Malaysian Airlines Flight MH17
-
రష్యా క్షిపణే ఆ విమానాన్ని కూల్చేసింది!
పుతిన్ బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే మలేషియా విమానం ఎంహెచ్-17 కూల్చివేత వ్యవహారంలో రష్యా ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఓ ఆస్ట్రేలియా న్యాయసేవల సంస్థ కోర్టుకు ఈడ్చింది. ఈ ప్రమాదంలో బాధితుల కుటుంబాలకు రష్యా, పుతిన్ పరిహారం చెల్లించాలంటూ మానవహక్కుల యూరోపియన్ కోర్టులో దావా వేసింది. 2014, జూలై 17న దక్షిణాఫ్రికాలోని అమ్స్టర్డాం నుంచి కౌలాలంపుర్ వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 298 మంది చనిపోయారు. ఇందులో 28మంది ఆస్ట్రేలియన్లు. ఈ విమానాన్ని కూల్చేసిన భూ-గగనతల క్షిపణి రష్యాలో తయారయినదని డచ్ సెఫ్టీ బోర్డు తన దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాకు చెందిన బాధిత కుటుంబాల తరఫున సిడ్నీకి చెందిన ఎల్హెచ్డీ లాయర్స్ సంస్థ యూరోపియన్ కోర్టులో దావా వేసింది. చనిపోయిన ప్రతి బాధితుడి కుటుంబానికి రూ. 67.42 కోట్ల పరిహారం చొప్పున రష్యా చెల్లించాలని డిమాండ్ చేసింది. -
క్షిపణితో విమానాన్ని కూల్చేశారు..
కౌలాలంపూర్: గతేడాది ఉక్రెయిన్లో కూలిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 17 ప్రమాదం వెనుక నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. రష్యాలో తయారైన క్షిపణితో దాడి చేయడం వల్ల ఈ విమానం కూలిపోయిందని నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు తన నివేదికలో వెల్లడించింది. 9ఎమ్38 క్షిపణి.. మలేసియా విమానం ముందు భాగాన్ని కొట్టడంతో విమానం పేలిపోయిందని తుది నివేదికలో పేర్కొంది. రష్యా ప్రభుత్వం మద్దతిస్తున్న తిరుగుబాటు దారులు ఈ విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా.. ఉక్రెయిన్ నియంత్రణలో ప్రాంతంలో నుంచి క్షిపణిని ప్రయోగించారని రష్యా చెబుతోంది. కాగా క్షిపణితో విమానంపైకి దాడి చేసింది ఎవరన్న విషయాన్ని డచ్ సేఫ్టీ బోర్డు నివేదికలో పేర్కొనలేదు. ఉక్రెయిన్లో ప్రభుత్వ దళాలకు, రష్యా అనుకూల తిరుగుబాటు దారులకు మధ్య పోరు జరుగుతోంది. గతేడాది జూలైలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 298 మంది మరణించారు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్కు వెళ్తుండగా తూర్పు ఉక్రెయిన్లో కూలిపోయింది.