largi dam
-
'నేవీని రంగంలోకి దింపాలి'
హైదరాబాద్ : బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల ఆచూకీ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రిని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. నేవీ సిబ్బందిని రంగంలోకి దింపాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. శాటిలైట్ ద్వారా ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. మరోవైపు బియాస్ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. -
దేవాశిష్ బోస్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి దేవాశిష్ బోస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య అంబర్ పేటలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన పండో డ్యామ్ ఎగువ ప్రాంతంలో 100మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం దేవాశిష్ బోస్ మృతదేహం లభ్యమైంది. కాగా హిమాచల్ ప్రదేశ్కు విహారయాత్రకు వెళ్లిన విజ్ఞన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులలో 20 మంది బీయాన్ నదిలో కొట్టుకుని పోయిన విషయం తెలిసిందే. బియాస్-నదిలో గల్లంతైన 24మంది విద్యార్ధుల్లో ఇప్పటి వరకు 6 మృతదేహాలను మాత్రమే రక్షణ సిబ్బంది వెలికి తీశారు. సోమవారం నలుగురు, మంగళవారం ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా.. ఇంకా 18మంది విద్యార్ధుల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. -
క్షణాల్లో ఉత్సాహాన్ని ముంచెత్తిన విషాదం
-
క్షణాల్లో వినోదం నుంచి విషాదం దాకా
హిమాచల్ ప్రదేశ్ లో లార్జీ డ్యామ్ వద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఫోటోలు దిగుతున్న విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్ధులు క్షణాల్లో ఎలా జలసమాధి అయిపోయారో చూపించే విడియోను ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ దినపత్రిక అమర్ ఉజాలా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. ఆనందం క్షణాల్లో ఎలా విషాదంగా మారిపోయిందో ఆ విడియోను చూస్తే అర్థమవుతుంది. స్థానికులు ఈలలు వేసి, హెచ్చరిస్తున్న దృశ్యాలను, శబ్దాలను కూడా చూడొచ్చు.