maximum level
-
ఈక్విటీ ఫండ్స్లో రికార్డు స్థాయి పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు కొత్త గరిష్టానికి చేరాయి. ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.15,685 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. ఇది తొమ్మిది నెలల గరిష్ట స్థాయి. 2022 మే నెలకు వచ్చిన రూ.18,529 కోట్లు ఇప్పటి వరకు గరిష్ట స్థాయిగా ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.12,546 కోట్లతో పోల్చినా, గత డిసెంబర్ నెలకు వచ్చిన రూ.7,303 కోట్లతో పోల్చినా గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఈక్విటీ పథకాల్లో గత 24 నెలలుగా నికరంగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. డెట్ విభాగం నుంచి ఇన్వెస్టర్లు ఫిబ్రవరిలో రూ.13,815 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఫిబ్రవరి నెలకు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.9,575 కోట్లకు పరిమితం అయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు ఎక్కువగా ఉండడంతో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ను మెరుగైన మార్గంగా భావించడం అధిక పెట్టుబడుల రాకకు మద్దతుగా నిలిచింది. విభాగాల వారీగా.. ► సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో రూ.14,000 కోట్లు వచ్చాయి. 2022 అక్టోబర్ నుంచి నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.13వేల కోట్లకు పైనే ఉంటున్నాయి. ► 11 కేటగిరీల్లో సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.3,856 కోట్లు ఆకర్షించాయి. ఆ తర్వాత స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.2,246 కోట్లు వచ్చాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ రూ.1977 కోట్లు, మిడ్క్యాప్ ఫండ్స్ రూ.1,816 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూ.1,802 కోట్లు, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.1,651 కోట్ల చొప్పున పెట్టుబడులను ఫిబ్రవరి నెలలో ఆకర్షించాయి. ► ఇండెక్స్ ఫండ్స్లోకి రూ.6,244 కోట్లు వచ్చాయి. ► గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి రూ.165 కోట్లు వచ్చాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.11,304 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫథకాల నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.1,904 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.39.46 లక్షల కోట్లుగా ఉంది. జనవరి చివరికి ఇది రూ.39.62 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. క్రమశిక్షణగా పెట్టుబడులు ‘‘విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల విక్రయాలతో అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించారు. డివిడెండ్ ఈల్డ్, ఫోకస్డ్ ఫండ్స్, లార్జ్క్యాప్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాల్లో వచ్చిన పెట్టుబడులు రూ.700 కోట్లపైనే ఉన్నాయి’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయనే అంచనాలతో డెట్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు బయటకు వెళుతున్నట్టు చెప్పారు. ‘‘మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ స్మాల్, మిడ్క్యాప్ క్యాప్ ఫండ్స్ భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ఆకట్టుకునే విధంగా ఉంది. దీర్ఘకాలంలో ఈ పథకాలు అద్భుతమైన రాబడులను అందించగలవు’’అని ఫిన్ ఎడ్జ్ సీఈవో హర్‡్ష గెహ్లాట్ అన్నారు. -
విదేశీ నిధుల ప్రవాహంపై రూపాయికి భరోసా!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయికి ఎగసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 47 పైసలు లాభపడి 74.88 వద్ద ముగిసింది. రానున్న వారాల్లో జారీ కానున్న క్విప్, ఐపీఓల ద్వారా మార్కెట్లోకి భారీ విదేశీ నిధుల ప్రవాహం జరుగుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్ను బలోపేతం చేశాయన్నది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా కొంత శాంతించడం, తగ్గిన డాలర్ ఇండెక్స్ దూకుడు వంటి అంశాలు కూడా రూపాయికి కలిసి వచ్చాయి. నిజానికి రూపాయి మరింత బలపడాల్సిందని, అయితే ఈక్విటీల బలహీన ధోరణి రూపాయిని కొంతమేర కట్టడి చేసిందని ఫారెక్స్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్థమాన దేశాల్లో భారత్ కరెన్సీనే బుధవారం ప్రధానంగా బలపడింది. డాలర్పై చైనా యువాన్ ర్యాలీ (దాదాపు నాలుగు నెలల గరిష్టానికి అప్) మొత్తంగా ప్రాంతీయ కరెన్సీలకు మద్దతునిస్తోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్ దిలిప్ పార్మార్ పేర్కొన్నారు. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ స్వల్ప లాభాల్లో 74.77 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాల్లో 93.64పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
ఎత్తిపోతలకు కుదరని ముహూర్తం.!
