kowsalya
-
తండ్రిలా తనకు తోడుంటా..
తమిళనాడు పరువుహత్య బాధితురాలు కౌశల్య కొత్త జీవితానికి నాంది పలికారు. భర్త శంకర్ హత్యతో కుంగిపోకుండా పడిలేచిన కెరటంలా సాంఘిక ఉద్యమాల్లో చురుగాగా పొల్గొంటూ అందరినీ ఆకట్టుకున్న కౌశల్య తాజాగా మరోసారి ఆదర్శనీయంగా నిలిచారు. తన జీవితంలో చోటు చేసుకున్న అత్యంత విషాదం నుంచి కోలుకుని సరికొత్త జీవితానికి తొలి అడుగు వేశారు. తన తోటి కళాకారుడు, కార్యకర్త శక్తిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని తందై పెరియార్ ద్రవిడగర్ కజగం ప్రధాన కార్యాలయంలో ఆదివారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు పెరియార్ ఉద్యమ కారులు, ఇతర సామాజిక ఉద్యమ నాయకులు ఈ వివాహానికి హాజరై కౌశల్య, శక్తిలకు అభినందనలు తెలిపారు. తండ్రిలా తోడుంటా.. కుల దురహంకారానికి బలైపోయిన కౌశల్య ‘శంకర్ సోషల్ జస్టిస్ ఫౌండేషన్’ పేరుతో కులానికి, మతానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ఉద్యమంలో పరిచయమైన కార్యకర్త శక్తిని వివాహం చేసుకున్నారు. శంకర్ ఫౌండేషన్తో తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా,ఆ ఉద్యమంలో ఎలాంటి అవరోధం కల్పించకుండా, తండ్రిలాగా కౌశల్యకు అండగా ఉంటానని శక్తి ప్రకటించారు. మరోవైపు ఉద్యమాల్లో రాజకీయంగా శక్తికి అండగా ఉంటూనే పరువు హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చేంతవరకు పోరాడతానని కౌశల్య స్పష్టం చేశారు. కాగా 2016లోదళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో కౌశల్య భర్త శంకరును ఆమె తల్లిందండ్రులు అతికిరాతంగా హత్య చేశారు. 19 సం.రాల వయసులో శంకర్తో నూతన జీవితాన్ని ప్రారంభించిన కేవలం 9నెలల కాలంలో ఎదురైన ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న కౌశల్య శంకర్ హంతకులకు శిక్షపడేలా పోరాడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12, 2017న నేరస్తులకు మరణశిక్ష విధిస్తూ తిరుప్పూర్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. More power to couples like this! This was the best thing I heard today. pic.twitter.com/IkIPstRjqN — Megha Kaveri (@meghakaveri) December 9, 2018 Post-wedding celebration with parai isai. pic.twitter.com/jtBLk0HNSJ — Megha Kaveri (@meghakaveri) December 9, 2018 -
ప్రణయ్ హత్య : కౌసల్య శంకర్ ఏమన్నారు?
సాక్షి,హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ (24) ఘోరమైన హత్యలాంటిదే తమిళనాడులో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడు శంకర్ (22) హత్య. ప్రణయ్ హత్య జరిగిన వెంటనే కౌసల్య, శంకర్ల విషాద గాథ అందరి మదిలో మెదిలింది. కేవలం తమ అమ్మాయి కౌసల్యను కులాంతర వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో శంకర్ను కౌసల్య తండ్రి కిరాయి హంతకుల ద్వారా అతిదారుణంగా పట్టపగలే నరికి చంపించిన వైనం అప్పట్లో కలకలం రేపింది. 2016 మార్చిలో తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చం ప్రణయ్ హత్య తరహాలోనే, మాటువేసి వెనుకనుండి దాడిచేసి పట్టపగలే నడిరోడ్డులో కత్తులతో నరికి చంపారు. ఈ హత్య కూడా సీసీ టీవీలో రికార్డు అయింది. ప్రణయ్ హత్యోదంతాన్ని తెలుసుకున్న కౌసల్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై ఇలాంటి భయానక హత్యలకు చరమగీతం పాడాలంటే కుల వ్యవస్థ మొత్తం నాశనం కావాలని కౌసల్య పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక మహిళ మరొక కులంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటే కులం నాశనమవుతుందని భావిస్తారు. ప్రత్యేకంగా, అబ్బాయి అణచివేత కులానికి చెందిన వాడైతే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. తమ కుమార్తె గర్భంలో మరొక కులానికి చెందిన శిశువు ఎలా ఉంటుందని రగిలిపోతారు. భారతీయ సమాజం మొత్తం కులతత్వ సమాజం. కులతత్వం ఉన్నంతకాలం ఈ భయంకరమైన కుల నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ప్రభుత్వాలు