breaking news
mayor murder case
-
చిత్తూరులో భారీ భద్రత.. అంతిమ తీర్పు!
చిత్తూరు అర్బన్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసుకు సంబంధించి మరో 24 గంటల్లో తీర్పు వెలువడనుంది. చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసులో శుక్రవారం తీర్పు వెలువరించనుంది. దీంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. మరోవైపు నిందితులు, బాధితుల్లో కోర్టు తీర్పుపై ఉత్కంఠత నెలకొంది. పదేళ్ల కిందట రక్తపుటేర్లు.. 2015 నవంబరు 17.. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రక్తపుటేర్లు పారాయి. ఓ వైపు తుపాకీ పేలుళ్లు.. మరోవైపు కత్తులతో స్వారీ. నాటి నగర ప్రథమ పౌరురాలైన కటారి అనురాధ మేయర్ స్థానంలో తన ఛాంబర్లో కూర్చుని ఉన్నారు. పక్కనే ఆమె భర్త కటారి మోహన్, ఇతర టీడీపీ నాయకులు ఉన్నారు. ముసుగు (బుర్కా) ధరించి వచ్చిన ఓ వ్యక్తితోపాటు మరికొందరు కూడా ముసుగులు ధరించి తుపాకులు, కత్తులతో ఛాంబర్లోకి చొరబడ్డారు. మేయర్ అనురాధను తుపాకీతో కాల్చగా.. తలను తీల్చుకుంటూ మెదడు చిట్లిపోయి ఆ బుల్లెట్ బయటకు వచ్చింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఆమె భర్త కటారి మోహన్ను కార్యాలయంలో కత్తులతో వేటాడి పాశవికంగా నరికి హతమార్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కటారి దంపతుల జంటహత్యలతో రక్తపుటేర్లు పారాయి. నాటి టీడీపీ ప్రభుత్వం హయంలో పోలీసుశాఖ వైఫల్యానికి.. రాష్ట్రంలో మహిళల భద్రతను ప్రశి్నస్తూ జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేరంలో మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా చూపించిన పోలీసులు.. హత్య కుట్రలో సంబంధం ఉందని 23 మంది చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత.. జంట హత్యల కేసుకు సంబంధించి మరో 24 గంటల్లో తీర్పు వెలువడనుండడంతో చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. న్యాయస్థానం ఏ తీర్పుఇచ్చినా.. కోర్టు ఆవరణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా బాంబు స్క్వాడ్, స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే కోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు నగరంలో కూడా ఎక్కడా ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.నిందితులు వీరే.. అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధంలేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు. చింటూ ప్రధాన నిందితుడిగా వెంకటాచలపతి, జయప్ర కాష్రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ మురుగన్, యోగానంద్, పరందామ, హరిదాస్, మొగిలి, శశిధర్, యోగానందం, ఆర్వీటీ బాబు, లోకేష్ రఘుపతి, నాగరాజు, ఆనంద్కుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్రబాబు, సురేష్ పేరిట పోలీసులు కోర్టులో నేరాభియోగపత్రం (ఛార్జ్షిట్) దాఖలు చేశారు. ఈ కేసులో దాదాపు 122 మంది వరకు సాక్షులుగా ఉన్నారు. కేసు మొత్తాన్ని విచారించిన చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం, మహిళలపై జరిగిన నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి ఎం.శ్రీనివాసరావు తీర్పు వెలువరించనున్నారు. -
మేయర్ దంపతుల హత్య కేసు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసు విచారణ (ట్రయల్ షెడ్యూల్) తేదీలను ఖరారు చేస్తూ స్థానిక 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కబర్ది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 నవంబరులో జరిగిన జంట హత్యల కేసులో చింటూతో పాటు వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, మొగిలి, హరిదాస్, శశిధర్, ఎంఎస్.యోగానంద్, ఆర్వీటీ బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకటానంద్, కమలాకర్, రజనీకాంత్, నాగేంద్ర, శ్రీనివాసాచారి, బుల్లెట్ సురేష్ నిందితులుగా ఉన్నారు. వీరిలో వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాథ్కు బెయిల్ రాలేదు. కేసు విచారణను వేగవంతం చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో చిత్తూరు కోర్టు చర్యలు చేపట్టింది. కేసులో మొత్తం 130 మంది సాక్షులుగా ఉన్నారు. వీరిలో 69 మందిని తొలుత విచారించనున్నారు. ఈ నెల 29 నుంచి ఈ ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు తొలి షెడ్యూల్ విచారణ జరగనుంది. మలి షెడ్యూల్ను ప్రకటించి విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించనున్నారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడంతో చింటూను పోలీసులు వైఎస్సార్ కడప జైలుకు తరలించారు. -
మేయర్ హత్యకేసులో ఇద్దరి కోసం గాలింపు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ హత్య కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 23 మందికి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. 21 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న ఆర్వేటి బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరో నిందితుడు సురేష్ టీడీపీకు చెందిన ఓ ఎమ్మెల్యే నుంచి పోలీసులకు ఫోన్ చేయించగా.. ఇందులో కల్పించుకోవద్దని పోలీసులు సైతం గట్టిగానే చెప్పినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు చింటూకు తుపాకిని సమకూర్చాడనే ఆరోపణపై సురేష్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తుపాకీ కటారి మోహన్, చింటూలు ఒక్కటిగా కలిసి ఉన్నప్పుడు సురేష్ వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. మామఅల్లుళ్ల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కాసిరాళ్ల బాబు ద్వారా తుపాకిని సురేష్ నుంచి చింటూ తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు
-
మేయర్ హత్య కేసులో 22కు చేరిన అరెస్టులు
గత నెల 17వ తేదీన జరిగిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టుచేశారు. ఎస్పీ శ్రీనివాస్ సోమవారం అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు తుపాకీ, బుల్లెట్లు ఇచ్చారనే ఆరోపణలపై చిత్తూరుకు చెందిన రజనీకాంత్ (35), నరేంద్రబాబు అలియాస్ పకోడి (42), కర్ణాటకలోని చింతామణి చెందిన శ్రీనివాస ఆచారి (72)ని అరెస్టు చేశారు. చింటూ నేరం చేశాడని తెలిసీ బెంగళూరులో ఆశ్రయం కల్పించడంతోపాటు వాహనాలు సమకూర్చినందుకు కమలాకర్ (44) అనే వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. వీరి నుంచి చింటూ పారిపోతూ కారులో పడేసిన 0.22 ఎంఎం పిస్టోలు, 16 బుల్లెట్లు, హత్యానంతరం పారిపోయిన స్విఫ్ట్ కారు, బెంగళూరులో తిరిగిన డస్టర్ కారును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మేయర్ జంట హత్యల కేసులో అరెస్టుల సంఖ్య 22కు చేరింది. వీరితో పాటు మరి కొందరిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.


