land capture
-
‘బావి స్థలం’ కబ్జాదారుపై చర్యలు?
ఆరా తీస్తున్న డీటీసీపీ అధికారులు అక్రమార్కులను కాపాడుతున్న ప్రముఖులు దశాబ్దాల కాలంగా ప్రజల దాహార్తిని తీర్చిన మున్సిపాలిటీకి చెందిన మంచి నీటి బావి కాస్త అక్రమార్కుల కన్ను పడి కబ్జాకు గురైంది. ఇంకేముంది పట్టణ నడిబొడ్డున ఉండడం.. మంచిరేటు పలుకుతుండడంతో దానిని కాస్త పూడ్చేసి దానిపై షాపింగ్ సముదాయాలను నిర్మించారు కబ్జాకోరులు. విషయాన్ని గ్రహించిన అధికారులు రెండు నెలల క్రితం నోటీసులు పంపినా.. ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. - వికారాబాద్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో గల మంచినీటి బావిని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించిన వారిపై డీటీసీపీ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. మార్కెట్లో గల ఈ బావి సుమారు 50 ఏళ్లుగా పట్టణంలోని ఆరు వార్డులకు తాగునీటిని అందించింది. అయితే కొంత కాలం క్రితం దీనిపై పలువురి కన్ను పడింది. ఇకేంముంది.. నకిలీలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా షాపింగ్ క్లాంపెన్స్ను నిర్మించారు. వీటికి సంబంధించిన రికార్డులను సైతం స్థానిక మున్సిపాలిటీలో కొందరు కాసులకు కక్కుర్తి పడి మాయం చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. బావి స్థలాన్ని కబ్జా చేశారంటూ రెండు నెలల క్రితం పలు దినపత్రికల్లో కథనాలు రావడంతో స్పందించిన టౌన్ప్లానింగ్ అధికారులు వారి దగ్గర ఉన్న రికార్డులతో కబ్జాకోరులను గుర్తించి తాఖీదులను అందచేశారు. మీ దగ్గర ఉన్న నిర్మాణాలకు సంబంధించిన ధ్రువపత్రాలను 11 రోజుల్లో టౌన్ప్లానింగ్ అధికారులకు అందచేయాలని, లేనిపక్షంలో రెండో నోటీస్ ఇచ్చిన తరువాత మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులకు ఒక్కరు మాత్రమే స్పందించాడు. తాను 15 గజాల స్థలాన్ని మాత్రమే కబ్జా చేసినట్లు అధికారులకు విన్నవించుకున్నాడు. మిగిలిన వారికి పట్టణ ప్రముఖులు అండగా ఉంటూ తెరవెనక రాజకీయాలు నడిపిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. దీంతో మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులు కూడా రెండు నెలలుగా తటస్థంగా ఉండిపోయారు. కాగా.. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి డీటీసీపీ హైదరాబాద్ కార్యాలయంలో ఉన్న రికార్డులను తిరగేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ అధికారులకు ముచ్చెమటలు.. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లోనే కొత్త మార్కెట్ను నిర్మించాలని భావించిన అధికారులు ఆదిశగా ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులను సైతం మంజూరు చేసింది. అయితే.. ఇక్కడే అసలు కథ మొదలైంది. పాతకూరగాయల మార్కెట్ స్థలం రికార్డుల ప్రకారం1.02 గుంటల భూమి గతంలో ఉండేది. అది కాస్త రోజు రోజుకు కుచించుకుపోయింది. ప్రస్తుతం ఆ స్థలం ఎంత మేరకు ఉంది? ఎవరి హయాంలో కబ్జాకు గురైంది. పూర్తి వివరాలను వెంటనే పంపించాలని డీటీసీపీ అధికారులు స్థానిక -
బండారం బయటపడుతోంది
కబ్జాలు...వసూళ్లు బండారు అనుచరులదీ ఇదే తీరు భీతిల్లుతున్న ఓటర్లు విశాఖ రూరల్, న్యూస్లైన్: ప్రజల సమస్యలపై ఉద్యమాల ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలు.. పారిశ్రామిక ప్రాంతాల్లో సమస్యలపై బయట పోరాటాలు.. తెరవెనుక పారిశ్రామికవేత్తలతో లాలూచీలు.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జాలలు. భూబకాసరులకు వంతపాటలు.....పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై ఇలా పలు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం, నిరుద్యోగం, ఉపాధి కల్పనల పేరుతో కొద్ది రోజులు ఉద్యమాలు నడిపి హడావుడి చేయడం.. లక్షలకు లక్షలు పిండుకున్నాక ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపేయడం ఆయన నైజమన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా భూ కబ్జాదారులను పెంచి పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక వాడలో ఉద్యమాలు చేసిన బండారు అక్కడ పోటీ చేయకుండా పెందుర్తి నుంచి పోటీకి దిగడం వెనుక ఆ పార్టీ కార్యకర్తలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాజువాక, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో బండారు సత్యనారాయణమూర్తి పోరాటాల ముసుగులో ప్రజలను మోసం చేశారన్న అభిప్రాయాలు ఉండడంతో అక్కడ నుంచి గెలవలేరని భావించి, పెందుర్తిని ఎంచుకున్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా పెందుర్తి నియోజవకర్గంలో ఆయన వెంట ఉండే అనుచరగణాన్ని చూస్తుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అనేక భూ కబ్జాలు బండారు అనుచరులు పెందుర్తిలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను దిగమింగారు. రికార్డులను ట్యాంపర్ చేసి భూములను జిరాయితీలుగా మార్చి దర్జాగా అమ్ముకున్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో సర్వే నెంబర్ 394-1లో 4.22 ఎకరాల ప్రభుత్వ భూమిని బండారు ముఖ్య అనుచరుడైన గండి ముత్యాలనాయుడు కబ్జా చేశాడు. ఈయన బండారు ఆశీస్సులతో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పదేళ్లుగా కొనసాగుతున్నాడు. ముత్యాలనాయుడు అధికారులను ప్రసన్నం చేసుకొని ప్రభుత్వ భూమిని జిరాయితీగా రికార్డుల్లో మార్పించి తన భార్య పేరున గిఫ్ట్డీడ్ రాయించి ఇచ్చాడు. సుమారు రూ.3 కోట్లు విలువ చేసే ఆ భూమిని 2007లో కరణం ప్రభావతి, నర్సిపల్లి మల్లేశ్వరి అనే ఇద్దరికి విక్రయించాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సమాచార హక్కు చట్టం గుర్తించి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సబ్బవరం మండలంలో గొల్లలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 47/2లో 22 ఎకరాల మిగులు భూములను కూడా ముత్యాలనాయుడు కబ్జా చేశారు. అధికారంలోకి వస్తే అంతే.. ప్రస్తుతం ముత్యాలనాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రచారాల బాధ్యతలను చూస్తున్నారు. ఎటువంటి అధికారం లేకుండానే అనేక కబ్జాలకు పాల్పడుతున్న వారికి అండదండలు అందిస్తున్న బండారు.. అధికారంలోకి వస్తే పెందుర్తిలో భూబకాసురులకు ఎదురుండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.