చొరవ తీసుకుని కులతత్వాన్ని సమూలంగా నాశనం చేసే మార్గాన్ని కనుగొంటే తప్ప, వీటికి అడ్డుకట్ట పడదని ఆమె చెప్పింది. హింస నుండి మహిళలను కాపాడడానికి చట్టాలున్నాయి కాబట్టే కొంతమేరకు పోరాడగలుగుతున్నాం. కానీ పరువు హత్యలపై ఇప్పటికీ ఎలాంటి చట్టాలు లేవు. ఇలాంటి పటిష్టమైన చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకు రావాల్సి ఉంది. కఠినచట్టాలు, రక్షణ లేకుండా , కేవలం నోటిమాటలతో ఈ హత్యల్ని ఆపలేం. ఇలాంటి వివాహాలు తప్పు కాదని చెప్పే చట్టాలు రావడంతోపాటు ఆయా జంటలకు ప్రోత్సాహన్నందించాలని కౌశల్య ఆకాంక్షించారు. మా తరువాత చాలా జంటల్ని కులం పొట్టన పెట్టుకుంది. మహిళలను శిశువులను తయారుచేసే యంత్రాలుగానే సమాజం చూస్తోంది. కేవలం కులాన్ని కాపాడే దేవతలుగా మాత్రమే మహిళల్ని గౌరవిస్తున్నారని కౌశల్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తమ తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు పోలీస్ స్టేషన్ల నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు. వారికిష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు అంటూ ఆ జంటను విడదీయడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు ఇలా ఎందుకు చేయాలి? చట్ట ప్రకారం, న్యాయం వైపు వారు ఎందుకు వుండరు? పోలీసులు హింసనుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఏ ఆఫీసర్ అలా చేయడం లేదని కౌశల్య ఆరోపించారు. పెరియార్, అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళల విముక్తి లేకుండా కులవ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు. ఈ రోజుల్లో కులాలు ఎక్కుడున్నాయని అందరూ అంటారు. కానీ, ప్రతిరోజూ అనుభవిస్తున్న వారికి మాత్రమే ఆ వివిక్ష తాలూకు బాధేంటో తెలుసునని కౌశల్య వ్యాఖ్యానించారు. కాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త కన్నవాళ్ల చేతుల్లోనే దారుణంగా హత్య కావడంపై కౌసల్య న్యాయపోరాటం చేసారు. నేరస్తులకు ఉరిశిక్షపడేదాకా మొక్కవోని ధైర్యంతో పోరాడారు. ప్రస్తుతం కులనిర్మూలన కోసం పోరాటం చేస్తున్నారు.. మరోవైపు కౌశల్య తరహాలోనే అమృత ప్రణయ్ కూడా కులనిర్మూలనకోసం ఉద్యమిస్తానని చెప్పడం గమనార్హం. -
దొంగల ముఠా అరెస్టు
నాగోలు: బస్సుల్లో.. వస్త్ర దుకాణాల్లో దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్పేటలో నివాసముంటున్న ఇంగుర్తి శ్రీను (27), ఇంగుర్తి విశ్వరూపాచారి (50), ఖమ్మం పట్టణానికి చెందిన నల్లగొండ కౌసల్య, నల్లగొండ ఈదమ్మలు ముఠాగా ఏర్పడి దృష్టి మళ్లించి బస్సులు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఎల్బీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
టికెటడిగినందుకు.. రైలు నుంచి తోసేశారు!
-
బేగంపేట రైల్వేస్టేషన్ లో మహిళా టీసీపై దాడి
హైదరాబాద్ : టికెట్ కలెక్టర్ గీత ఘటన మరవక ముందే మరో మహిళా టీటీఈపై దుండగులు దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ కౌసల్య టికెట్ అడిగినందుకు... ఎనిమిది మంది దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే చికిత్స నిమిత్తం కౌసల్యను లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడినవారిలో నలుగురిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. మహిళా టీసీలపై దాడి చేయటం వారం రోజుల్లో ఇది రెండో సంఘటన. దాంతో మహిళా రైల్వే టీసీలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంగ్లీష్ కథనం కోసం.... ఈ నెల 18న టీసీ గీతను హఫీజ్ పేట రైల్వే స్టేషన్ లో దుండగులు కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు. టికెట్ లేకుండా ప్రయాణించినందున జరిమానా కట్టాలని గీత అడిగిన పాపానికి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గతంలోనూ కేరళ ఎక్స్ప్రెస్లో విజయ్ కుమార్ అనే టీసీని దుండగులు రైల్లో నుంచి తోసివేయటంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.