misfires
-
క్షిపణి మిస్ఫైర్పై రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ ప్రకటన
-
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తప్పిన ప్రమాదం
సాక్షి, నిర్మల్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్గౌడ్ అనే వ్యక్తి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆదివారం కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున ట్రిగ్గర్ తగిలి మిస్ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ శంకర్గౌడ్ చాతి భాగం నుంచి బయటకు దూసుకెళ్లింది. గాయపడిన శంకర్ గౌడ్ను నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
-
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మెదక్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం న్యూఉమ్నాపూర్లోని పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ వద్ద గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. సిబ్బంది శిక్షణ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మిస్ఫైర్ అయ్యింది. ఆ సమయంలో న్యూఉమ్నాపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళుతుండగా ఆమె తలలోకి ఓ బుల్లెట్ దూసుకు వెళ్లింది. దాంతో ఆమెను బంధువులు హుటాహుటీన చికిత్స నిమిత్తం సంగారెడ్డి గోకుల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చంద్రకళ తలలోని బుల్లెట్ను తొలగించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.