సాక్షి, రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లో భాగంగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోయడం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం పంపుహౌజ్ల నుంచి ఎత్తిపోతలు ప్రారంభించి రివర్స్ పంపింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లో చివరి పార్వతీ (సుందిళ్ళ–గోలివాడ) పంపుహౌజ్ ఎత్తిపోతలకు ముహుర్తం కుదరడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇన్ఫ్లో భారీగా వస్తుండడంతో ఎల్లంపల్లి నిండుకుండను తలపిస్తుంది. గతేడాదితో పోల్చితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు మూడు దఫాలుగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి రివర్స్ పంపింగ్తో ఎత్తిపోతలు ప్రారంభించలేదు. జూలై 31న తొలిసారి పంపుహౌజ్లో ఒకటవ నెంబర్ మోటార్కు వెట్ రన్ చేసిన అధికారులు క్రమంగా నాలుగు, ఐదు రోజుల వ్యవధిలో దశల వారీగా అన్ని మోటార్లను వెట్ రన్ నిర్వహించి ఎత్తిపోతలకు సిద్ధం చేసినా ఇంకా వాటితో అవసరం పడడం లేదు. ప్రకృతి అనుకూలించడంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచి వదిలిన నీరు సుందిళ్ల బ్యారేజీకి చేరాయి. అక్కడ వరద నీటి నిల్వలు పెరగడంతో, గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎత్తిపోతలు చేపట్టే అవకాశాలు లేకపోవడంతో మరింత కాలం పట్టే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికార యంత్రాంగం పేర్కొంటుంది. పార్వతీ పంపుహౌజ్లో ఉన్న తొమ్మిది మోటార్లను అధికారులు వెట్ రన్ నిర్వహించి సిద్ధంగా ఉంచారు. ఒక్కో మోటారు 40 మెగావాట్ల సామర్థ్యం గల 24 గంటలు నిరంతరంగా మోటారు నడిపిస్తే 2,600 క్యూసెక్కులను ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. తొమ్మిది మోటార్లు నిరంతరంగా 24 గంటలు నడిపిస్తే 23,400 క్యూసెక్కులను ఎత్తిపోయవచ్చన్నారు. కాగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ ద్వారా నీటి మళ్లింపు జరిగి, ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేకుంటేనే పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు వరద నీరు కాగా ప్రస్తుతం 148 మీటర్ల ఎత్తులో 19.60 టీఎంసీలు నిల్వ ఉంది. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ డెలివరీ సిస్టర్న్ వరకు వరద నీటి ఉధృతి ఉంది. ఏది ఏమైనా ప్రకృతి సహకరించడంతో భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలకు ముహుర్తం రాకపోవడం గమనార్హం. నిండుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీ సామర్థ్యం కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 147.8 మీటర్ల ఎత్తులో 19.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి మంగళవారం ఇన్ఫ్లో 46,898 క్యూసెక్కులు కాగా ఔట్ఫ్లో 54,190 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు మధ్యలో పది గేట్లను మీటరు ఎత్తు వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. -
రెండేళ్ల గరిష్ట స్థాయికి టోకు ధరలు
• ఆగస్టులో 3.74 శాతం • ఆహార ధరలు 8.23 శాతం అప్ న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ధరల పెరుగుదల రేటు ఆగస్టులో 3.74 శాతంగా నమోదయ్యింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ విభాగంలో కొన్ని వస్తువులు, అలాగే పప్పు దినుసుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపింది. అదీకాక గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల (ఆగస్టు) ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా క్షీణతలో -5.06% వద్ద ఉండడం(బేస్ ఎఫెక్ట్) కూడా తాజా పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జూలైలో కూడా టోకు ద్రవ్యోల్బణం 3.55%గా నమోదయ్యింది. 2014 నవంబర్ నుంచి 2016 మార్చి వరకూ క్షీణతలో ఉన్న టోకు ద్రవ్యోల్బణం వరుసగా 7 నెలల నుంచీ ప్లస్లోకి మారింది. మూడు ప్రధాన విభాగాలను చూస్తే... - ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 7.47 శాతంగా నమోదయ్యింది. 2015 ఆగస్టులో ఈ రేటు - 4.21 శాతంగా ఉంది. ఇక ఇందులో భాగంగా ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా -1.02 శాతం క్షీణత నుంచి 8.23 శాతానికి ఎగసింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు -0.45 శాతం నుంచి 8.44 శాతానికి చేరింది. నిత్యావసరాలకు సంబంధించి కూరగాయల ధరలు వార్షికంగా జూలైలో 28.05 శాతం పెరిగితే ఆగస్టులో ఈ రేటు 0.17 శాతంగానే ఉంది. పప్పుల ధర లు మాత్రం భారీగా 34.55 శాతం పెరిగినట్లు తాజా వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక తెలిపింది. తయారీ రంగం వాటా -1.99% నుంచి 2.42 శాతానికి చేరింది. -
పంచదార షేర్ల పరుగు...
