పకనే చెప్పాడు.మాకు అశూ, జడ్డూ ఉన్నారుఇక స్పిన్దళం అశ్విన్, జడేజా, కుల్దీప్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా స్పిన్నర్లు మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు ప్రభావం చూపగలరు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకోలేము కదా. అదృష్టవశాత్తూ మాకు అశ్విన్, జడేజా ఉన్నారు. వాళ్లు డిఫెన్సివ్గా ఆడగలరు. అదే సమయంలో దూకుడూ ప్రదర్శించగలరు’’ అని గంభీర్ ప్రశంసించాడు. కాగా చెపాక్లోని ఎర్రమట్టి పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో.. తమ స్పిన్ దళం నుంచే ప్రత్యర్థికి ఎక్కువ ప్రమాదమని గౌతీ చెప్పడం విశేషం.బంగ్లాదేశ్తో తొలి టెస్టు భారత తుదిజట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లినే భయపెట్టాడు..! ఎవరీ గుర్నూర్ బ్రార్? -
ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అతడే: కేఎల్ రాహుల్
శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగిన కేఎల్ రాహుల్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ కర్ణాటక బ్యాటర్.. ఇండియా-‘బి’తో మ్యాచ్లో వరుసగా 37, 57 పరుగులు చేశాడు. అయితే, కేఎల్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో ఈ మ్యాచ్లో ఇండియా-‘ఎ’ జట్టుకు ఓటమి తప్పలేదు.తదుపరి టెస్టు సిరీస్తో బిజీబెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా-‘బి’ చేతిలో ఇండియా- ‘ఎ’ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో అర్ధ శతకంతో సత్తా చాటిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. సొంతగడ్డ మీద సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న మ్యాచ్లో అతడు భాగం కానున్నాడు. తాజా ఫామ్ దృష్ట్యా తుదిజట్టులోనూ ఈ వికెట్ కీపర్కు చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నంబర్ వన్ అతడేఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా-‘ఎ’ జట్టును వీడిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోని టాప్-5 బ్యాటర్లను ఎంచుకోమని యూట్యూబర్ కోరగా.. విరాట్ కోహ్లికి అగ్రస్థానమిచ్చిన రాహుల్.. ఆ తర్వాతి స్థానాలకు వరుసగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజం, ట్రవిస్ హెడ్ను ఎంపిక చేసుకున్నాడు.అత్యుత్తమ బౌలర్ ఎవరంటే?ఇక ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ ఎవరంటూ సదరు యూట్యూబర్ ఆప్షన్లు ఇవ్వగా రాహుల్.. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ పేరు చెప్పాడు. ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ ఆండర్సన్కు రెండో ర్యాంకు ఇచ్చిన రాహుల్.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు మూడు, అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు నాలుగు, పాకిస్తాన్ యువ పేసర్ నసీం షా కు ఐదో ర్యాంకు ఇచ్చాడు.కాగా ప్రపంచంలోని నవతరం ఫాస్ట్బౌలర్లలో ప్రత్యేకమైన శైలితో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బుమ్రాను కాదని కేఎల్ రాహుల్ స్టెయిన్ పేరు చెప్పడం అతడి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. సదరు యూట్యూబర్ తానే ఆప్షన్లు ఇచ్చి రాహుల్ను పేర్లు ఎంచుకోమని చెప్పాడు. కాబట్టి.. ‘‘అతడి లిస్టులో బుమ్రా పేరు ఉందో లేదో రాహుల్కు తెలియదు. అందుకే అతడు స్టెయిన్ను ఎంచుకుని ఉండవచ్చు’’ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా క్లాసీ రాహుల్ ఎంతో క్లాస్గా సమాధానాలు ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ బర్త్డే: ఆ ముగ్గురు హైలైట్ (ఫొటోలు)
-
రాహుల్ కోసం ఆ యువ ఆటగాడి త్యాగం?
స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానుంది.ఈ నెల 13 నుంచి ఆరు రోజుల పాటు చెపాక్లో ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంపులో భారత జట్టు పాల్గోనుంది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్తో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పునరాగమనం చేయనున్నాడు. అదే విధంగా మరో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా దాదాపు 7 నెలల తర్వాత భారత్ తరపున టెస్టుల్లో ఆడనున్నాడు.బంగ్లాతో సిరీస్కు రాహుల్కు కూడా చోటు దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో రాహుల్ భాగమయ్యాడు.అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన రాహుల్.. సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత అతడి స్ధానాన్ని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్తో బీసీసీఐ భర్తీ చేసింది. సర్ఫరాజ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. రెండు అర్ధ సెంచరీలతో సత్తాచాటి శెభాష్ అన్పించుకున్నాడు. అయితే బంగ్లాతో సిరీస్కు సర్ఫరాజ్, రాహుల్కు ఇద్దరికి జట్టులో చోటు దక్కింది. దీంతో ప్లేయింగ్ ఎలెవన్లో ఎవరికి చోటు దక్కుతుందా అన్నది అందరి మొదడలను తొలుస్తున్న ప్రశ్న.రాహుల్కు ఛాన్స్.. సర్ఫరాజ్కు నో ఛాన్స్అయితే సర్ఫరాజ్ కంటే రాహుల్ వైపే టీమిండియా మెనెజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్కు ఉన్న అనుభవం దృష్ట్యా సర్ఫరాజ్ను బెంచ్కే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. జట్టు వ్యూహాలు, ఆలోచనలు బయటి వ్యక్తులకు ఆర్ధం కాకపోవచ్చు. ఇంగ్లండ్ సిరీస్లో మధ్యలో మేము అతడిని తప్పించలేదు. అతడు గాయ పడ్డాడు. అందుకే అతడు ఆ సిరీస్కు దూరమయ్యాడు. తను గాయపడటానికి ముందు హైదరాబాద్లో 86 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఫామ్లోకి తిరిగి రావడం జట్టుకు కలిసొచ్చే ఆంశం. ఆస్ట్రేలియాలో రాబోయే సవాళ్లకు మేనేజ్మెంట్ అతడిని సిద్దం చేస్తోంది.సర్ఫరాజ్ సైతం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కానీ తుది జట్టులో చోటు కోసం కాస్త ఎదురు చూడక తప్పదు. ఏదైనా అవకాశముంటే అతడికే తొలి ప్రాధన్యత ఇస్తామని పీటీఐతో బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.చదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్