Krishna lanka police station
-
నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదు: వంశీ భార్య
సాక్షి, విజయవాడ: తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్ఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. తమను పోలీస్స్టేషన్ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్ లోపలికి పోలీసులు పంపించారు.వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు: జగన్మోహన్రావువైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారని మండిపడ్డారు. లోకేష్ చెప్పడం వల్లే అక్రమ కేసులు బనాయించారని.. ఇలాంటి విష సంస్కృతిని అందరూ ఖండించాల్సిందేనన్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టులన్నారు. రాజ్యాంగ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని జగన్మోహన్రావు అన్నారు.వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదు: లాయర్ చిరంజీవిసుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్ చిరంజీవి అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదని.. ఆయనను కావాలనే అరెస్ట్ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. వంశీ లాయర్నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరు’’ అని అడ్వకేట్ చిరంజీవి అన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం కలకలం రేగింది. వివిధ కారణాలతో ముగ్గురు వేర్వేరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. నగర శివారులోని వాంబే కాలనీలో నివాసముంటున్న శ్రావణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి బలవన్మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు మొదలైందని విజయవాడ రూరల్ పోలీసులు తెలిపారు. నగర శివారు ప్రాంత గ్రామంలో.. విజయవాడ శివారులో గల ఓ గ్రామంలో వరదారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్ధిక ఇంబందుల కారణంగా వరదా రెడ్డి ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బీటెక్ విద్యార్థి కృష్ణలంకలో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న యువతిని విజయవాడలోని ప్రవేట్ ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కాగా, కుటుంబ కలహాల కారణంగానే యువతి చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. మృతురాలు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. -
తల్లి ప్రేమ గెలిచింది
విజయవాడ : పేగుతెంచుకుని పుట్టిన బిడ్డను ఇబ్బందుల కారణంగా ఓ అమ్మ విజయవాడలో వదిలేసింది. చిన్నారిని విడిచి ఉండలేక కొద్ది రోజుల్లోనే వదిలేసిన చోటనే వెదుక్కుంది. ఆ ప్రయత్నం ఫలించడంతో కుమార్తె మళ్లీ తల్లి ఒడికి చేరింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన హుస్సేన్బీకి ఇద్దరు కుమార్తెలు. మూడు నెలల చిన్న కుమార్తెకు పుట్టుకతోనే గుండెకు చిల్లు ఉండడంతో అనారోగ్యంతో బాధపడుతుండేది. హుస్సేన్బీ భర్త బిందెలకు మాట్లు వేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో హుస్సేన్బీ కొద్ది రోజుల కిందట చిన్న కుమార్తెను విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఓ ఆస్పత్రి దగ్గర చెత్తకుండీ వద్ద వదిలివె ళ్లింది. కృష్ణలంక రాణీగారితోటకు చెందిన కుంభా కుసుమకుమారి అటుగా వెళ్తుండగా చిన్నారి ఏడుపు వినిపించింది. ఆమె పాపను తీసుకుని సమీపంలోని దుకాణదారులకు ఈ విషయం చెప్పి తన అడ్రస్ ఇచ్చింది. చిన్నారి కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే తన వద్దకు పంపాలని సూచించి బాలికను తీసుకుని వెళ్లిపోయింది. అనంతరం అనారోగ్యంతో బాధపడుతోందని గుర్తించి వైద్యులకు చూపించింది. కుమార్తెను వదిలి వెళ్లాక హుస్సేన్బీ మనశ్శాంతిగా ఉండలేకపోయింది. తన తల్లి నబీషాకు ఈ విషయం చెప్పింది. ఐదు రోజులు గడిచిన తరువాత హుస్సేన్బీ తల్లితో కలిసి నగరానికి వచ్చి కూతురిని వదిలేసిన చోట ఆరా తీసింది. స్థానిక దుకాణదారులు కుసుమకుమారి చిరునామా చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్లారు. కుమార్తెను వదిలేయడానికి కారణం చెప్పి తనకు తిరిగి ఇవ్వవలసిందిగా కోరింది. దీంతో వారంతా బుధవారం రాత్రి కృష్ణలంక పోలీస్స్టేషన్కు వెళ్లి సీఐకి అంతా వివరించారు. కుసుమకుమారి అంగీకారంతో ఆయన చిన్నారిని తల్లికి అప్పగించారు.