♦ ప్రతి రోజూ గరిష్ట స్థాయిలకు ♦ దేశీయంగా తగ్గుతున్న చక్కెర ఉత్పత్తి ♦ అంతర్జాతీయంగా పెరుగుతున్న ధర ♦ టర్న్ అరౌండ్ అవుతున్న చక్కెర కంపెనీలు పంచదార కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల తీపి చేస్తున్నాయి. కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలో పలు కంపెనీల షేర్లు 8-74 శాతం రేంజ్లో పెరిగాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ కుదేలైనప్పటికీ దాదాపు పది పంచదార షేర్లు కొత్త ఏడాది గరిష్ట స్థాయిలను తాకడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లలో చక్కెర ధరలు పెరగడం, దేశీయంగా ఉత్పత్తి తగ్గడం, పంచదార కంపెనీలు టర్న్ అరౌండ్ కావడం తదితర కారణాల వల్ల షుగర్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి. ఏరోజుకారోజు గరిష్టస్థాయిలను తాకుతున్నాయి. తగ్గుతున్న ఉత్పత్తి.. పెరుగుతున్న ధరలు చక్కెర ఉత్పత్తిలో భారత్ది ప్రపంచంలోనే రెండో స్థానం. వినియోగంలో మాత్రం మొదటి స్థానమే. 2015-16 షుగర్ సీజన్(అక్టోబర్-సెప్టెంబర్)లో 25 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. అంతకు ముందటి షుగర్ సీజన్ ఉత్పత్తి (28.3 మిలియన్ టన్నుల)తో పోల్చితే ఇది 11 శాతం తక్కువ. 2016-17 షుగర్ సీజన్లో చక్కెర ఉత్పత్తి 23.5 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. 2015-16 మార్కెటింగ్ సంవత్సరం(అక్టోబర్-సెప్టెంబర్) కాలానికి భారత్ 1.4 మిలియ్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. చెరకు పండించే కొన్ని ప్రాంతాలు కరువు బారిన పడటంతో చెరుకు దిగుబడి పడిపోయి పంచదార ఉత్పత్తి తగ్గుతోంది. దీంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. 2015 జూలై నుంచి చూస్తే 2016 జూన్ 13 కల్లా టన్ను చక్కెర ధర 50%పైగా పెరిగి రూ.36,500 కు చేరింది. టర్న్ అరౌండ్లో కంపెనీలు గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న పలు షుగర్ కంపెనీలు ఈ మార్చి క్వార్టర్లోనే టర్న్ అరౌండ్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బలరామ్పూర్ చిని మీల్స్ రూ.99 కోట్లు, ఆంధ్రా షుగర్స్ రూ.56 కోట్లు, ద్వారకేశ్ షుగర్స్ రూ.39 కోట్లు, థమ్పూర్ షుగర్స్ రూ.26 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. ఇక 34 షుగర్ కంపెనీల మొత్తం నికర లాభాలు గతేడాది రెండో అర్థభాగానికి రూ.1,408 కోట్లుగా ఉన్నాయి. ఇదే ఏడాది మొదటి అర్ధభాగానికి ఈ కంపెనీల మొత్తం నష్టాలు రూ.1.700 కోట్లకు పైమాటే. ఈ కంపెనీలకు 2014-15 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రూ.979 కోట్లు, 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో రూ.1,268 కోట్లు చొప్పున నికర నష్టాలు వచ్చాయి. ఏడాదిలో రెట్టింపు: ఇక ఈ ఏడాదిలో 9 కంపెనీల షేర్లు రెట్టింపుకు పైగా పెరిగాయి. అప్పర్ గంగేశ్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్, మావానా షుగర్స్, అవధ్ షుగర్ మిల్స్, ధరణి షుగర్స్, ద్వారకేశ్ షుగర్ ఇండస్ట్రీస్, తిరు అరూరన్ షుగర్స్, రాజశ్రీ షుగర్స్, ఉగార్ షుగర్ వ ర్క్స్, ఉత్తమ్ షుగర్ కంపెనీల షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 110-350% వరకూ ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ.... అంతర్జాతీయంగా చక్కెర ధరలు 3 నెలలలో 50% వరకూ పెరిగాయి. ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్లో పంట ఆలస్యంతో సరఫరాలు తగ్గాయి. బ్రెజిల్ తర్వాత అత్యధికంగా చక్కెర ఎగుమతి చేసే దేశం థాయ్లాండ్ నుంచి సరఫరాలు తగ్గడం, కరువువల్ల ఉత్పత్తి తగ్గి భారత్ నుంచీ సరఫరాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర లోటు ఏర్పడుతుందనే అంచనాలు ధరలను ఎగదోస్తున్నాయి. 2016-17 షుగర్ సీజన్లో అంతర్జాతీయంగా చక్కెర లోటు 5.5 మిలియన్ టన్నులుగా ఉండొచ్చనేది రొబొబ్యాంక్ అంచనా. ఇంటర్కాంటినెంటల్ ఎక్స్చేంజ్(ఐసీఈ)లో చక్కెర ధరలు గత 2 వారాల్లో 12% పెరిగాయి. ఐసీఈలో జూలై కాంట్రాక్ట్ షుగర్ ఫ్యూచర్స్(ఒక్కో పౌండ్కు) 19.34 సెంట్స్ వద్ద ట్రేడవుతోంది. -
గరిష్టా స్ధాయికి చేరిన ఉష్ణోగ్రతలు