Advertisement
Labor agreements
-
చంద్రబాబు కొమ్ములు వంచుతాం
సాక్షి, మద్దిలపాలెం (విశాఖ తూర్పు) : వరాలు కురిపిస్తామని, బతుకులు బాగు చేస్తానని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు కొమ్ములు వంచేందుకు కార్మికులు కదనరంగలోకి దిగనున్నారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి అన్నారు. జూలై 1వ తేదీన విశాఖనగరంలో నిర్వహించనున్న కార్మిక గర్జన సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆయనతోపాటు నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్తలు సోమవారం నగర పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్రెడ్డి మాట్లాడుతూ 2014లో అధికారమే పరమావధిగా భావించిన చంద్రబాబు కార్మికులకు 49 హామీలను ఇచ్చారన్నారు. వాటిలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలు చేయకుండా కార్మికులను దగా చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించారన్నారు. హక్కులను సైతం కాలరాస్తూ కార్మికులకు అన్యాయం చేశారన్నారు. కార్మికులతో పెట్టుకుంటే టీడీపీ బంగాళఖాతంలో కలిసిపోవడం ఖాయమని రాబోయే ఎన్నికలలో రుజువు చేస్తారన్నారు. అధికారంలోకి వస్తే తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించిందన్నారు. కార్మికులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు కార్మికులు, నిరుద్యోగులు కంకణం కట్టుకున్నారన్నారు. రాబోయే ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కల్యాణి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఉషాకిరణ్, నగర ట్రేడ్ యూని యన్ అధ్యక్షుడు బద్రినాథ్, మాజీ కార్పొరేటర్లు నడింపల్లి కృష్ణంరాజు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు, ఎస్సీసెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, అధికార ప్రతినిధి మర్టూరి పరదేశి, వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీ నక్క వెంకటరమణ, మస్తానప్ప, సంపంగి ఈశ్వరరావు, పిట్టా రెడ్డి, జి.వి.శ్రీనివాస్, కె.సుధాకర్, కె.సత్యనారాయణ, కాళీదాసురెడ్డి పాల్గొన్నారు. -
త్వరలో బ్రిక్స్ దేశాలతో ‘కార్మిక’ ఒప్పందాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ దేశాలతో కార్మిక సంబంధాలను పటిష్టపర్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పలు ఒప్పందాలకు సిద్ధమవుతోంది. వలస కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, సంక్షేమం కోసం త్వరలో బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బ్రిక్స్ ఎంప్లాయీమెంట్ వర్కింగ్ గ్రూపు(బీఈడబ్ల్యూజీ) సమావేశాలు బుధ, గురువారాల్లో హైదరాబాద్లో జరిగాయి. ఈ సమావేశాల విశేషాలను ఆయన గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఈడబ్ల్యూజీ తొలి సమావేశాలు భారతదేశం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించడం విశేషమన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల్లో ఉపాధి సృష్టి, కార్మికుల సామాజిక భద్రతపై పరస్పర అవగాహన ఒప్పందం, కార్మిక శిక్షణ సంస్థల అనుసంధానం అనే మూడు అంశాలపై ఆ దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారని తెలిపారు. ఈ చర్చల ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా వచ్చే సెప్టెంబర్లో ఆగ్రాలో జరగనున్న బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి కల్పన మంత్రుల సమావేశంలో వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంటామని మంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన జీ-20 దేశాలు పరస్పరం సహకరించుకుంటున్న విధంగా ‘బ్రిక్స్’ దేశాలు సైతం ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. దేశ యువజన జనాభా 80 కోట్ల వరకు ఉందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా వీరందరికీ దేశ, విదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. 10 మంది, అంతకు మించిన సంఖ్యలో కార్మికులతో నడుస్తున్న దుకాణాలు, వ్యాపార సంస్థలను ఏడాదిలో 365 రోజులూ రాత్రింబవళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని’ తీసుకొచ్చామన్నారు. భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించి రాత్రివేళల్లో మహిళలకు ఉపాధి కల్పించవచ్చని దత్తాత్రేయ చెప్పారు. ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనేది దుకాణాలు, వ్యాపార సంస్థల ఇష్టమన్నారు. ఈ చట్టంతో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.