Maruthi van
-
కిడ్నాపైన ఆ నలుగురు గోవాలో ప్రత్యక్షం
హైదరాబాద్: ఎల్బీనగర్లో కలకలం సృష్టించిన నలుగురు విద్యార్థుల కిడ్నాప్ ఘటన అంతా ఉత్తితిదేనట. ఈ కిడ్నాప్ హైడ్రామా వెనక అసలు కథ ఏంటో త్వరలో తేలనుంది. ఎల్బీనగర్లో అదృశ్యమైన ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు నలుగురు బుధవారం గోవాలో ప్రత్యక్షమయ్యారు. గోవా నుంచి సాయినాథ్, లిఖిత్ కుమార్, సాయికుమార్, విజయ్ కుమార్ నలుగురు ఈ రోజు హైదరాబాద్కు తిరుగు పయనమైనట్టు తెలిసింది. నిన్న (మంగళవారం)టి నుంచి వారు కనిపించకుండా పోవడంతో విద్యార్థులను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అందరూ భావించారు. నిన్న స్కూల్ వద్ద ఎవరో రెడ్ కలర్ మారుతి వ్యాన్లో వచ్చి నలుగురు పిల్లలను ఎత్తుకెళ్లారని తోటి విద్యార్థులు చెప్పడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైతేనేమీ నలుగురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలియగానే వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఎల్బీనగర్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్
-
ఎల్బీనగర్లో నలుగురు చిన్నారుల కిడ్నాప్?
ఎల్బీనగర్: ఎల్బీనగర్లో నలుగురు చిన్నారులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న సాయినాథ్ (13), లిఖిత్ (14), సాయికుమార్, విజయ్ కుమార్ అనే విద్యార్థులు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు చిన్నారులు స్థానికంగా ఎల్బీనగర్లో ఉంటున్నారు. నిన్న (మంగళవారం) స్కూల్కు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులు, తోటి విద్యార్థులు, స్నేహితులను ఆరా తీశారు. సాయినాథ్ తండ్రి మాత్రం సరదాగా ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నట్టు తెలిపారు. తమ పిల్లవాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంటుందనీ, మాకు ఎవరితోనూ ఎలాంటి విబేధాలు లేవని తెలిపాడు. ఒకే ప్రాంతంలో ఉండే నలుగురు చిన్నారుల జాడ తెలియకపోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే స్కూల్ వద్ద ఎవరో రెడ్ కలర్ మారుతి వ్యాన్లో వచ్చి నలుగురు పిల్లలను ఎత్తుకెళ్లారని తోటి విద్యార్థులు చెప్పినట్టు పోలీసులకు చెప్పారు. అయితే విద్యార్థులిద్దరూ తప్పిపోయారా? లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మారుతి వ్యాన్ నుంచి చెలరేగిన మంటలు
-
మారుతి వ్యాన్ నుంచి చెలరేగిన మంటలు
కాకినాడ: నడుస్తున్న మారుతి వ్యాన్లోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. చీరల లోడ్తో ఓ వ్యాన్ వెళ్తోంది. అయితే, జగ్గంపేట సమీపానికి మారుతి వ్యాన్ రాగానే రోడ్డుపై పడి ఉన్న ఎండుగడ్డిపై నుంచి వెళ్లింది. దీంతో ఎండుగడ్డి కారు ఇంజన్లో ఇరుక్కోవడంతో చిన్నగా మంటలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ వ్యాన్ను రోడ్డు పక్కన ఆపేశాడు. దీంతో అతడికి ఏ ప్రమాదం జరగలేదని సమాచారం. అనంతరం కొన్ని నిమిషాల్లోనే మారుతీ వ్యాన్ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటనలో రూ.5 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సెలవుల సంబరం ముగియకనే..
సంక్రాంతి సెలవుల్లో బంధువుల ఇంట్లో ఉన్న తమ పిల్లలను స్వగ్రామానికి తీసుకువస్తున్నామన్న సంతోషం ఆ కుటుంబాలకు రోడ్డు ప్రమాదం మృత్యురూపంలో దూరం చేసింది. గాఢ నిద్రలో ఉన్న ఆ కుటుంబీకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. వారు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలయ్యారు. ఈ విషాదకర సంఘటన కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. * కల్వర్టును ఢీకొన్న ఓమ్ని వ్యాన్ * నలుగురి మృతి,ఐదుగురికి తీవ్రగాయాలు * మృతులంతా ఒకే కుటుంబీకులు * సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ కరీంనగర్ జిల్లా గోదావరిఖని అడ్డకట్టపల్లికి చెందిన ముజీబుద్దీన్ (46), రజీయొద్దీన్ (40) అన్నదమ్ములు. వీరు గోదావరిఖనిలో స్వీట్ హోంను నిర్వహిస్తున్నారు. కాగా ముజీబుద్దీన్కు కుమారుడు తాలీబుద్దీన్ (18), కుమార్తెలు ముస్కాన్ (13), రాంసా, సఫోరా ఉన్నారు. రజీయొద్దీన్కు ఇద్దరు కుమార్తెలు సన, సుమయలు ఉన్నారు. అయితే పాఠశాల, కళాశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో పిల్లలను అందరినీ కలిపి అన్నదమ్ములు హైదరాబాద్లోని బంధువుల ఇంటికి చేర్చారు. అయితే సెలవులు పూర్తి కావడంతో సోమవారం ముజీబుద్దీన్, రజియొద్దీన్లు ఓమ్నిలో హైదరాబాద్కు చేరుకున్నారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి దాటిన తరువాత పిల్లలతో సహా గోదావరిఖనికి బయలుదేరారు. ఈ క్రమంలో కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును వేగంగా ఢీ కొంది. అనంతరం పక్కనే ఉన్న గోతిలో వ్యాన్ పడింది. ఈ సంఘటనలో వాహనాన్ని నడుపుతున్న రజీయొద్దీన్, అతడి అన్న ముజీబుద్దీన్, అన్న కుమార్తె ముస్కాన్, కుమారుడు తాలిబుద్దీన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న సఫోరా, రాంసా, సుమయ, మొయినుద్దీన్, సనలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుకునూరుపల్లి ఎస్ఐ కృష్ణ నేతృత్వంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సుమయ, మొయినుద్దీన్ల పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులందరినీ హైదరాబాద్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్గౌడ్ సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. అదే విధంగా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టంలో ఉన్న మృతదేహాలను డీఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట తొగుట సీఐ వెంకటయ్య, కుకునూర్పల్లి ఎస్ఐ కృష్ణలున్నారు. ఈ ప్రమాదంపై కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే కారణమని డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు. కాగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఇంటి విషాదం నెలకొంది. కుటుంబ యజమానులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు మృతి